బొగ్గుగని కార్మికుల దేశవ్యాప్త సమ్మెకు పౌరహక్కుల సంఘం మద్దతు
బొగ్గుగనులను ప్రైవేటీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా జూలై 2, 3, 4 తేదీల్లో జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెకు పౌర హక్కుల సంఘం తెలంగాణ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం.
బొగ్గుగనుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జులై 2,3,4 తేదీలలో భారతదేశవ్యాప్తంగా మరియు సింగరేణి బొగ్గు గనుల్లో నాలుగున్నర లక్షల మంది బొగ్గుగని కార్మికులు చేస్తున్న72 గంటల సమ్మెకు పౌర హక్కుల సంఘం తెలంగాణ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది.
జాతీయకార్మికసంఘాలు మరియు జాతీయ ఫెడరేషన్ల పిలుపు మేరకు బొగ్గుగనుల్లో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జులై 2,3& 4,2020 తేదీలలో భారతదేశవ్యాప్తంగా మరియు సింగరేణి బొగ్గు గనుల్లో నాలుగున్నర లక్షల మంది బొగ్గుగని కార్మికులు చేస్తున్న72 గంటల సమ్మెకు పౌర హక్కుల సంఘం తెలంగాణ సంపూర్ణ మద్దతు తెలుపుతుంది……
దేశవ్యాప్తంగా సమ్మెలో బాగంగా ఇక్కడ మనతెలంగాణ రాష్ట్రంలోని
సింగరేణి బొగ్గుగనుల్లో జులై 2,3 &4 తేదీలలో కూడా 72 గంటల సమ్మెను విజయవంతం చేద్దాం.
దేశంలో BJP నరేంద్రమోదీ ప్రభుత్వం బొగ్గుగనులను ప్రైవేటుపరం చేయడానికి నిర్ణయం తీసుకుంది..50,000 కోట్ల రూపాయల ను మల్టీనేషనల్ కంపెనీలు,బడా కార్పొరేట్ కంపనీలకు మోడీ ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నది..
ఈనెల18 వతేదీన మొదటివిడతగా దేశంలోని41 బొగ్గుబ్లాక్ లను e ఆక్షన్ ద్వారా వేలంవేసింది.
1.41 బొగ్గుబ్లాక్ లను వేలంపాటను రద్దుచేయాలి.
2.100%FDI (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు)
3.ఔట్ సోర్సింగ్ పేరుతో బొగ్గుగనుల ప్రైవేటీకరణ మరియు కమర్షియల్ మైనింగ్ ను నిలిపివేయాలి.
4.CIL/SCCL లో కాంట్రక్టు కార్మికులకు హైపవర్ వేతనాలు చెల్లించాలి.
5.క్లాజ్ 9.3.0,. ..,9.4.0….,, 9.5.0 లను జాతీయ బొగ్గుగని కార్మికుల వేజ్ బోర్డ్ అగ్రిమెంట్ లో అమలు చేయాలి.
ఇంకా 44 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్ లుగా మార్చడాన్ని నిలిపి వేయాలి.
ఈ దేశ సహజసంపద, వనరులను విచ్చలవిడిగా కార్పొరేట్లకు, బహుళజాతి కంపెనీలకు మన కేంద్రప్రభుత్వం అప్పగించకుండా మరియు ప్రభుత్వ రంగం లోని బొగ్గుగనులను కార్మికులను కాపాడడం కోసం మనందరం కార్మికులకు అండగా ఉండాలని కోరుతూ జులై 2,3,4 తేదీలలో దేశవ్యాప్తంగా జరిగే 72 గంటల సమ్మెకు పౌర హక్కుల సంఘం తెలంగాణ మద్దతు తెలియజేస్తున్నది..
1.ప్రొపెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్షులు,
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధానకార్యదర్శి, కార్యదర్శి,పౌరహక్కుల సంఘం తెలంగాణ.
3.మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి
పౌరహక్కుల సంఘం తెలంగాణ.
సాయంత్రం 6:45,సోమవారం.
29-6-2020,హైదరాబాద్...
Keywords : coal mine, privatization, modi, bjp, CLC, Telangana
(2024-03-27 08:10:22)
No. of visitors : 889
Suggested Posts
| ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. |
| ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. |
| ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులుఅక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస |
| సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘంGDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. |
| జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల |
| CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన పాలకులపై పోరాడుదాం
ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. |
|
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹచత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు. |
| మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టుపెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది. |
| ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడలో పౌరహక్కుల సంఘం సభవిజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్గిరి ఎన్కౌంటర్ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర..... |
| ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన
14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. |