అంబులెన్స్ సమయానికి రాక గర్భవతి మరణం... వార్త ప్రసారం చేసిన జర్నలిస్టు, టి వి చానెల్ పై కేసు

అంబులెన్స్

జార్ఖండ్‌లోని కోడెర్మా జిల్లాలో, సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో ఒక మహిళ చనిపోయిన వార్తను ప్రసారం చేసినందుకు ఆ ఛానెల్‌పైనా, సమాచారం ఇచ్చినందుకు స్థానిక జర్నలిస్ట్ పైన వైద్యాధికారి కేసు పెట్టాడు.

జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్ తోపాటు ʹఆర్.పి.భారత్ʹఅనే న్యూస్ ఛానల్ మీద ఐపిసి 186, 505, 34 సెక్షన్లతో సహా యితర అనేక సెక్షన్ల కింద సత్‌గావ్ పోలీస్‌ స్టేషన్ పరిధిలో వున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బాధ్యుడైన వైద్యాధికారి డాక్టర్ చంద్రమోహన్ కుమార్ కేసు నమోదు చేశాడు.

ప్రవీణ్ కుమార్ న్యూస్ ఛానల్ ఆర్.పి.భారత్‌తో పాటు ʹపబ్లిక్ʹ, ʹసన్మార్గ్ʹ లకు కూడా ఫ్రీలాన్సర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు. కరోనా కాలంలో అనేక గ్రామాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాల్లోని దుస్థితి గురించి ఆయన సమాచారాన్ని సేకరించారు.

ʹసత్‌గావ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ బాధ్యులైనప్పటికీ డా. చంద్రమోహన్ రాయ్, ప్రైవేట్ క్లినిక్ గీతాదేవి మెమోరియల్ హాస్పిటల్‌లో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ విషయం నేను రిపోర్ట్ చేసాను. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాంగణంలో ఉన్న నివాస గృహాలను డాక్టరు అద్దెకు ఇచ్చిన విషయాన్ని కూడా నేను గమనించాను. నా మీద కేసు పెట్టి బెదిరిస్తే, నేను భయపడి అతని అవినీతిని బహిర్గతం చేయడాన్ని ఆపేస్తానని డాక్టర్ నాపై కేసు పెట్టారుʹ అని జర్నలిస్టు ప్రవీణ్ కుమార్ అన్నారు.

మెడికల్ ఆఫీసర్ డా. చంద్రమోహన్ రాయ్ ఇచ్చిన ప్రకటన:

ʹకోడెర్మా జిల్లాలోని సత్‌గావ్ పరిధిలోని మోచారామో గ్రామంలో నివసిస్తున్న 20 ఏళ్ల పింకీ దేవి మరణించిన తరువాత జూలై 22 న సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో నన్నూ, ఆరోగ్య శాఖ పరువు తీసేందుకు ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగంగా ఈ వార్తలను ప్రసారం చేశారు. వాస్తవానికి, పింకీ దేవి ఆరోగ్యం క్షీణించడం గురించి ఆరోగ్య శాఖకు గతంలో ఎలాంటి సమాచారం లేదు. స్థానిక జర్నలిస్ట్ ప్రవీణ్ కుమార్, వార్డ్ సభ్యులు తేజన్ రాయ్, జైరామ్ సింగ్ ʹబిహారీʹలు హెల్పర్ కేసరి దేవిని, మరొక మహిళను బెదిరించి బలవంతంగా తప్పుడు ప్రకటన చేయించారు. సమయానికి ఆరోగ్యశాఖ అంబులెన్స్ రాలేదు కాబట్టి, పింకీ దేవి ఉదయం 11:00 గంటలకు చనిపోయిందని చెప్పించారు. కానీ ఆమె ఉదయం 6:00 గంటలకే చనిపోయింది. ఈ వార్తను ఆర్.పి. భారత్‌ ఛానెల్‌లో చాలా వివరంగా ప్రసారం చేయడంవల్ల ప్రభుత్వ పనులకు అంతరాయం కలిగింది.ʹ

ఈ విషయంపై జర్నలిస్టు ప్రవీణ్ కుమార్ ఏమన్నారంటే.., "జూలై 22 ఉదయం 11 గంటలకు వార్డ్ సభ్యులు తేజ్‌నారాయణ్ రాయ్, జైరామ్ సింగ్ ʹబిహారీʹ ఫోన్‌ చేసి మోచరామో గ్రామంలో ఒక గర్భవతి మహిళ మరణించింది, మేము సత్‌గావ్ ఆరోగ్య కేంద్రానికి ఫోన్ చేస్తూనే ఉన్నాము, కాని అంబులెన్స్ రాలేదు అని చెప్పారు. నేను వెంటనే ఆ గ్రామానికి వెళ్ళాను. పింకీదేవికి ఉదయం 4 గంటల నుంచే నొప్పులు మొదలయ్యాయనీ హెల్పర్ కేసరి దేవితో సహా చాలా మంది చెప్పారు, కేసరి దేవి కాకుండా అనేక మంది వూరి ప్రజలు కూడా సత్‌గావ్ ఆరోగ్య కేంద్రానికి ఫోన్ చేసి అంబులెన్స్ పంపమని కోరినప్పటికీ వారు పంపలేదు. గ్రామ యువకులు కొంతమంది ప్రసవ నొప్పులతో బాధపడుతున్న మహిళ మంచం మీద పడుకోబెట్టి ఆసుపత్రికి బయలుదేరారు, కాని ఆమె దారిలోనే మరణించింది.ʹ
ʹ...హెల్పర్ కేసరి దేవి, మరొక మహిళతో మాట్లాడించి వార్తను న్యూస్ ఛానల్ ఆర్పి భారత్‌కు పంపాను. ఈ వార్త జూలై 22 సాయంత్రం ప్రసారమైంది. అనేక స్థానిక వాట్సాప్ గ్రూపులలో షేర్ అయింది. రెండు రోజుల తరువాత, జూలై 24 న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర బాధ్యుడైన వైద్యాధికారి డాక్టర్ చంద్రమోహన్ కుమార్ ʹఆర్‌పి భారత్ʹ న్యూస్ ఛానల్‌తోపాటు నా మీద కూడా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాడని తేజ్‌నారాయణ్ రాయ్, బిహారీ సింగ్ నాకు చెప్పారు.ʹ

