జూలై 4,5 తేదీల్లో విరసం యాభయ్యో ఆవిర్భావ సభలు... ఆన్ లైన్ లో

జూలై

జూలై 4, 5 తేదీల్లో విప్లవ రచయితల సంఘం(విరసం) ఆన్ లైన్ లో సభలు నిర్వహిస్తోంది. ఆ సందర్భంగా విరసం విడుదల చేసిన కరపత్రం పూర్తి పాఠం...

ఈ జూలై 4 విరసం యాభయ్యో పుట్టిన రోజు. ఈ 50 వసంతాల చరిత్ర పోరాట ప్రజల మధ్య, జైలు గోడల మధ్య నిర్మాణమైంది. అనంతమైన భావజాల సంఘర్షణల మధ్య రూపొందింది. సాహిత్య సాంస్కృతిక రంగాల్లో మార్క్సిజం, లెనినిజం , మావోయిజాన్ని తాత్విక దృక్పథంగా ఆచరించే, అన్వయించే చరిత్రగా విస్తరిస్తోంది. వర్గపోరాటమనే పువాధి మీద వ్యవస్థ మార్పు, సాంఘిక విముక్తి అనే చారిత్రక కర్తవ్యాలను పరిపూర్తి చేయగల సాంస్కృతిక శక్తిగా నిరూపించుకుంటోంది.

ఈ యాభై వసంతాల చారిత్రక‌ సందర్భాన్ని సృజనాత్మక ధిక్కారంగా జనవరిలో 27వ మహా సభలతో ప్రారంభించింది. సభలైపోయిన వారానికి విరసం కార్యదర్శి కామ్రేడ్ కాశీంను తెలంగాణ ప్రభుత్వం అరెస్టు చేసింది. మే 20న బెయిలు మీద తను విడుదలయ్యారు. ఇప్పటికి 20 నెలలుగా వ్యవస్థాపక‌ సభ్యుడు వరవరరావు పూనా, ముంబై జైలు నిర్బంధంలో ఉన్నారు. మరో సీనియర్ సభ్యుడు జీఎన్ సాయిబాబా యావజ్జీవ ఖైదీగా నాగపూర్ జైల్లో ఉంటున్నారు. దేశమంతా సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులు వందలాది మంది ఉపాలాంటి అక్రమ కేసుల్లో జైళ్లలో ఉన్నారు...
ఈ వర్తమాన నిర్బంధ, సంక్షోభ కాలంలో, కరోనా విప‌త్తులో విరసం యాభయ్యో ఆవిర్భావ దినాన్ని ఆన్లైన్ లో నిర్వహించుకోవాల్సి వస్తోంది. ప్రతి సామాజిక కల్లోలమూ విరసం ప్రాపంచిక దృక్పథాన్ని పదును పెట్టింది. ప్రజా జీవితంలోంచి పెల్లుబుగుతున్న నిరసనలు, ఆశలు, ఆకాంక్షలు, ఆలోచనా రీతులు విర‌సం తాత్వక చింతనను వర్గపోరాట భూమిక‌ మీద తీర్చిదిద్దుతున్నాయి. అందువల్లనే సాహిత్య రంగంలోని అనేక తాత్విక రాజకీయ సంక్షోభాలకు విరసం తన విప్లవోద్యమ చైతన్యంతో పరిష్కారాలను అన్వేషించగలుగుతోంది.
ఈ నిరంతరాయ కృషి వల్లనే విరసమంటే మూడు తరాల నవ యవ్వనమని రుజువైంది. అది యాభయ్యేళ్ల సృజనాత్మక ధిక్కారం. నిరంతర సృజనాత్మక ప్రయోగం. అనేక కల్లోలాల నుంచి, నిర్బంధపు రాపిడి నుంచి పదునెక్కిన సృజనాత్మకత విరసం సొంతం. పోరాట ప్రజల విముక్తి కాంక్ష నుంచి, గెలుపు ఓటములెన్ని ఎదురైనా వ్యవస్థతో రాజీపడని వర్గపోరాటం నుంచి రాటుదేలిన ధిక్కారం విరసం ప్రాణం. అందువల్లనే విరసం నిరంతర ప్రయోగశీలి. అదే దాని ప్రాసంగికతలోని బహిరాంతర రహస్యం.
సాహిత్యమంటే మానవ చైతన్యం, మానవ ఆచరణ, మానవుల సాంస్కృతిక వ్యక్తీకరణ. రాజకీయార్థిక వ్యవస్థల సంక్షోభానికి, వాటిలోని వైరుధ్యాలను పరిష్కరించే వర్గపోరాటానికి కళాత్మక రూపం. దీనికి అట్టడుగు ప్రజల జీవితమే వనరు. ఆ ప్రజలు దారుణమైన దోపిడీకి గురవుతున్నారు. పితృస్వామ్య హింసను అనుభవిస్తున్నారు. కుల పీడ‌నకు బలైపోతున్నారు. మైనారిటీ జాతులు, మతాలు, తెగలు మెజారిటీ ఆధిక్యానికి అణగారిపోతున్నారు. అనుమానితులవుతున్నారు. వీటికి వ్యతిరేకంగా తరతరాలుగా పోరాటాలు కూడా చేస్తున్నారు. ప్రత్యామ్నాయ భావజాల ప్రపంచాన్ని నిర్మిస్తున్నారు.
దండకారణ్యంలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో విప్లవోద్యమ నాయకత్వంలో పీడిత ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయార్థిక సాంస్కృతిక వ్యవస్థలను నిర్మించి నిర్వహిస్తున్నారు. ఫాసిజంగా మారిపోయిన బూర్జువా ప్రజాస్వామ్యానికి పోటీగా విప్లవ ప్రజాస్వామాన్ని, స్వావలంబన‌ను, కింది నుంచి ప్రజాస్వామ్యాన్ని ఆచరిస్తున్నారు. లక్షలాది సైనిక బలగాలతో పోరాడుతూ విప్లవమే ప్రత్యామ్నాయమనే సందేశాన్ని ప్రపంచ కార్మికవర్గానికి అందిస్తున్నారు.
ఈ వేర్వేరు రూపాల్లోని ప్రతీ ఆతరణకు విరసం సాహిత్య కళా వ్యక్తీకరణ వేదిక.అనేక జీవిత పార్శ్యాల, ధిక్కారాల, ఆత్మగౌరవ ఆకాంక్షల, భవిష్యదాశ‌‌ల సృజన కూడలి విరసం. ఈ పని యాభై ఏళ్లుగా సాగడానికి విరసం సృజనాత్మకత, విమర్శనాత్మకత కారణం, దేన్నయినా విమర్శనాత్మకంగా చూడటమే మార్క్సిజంలోని శాస్త్రీయత. తనను తాను కూడా నిశితమైన స్వీయ విమర్శలు గురి చేసుకోగల సాహసం ఉన్నందు వల్లే విమర్శించవలసిన దేన్నయినా సునిశితంగా విశ్లేషించగలుగుతోంది. తనను, ఇతరులనూ ఆచ‌రణ గీటురాయి మీదే అంచనా వేయగలుగుతోంది. యాభై ఏళ్ల ప్రయాణానికి ఇదే ఇరుసు...
ఈ ఆవిర్భావ దినం సందర్భంగా సమకాలీన‌ సాహిత్య సామాజిక విషయాల మీద రెండు రోజులు సభలు జరపాలని చాలా ముందే అనుకున్నాం. కానీ కరోనా కాలం దేన్నీ అనుమతించడం లేదు. కానీ ఈ కాలంలో పాలకవర్గం తన పనులన్నీ ఎప్పటికంటే మరింత చురుగ్గా చక్కబెట్టుకుంటోంది. కరోనాతో మరింత సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ కూరుకపోతున్న తరుణాన్ని వాడుకొని కార్పొరేట్లకు ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు దోచి పెట్టింది. తరతరాల పోరాట ఫలితమైన కార్మిక చట్టాలను రద్దు చేసింది. ప్రజా మేధావులను, సీఏఏ వ్యతిరేక ఉద్యమకారులను అక్రమంగా అరెస్టు చేసింది. లాక్ డౌన్ లో కూడా ఎకౌంటర్ హత్యలకు పాల్పడుతోంది. హిందుత్వ ఫాసిస్టు విధానాలను యథేచ్ఛగా అమలు చేస్తోంది. కరోనా విపత్తు నుంచి ప్రజ‌ల మనసు మల్లించడానికి చైనా వివాదాన్ని వాడుకుంటున్నది. ఈ నేపథ్యంలో జరుగుతున్న విరసం ఆవిర్భావ సభకు హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం.

- విప్లవ రచయితల సంఘం
(జూలై 4వ తేదీ సాయంత్రం 5గంటల నుండి 8 గంటల వరకు, జూలై 5వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1గంటవరకు, మళ్ళీ సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు https://www.facebook.com/virasamorg-1050140691663947/ ఈ లింక్ లో లైవ్ చూడండి)

Keywords : virasam, 50th birthday, meetings, online
(2024-04-20 16:19:01)



No. of visitors : 980

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జూలై