సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ప్రకటన
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన మీడియా ప్రకటన....
కరోనా మహమ్మారి ప్రజలను హతమార్చుతున్న ఈ కాలంలో మావోయిస్టు పార్టీ భౌతిక దాడులకు పాల్పడకుండా స్వీయనియంత్రణ పాటిస్తుంటే కేసిఆర్, నరేంద్ర మోదీల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టుల నిర్మూలనే లక్ష్యంగా దాడులు చేయడాన్ని ఖండించండి. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మల్లెపల్లి తోగు అడవుల్లో, కొమురం భీమ్, (అసిపాబాద్) జిల్లా తొక్కగుడా అడవులల్లో మా దళాలపై గ్రేహౌండ్స్ బలగాలతో దాడులు చేయడాన్ని, ప్రజలను అరెస్టు చేయడాన్ని, ప్రజలు ప్రజాస్వామికవాదులు తీవ్రంగా ఖండించండి. ఉపా, ఎన్ ఐ ఏ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం.
జూలై /15వ తారీకున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలంలోని మల్లెపల్లి తోగు గ్రామ అడవుల్లో మరియు కుమరం భీం ఆసిఫాబాద్, జిల్లా తిర్యాణి మండలం, మంగ్ ప్రాంతంలోని తొక్కగూడ అడవుల్లో వందలాది మంది గ్రహౌండ్స్, పారామిలటరీ పోలీసులు, పోలీసు ఇన్ఫార్మర్ల ద్వారా సమాచారం ఆధారంగా మా దళాలను నిర్మూలించే లక్ష్యంతో దాడులు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం నుండి మొదలు ఉమ్మడి ఆదిలాబాద్ వరకు ఏజెన్సీ ప్రాంతాన్ని, గోదావరి, ప్రాణహిత పరివాహక ప్రాంతాన్ని గ్రహౌండ్స్,కోబ్రా బలగాలతో జల్లెడపడుతూ కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ప్రహార్ పేరుతో తెలంగాణ- ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, ఆంధ్ర పోలీసు బలగాలతో జాయింట్ గా జనవరి నుండి ఇప్పటి వరకు మావోయిస్టు పార్టీని నిర్మూలించే లక్ష్యంతో వరుస దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులలో కా॥ సృజన (ఆర్ సిఎమ్) కా॥ అభిలాష్ (కమాండర్)తో సహా 40 మంది కామ్రేడ్స్ అమరులైనారు. దండకారణ్యంలో ఈ మధ్య కాలంలో 20 మంది విప్లవ కారులను, ప్రజలను బూటకపు ఎన్కౌంటర్లలో హత్యలు చేశారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విస్తరిస్తుంటే మా దళాలు, మా సంఘాలు ప్రజలను చైతన్య పరుస్తూ భౌతిక దాడులకు పాల్పడకుండా స్వీయనియంత్రణ పాటిస్తుంటే ప్రజల భాదలను పట్టించుకోకుండా లాక్ డౌన్లతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతూ, అనారోగ్యాలకు, ఆకలి చావులకు గురి చేస్తూ మోడీ బీజేపీ ప్రభుత్వం, టీఆర్ఎస్ (కేసీఆర్) ప్రభుత్వాలు ప్రజల తరపున పనిచేస్తున్న మా పార్టీని, దళాలను నిర్మూలించే లక్ష్యంతో దాడులు కొనసాగిస్తున్నాయి.
భారత దోపిడీ పాలక వర్గాలు 2022 నాటికి దేశంలో విప్లవోద్యమాన్ని నిర్మూలించేందుకు వ్యూహాత్మక సమాధాన్ దాడిని తీవ్రతరం చేశాయి. అందులో భాగంగానే తెలంగాణలో కూడా పాశవిక అణచివేతను కొనసాగిస్తున్నారు.
కార్డన్ సెర్చ్ పేరుతో గ్రామాల చుట్టివేత, ఇండ్ల సోదాలు, అక్రమ అరెస్టులు, చిత్రహింసలు, ప్రజలను బూతులు తిట్టడం, కొంత మందిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చకుండా పోలీస్ స్టేషన్లలోనే చిత్రహింసలు పెడుతూ అక్కడే వుంచుతున్నారు. ఈ మధ్యకాలంలో 60 మంది వరకు సంఘ నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి ఉపా చట్టం కింద జైళ్ళలో పెట్టారు. తీవ్ర భయబ్రాంతులకు గురి చేస్తూ రోజువారిగా పోలీసు స్టేషన్లలో సంతకాలు పెటిస్తూ వాళ్ళతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు
కుట్రలు పన్నిన బ్రాహ్మణీయ హిందూ మతోన్మాదులు, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల కోసం పని చేస్తున్న పలు ప్రజాసంఘాల నాయకులను అరెస్టులు చేసి జైల్లో పెట్టారు. విడుదలైన తెలంగాణ ప్రజా సంఘం నాయకుడు నల మాసకృష్ణను ఎన్ ఐ ఏ వాళ్ళు తిరిగి అరెస్టు చేసి జైల్లో పెట్టారు. ప్రజా గొంతుకలు ప్రజాస్వామిక వాదులు వరవరరావు, సాయిబాబాలు అనారోగ్యంతో, వృద్ధాప్యంతో బాధపడుతున్నా పాలకులు వాళ్ళను జైళ్ళల్లోనే చంపివేయాలనే కుట్రతో సరైన వైద్యం అందించడం లేదు. వాళ్ళను, వాళ్ళతో పాటు జైళ్ళవున్న మరో తొమ్మిది మందిని వెంటనే విడుదల చేయాలి. ఉపా, ఎన్ ఐఏ కేసులు ఎత్తివేయాలని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు పోరాడాలి.
బ్రాహ్మణీయ హిందుత్వవాదులు, హిందూ రాజ్య నిర్మాణ లక్ష్యంతోనే కోవిడ్-19 కరోనా మహమ్మారీ కలవరపెడుతున్నప్పటికీ ప్రజలపై పాశవిక దాడిని కొనసాగిస్తున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ (కేసీఆర్) ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలు చేపట్టి మరింత నియంతృత్వంగా మారింది. ప్రజల సమస్యలు పరిష్కరించలేని పరిస్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ఆయుధాన్ని ప్రయోగిస్తున్నాయి. ఈ ప్రతిఘాతుక యుద్ధాన్ని ఓడించడానికి పీడిత ప్రజలందరూ ఈ రోజు కొనసాగుతున్న ప్రజావిముక్తి యుద్ధంలో భాగస్వాములు కావాలని కోరుతున్నాం. ప్రజలారా ప్రజల కోసం పనిచేస్తున్న దళాలను కంటికి రెప్పలా కాపాడుకోండి. ప్రజలపై, దళాలపై దాడులు ఆపకపోతే టీఆర్ఎస్ పార్టీ నాయకులకు, బీజేపీ పార్టీ నాయకులకు ప్రజల చేతిలో శిక్షలు తప్పవని హెచ్చరిస్తున్నాం. ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా! ప్రజల కోసం పని చేస్తున్న దళాలపై టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్న దాడులను ఖండించండి. అడవుల నుండి గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.
విష్ణనాభినందనలతో
జగన్
అధికార ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర కమిటీ
Keywords : CPI Maoist Party, Telangana, Jagan, bjp, trs, police, attacks
(2024-03-27 03:03:21)
No. of visitors : 2113
Suggested Posts
| శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావువరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు.... |
| అది ఎన్కౌంటర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజనిర్థారణ బృందంహిడ్మే ఒంటిపై దుస్తులను తొలగించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీర భాగాలన్నింటినీ కత్తులతో కోశారు. ఆ తరువాత చాతీపై, కడుపులో తూటాల వర్షం కురిపించారు. మృతదేహాన్ని సుక్మా పట్టణానికి తరలించారు. 14వ తేది విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... |
| శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి.... |
| రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు... |
| చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్నప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా |
| ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను..... |
| నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపునేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు..... |
| ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం.... |
| జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ (వీడియో) మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్బరీ వేడుకలు ప్రపంచానికి ఇప్పడు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్కరిద్దరు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్రజా విముక్తి గెరిల్లాలతో కలిసి కదంతొక్కారు. |
| ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపుగొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో... |