include 'men';
?>
ప్రొఫెసర్ సాయిబాబాను కాపాడుకుందాం... సహకరించండి... సాయిబాబా భార్య లేఖ
నాగ్పూర్ సెంట్రల్ జైలులో కోవిడ్ -19 పాజిటివ్ కేసులు వచ్చిన నేపథ్యంలో వైద్య ప్రాతిపదికన ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా బెయిల్ కోసం వేసిన దరఖాస్తును 2020 జూలై 28 న నాగ్పూర్లోని ముంబై హైకోర్టు బెంచ్ మళ్ళీ తిరస్కరించింది. వైద్య ప్రాతిపదికమీద 2018 మార్చిలో వేసిన మొదటి బెయిల్ దరఖాస్తును కూడా ఈ కోర్టు కొట్టివేసింది. అలాగే ఆ తర్వాత పెరోల్ దరఖాస్తును కూడా తిరస్కరించింది.
COVID-19 తీవ్రత నెపథ్యంలో, డాక్టర్ జి.ఎన్. సాయిబాబా ఆరోగ్య స్థితివల్లనూ, 2020 ఫిబ్రవరి నుండి లింఫోమా క్యాన్సర్ వల్ల తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని చూడడం కోసమూ 45 రోజుల పాటు పెరోల్పై విడుదల చేయాలని కోరుతూ 2020 ఏప్రిల్ 2న మహారాష్ట్ర హోం శాఖకు, నాగ్పూర్లోని జైళ్ల డివిజనల్ కమిషనర్కు దరఖాస్తు పెట్టుకున్నాము.
ప్రొఫెసర్ సాయిబాబా నివాసం కంటైన్మెంట్ జోన్లో ఉందని చెప్పి పెరోల్ను తిరస్కరించారు. కానీ, అది వాస్తవం కాదు. ప్రస్తుతం, అతని తల్లి ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా వున్నది. మెదడుకు క్యాన్సర్ వ్యాపించింది. వైద్యుల అంచనా ప్రకారం ఆమె రెండు రోజుల కన్నా ఎక్కువ కాలం జీవించదు. 28.07.20న బెయిల్ను తిరస్కరించిన ఉత్తర్వులో, ఇప్పటికే ఒక తమ్ముడు అనారోగ్యంతో ఉన్న తల్లిని చూసుకొని జాగ్రత్తలు తీసుకొంటున్నాడు కాబట్టి, చావుకు దగ్గరగా వున్న తన తల్లిని చూడటానికి డాక్టర్ సాయిబాబా వెళ్ళాలనేది సహేతుకంగా లేదు అని ప్రాసిక్యూషన్ పేర్కొన్నది. ఈ దారుణమైన స్థితిలో కూడా, గౌరవనీయమైన న్యాయస్థానం డాక్టర్ సాయిబాబాకు తన తల్లిని చివరిసారిగా చూడటానికి అనుమతిస్తుందని అనిపించడం లేదు.
నిన్న 28.07.20న గౌరవనీయ ధర్మాసనం 2018లో మొదటి బెయిల్ తిరస్కరణ నాటి నుండి ఈ కేసుకు సంబంధించిన పరిస్థితులు మారలేదని, కాబట్టి తాము మొదటి బెయిల్ తిరస్కరణ ఉత్తర్వులను అనుసరిస్తామని పేర్కొన్నది. తీవ్రంగా క్షీణిస్తున్న ఆరోగ్యమూ, నాగ్పూర్ జైలులో COVID-19 వ్యాప్తి వల్ల సాయిబాబా ప్రాణాలకు ముప్పు కలిగే ప్రమాదమున్నదని మా న్యాయవాది ఇచ్చిన కారణాలను కోర్టు తేలిగ్గా కొట్టిపారేసింది. అతనికి పాజిటివ్ రాలేదనీ, అత్యంత తక్కువ మంది వెళ్ళే అండా సెల్లో ఉంచారు కాబట్టి వచ్చే అవకాశం కూడా లేదని పేర్కొన్నది. అతనికి ఇద్దరు సహాయకులను కూడా ఇచ్చామని చెప్పింది.
