మా జీవితాన్ని,సంస్కృతిని నాశనం చేయకండి... ప్రధానికి లేఖ రాసిన 9 మంది సర్పంచ్ లు
వాణిజ్య మైనింగ్ కోసం బొగ్గు బ్లాకులను వేలం వేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం చత్తీగడ్ లోని మూడు జిల్లాల్లో వ్యాపించి హస్డియో అరంద్ ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవితాలను సర్వనాసనం చేసే ఈ వేలాన్ని తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తూ తొమ్మిది మంది సర్పంచ్ లు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు.
సర్గుజా, సూరజ్పూర్, కోర్బా జిల్లాల్లో ఉన్న హస్డియో అరంద్ ప్రాంతంలో బొగ్గు బ్లాక్ లను వేలం వేసి మైనింగ్ చేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని ఆ లేఖలో వారు వ్యతిరేకించారు. ʹʹమీరు ఆత్మనిర్భర భారత్ గురించి మాట్లాడారు. స్వయం సమృద్ది గురించి మాట్లాడారు. మరో వైపు మా జీవనోపాది, జీవనశైలి, సంస్కృతిపై దాడి చేస్తున్నారుʹʹ అని లేఖలో పేర్కొన్నారు. ఇంకా ఆ లేఖలో ఏం రాశారంటే...
ʹʹపెసా, FRA చట్టాల ప్రకారం గ్రామ సభల ఒప్పుకుంటేనే మైనింగ్ జరగాలి కానీ గ్రామ సభల నిర్ణయం పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోకుండా బొగ్గు బ్లాకుల వేలానికి ప్రయత్నిస్తున్నారుʹʹ ఇది మీరు మాట్లాడిన ʹఆత్మనిర్భరʹకు వ్యతిరేకంʹʹ
"ఒక వైపు COVID19 తో పోరాడుతున్నాం. ఇటువంటి పరిస్థితిలో మేము మా ఇళ్ళు, భూమి కోల్పోయి నిరాశ్రయులయ్య్తే ముప్పును ఈ మైనింగ్ వల్ల ఎదుర్కొంటున్నాంʹʹ
గత వారం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ జూన్ 18 న "దేశంలో మొట్టమొదటి వాణిజ్య బొగ్గు వేలం" ను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బొగ్గు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో - ʹబొగ్గును తవ్వడం: ఆత్మనిర్భర్ భారత్కు కొత్త ఆశలుʹఅని పేర్కొంది.
"ఇది భారత చారిత్రాత్మక రోజు బొగ్గు ఉత్పత్తికి పరిమితుల సంకెళ్ళ నుండి విముక్తి కలిగించే రోజు" అని కేంద్ర బొగ్గు శాఖా మంత్రి ప్రల్హాద్ జోషి అన్నారు. ఈ బోగ్గు ఉత్పత్తి ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధానమంత్రి హాజరవుతారని చెప్పారు మంత్రి.
దీనిపై ఘట్బారా గ్రామ సర్పంచ్ జైనందన్ సింగ్ పోర్టే ది వైర్తో మాట్లాడుతూ "మా ప్రాంతంలో ఎలాంటి మైనింగ్ వద్దు, ఎందుకంటే ఇది మన జీవనోపాధి మరియు సంస్కృతిని నాశనం చేస్తుంది."
"ఈ ప్రాంతంలోని సహజ వనరుల కారణంగా మేము ఇప్పటికే ఆత్మనిర్భరగా ఉన్నాము. మా పొరుగు ప్రాంతాలైన రాయగర్ వంటి ప్రాంతాల్లో చూసినట్లుగా అడవిని, మా జీవితాన్ని, సస్కృతిని నాశనం చేస్తుంది. మేము మైనింగ్ను వ్యతిరేకిస్తున్నాము మరియు అనేక గ్రామసభలు ఈ విషయంలో తీర్మానాన్ని ఆమోదించాయిʹʹ అన్నారాయన.
జనవరి 2015 లో, మొదటిసారి వేలం ప్లాన్ చేసినప్పుడు, హస్డియో-అరండ్ ప్రాంతంలో బొగ్గు గనులను వేలం వేయడాన్ని వ్యతిరేకిస్తూ 20 గ్రామసభలు / గ్రామ కౌన్సిల్లు తీర్మానాలను ఆమోదించాయి, ఆ వేలం FRA చట్టం 2006 ను ఉల్లంఘిస్తుందని గ్రామ సభలు పేర్కొన్నాయి.
ఇక ముప్పు ముంచుకొచ్చిందని అక్కడి ఆదివాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో 9 మంది సర్పంచ్ లు మోడీకి లేఖ రాశారు.
ఈ గ్రామాలు షెడ్యూల్ 5 ప్రాంతంలో ఉన్నాయని, ఇక్కడ పెసా మరియు ఎఫ్ఆర్ఎ నిబంధనల ప్రకారం, మైనింగ్ ప్రారంభించే ముందు గ్రామసభల సమ్మతి అవసరమని సర్పంచ్లు లేఖలో సూచించారు.
ʹ… గ్రామసభలు గతంలో కూడా ఇటువంటి మైనింగ్ను వ్యతిరేకించాయి. భవిష్యత్తులో కూడా మైనింగ్ కు సమ్మతిని ఇవ్వకూడదని సంకల్పించాయి.ʹʹ
"... ఈ వాస్తవాలు మరియు గ్రామసభల నుండి నిరంతర వ్యతిరేకత వస్తున్నప్పటికీ, హస్డియో అరంద్లోని 6 బొగ్గు బ్లాకులను వేలంపాటల జాబితాలో ఉంచడం మాకు ఆశ్చర్యం కలిగించింది. నిరాశ లో ముంచింది."
గ్రామస్తులు పూర్తిగా నీరు, అటవీ ఉత్పత్తులు, భూమిపై ఆధారపడి జీవిస్తున్నారు ఈ బొగ్గు మైనింగ్ వాటిని పూర్తిగా నాశనం చాస్తుంది అని కోర్బా జిల్లాలోని మదన్పూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ దేవ్సే అభిప్రాయం.
"మా స్వతంత్ర జీవనానికి ఈ సహజ వనరులే ప్రధానం. డబ్బు కానీ మరేదైనా పరిహారం కానీ సహజవనరులకు ప్రత్యామ్నాయం కావు" అని దేవ్సే ది వైర్తో అన్నారు. ఈ ప్రాంతంలో మైనింగ్కు అనుమతిస్తే ఈ ప్రాంతంలోని సాగునీరు ఇచ్చే చిన్న నీటి ప్రవాహాలు ఎండిపోతాయని చెప్పారు.
Keywords : chattis garh, coal mining, narendra modi,
(2024-03-25 21:53:31)
No. of visitors : 843
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| హెచ్ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |