నాగ్ పూర్ జైలులో కోవిడ్-19: తీవ్రంగా క్షీణిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఆరోగ్యం

నాగ్


తన పరిస్థితిని న్యాయవాదికి, కుటుంబ సభ్యులకు వివరించడానికి ప్రొఫెసర్ సాయిబాబాకు జైలు అధికారులు ప్రత్యేక అనుమతి ఇచ్చారు. నాగపూర్ సెంట్రల్ జైలులో COVID-19 నియంత్రణ చేయలేనంతగా వ్యాప్తి చెందిందని డాక్టర్ జి.ఎన్.ఇటీవల ఫోన్ చేసినప్పుడు చెప్పారు. జైలు అధికారులు చురుకుగా నివారణ చర్యలు చేపట్టినప్పటికీ, శిక్షపడిన ఖైదీలు, విచారణా ఖైదీలు, జైలు గార్డులతో సహా 100 మందికి పైగా COVID-19 సోకింది.

అంటువ్యాధులు విస్తృతంగానూ అత్యధిక సంఖ్యలోనూ ఉన్నాయి. ఒక బారక్ తర్వాత మరో బ్యారక్‌కు వ్యాపిస్తోంది. 2020 జూలై 8న, అండా సెల్ లోని మొత్తం 20 మంది ఖైదీలకు COVID-19 పరీక్ష చేసినప్పుడు ఒక ఖైదీకి పాజిటివ్ నిర్థారణైంది. "ఈ వ్యాధి నాకు చాలా దగ్గరలోనే ఉంది, నా సెల్ కి ఏ క్షణాన్నైనా రావచ్చు" అని సాయిబాబా చెప్పారు. బలహీనమైన ఆరోగ్యస్థితి, ఇదివరకే ఉన్న యితర వ్యాధుల వల్ల దెబ్బతిన్న ఆరోగ్యం, క్షీణిస్తున్న రోగనిరోధక శక్తితో సాయిబాబా మరింత ప్రమాదకర పరిస్థితిలో ఉన్నారు.

బ్యారక్స్‌లో తిరుగుతూండిన అధికారులకు కూడా COVID వచ్చింది. దీన్ని ఎదుర్కోవటానికి ప్రత్యేక శ్రద్ధ వహించడం లేదా చికిత్స అందించడం జరగడం లేదు. అంతేకాక, తనకి వున్న ఇతర తీవ్రమైన ఆరోగ్య రుగ్మతలకు కూడా చికిత్స జరగడంలేదు. సాయిబాబాకు (53) వైరస్ వచ్చే అవకాశాలు అధికంగా వున్నాయి. వస్తే కనక వైద్య చికిత్స అందకుండా తనంత తానుగా కోలుకొనే స్థితిలో లేడు.
రోజువారీ అవసరాలను తీర్చుకోవడంలో సహాయం చేయడానికి జైలుఅదికారులు ʹసహాయకులనుʹ ఎవరినీ కేటాయించలేదు. అపరిశుభ్రమైన పరిస్థితులలో జీవించాల్సి వస్తోంది. ఒకవేళ వైరస్ సోకితే కనక ఒంటరిగా వదిలేస్తారు. పరిస్తితి భయంకరంగా వుంటుంది ; సహాయకులు లేకుండా సెల్‌కు పరిమితం చేస్తారు; ఆరోగ్య సంరక్షణ కోసం కుటుంబానికి అప్పగించడాన్ని అనుమతించరు. ప్రస్తుత పరిస్థితులలో అంటువ్యాధులు సులభంగా రాగలిగిన అత్యంత నాజూకు ఆరోగ్య స్థితిలో వున్నాడు కాబట్టి ఇది అతనికి ఒక నిర్దిష్టమైన మరణశిక్షలా వుంటుంది.
అంతకు ముందు 2020 జూలై 6 న ఫోన్ చేసినప్పుడు సాయిబాబా తనకు ఆరోగ్యం బాగాలేదని చెప్పారు. COVID-19 లాక్డౌన్ సమయంలో జైలు అధికారులు రెండుసార్లు నాగ్‌పూర్ ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అ ఆసుపత్రిలోని 5 వివిధ విభాగాలలో చూపించినప్పుడు, డాక్టర్లు మరిన్ని పరీక్షలు చేయించాలని చెప్పి కొన్ని నొప్పి తగ్గే మందులను (painkiller) రాసిచ్చారు. ఆసుపత్రిలో MRI- బ్రెయిన్ స్కాన్, ఇతర పరీక్షలు చేశారు కానీ యింతవరకు రిపోర్టులు ఇవ్వలేదు. అనేకసార్లు అభ్యర్ధనలు చేసినప్పటికీ, సెప్టెంబర్ 2018 నాటి నుండి పాత రిపోర్టులు ఏవీ యివ్వలేదు. ఆ రిపోర్టులు అందుబాటులో లేకపోవడం వల్ల కుటుంబ సభ్యులు అతని ఆరోగ్య సమస్యలపై తమ కుటుంబ వైద్యుడి సలహా కూడా తీసుకోలేకపోయారు.
నాగ్‌పూర్ గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్ వైద్యులు 2020 జూన్ 25 న పిత్తాశయాన్ని(gall bladder) తొలగించడానికి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. కానీ క్షీణించిన ఆరోగ్యస్థితివల్లనూ, ప్రస్తుతం ఉన్న COVID-19 వల్లనూ, వైరస్ సంక్రమణకు గురయ్యే అవకాశం ఎక్కువగా వుంది కాబట్టి శస్త్రచికిత్స చేయడం మంచిది కాదు. నాగ్‌పూర్ గవర్నమెంట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్యులు కోల్డ్ అండ్ హాట్ ప్యాక్‌లను క్రమం తప్పకుండా వాడాలని, నిద్రించడానికి మెడికల్ బెడ్‌ను మరియు ఆరు వైపుల దిండ్లు (నిరంతరం తీవ్రంగా వేధించే నొప్పి నుండి ఉపశమనం పొందటానికి) ఉపయోగించాలని సూచించారు. కానీ యింతవరకు జైలు అధికారులు ఏమీ యివ్వలేదు.
ఇప్పటివరకు, సహాయకులనెవరినీ కేటాయించలేదు. సహాయం చేయడానికి ఎవరూ లేకపోవడంతో టాయిలెట్‌కు వెళ్లడంతో సహా రోజువారీ కార్యకలాపాలను చేసుకోవడంలో ఆయన చాలా యిబ్బంది పడుతున్నారు. చాలా కాలం నుంచి బాగా మాసిన, ఉతకని దుస్తులను, దుప్పట్లను వాడుతున్నారు. ఇటువంటి అపరిశుభ్రమైన వాతావరణంలో వుండడం అలెర్జీలు, ఇన్ఫెక్షన్ మొదలైన వాటితో సహా తీవ్ర అనారోగ్య పరిస్థితులకు దారితీస్తుంది.
మార్చి నుంచి ఆయనకు వార్తాపత్రికలు యివ్వడంలేదు. తన ఎడమ చేయి పూర్తిగా పనిచేయలేని స్థితిలో ఉందని డాక్టర్ జిఎన్ సాయిబాబా తెలియచేసారు. నాడీ వ్యవస్థ కుడి చేతిని కూడా ప్రభావితం చేసింది. వేళ్ళ వరకు రెండు చేతులూ తీవ్రంగా నొప్పి పెడుతున్నాయి.
సైబరాబాద్ కమిషనర్ నివేదిక ప్రకారం అతని సోదరుడు నివాసం COVID కంటైన్మెంట్ జోన్లో వుండడం వల్ల మొదటి పెరోల్ దరఖాస్తు తిరస్కరించబడింది. అతని సోదరుడు దాదాపు నెల క్రితం సాయిబాబా పెరోల్ కోసం మళ్ళీ దరఖాస్తు చేసుకున్నాడు, కాని సంబంధిత జైలు అధికారులు ఇంతవరకు స్పందించ లేదు.
2020 జూలై 14 న, వైద్యపరమైన కారణాలతో తిరిగి ఒక రిట్ వేయగా, నాగ్‌పూర్‌లోని బాంబే హైకోర్టు ధర్మాసనం ప్రాసిక్యూషన్‌కు సమాధానం యివ్వడానికి 10 రోజుల సమయం ఇచ్చింది. జూలై చివరలో కేసును షెడ్యూల్ చేసింది.
చేతుల్లో కండరాల క్షీణత వల్ల డాక్టర్ జి. ఎన్. సాయిబాబాకు తీవ్రమైన శారీరక నొప్పి వస్తుంది. అతను ప్యాంక్రియాటైటిస్, అధిక రక్తపోటు, కార్డియోమయోపతి, దీర్ఘకాలిక వెన్నునొప్పి, కదలికలో యిబ్బంది, నిద్రలేమి మొదలైన సమస్యలతో బాధపడుతున్నాడు. పర్యవసానంగా, అతని శారీరక రుగ్మతలు తీవ్రమవుతున్నాయి, అయితే వైద్య సదుపాయాలు సరిపోకపోవడంవల్లనూ, నొప్పి నివారణ పట్ల వహిస్తున్న నిర్లక్ష్య వైఖరి వల్లనూ ఇప్పటికే నాజూకుగా ఉన్న ఆరోగ్యం మరింతగా బలహీనపడింది. జాతీయ మానవ హక్కుల కమిషన్, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థల అధికారులు జోక్యం చేసుకున్నప్పటికీ, కోర్టులు అతనికి బెయిల్ యివ్వనిరాకరించాయి. జైలు శిక్ష అనుభవిస్తున్నఖైదీలకు బెయిల్ యివ్వకుండా అనవసర కాలాయాపన చేయడం ఆర్టికల్ 21 ప్రకారం హామీ ఇవ్వబడిన ప్రాథమికహక్కులైన జీవించే హక్కు, స్వేచ్ఛా హక్కులను నిరాకరించడమే అవుతుంది.

భారత సుప్రీంకోర్టు జీవించేహక్కును సమర్థించింది. ʹమానవ గౌరవాన్ని కించపరిచే, తప్పించుకోగలిగే హింసను విధించే, మనిషిని మృగస్థాయికి దిగజార్చేట్లుగా ప్రవర్తించడం ఖచ్చితంగా ఏకపక్షంగా ఉంటుంది, అలా చేయడాన్ని ఆర్టికల్ 14 కింద ప్రశ్నించవచ్చుʹ అని ఖైదీల గురించి స్పందించింది. మానవుల స్వాభావిక గౌరవాన్ని, పౌర - రాజకీయ స్వేచ్ఛను ఆస్వాదించే స్వేచ్ఛా మానవుల ఆదర్శాన్ని గుర్తించే పౌర-రాజకీయ హక్కులపై అంతర్జాతీయ ఒడంబడిక (ఐసిసిపిఆర్) లో భారతదేశం సంతకం చేసింది.

అంతేకాకుండా, 2007 అక్టోబర్ 1న వికలాంగుల హక్కులపై యుఎన్ కన్వెన్షన్ (సిఆర్పిడి)ను భారతదేశం ఆమోదించింది. ఖైదీల చికిత్స కోసం రూపొందించిన ప్రామాణిక కనీస నియమాలపై ఐక్యరాజ్యసమితి తీర్మానం 70/175ను కూడా భారతదేశం ఆమోదించింది (దీనిని నెల్సన్ మండేలా రూల్స్ అని కూడా పిలుస్తారు). ఈ ఒడంబడికలు, సమావేశాలు, తీర్మానాలు అందరు వ్యక్తులు, ఖైదీలు, దివ్యాంగులకు జీవితాన్ని, గౌరవాన్ని నిర్ధారిస్తాయి. వాటి అమలుకు అవసరమైన ప్రమాణాలను రూపకల్పన చేస్తాయి.

అటువంటి ప్రదేశంలో COVID-19 వైరస్ వ్యాప్తిచెందడం డాక్టర్ జి.ఎన్. సాయిబాబాకు మరణశిక్షలాంటిది. అటువంటి ప్రమాదకరమైన ఆరోగ్య స్థితిలో వున్న డాక్టర్ జి.ఎన్. సాయిబాబాను, మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు వెంటనే బెయిల్ లేదా పెరోల్‌పై విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము. అలా చేయడం వల్ల అతని కుటుంబ సభ్యులు తాము నివసిస్తున్న హైదరాబాద్ లేదా ఢిల్లీలలో తగిన వైద్య చికిత్స అందించగలుగుతారు.

ఖైదు చేయబడిన ప్రజాస్వామిక స్వరాలన్నింటినీ విడుదల చేయండి! వారి జీవన హక్కును సమర్థించండి.

ఏ. ఎస్. వసంత కుమారి,

(డా. జి. ఎన్. సాయిబాబా సహచరి)

న్యూ ఢిల్లీ.

జి. సత్యవతి,

(డా. జి. ఎన్. సాయిబాబా తల్లి)& కుటుంబ సభ్యులు.

Keywords : saibaba, nagpur jail, corona, wife, vasantha
(2024-04-11 19:10:04)



No. of visitors : 726

Suggested Posts


Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions

After the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving

Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju

I am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court.

బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO

నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు.

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి

తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.

ముగిసిన అమ్మ ఎదురు చూపులు

విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది.

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం

రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నాగ్