జైలులో COVID-19 పాజిటివ్ కేసులు వచ్చిన ఈ కల్లోల వాతావరణంలో, సోకాల్డ్ ʹCOVID-19 భద్రతాʹ అండా సెల్కి భోజనం బయటి నుంచి వస్తుంది. సహాయకులు బయటినుంచి వస్తారు. కాబట్టి స్పష్టంగా ఇది వైరస్ను అదుపుచేయగలిగే జోన్ కాదు. సాయిబాబా ఫోన్ చేసినప్పుడు వివరించినట్లుగా, సహాయకులు తాము స్వచ్ఛందంగా సహాయం చేయడానికి మానసిక సిద్ధంగా లేమని, కానీ తమని బలవంతం చేస్తున్నారనీ, జైలు అధికారులకు ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నారు.
తన ప్రాథమిక అవసరాల్లో సహాయం చేయడానికి ఎవరూ లేకుండా పూర్తిగా అపరిశుభ్రమైన పరిస్థితులలో జీవిస్తున్నట్లు సాయిబాబా చెప్పారు. ముఖ్యంగా రద్దీగా ఉండే జైళ్లలో వైరస్ వ్యాప్తికి సంబంధించి పరిస్థితి తీవ్రతను కోర్టు తక్కువగా అంచనా వేసినట్లు అనిపిస్తుంది.
సాయిబాబా వైద్యానికి సంబంధించిన వైద్య పత్రాలు కానీ, తరచుగా అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటి రిపోర్టులు కానీ యిప్పటి వరకు కోర్టు కుటుంబానికి అందించలేదు. ఆ రిపోర్టులను మా కుటుంబ వైద్యులకు చూపించి వారి అభిప్రాయం తెలుసుకోవడానికి మార్గం లేదు. అంతేకాక, ఈ రిపోర్టులలో వున్న వ్యాధి నిర్థారణ ఏమిటో కూడా మాకు తెలియదు. తన ఆరోగ్యం గురించి తెలుసుకోవాలనుకున్న రోగికి కూడా వాటిని అందించలేదు.
ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు వేర్వేరు వ్యాధులకు అవసరమైన చికిత్సా దినచర్యను గతంలో పేర్కొన్నారు, కానీ ఫిజియోథెరపీతో సహా ఈ దినచర్యకు జైలు ప్రాంగణంలో సౌకర్యాలు లేవు. అందువల్ల, అతన్ని చూసిన ప్రభుత్వ వైద్యుల ప్రకారం, జైల్లో అతను శిక్ష అనుభవిస్తున్న పరిస్థితుల్లో చికిత్స పొందడం అసాధ్యం. అతనికి చికిత్స అందిస్తున్నట్లు ప్రాసిక్యూషన్ ఇప్పటికీ అంటోంది, కాని ఆ చికిత్స అతని ఆరోగ్య పరిస్థితిని ఏ మాత్రం మెరుగుపరచడం లేదు. జైలులో ఉన్న ఆసుపత్రికి, బయటి ఆసుపత్రులకు తరచుగా వెళ్ళడం చూస్తుంటే అతని ఆరోగ్య స్థితిలో ఎలాంటి మార్పు లేదని అర్థమవుతోంది .
న్యాయస్థానం ఈ అంశాలపై ఏ మాత్రం దృష్టి పెట్టలేదు. ప్రాసిక్యూషన్ మాటలను మాత్రమే వింటోంది. 11.07.20 న తన ఫోన్ కాల్లో సాయిబాబా జైలులో ఉన్న భయంకరమైన పరిస్థితిని స్వయంగా మాకు తెలియజేశారు. అతను తన ఎడమ చేతిని కదపలేకపోతున్నాడు, కుడి చేయి కూడా నిరంతరం వణుకుతూంటుంది. తీవ్రమైన వీపు నొప్పి, శరీర నొప్పులతో పాటు, తరచుగా కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి, స్పృహతప్పిపోతున్నాడు.
