వీవీని విడుదల చేయాలి...ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్, కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్
తీవ్ర అనారోగ్యంతో ముంబై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రిటైర్డ్ అధ్యాపకులు, విప్లవ రచయిత వరవరరావును బెయిల్ పై వెంటనే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక డిమాండ్ చేస్తున్నది.
భీమాకోరేగావ్ కేసులో అరెస్టు చేయబడి గత 23 నెలలుగా మహారాష్ట్రలోని తలోజా జైల్లో నిర్బంధించబడినారు.
ఎనభై ఏళ్ళ వయసులో అనారోగ్యకర వాతావరణంలో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని, కుటుంబ సభ్యులను కూడా గుర్తించలేకపోయాడని, పైగా ఆయనకు కరోనా పాజిటీవ్ వచ్చిందని తెలిసింది.
వరవరరావు తెలుగు ప్రజలకు సుపరిచితమైన అభ్యుదయ వాది. అధ్యాపకునిగా ఎందరో విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. కవిగా, రచయితగా, వక్తగా ఆయన తెలుగు ప్రజలపైనే కాక దేశవ్యాప్తంగా అద్భుతమైన ప్రభావం చూపారు.. సమకాలీన సామాజిక సమస్యలపై రచనలతో, కవిత్వంతో ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నం చేశారు. ఆయన రచనలు అన్ని భారతీయ భాషల్లోకే కాక, ఇంగ్లీషు, ఇటాలియన్, స్పానిష్, ఫ్రెంచ్ వంటి అనేక దేశాల భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయన జీవితమంతా ప్రజలకోసం పోరాడారు. అన్యాయాలను ప్రశ్నించారు. ఆ క్రమంలో అనేక కుట్ర కేసులు ఎదుర్కొని అన్నింటిలోనూ నిర్దోషిగా నిరూపితమైనారు.
వయోభారంతో ఇబ్బంది పడుతున్న వరవరరావుకు రెండేళ్ళుగా బెయిలు ఇవ్వకుండా వేధించటం సమంజసం కాదు. బెయిలు అనేది నిందితుడి హక్కు అని, జైలు అనేది తప్పని సరి కాదని మన చట్టాలు చెబుతున్నాయి. కనుక మానవీయ దృష్టితో ఆలోచించినా ఆ వయసులో, అంతటి అనారోగ్యంలో ఆయనకు కుటుంబసభ్యులతోడు, సంరక్షణ చాలా అవసరం. కాబట్టి ఆయన్ని వెంటనే విడుదల చేయాలని కోరుతున్నాము.
రిటైర్డ్ అధ్యాపకులు, ప్రముఖ కవి, రచయిత వరవరరావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యవేదిక పక్షాన భారత రాష్ట్ర పతికి, ప్రధాన న్యాయమూర్తికి, బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు వ్రాశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే జోక్యం చేసుకుని వరవరరావును బెయిల్ లేదా పెరోల్ పై విడుదల చేయించుటకు చొరవ తీసుకోవాలని ఐక్యవేదిక కోరుతున్నది. పై లేఖలపై సంతకం చేసిన
తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్& కాంట్రాక్టు ఉద్యోగుల ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీ నాయకులు
కె లక్ష్మయ్య, టి శుభాకరరావు, జి సదానందం గౌడ్, పి పర్వతరెడ్డి, కె జంగయ్య, చావ రవి, సిహెచ్ సంపత్కుమారస్వామి, జి బాలస్వామి, కె రమణ, మైస శ్రీనివాసులు, ఎం రఘుశంకర్ రెడ్డి, టి లింగారెడ్డి, కె కృష్ణుడు, లక్ష్మణ్ గౌడ్, ఎం రాధాకృష్ణ, చంద్రశేఖర్, తాజ్ మోహన్ రెడ్డి, యు పోచయ్య, డి సైదులు, జి ఉపేందర్, జె వెంకటేష్, ఆర్ కృష్ణారెడ్డి, భూపాల్, కె యాదానాయక్, పి భాస్కర్, షౌకత్ అలీ, ఎన్ చెన్నరాములు, ఎస్ మధుసూదన్ రావు, కె మహిపాల్ రెడ్డి, ఇ లక్ష్మణ్ నాయక్, జె రాజన్న, వెంకట్రావు జాదవ్, కొమ్ము రమేశ్, సిహెచ్ యాదగిరి, శాగ కైలాసం, సిహెచ్ రమేష్, ఎ గంగాధర్, డివి రావు, ఎం రాములు, ఆర్ ఈశ్వర్, ఎం రంగయ్య, పి కృష్ణమూర్తి, వెంకట్ రెడ్డి, కె జయబాబు, కె రామారావు, ఎం రామారావు, బి కొండయ్య, ఎస్ విఠల్, ఎండి ఖమ్రొద్దీన్, మల్లీశ్వరి, ఎస్ హరికృష్ణ, ఎం శ్రీను నాయక్, మసూద్ అహ్మద్, కె వెంకట్, చంద్రశేఖర్, బిక్షపతి, విజయకుమార్ తదితరులు సంతకాలు చేశారు.
Keywords : varavara rao, maharashtra, bhima koregaon, thaloja jail, nanavathi hospital
(2024-04-23 00:14:12)
No. of visitors : 819
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |