వీరుల కన్నతల్లి... అమరుల బంధువు...

వీరుల

వీరుల కన్నతల్లి , అమరుల బంధువు , స్నేహితురాలు కామ్రేడ్ గొకరకొండ సూర్యవతి (75) కి అరుణారుణ జోహార్లు !

జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తూ నాగపూర్ జైలులో అండా సెల్ లో ఉన్న ప్రజా మేధావి, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ కామ్రేడ్ జి ఎన్ సాయిబాబ తల్లి జి సూర్యవతి తన 75 వ ఏట కేన్సర్ వ్యాధితో 1 ఆగస్టు 2020 మధ్యాన్నం హైదరాబాద్ లోని స్పర్శ్ కేర్ సెంటర్ లో చనిపోయారు. అంతకు రెండు రోజులు ముందు వరకు అంటే 30 జూలై ,2020 వరకు హైదరాబాద్లోని నింస్ ( నిజాంస్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ) ఆసుపత్రి లో కేన్సర్ వ్యాధికి చికిత్స పొందారు.

జి ఎన్ సాయిబాబ తల్లిదండ్రులు గోకరకొండ సత్యనారయణ మూర్తి , గొకరకొండ సూర్యవతి దంపతులది ఒక వ్యవసాయ కుటుంబం. తూర్పుగోదావరి జిల్లలోని అమలాపురం దగ్గరలో జనిపల్లి, సన్నవిల్లి గ్రామాలకు చెందినవారు. సత్యనారాయణ గారికి ముగ్గురు తమ్ముళ్లు, ఇద్దరు చెల్లెళ్లు. సూర్యవతమ్మకు ఒక అన్న, అక్క, ఒక తమ్ముడు, చెల్లె కాగా ఇపుడు అన్న ఒకరు జీవించి ఉన్నారు..

సత్యనారయణ గరు 3 వ తరగతి వరకు చదువుకుంటే , సూర్యవతమ్మ 1 వ తరగతి కూడా సరిగా చదువుకోలేదు.. సత్యనారయణగారు కొద్దిపాటి భూమి కలిగిన రైతు.. కొన్ని పరిస్థితుల్లో నష్టాల పాలయ్యి భూములు కోల్పోయి, రైతు కూలిగా మారారు. వారికి ఇద్దరు కొడుకులు ( జి ఎన్ సాయిబాబా, జి రామదేవుడు) , ఇద్దరి మధ్యలో రెండవ సంతానంగా ఒక అమ్మాయి (భవానీ ). పిల్లలు ఎదుగుతున్న క్రమంలో వారి చదువుకోసం అమలాపురానికి వచ్చారు..

అమలాపురంలో ఒక అద్దె ఇంటిలో , సాయిబాబా వెళ్లి రావడానికి అనుకూలంగా స్కుల్ కు దగ్గరగా ఉండేవారు. సాయిబాబా కు ఉన్న వైకల్యం గురించి ఎప్పుడూ అమ్మకు ఆలోచన, ఆ భావనలేదు. చాలా జాగ్రత్తగా చూసుకునే వారు. టీచర్లను ఇంటికి పిలిపించుకుని చదువు చెప్పించేది. భూమి పోగా వచ్చిన కొద్ది డబ్బులతో అమలాపురంలో ఒక ఇల్లు కొనుక్కున్నారు.. ఇతరత్రా ఎటువంటి ఆస్తులూ లేవు. ఇంట్లొ వేసుకున్న నాలుగయిదు కొబ్బరి చెట్ల ఫల సాయాన్ని జాగ్రత్తగా అమ్మి కుటుంబ అవసరాలకు సూర్యవతమ్మ ఇమ్ము చేసేవారు. ఇంట్లొనే కొద్దిగా కూరగాయ మొక్కలు పెంచుకుని సర్దుబాటు చేసుకునే వారు . తెలిసినవారు ఆవు ఒకటి ఇస్తే , ఆ పాలతో ఇంటి అవసరాలు కొంత తీరాయి.

