ఇప్పటికీ మానని గాయం - కారంచేడు మారణ హోమం

ఇప్పటికీ

1985 జూలై 17 సరిగ్గా ముప్పైఐదు ఏళ్ళ కింద ఈ రోజు ప్రకాశం జిల్లా కారంచేడు దళిత వాడ నెత్తుటి కుప్పయ్యింది.... నరనరాన అహంకారం నిండిన కమ్మ భూస్వామ్యం దళితులను ముక్కలు ముక్కలు గా నరికిందక్కడ... అగ్రకుల రాక్షసమూకలు నెత్తుటి ఏరులుపారించారక్కడ..... బరిసెలు, గొడ్డళ్ళు, కత్తులతో దళిత మహిళలను, పిల్లలను, ముసలివారిని, యువకులను వెంటాడి..వేటాడి చంపారక్కడ ... మహిళలను చెరిచారు.... పసి పిల్లలను కింద పడేసి తొక్కారు.... ఆరుగురిని హత్య చేసి, ఎందరో మహిళలపై అత్యాచారాలు చేసి, మరెంతో మందిని నెత్తుటి ముద్దలను చేశారు. ఇదంతా చేసింది ఆ ఊరి కమ్మ భూస్వాములు... అప్పటి ముఖ్యమంత్రి వియ్యంకుడి అద్వర్యంలో ఇదంతా జరిగింది....తెలుగు నేల యావత్తూ బిత్తర పోయి చూసింది. మూగగా రోధించింది. కమ్మ భూస్వాముల మారణ హోమంలో 1)దుడ్డు వందనం 2) దుడ్డు రమేశ్ 3) తేల్ల మోషే 4) తేల్ల ముత్తయ్య 5) తేల్ల యెహోషువా 6) దుడ్డు అబ్రాహాం లు మరణించారు. అసలు దాడికి కారణమేంటంటే.... కారంచేడులో మాల, మాదిగ, ఎరుకల కులాల వారు ఒకే దగ్గరుంటారు. కొత్త తరం దళిత యువకులు కొందరు పెద్ద చదువులు చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం, కమ్మలు చేసే తప్పులను ప్రశ్నించడం అక్కడి కమ్మ భూస్వాములకు కళ్ళమంటగా ఉండేది. వారి కెట్లైనా బుద్ది చెప్పాలని సమయం కోసం కాచుక కూర్చున్నారు. ఆ గ్రామంలోని కమ్మ యువకులు ప్రతి రోజూ దళిత, ఎరుకల యువతుల పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారు. వాళ్ళ ఇళ్ళ దగ్గరకొచ్చి మరీ ఆడపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు. వెంకటేషు అనే కమ్మ యువకుడు ఒకరోజు తిరుపతయ్య అనే ఎరుకలతని ఇంటికి వచ్చి అతని కూతురుతో అసభ్యం గా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. తిరుపతయ్య అతని భార్య, వెంకటేశ్ ను వారించడానికి ప్రయత్నించడంతో అతను వారిద్దరి పై దాడి చేసి కొట్టాడు. అక్కడే ఉండి ఈ తతంగాన్ని గమనిస్తున్న కొందరు దళిత యువకులు వెంకటేశ్ ను అడ్డుకొని బలవంతంగా అక్కడినుండి పంపించారు. ఇది ఆ ఊరి కమ్మలకందరికి ఆవేశాన్ని తెప్పించింది. అలాగే బహిర్భూమికి పోయే దళిత మహిళల పట్ల కమ్మ యువకులు ప్రతి రోజూ అసభ్యంగా ప్రవర్తించేవారు. ఇటువంటి సంఘటనలు జరుగుతున్న సమయంలోనే ఎన్నికలొచ్చాయి. ఆ ఎన్నికల్లో నిలబడ్డ దగ్గుబాటి చెంచురామయ్య కొడుకు దగ్గుబాటి వెంకటేశ్వర్ రావుకు మద్దతివ్వాలని చెంచురామయ్య దళిత కుల పెద్దలను కోరాడు. కానీ వాళ్ళు అతనికి హామీ ఇవ్వలేదు. ఆ ఎన్నికల్లో దళితులంతా కాంగ్రెస్ కు ఓటు వేశారని చెంచురామయ్య భావించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు దళితులు నీళ్ళు తాగే చెరువులో ఇద్దరు కమ్మ యువకులు తమ బర్రెలను కడుగుతూ కుడితిని పారబోయటాన్ని అక్కడికి మంచినీళ్ళ కోసం వచ్చిన మున్నంగి సువార్త అనే మాదిగ మహిళ ప్రశ్నించింది. దాంతో వాళ్ళ అగ్రకుల అహానికి దెబ్బతగిలి ఆమెను చెర్నకోలాతో కొట్టారు. సువార్త కూడా తన బిందెతో వారికి సమాధానం చెప్పింది. వేల ఎకరాల భూములున్న భూస్వాములను, కోట్లాది రూపాయల బిజినెస్ లున్న వ్యాపారులను, సినీ రాజకీయ రంగాలను ఏలుతున్న వారిని, అందులోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టీ.రామారావు కులం వారిని,చుట్టాలను, ఓ దళిత మహిళ ఎదిరించడమా ? కమ్మలందరూ రగిలి పోయారు.... కూడబలుక్కున్నారు.... చుట్టుపక్కల గ్రామాల్లోని తమవారికి సమాచారం పంపించారు. 1985 జూలై 17 వ తేదీన వేలాది మంది కమ్మ అగ్రకుల దురహంకారులు కారం చేడు దళిత వాడ పై దాడి చేశారు. మానవత్వం నశించిన ఆ దుర్మార్గులు రాక్షసుల వలె ప్రవర్తించారు. పశువులు కూడా అసహ్యించుకునే రీతిలో మహిళపై అత్యాచారాలు చేశారు. హత్యలు చేశారు. కత్తులతో, బరిశెలతో వీరంగం సృష్టిస్తూ వికటాట్టహాసాలు చేశారు. ఇది మొత్తం దగ్గుబాటి వెంకటేశ్వర్ రావు తండ్రి, ఎన్,టీ,రామారావు వియ్యంకుడు అయిన దగ్గుబాటి చెంచురామయ్య అద్వర్యంలో,కనుసన్నలో సాగింది. ప్రభుత్వం మాత్రం ఈ కేసుకు సంభంధించి ఎఫ్ఫైఆర్ లో చెంచురామయ్య పేరును కూడా చేర్చలేదు. ఆ తరువాత ఈ మారణ హోమానికి వ్యతిరేకంగా, హంతకులను శిక్షించాలనే డిమాండ్ తో విప్లవ, దళిత ఉధ్యమకారులు చాలా కాలంపాటు ఉధ్యమాలు చేశారు. ఆ ఉధ్యమాల మూలంగా దేశం యావత్తూ కారం చేడు వైపు చూసింది. ఆ ఉధ్యమకారణంగా ఆ తరువాత దళిత ఉధ్యమం ఒక కొత్త చరిత్రను లిఖించింది. ఆ తర్వాత కొంత కాలానికి ఇప్పుడు మావోయిస్టు పార్టీగా పేరు మార్చుకున్న అప్పటి పీపుల్స్ వార్ పార్టీ చెంచురామయ్యను చంపేసింది.

Keywords : karamchedu, kamma land lords, dalit, attacks, murder, daggubati chenchuramayya, nt ramarao
(2024-04-11 19:09:26)



No. of visitors : 875

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇప్పటికీ