మూడురోజుల పాటు మావోయిస్టుల భారీ బహిరంగ సభ...వేలాదిగా పాల్గొన్న జనం

మూడురోజుల

జూన్ 18 నుండి 20 వతేదీ వరకు మూడు రోజులు... 10 వేల మందికి పైగా ప్రజలు... 300 మంది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ సభ్యులు, 500 మంది జన మిలీషియా సభ్యులు....ఎర్ర జెండాల రెపరెపల మధ్య క్రీడా కార్యక్రమాలు...సాంస్కృతిక కార్యక్రమాలు....ఉపన్యాసాలు....

సీపీఐ మావోయిస్టు పార్టీ అద్వర్యంలో ఈ నెల 18 నుండి 20 వ తేదీ వరకు మూడురోజుల పాటు చత్తీస్ గడ్ రాష్ట్రం సుక్మా, బీజాపూర్ జిల్లాల సరిహద్దులో సభలు జరిగాయని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది. ఇందులో 10 వేల మంది ప్రజలు పాల్గొన్నారని పోలీసులను ఉటంకిస్తూ ఆ పత్రిక తెలిపింది. హిందుస్తాన్ టైమ్స్ కథనం ప్రకారం...

మూడు రోజుల పాటు జరిగిన సభల సందర్భంగా క్రీడా పోటీలు, పాటలు, నృత్యాలు, ఉపన్యాసాలు జరిగాయి. 2019 డిసెంబర్‌లో మరణించిన దండకకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (డికెఎస్‌జెడ్‌సి) కార్యదర్శి రామన్నతో సహా, విప్లవ పోరాటంలో ప్రాణాలు విడిచిన‌ అమరవీరులకు నివాళులు అర్పిస్తూ ప్రారంభమయిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. ఈ మూడు రోజుల కార్యక్రమానికి పోలీసులనుండి ఆటంకం రాకుండా 300 మంది సాయుధ‌ పీఎల్జీఏ సభ్యులు, 500 మంది జన మిలీషియా సభ్యులు రాత్రీ పగలు కాపలా కాశారు. ఈ సమావేశాలకు ప్రధానంగా సుక్మా, బీజాపూర్, దంతేవాడ,నారాయణపూర్ జిల్లాల ప్రజ‌లు హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబళ్ళ‌ కేశవ రావు అలియాస్ బసవరాజు, మాండవి హిడ్మా, కోసా, దేవ్జీ, సుజాతలతో సహా అనేక మంది మావోయిస్టు నాయకులు హాజరైనట్లు అభిఙవర్గాల సమాచారం.

ʹʹఈ మూడు రోజుల సమావేశం గురించి మాకు సమాచారం అందింది. మేము దీనిని పరిశీలిస్తున్నాముʹʹ అని ఛత్తీస్గడ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) డిఎం అవస్థీ హిందూస్తాన్ టైమ్స్‌తో అన్నారు.
గత ఐదేళ్లలో తొలిసారిగా మావోయిస్టులు ఇంత పెద్ద బహిరంగ సభ‌ ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు బస్తర్‌లోని సీనియర్ పోలీసు అధికారులు.

ʹʹఈ సమావేశాలకు వెళ్ళిన ప్రజలను సెల్ ఫోన్లు తీసుకెళ్ళడానికి అనుమతించలేదు అందువల్ల ఈ సమావేశపు ఫోటోలు, వీడియోలు మాకు దొరకలేదుʹʹ అని ఓ పోలీసు అధికారి అన్నారు.
"ఈ సమావేశానికి హాజరైన ఒక మహిళ చెప్పిన విషయాల ప్రకారం మావోయిస్టు నాయ‌కులు మావోయిజం గురించి, బస్తర్ చరిత్ర గురించి ప్రసంగాలు చేశారని మాకు తెలిసిందిʹʹ అని ఆపోలిసు అధికారి హిందుస్తాన్ టైమ్స్ ప్రతినిధితో చెప్పారు.
ఈ ఏడాది మార్చ్ లో సుక్మా జిల్లా మిన్సా దగ్గర మావోయిస్టుల దాడిలో 17 మంది జవాన్లు చనిపోయిన సంఘటనలో మావోయిస్టులు తీసుకెళ్ళిన ఆయుధాలు ఈ సమావేశ వేదికపై ప్రదర్శించినట్టు పోలీసు అధికారులు చెప్పారు.

ʹʹసాల్వా జుడమ్ కు ముందు 2004 లో నారాయణపూర్ జిల్లాలోని అబూజ్ మడ్ ప్రాంతంలో జరిగిన ఓ సమావేశానికి నేను హాజరయ్యాను. కొన్ని రోజుల పాటు జరిగిన ఈ సమావేశంలోలో 10,000 మంది ప్రజలు పాల్గొన్నారు. ఐదేళ్ల విరామం తర్వాత మావోయిస్టులు మళ్లీ అలాంటి సమావేశం చేశారంటే... మావోయిస్టులు బలహీనపడ్డారనే వాదనలు చేయడం, త్వరలోనే తుడిచిపెట్టుకపోతారని అనుకోవడం ఓ కల. ఇప్పటికీ మధ్యభారతంలోని అటవీ ప్రాంతాల్లో ప్రజలు మావోయిస్టులతోనే ఉన్నారు.ʹʹ అని చత్తీస్ గడ్ కు చెందిన శాంతి కార్యకర్త శుభ్రాషు చౌదరి అన్నారు.

ఒక్క బస్తర్ ప్రాంతంలోనే 2,00,000 మందికి పైగా ప్రజలు సిపిఐ (మావోయిస్టు) పార్టీ అనుబంద సంఘాల సభ్యులుగా ఉన్నారని పోలీసుల అంచనా అని హిందుస్తాన్ టైమ్స్ పత్రిక పేర్కొంది.
(hindustantimes.com సౌజన్యంతో)

Keywords : maoists, bastar, meeting, hindustan times, people,
(2024-04-24 23:47:05)



No. of visitors : 2905

Suggested Posts


బస్తర్ లో భారత యుద్దం..రగులుతున్న అడవి

న్యాయభావన ఉన్న ఎవ్వరైనా అలాగే ప్రభావితమౌతారు. పోరాడుతున్న ఆదివాసీల నుండి, పోరాటానికి అండగా నిలిచిన మావోయిస్టు పార్టీ పట్ల అభిమానమేర్పడింది. మావోయిస్టు పార్టీ పోరాట క్రమంలో చేసే తప్పులను ఆమె నిర్మొహమాటంగా ఎత్తి చూపించింది. ఏ ప్రజా పోరాటానికైనా ఇలా నిజాయితీగా, నిర్భయంగా పొరపాట్లను ఎత్తి చూపే వాళ్ళ అవసరం చాలా ఉంటుంది. ఆమె పరిశోధనా కాలంలోనే పోరాటాలని రాజ్యం

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మూడురోజుల