చిన్నప్పటి నుంచి సాయిబాబా బాగా తెలివయిన విద్యార్థి. అమ్మ తనకు తగినట్లు అవసరమయిన ఏర్పాట్లు చేసేది. సాయిబాబా బి ఎ ఇంగ్లిష్ డిగ్రీ పూర్తిచేశాక , హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఎం ఎ ఇంగ్లిష్ సీటు వచ్చింది. ఆ తరవాత సాయిబాబా హైదరాబాదులోని సీఫెల్ ( సి ఐ ఇ ఎఫ్ ఎల్) లో డిప్లొమా , ఎంఫిల్ చేశారు. ఢిల్లీ యూనివర్సిటీలో డాక్టరేట్ చేసి , డాక్టరేట్ పట్టాను అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతులు మీదుగా అందుకున్నారు. సాయిబాబా చదువంతా స్కాలర్ షిప్ లపై కొనసాగింది. ఆ క్రమంలోనే తాను రాడికల్ విద్యార్థి రాజకీయాలతో, విప్లవ సాహిత్యంతో , ప్రజా సంఘాలతో ప్రభావితమయ్యాడు. మరోపక్క ఊరిలో ఉండే పరిస్థితిలేక కుటుంబమంతా 1990 లో హైదరాబాద్ వచ్చేసింది . తన రాజకీయాల ప్రభావం మొత్తం కుటుంబంపై పడింది. సాయిబాబా తమ్ముడు రాందేవ్ కూడా బి ఎస్ సి , ఎం ఎస్ సి , భౌతికశాస్త్రంలో డాక్టరేట్ హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పూర్తి చేశారు.

సూర్యవతి గారు సాయిబాబా ను చదువు విషయంలోనే కాదు , తను సామాజిక బాధ్యతగా చేస్తున్న పనులకు ఎప్పుడూ అడ్డు చెప్పలేదు, నిరుత్సాహ పరచలేదు. ఆ క్రమంలోనే ప్రజా సంఘాలవారు అందరూ సూర్యవతి గారికి దగ్గరయ్యారు. పిల్లలూ , కోడళ్ళూ ( ఏ ఎస్ వసంత కుమారి , సోలిపేట శైలజ ) ప్రజా సంఘాలలో భాగమయితే తానూ సహకరిస్తూ పరోక్షంగా భాగమయ్యింది.

ఒక్కగానొక్క కూతురు భవాని ఏడవ తరగతితో చదువు ఆపేసింది. తాను చదువుకుంటునప్పుడే కుట్టుపని చేసేది. అన్నను బాగా చదివించమని, తనకు చదువు పట్ల ఆసక్తి లేదని చెప్పింది. భవాని చాలా చురుకయిన , నిశితమయిన పరిశీలనా దృష్టి కలిగి ఉండేది. ప్రజా సంఘాల పరిచయంతో మొదలు మహిళా సంఘంలో పనిచేసింది. ఆ క్రమంలో తాను అప్పటి పీపుల్స్ వార్ ఉద్యమంలో భాగంగా అజ్ఞాత విప్లవోద్యమ జీవితంలోకి వెళ్ళిపోయింది. 2000లో బూటకపు ఎదురుకాల్పుల్లో అమరురాలయింది. అమ్మాయి గురించి ఒక సందర్భంలో చెబుతూ - " ఇది నా డబ్బు నేను దాచుకోవాలనే భావన భవానీకి ఎప్పుడూ లేదు. పనిమనిషికి వేరే కంచంలో పెడితే తాను ఊరుకునేది కాదు. మమ్మీ నువ్వు వేరు భావంగా చూస్తున్నావు .. అవన్నీ విడిచిపెట్టుకోవాలె .. అలా అయితేనే నీ దగ్గర ఉంటాను అనేది. ఆమె చనిపోయాకే ఆమె ఏమేమి చేసిందో తెలిసింద " ని సూర్యవతి గుర్తు చేసుకున్నారు. విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది. అమరుల కుటుంబలపై కొనసాగిన తీవ్రమైన హింస సూర్యవతమ్మ పిల్లల రాజకీయాలు అర్థం చేసుకునేలా చేసింది. పిల్లల స్పూర్తితో ఆ తర్వాత ఏర్పడ్డ అమరుల బంధు మిత్రుల సంఘం వ్యవస్థాపక సభ్యురాలయింది. .

స్కూల్ చదువు లేకున్నా సూర్యవతి కూడబలుక్కుని చాలా చక్కగా పేపరు చదివేవారు. తాను చదవడమే కాకుండా పిల్లలకు ఇష్టమయ్యే శీర్షికలతో మొదలు పెట్టి అంటే, సినిమా, ఆటలు, కథలు తో మొదలు పెట్టి మొత్తం పేపర్ చదివేసే వారు. అలాగే కథల పుస్తకాలు చదివి వినిపించేవారు. పిల్లలకు చదవడం నేర్పించేది. ఆమె చదివితే పిల్లలకు భలే ఇష్టం. ఆమె చదరంగం బాగా ఆడడమే కాదు .. పిల్లలకు ఆమె నేర్పారు. ఆమె పిల్లల చెస్ కోచ్.. అందువల్ల స్కూల్ స్థాయి పోటీలలో తన మనవలు సునాయాసంగా గెలుచుకు వచ్చేవారు. చెస్ మాత్రమే కాదు, కాలక్షేపానికి ఆడే పేకాటలోను ఆమెను ఓడించడం కష్టమే.

