include 'men';
?>
అఖిల్ గొగొయ్ ని విడుదల చేయాలంటూ1200 మంది ఖైదీల నిరాహార దీక్ష
మావోయిస్టు అనే ఆరోపణలతో అస్సాం గౌహతి జైల్లో ఉన్న రైతు నాయకుడు అఖిల్ గొగోయ్ను విడుదల చేయాలని, మరొకొన్ని తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలని 12వందల మంది ఖైదీలు నిరాహార దీక్షకు దిగారు.
అస్సాంలో క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి (కెఎంఎస్ఎస్) వ్యవస్థాపకుడు గొగోయ్ కెఎమ్ఎస్ఎస్ యువ నాయకులు బితు సోనోవాల్, ధైజ్యా కొన్వర్, మనస్ కొన్వర్లతో పాటు అరెస్టు చేయబడ్డాడు. వీళ్ళు జైల్లో కొచ్చి జూన్ 29 కి 200 రోజులవుతుంది. గోగోయ్ నేతృత్వంలో, ఈ యువ నాయకులు డిసెంబర్ ఆరంభంలో రాష్ట్రంలో ఉదృతంగా సాగిన సీఏఏ వ్యతిరేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బిజెపి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శకులుగా పరిగణించబడుతున్న వీరందరినీ ʹమావోయిస్టులుʹ అనే అభియోగంపై క్రూరమైన చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) యూఏపీఏ చట్టం కింద అరెస్టు చేశారు.
ఈ నేపథ్యంలో అఖిల్ గొగోయ్ సహా మిగతా రైతు సంఘం నాయకులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖైదీలు నిరాహార దీక్షలు చేపట్టారు. అస్సామీ దినపత్రిక అమర్ అసోమ్లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, ఖైదీలు జూన్ 25, 26 వ తేదీల్లో ఈ నిరాహార దీక్షలు చేపట్టారు. గౌహతి జైలు నుండి గోగోయ్ విడుదల సహా మరో ఎనిమిది డిమాండ్ల ను నెరవేర్చాలని ఖైదీలు కోరారు.
ఖైదీల ప్రధాన డిమాండ్లలో గొగోయ్ విడుదల సహా కరోనా వ్యాప్తి భయాందోళనలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఖైదీలను ఈ జైలుకు తీసుకరావద్దన్నది ఒకటి ఈ మేరకు జూన్ 24 న ఖైదీలు సమావేశం నిర్వహించి జైలు అధికారులకు రెండుసార్లు లిఖితపూర్వక అభ్యర్ధనను సమర్పించారు. ʹʹఅయితే, జైలు అధికారులు తమ డిమాండ్ను పక్కన పెట్టి కొత్త ఖైదీలను తీసుకురావడం ప్రారంభించారు. కనీసం కొత్తగా వచ్చే ఖైదీలకు COVID-19 పరీక్షలు కూడా నిర్వహించలేదు ఈ కారణంగా 1,200 మంది ఖైదీల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తమను తాము రక్షించుకోవడానికి, ఖైదీలు జూన్ 25 న ఉదయం 9 గంటల నుండి నిరాహార దీక్షను చేపట్టాలని నిర్ణయించుకున్నారు. జూన్ 26 న కూడా వారు తమ సమ్మెను కొనసాగించారు. ʹʹ అని అమర్ అసోమ్ దినపత్రిక పేర్కొంది.
జైల్లో ఖైదీల ఉద్యమం తీవ్రమవడంతో అనేక మంది జైలు అధికారులు, జిల్లా అధికారులు ఖైదీలతో మాట్లాడటానికి ఖైదీల దగ్గరికి వచ్చారు. నివేదికల ప్రకారం గోగోయితోపాటు ఇతర కూడా కెఎంఎస్ఎస్ నాయకులు కూడా ఈ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. నిరాహార దీక్షలోపాల్గొన్నారు. మహమ్మారి నుండి తమను తాము రక్షించుకోవడానికి ఖైదీలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, హక్కులతో పాటు 24 గంటల స్వచ్ఛమైన తాగునీటి సరఫరా, ప్రస్తుతం షెడ్యూల్ చేసిన ʹరెండు నిమిషాలʹ సంభాషణకు మించి వారి న్యాయవాదులు మరియు కుటుంబ సభ్యులను కలవడానికి అనుమతి. మొదలైన డిమాండ్లతో రెండు రోజులు ఉద్యమం నడిచింది.