అతని ఆరోగ్య పరిస్థితి గురించి ప్రాసిక్యూషన్ చెప్పే మాటలపై మాకు ఏ మాత్రం నమ్మకం లేదు కాబట్టి, మా వ్యక్తిగత వైద్య సలహాదారులతో సంప్రదించడానికి ప్రభుత్వ ఆసుపత్రుల నుండి స్కాన్లు, మెడికల్ రిపోర్టుల కోసం అభ్యర్థించాము, కానీ ఈ అభ్యర్థన మంజూరు కాలేదు. అందువల్ల, సాయిబాబా ఆరోగ్య వాస్తవ స్థితి గురించి మాకు ఏమీ తెలియడం లేదు. 2018 ప్రారంభంలో మాకు మెడికల్ రిపోర్టులు అందినప్పుడు, డాక్టర్ సాయిబాబా మెదడులో ప్రమాదకరమైన కణితి వుందని తెలిసింది. బహుశా అతని నిరంతర అనారోగ్యానికి అది కారణం కావచ్చు. కానీ ఈ విషయంపై ఏ దర్యాప్తు జరగలేదు.
ఈ పరిస్థితిలో డాక్టర్ సాయిబాబా బెయిల్ను తిరస్కరించాలని కోర్టు తీసుకున్న నిర్ణయం చాలా నిర్లక్ష్య ధోరణితో కూడిన నిర్ణయం. తనకు COVID-19 వస్తే కనక వారు అతనికి అస్సలు ఏ మాత్రం సహాయం చేయరని ఫోన్లో చెప్పారు. బారక్లో ఉన్న ఎవరూ అతని దగ్గరికి రాలేరు, ఖైదీల సహాయం లేకుండా అతను స్వయంగా ఏ పనులూ చేసుకోలేడు. ఇలాంటి స్థితిలో తాను చనిపోయేలా చేస్తారని ఆయన అన్నారు.
స్వామి అసీమానంద్, సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ వంటి పాలక పక్ష మద్దత్తుదార్లు, రాజకీయ నాయకులకు బెయిల్ మంజూరు చేయడమే కాకుండా, సాధ్వి ప్రజ్ఞా ఎన్నికల ప్రచారం చేసుకోగల , ఆ తరువాత పార్లమెంటులో పూర్తి కాలం పనిచేయగల ఆరోగ్యవంతురాలయినప్పటికీ ఆమెకు ఆరోగ్య కారణాల వల్ల ప్రత్యేక బెయిల్ లభించింది. ఆ కేసులతో పోలిస్తే, ఇది 90 శాతం వికలాంగుల కేసు - వీల్ చైర్కు కట్టుబడి ఉన్నవ్యక్తి, ఏకాంత నిర్బంధంలో అతని ఆరోగ్యపరిస్థితి మరింతగా దిగజారింది, ఒక డజను అనారోగ్యాలు అతన్ని చుట్టుముట్టాయి, ఇప్పటికీ COVID 19 వైరస్ ముప్పులో ఉన్నారు.
ఈ తీవ్రమైన అనారోగ్య పరిస్థితులలో వున్న ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా విడుదల కోసం మరింత దృఢంగా కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేయాలని మన దేశంలోనూ, అంతర్జాతీయంగానూ వున్న ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను.
నెల్సన్ మండేలా జైలు హక్కులు, దివ్యాంగుల హక్కుల ప్రకారం ప్రొఫెసర్ సాయిబాబా ప్రాణాలను కాపాడుకోవడానికి అందరూ సహాయం చేయాలని కోరుతున్నాను.
రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేయాలి.
వసంత కుమారి
జి.ఎన్ సాయిబాబా సహచరి
న్యూ ఢిల్లీ
29 జులై 2020
Keywords : prof.Saibaba, nagpur jail, maharashtra, Vasantha, Letter
(2024-03-26 07:32:43)
No. of visitors : 926
Suggested Posts
| Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditionsAfter the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving |
| Release Prof G.N Saibaba From Jail - Justice Markandey KatjuI am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court. |
| బుధవారం సాయంత్రం సాయిబాబాతో....ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు... |
| గూగీ వా థియాంగో...జి.ఎన్. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలునేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?! |
| ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHROనాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు. |
| Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and othersThe judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context.... |
| చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్ బెయిల్ ఇవ్వాలితన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది. |
| ముగిసిన అమ్మ ఎదురు చూపులు
విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది. |
| DU refuses to reinstate Saibaba despite VP pushDelhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate
Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case... |
| ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..