పిల్లలు ఏవి ఇష్టాంగా తింటారు, ఎలా వండితే తింటారు, వీలయినంత మంచి పోషక ఆహరం ఎలా అందించాలనే వాటి పై చాలా మంచి అవగాహనే కాకుండా , చాలా బాగా వండి పెట్టేవారు. పిల్లలను కొట్టకుండా , తిట్టకుండా అనునయంగా చెప్పి పిల్లలు వినేలా చూసుకునేవారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ఆమె నుంచీ చాలా విషయాలు నేర్చుకోవచ్చు. వంటలు, పిల్లల పెంపకం ఆమె నుంచి నేర్చుకోవలసిందే . శాఖాహారమయినా , మాంసాహారమయినా ఆమె వండితే ఆ రుచే వేరు. బంధువులు కూడా ఆమెతో చేయించుకుని పోయేవారు. ప్రజా సంఘాల మిత్రులు చాలామంది సూర్యవతిగారి చేతి వంటలను ఇష్టం గా తిన్నవారే. ఇక ఎక్కడిదాకా అంటే సాయి అమెరికా మిత్రులు కూడా అమ్మ చేసిన పచ్చళ్ళు , ఆవకాయలు ఇష్టంగా తిన్నవారే. ఇలా చెప్పుకుంటూ పొతే , సూర్యవతి గారి సాంబారును ప్రముఖ రచయిత గూగీ కూడా ఆస్వాదించారు. కొడుకుల కొడుకులే కాకుండా , తాతలు , మొత్తంగా బంధువులంతా సూర్యావతి గారిని ప్రేమగా " సూరక్క " అని పిలుచుకుంటారు. ఊరిలో అందరికీ సూరక్కగానే బాగా తెలుసు. పనిలేకుండా ఆమె ఎప్పుడూ ఉండదు, మనలను ఉండనివ్వదని కుటుంబ సభ్యులు గుర్తుచేసుకున్నారు. ప్రతి పనిని గొప్ప నిమగ్నతతో చేసేవారు. ఆమె పనికి విసుగు, విరామం లేవు . చివర రోజులు వరకు ఆరోగ్యం సహకరించినంత వరకు రోజూ పేపర్ చూసేది. చూడడమే కాదు పిల్లలు పనుల ఒత్తిడిలో గమనించకుంటే , వరవరరావు గారి ఆరోగ్యంతో సహా , ప్రజా సంఘాల విషయాలను గమనించి ఎప్పటికప్పుడు చెబుతూనే ఉండేవారు. ప్రజల విషయాల పట్ల ఎంతో పట్టింపుతో ఉండేవారు.