గైహతి జైల్లో జరిగిన ఈ ఉద్యమంలో.. అస్సాంలో సాయుధ పోరాటం చేస్తున్న గ్రూపులు యునైటెడ్ పీపుల్స్ ఫ్రంట్, యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అసోమ్ లు, సిఎఎ వ్యతిరేక నిరసనకారుడు, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయ విద్యార్థి షార్జీల్ ఇమామ్ సహా అనేక మంది హక్కుల కార్యకర్తలు, ప్రజా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
స్థానిక వార్తా పత్రికల నివేదిక ప్రకారం ʹʹగొగోయ్ కూడా ఖైదీలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలను కోరుతూ పదేపదే జైలు అధికారులను సంప్రదించాడు కాని అధికారుల వైపు నుండి ఎటువంటి స్పందన లేదు".
నిరాహార దీక్ష తర్వాత ఖైదీల డిమాండ్లను పరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి, కొత్త ఖైదీలందరినీ 14 రోజుల జైలు ప్రాంగణంలోని ప్రత్యేక వార్డుల్లో సెల్ఫ్ క్వారంటైన్లో ఉంచడానికి అంగీకరించిన తర్వాత ఖైదీలు నిరాహారధీక్ష విరమించారని జైళ్ల ఇన్స్పెక్టర్ జనరల్ దశరత్ దాస్ తెలిపారు.
(thewire.in సౌజన్యంతో)
Keywords : assom , akhil gogoi, KMSS, gouhati jail, caa, maoists
(2024-03-24 02:52:15)
No. of visitors : 859
Suggested Posts
| లాల్ సలాం..కామ్రేడ్..లెనిన్... అంటే కేసులు !లాల్ సలాం...కామ్రేడ్..లెనిన్...ఈ పదాలు పాలకులను ఎట్లా భయపెడుతున్నాయో అర్దమవుతోంది. ఆ పదాలు వింటేనే భయంతో వణికిపోతున్నారు. అందుకే ఆ పదాలు వాడినవారిపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు. ఫేస్ బుక్ లో లెనిన్ ఫోటో అప్లోడ్ చేశాడని, లాల్ సలామ్, కామ్రేడ్ అనే పదాలు వాడాడని అస్సాం కు చెందిన బిట్టు సోనోవాల్ అనే సామాజిక కార్యకర్తపై |
| ఐసిస్ చేరాలంటూ బ్యానర్లు కట్టిన బీజేపీ కార్యకర్తల అరెస్టు !
ఈనెల 3న రాష్ట్రంలోని నల్బరి జిల్లా కోయిహటాలో చెట్టుకు ఒక జెండా కట్టి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులు సమాచారమందించారు. ఐఎస్ఐఎస్లో చేరాలని జెండాపై అరబిక్లో రాసి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. జెండాను |
| అఖిల్ గొగోయ్ పై UAPA కేసు కొట్టేసిన కోర్టు - నిర్దోషిగా విడుదలఅస్సాం రైతాంగ కార్యకర్త, రాజోర్ దళ్ అధ్యక్షుడు, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అఖిల్ గొగొయ్ పై NIA మోపిన UAPA కేసును కోర్టు కొట్టివేసింది. అతను హింసను రెచ్చగొట్టాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆందోళన నిర్వహించడం హింసను రెచ్చగొట్టడం కాదని గౌహతి లోని NIA కోర్టు ఈ రోజు తీర్పు చెప్పడంతో ఆయన ఈ రోజు విడుదలయ్యారు. |
| అస్సాం జైల్లో ఉన్న అఖిల్ గొగోయ్ కి కరోనాఅసోం సామాజిక కార్యకర్త..క్రిషక్ ముక్తి సంగ్రామ్ సమితి నాయకుడు ప్రస్తుతం గువహటిలో జైలులో ఉన్న అఖిల్ గొగోయ్కు కరోనా సోకిందని ఆయన తరుపు న్యాయవాది శంతను భర్తకుర్ గురువారం తెలిపారు. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..