include 'men';
?>
బొగ్గు గని కార్మికుల మూడు రోజుల సమ్మెకు ప్రజా ఫ్రంట్ మద్దతు
దేశంలో బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ చర్యలకు నిరసనగా జూలై2వ తేదీ నుండి 4వ తేదీ వరకు దేశవ్యాప్త బొగ్గు గని కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చారు. ఆ సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తెలంగాణ ప్రజాఫ్రంట్ విడుదల చేసిన మీడియా ప్రకటన....
సింగరేణి బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జూలై రెండు నుండి నాలుగు వరకు 72 గంటల జాతీయ, విప్లవ కార్మిక సంఘాల సమ్మె పిలుపునకు టి పి ఎఫ్ తన సంపూర్ణ మద్దతును తెలియజేస్తున్నది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసినట్లుగానే భారత బొగ్గుగనుల రంగాన్ని సమస్తము కార్పోరేట్, పెట్టుబడిదారీ సంస్థలకు కట్టబెట్టాలని ప్రభుత్వము సంకల్పించింది. కోల్ ఇండియా లిమిటెడ్ లోని బొగ్గు గనులను ఇప్పటికే 30 శాతం ప్రైవేట్ రంగానికి అప్పగించిన భారత ప్రభుత్వం, మొత్తంగా 100% ప్రవేటీకరిచాలని ఇటీవలే భారత ఆర్థికమంత్రి ప్రకటించారు. మొదటి దశలో సింగరేణి గనుల్లో ని 49 శాతం బ్లాగులను వేలం వేయాలని నిర్ణయించుకుని,18-6-20 న నలభై ఒక్క బ్లాగులను ప్రైవేట్ శక్తులకు అమ్మివేశారు. కరోనా సాకుతో సుదీర్ఘ కాలము పోరాటం చేసి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేయడం, పనిగంటలు 12కు పెంచడం, డిఎ ఫ్రీజ్ చేయడం, సగం వేతనాలు చెల్లించడం... లాంటి అనేక కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేయపూనుకున్నారు.
ప్రత్యేకించి సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి, గనుల అభివృద్ధికి పూచీ పడతామని అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్౼౼ కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించకుండడా, సమ్మెలో పూర్తిగా పాల్గొనకుండా తన కార్మిక వ్యతిరేక స్వభావాన్ని చాటుకుంటున్నది. కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించిన 20 లక్షల కోట్ల కరోనా ప్యాకేజ్ ని తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా, కేంద్ర ప్రభుత్వ నూతన విద్యుత్ బిల్లును తీవ్రంగా విమర్శించిన ట్లుగా... బొగ్గు గనుల ప్రైవేటీకరణను కూడా ముఖ్యమంత్రి బహిరంగంగా వ్యతిరేకించాలని టి పి ఎఫ్ డిమాండ్ చేస్తున్నది. ఓపెన్ క్యాస్ట్ లకు వ్యతిరేకంగా తానే కుర్చీ వేసుకుని ఉద్యమం చేస్తానని ప్రకటించిన కెసిఆర్, స్వయంగా 17 ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులకు తవ్వకానికి అనుమతులు ఇచ్చాడు.
కేంద్ర ప్రభుత్వము నలభై ఒక్క బొగ్గుగనుల వేలాన్ని రద్దు చేయాలని, బొగ్గు గనుల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని, 44 కార్మిక చట్టాలను స్థానంలో నూతనంగా 4 కార్మిక చట్టాలను తేవాలనే ప్రతిపాదనను మానుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాలు చేసే సమ్మెను జయప్రదం చేయాలని టీపీఎఫ్ విజ్ఞప్తి చేస్తుంది.
కె రవిచందర్,అధ్యక్షులు
ఏ నరసింహారెడ్డి,ఉపాధ్యక్షులు
Keywords : coal mine, privatization, strike, singareni, telangana praja front
(2024-03-14 21:24:55)
No. of visitors : 568
Suggested Posts
| ప్రత్యామ్నాయ గొంతు వినిపించడం నేరమా...మా నాన్నను వెంటనే విడుదల చేయాలి...నలమాస కృష్ణ కూతురు
ప్రజాఫ్రంట్ ఉపాధ్యక్షుడు నలమాస కృష్ణను ఎన్ ఐ ఏ అరెస్టు చేసింది. అనారోగ్యంతో ఉన్న కృష్ణ ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ ఉ౦డగా ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో హాస్పటల్ లోకి వెళ్ళిన ఎన్ ఐ ఏ పోలీసులు అరెస్టు చేశారు. |
| నిత్య పోరాట యోధుడు, ప్రజాస్వామిక తెలంగాణ స్వాప్నికుడు రాఘవులు సార్ కు జోహార్లు !తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా గౌరవాధ్యక్షుడు రాఘవులు సార్ ది 40 ఏండ్ల పోరాట చరిత్ర. నిజామాబాద్ జిల్లాలో విప్లవోద్యమం ప్రారంభ దశ నుండి పెద్ద అండ రాఘవులు సార్. ఉపాధ్యాయ ఉద్యమనాయకుడు, ఉపాధ్యాయులను ప్రజల కోసం నిలబెట్టడానికి |
| ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని చూసి తెలంగాణమా గర్వించు ! భిన్నాభిప్రాయాలకు స్థానంలేక పోతే ప్రజాస్వామ్యమే కాదని టీఆరెస్ వర్కింగ్ ప్రసిడెంట్ స్టేజీల మీద ఉపన్యాసాలు దంచుతాడు మరో వైపు చిన్న సభ పెట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వది హైకోర్టు అనుమతి ఇచ్చినా దాన్ని పట్టించుకోకుండా ప్రజలను అరెస్టులు చేస్తూ సభను జరగనివ్వరు. ఇదీ తెలంగాణలో కొనసాగుతున్న ప్రజాస్వామ్యం. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..