సూర్యవతి జీవిత కాలం చాలా మంచి ఆరోగ్యంతో ఉన్నారు . ఆమె ఆహారపు అలవాట్లు కూడా చాలా సాదా సీదాగా ఒక క్రమ పధ్ధతి తో ఉండేవి. పులుపు తినేవారు కారు. ఎప్పుడూ వేడి నీళ్లు తాగే వారు. సహజంగా , ఇంట్లో వండినవి మాత్రమే తినేవారు. ఫ్రిజ్ లో పెట్టిన పదార్థాలు తినేవారుకాదు. గత రెండేళ్లుగా ఆర్త్రైటిస్ తో బాధ పడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నారు. అయితే ఇటీవల బాగా నీరస పడుతుంటే 2020 ఫిబ్రవరి 15 నుంచి 28 మధ్యలో నిమ్స్ లో జాయిన్ చేసి వైద్యం చేయించారు. ఆ క్రమంలో లింఫ్ వ్యవస్థకు సంబందించిన కేన్సర్ గా ( హై గ్రేడ్ నాన్ హాడ్జ్కిన్ లింఫోమా గా ) నిర్ధారణ అయ్యింది. ఆంకాలజీ విభాగం వారు ఆరు సార్లు కెమో థెరపీ ఇవ్వాలని చెప్పారు. మూడు సార్లు థెరపీ బానే సాగింది. నాల్గవ సైకిల్ కి ముందు బ్లడ్ కౌంట్స్ సరిగా లేక థెరపీ ఆలస్యమయింది. కరోనా పరిస్థితులు పరోక్షంగా ఆలస్యానికి ఇంకొంత కారణమయ్యాయి. ఆ క్రమంలో సమస్య మెదడుకు పాకింది . ఎడమ వైపు కాలు , చేయి పడిపోయాయి. నాల్గవ సైకిల్ 2020 జూలై 23 న మొదలుపెట్టారు. జూలై 29న ఫీట్స్ వచ్చి కోమాలోకి వెళ్లిపోయారు. చివరి క్షణాలు హైదరాబాదులోని స్పర్శ్ కేర్ సెంటర్ లో గడిచాయి. 2020 ఆగస్టు 1 వ తారీఖు మధ్యాన్నం 1.40 నిముషాలకు తుది శ్వాస విడిచారు. సాయిబాబా విడుదలకోసం జరిగిన పోరాటాలలో ఆమె పాల్గొని మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటే.. " నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు.. పేదలకోసం మాట్లాడితే అరెస్టు చేస్తారా.. ఆదివాసుల గురించి మాట్లాడితే అరెస్టు చేస్తారా " అని ఆమె రాజ్యాన్ని నిలదిసారు. సాయిబాబా అరెస్ట్ తర్వాత ఏండ్ల తరబడి కొడుకు విడుదల కోసం ఆమె ఎంతో ఎదురు చూసింది. ప్రయత్నాలు చేసింది. అయినా కొడుకును దగ్గరిగా చూడలేకపోయింది. రాజ్య స్వభావం తెలిసిన మనిషే అయినా న్యాయ వ్యవస్థ అయినా కాస్త భిన్నంగా వ్యవహరిస్తుందేమోనని కొద్దిపాటి ఆశ. చివరికి క్యాన్సర్ బారిన పడింది. గత కొంత కాలంగా కొడుకును చూడాలని న్యాయస్థానం చుట్టూ తిరిగింది. చివరికి ఆ తల్లికి అన్యాయమే జరిగింది. జైలులో ఆ కొడుకు తీవ్ర అనారోగ్యంతో ఉన్నా.. తల్లికి క్యాన్సర్ అని తెలిసి తల్లడిల్లిపోయాడు. కొడుకును తృప్తిగా చూడకుండానే ఆమె మనల్ని విడిచిపోయింది. కామ్రేడ్ సాయిబాబా తండ్రి సత్యనారాయణ మూర్తి తన 73 వ ఏట 2006 లో చనిపోయారు. ఇప్పుడు అమ్మ ఇలా సాయిబాబా కోసం వేదనతో , చూడలేకపోయానన్న నిరాశతో చనిపోయారు.

కుటుంబ సభ్యులు, అమరుల బంధు మిత్రులు, ప్రజా సంఘాల మిత్రుల సమక్షంలో సూర్యవతమ్మ అంత్యక్రియలు 2020 ఆగస్టు 1 సాయంకాలం 5.00 గంటలకు బంజారాహిల్స్, రోడ్డు నెం. 13, స్పర్శ్ కేర్ సెంటర్ దగ్గర ఉన్న శ్మశానవాటికలో జరిగాయి

ప్రజా ఉద్యమాలకు , విప్లవోద్యమాలకు చరిత్ర పొడవునా పిల్లలు చేసిన ఉద్యమాలకు బాసటగా నిలిచిన అనేక మంది తల్లులు లాగానే , కొడుకు నుంచి ప్రేరణ పొంది ఆచరణకు పూనుకున్న గోర్కీ అమ్మలాగానే సూర్యవతమ్మ అందరికి అమ్మయింది. అందరికీ గొప్ప ప్రేమను పంచింది. ఎక్కువ జీవితం దిగువ మధ్య తరగతిగా కష్టాలు జీవిత కాలం అనుభవించింది. పిల్లలను తాను నడిపింది.తరవాత ఆ పిల్లలతో పాటు తానూ నడిచింది. కామ్రేడ్ సాయిబాబా , కామ్రేడ్ వరవరరావు సహా రాజాకీయ ఖైదీల విడుదలకోసం పోరాడుదాం. ప్రజల భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకోవడమే కాదు, పోరాటం మా జన్మ హక్కని చాటి చెబుదాం. అదే సూర్యవతమ్మకు , అమరులందరికీ మనమివ్వగలిగే నిజమయిన నివాళి. కామ్రేడ్ సూర్యవతమ్మకు / కామ్రేడ్ సూరక్క కు విప్లవ రచయితల సంఘం తరఫున, నా తరఫునా వినమ్రంగా జోహార్లు చెబుతూ , నివాళులు అర్పిస్తున్నాను.
- రాంకి, విరసం

Keywords : profe. Saibaba, Suryavathi, Bhavani, martyrs, Mother, ABMS
(2024-04-13 16:21:36)



No. of visitors : 965

Suggested Posts


Saibaba being denied even food by jail authorities. humiliation under humid conditions

After the Nagpur High Court Bench rejected Prof G.N. Saibabaʹs bail application, the food previous provided by the jail authorities have been withdrawn. They stopped giving

Release Prof G.N Saibaba From Jail - Justice Markandey Katju

I am sending this appeal seeking release of Prof. Saibaba who has been given life sentence by Gadchiroli Distt Court, and whose appeal is pending before the Nagpur Bench of Bombay High Court.

బుధవారం సాయంత్రం సాయిబాబాతో....

ఆయనకు రెండు కాళ్ళు లేవు... నడవలేడు...ఎక్కడికి వెళ్ళాలన్నా చక్రాల కుర్చీనే.. జైల్లో మరింత అనారోగ్యం పాలయ్యాడు... పాలకుల కర్కషత్వంతో ఒక చేయి కూడా పనికి రాకుండా పోయింది. అతని పేరు సాయిబాబా. ప్రొఫెసర్ సాయిబాబా. ఢిల్లీ యూనివర్సిటీలో ఇంగ్లీష్ బోధిస్తాడు... పాలకు దృష్టిలో మావోయిస్టు...

గూగీ వా థియాంగో...జి.ఎన్‌. సాయిబాబా...యుద్దకాలంలో స్వప్నాలు

నేను ఆ నవలను కెన్యాలో కామిటి అత్యంత భద్రతా కారాగారంలో 1978లో టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.ఇప్పుడు సాయిబాబా మరొక జైలులో, భారతదేశంలో మహారాష్ట్రలో నాగపూర్‌ అత్యంత భద్రతా కారాగారంలో ఒక ఒంటరి కొట్టులో ఉండి నా మరొక పుస్తకాన్ని అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

ప్రొఫెసర్ సాయిబాబాకు ముకుందన్ సీ మీనన్ అవార్డు 2019 ప్రకటించిన NCHRO

నాగ్ పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్, రెవల్యూషనరీ డెమాక్రటిక్ ఫ్రంట్ నాయకుడు జీఎన్ సాయిబాబాకు మానవ, పౌర హక్కుల పరిరక్షణ కోసం చేసిన సేవలకు గుర్తింపుగా ప్రతి సంవత్సరం ఇచ్చేʹముకుందన్ సి మీనన్ʹ అవార్డును ప్రకటించారు.

Condemn the irrational and illegal conviction of Prof GN Saibaba and others

The judgment is illegal, irrational, atrocious and highly motivated, to say the least. None of the charges framed against the accused stand a real test of judicial inquiry as all of them are fabricated and the evidences are concocted or drawn out of context....

చావుబతుకుల మధ్య సాయిబాబా..ఆయనకు మెడికల్‌ బెయిల్‌ ఇవ్వాలి

తన చేతులు విడుపులేకుండా వణుకుతున్నాయి. బరువు కూడా బాగా కోల్పోయారు. ఇప్పుడు తనను కుర్చీలోంచి పడకమీదికి మార్చాలంటే కనీసం ఇద్దరు మనుషుల సహాయం అవసరం. డిసెంబర్‌ 26న వైద్య పరీ క్షల సమయంలో కూడా సాయి సోదరుడు, ఒక పోలీసు కలిసి తనను అనేక సార్లు చేతుల మీద ఎత్తుకుని మార్చాల్సి వచ్చింది.

ముగిసిన అమ్మ ఎదురు చూపులు

విప్లవోద్యమంలో పని చేస్తున్న కూతురు కోసం ఎన్నో ఏళ్ళు ఎదురు చూసింది, చివరికి విగత జీవిగా కూతురును తీసుకొచ్చుకొంది. భవానీ మృతదేహం తెచ్చుకోడానికి ఆమె పెద్ద పోరాటమే చేసింది.

DU refuses to reinstate Saibaba despite VP push

Delhi Universityʹs Ram Lal Anand College has decided not to reinstate Professor GN Saibaba, who was granted bail by the Supreme Court in April in a case...

ప్రొఫెసర్ సాయిబాబాను వెంటనే ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించాలి - విరసం

రెండు కాళ్ళు పని చేయని మనిషికి, ఒక చేయి కూడా కదలని స్థితి ఏర్పడటం ఎటువంటిదో ఊహించవచ్చు. ఈ విధంగా మనిషిని ముట్టుకోకుండా కూడా చిత్ర హింసలు పెట్టవచ్చని నాగపూర్ జైలు అధికారులు నిరూపిస్తున్నారు. ఆయన నేరం చేసాడా లేదా అన్నదాంతో సంబంధం, లేకుండానే జైలు నిబంధనల ప్రకారం కూడా ఇది తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘన.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


వీరుల