ఈ విషయంపై మానవ హక్కుల ప్రజా పర్యవేక్షణ కమిటీ జార్ఖండ్ రాష్ట్ర సమన్వయకర్త ఓంకర్ విశ్వకర్మ జూలై 31 న కోడెర్మా ఎస్పీకి ఓ లేఖ రాశారు. ఆ లేఖలో.. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఒక సాధారణ ప్రజల సమస్యలను ప్రింట్ / ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా లేవనెత్తే రాజ్యాంగబద్ధమైన హక్కు జర్నలిస్టుకు ఉంది. ఒక జర్నలిస్ట్ మానవ హక్కులను పరిరక్షించడానికి పనిచేస్తాడు. అటువంటి పరిస్థితిలో, ఒక జర్నలిస్టుపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయడం అంటే ప్రజాస్వామ్య గొంతును నోక్కివేయడమే అవుతుంది. ఈ కేసును న్యాయమైన దర్యాప్తు జరిపించాలి అని రాశారు.
(junputh.com సౌజన్యంతో)

Keywords : jharkhand, Journalist,
(2024-04-14 06:31:12)



No. of visitors : 793

Suggested Posts


వేటకు వెళ్లిన ఆదివాసీ యువకులపై భద్రతా దళాలు కాల్పులు - ఒకరి మరణం, మరొకరికి తీవ్ర గాయాలు

జార్ఖండ్‌, లతేహర్ జిల్లాలోని గారు పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకూ-పిరీ అడవిలో వేట కోసం వెళ్ళిన‌ ఆదివాసీ యువకుల పై భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో పిరి నివాసి 23 ఏళ్ల బ్రహ్మదేవ్ సింగ్ బుల్లెట్లు తగిలి అక్కడికక్కడే మరణించాడు, అదే గ్రామానికి చెందిన దీనానాథ్ సింగ్ గాయపడ్డాడు.

ʹమావోయిస్టు నాయకులను జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారుʹ

సీనియర్ మావోయిస్టు నాయకులు ప్రశాంత్ బోస్ @ కిష‌న్ దా, అతని సహచరి షీలా మరాండీలమి జైల్లో చిత్రహింసలకు గురిచేస్తున్నారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది.

మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు రవి అమరత్వం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్రకమిటీ స్టాఫ్ సభ్యుడు (డివిజనల్ కమిటీ స్థాయి) మన ప్రియతమ కామ్రేడ్ రవి (జైలాల్) అమరత్వ వార్తను అనివార్య పరిస్థితులలో దాదాపు సంవత్సరంన్నర కాలం ఆలస్యంగా తెలియజేస్తున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.

అవును నేను మావోయిస్టునే..!

అభయ్ జాక్సన్ ఛత్తీస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన ఓ ఆదివాసీ మేధావి. మారుమూల అటవీ గ్రామాన్నుండీ అతికష్టం మీద చదువుకొని ఢిల్లీ జె ఎన్ యు లో సోషల్ సైన్స్ మాస్టర్ డిగ్రీ చేసిన మేధావి.రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు ప్రకారం అతనికి మంచి ఉద్యోగం, హోదా , సుఖవంతమైన జీవితం దొరికుండేవి.

Condemn arrest of Damodar Turi by Jharkhand Police - PPSC

Persecuted Prisonersʹ Solidarity Committee (PPSC) condemns the continued repression on activists and groups associated with peopleʹs struggles in Jharkhand by the police and administration. Damodar Turi, a member of the Central Committee of Visthapan Virodhi Jan Vikas Andolan (VVIVA), was arrested in the evening on 15" February 2018 from Ranchi.

Bajrang Dal activists killed my husband: Widow of man lynched in Jharkhand

The wife of the man who was lynched in Jharkhandʹs Ramgarh district on suspicion of carrying beef has alleged that the mob that beat her husband to death mostly included Bajrang Dal activists. ʹThey were rogues owing allegiance to the Bajrang Dal,ʹ Mariam Khatoon told....

Jharkhand: Tribals hold police, district officials hostage in late-night drama

Thousands of tribals armed with traditional weapons held several senior police and administrative officers hostage at Kanki Siladon, a tribal hamlet in Khunti district, through Thursday night.....

Former Jharkhand CM Hemant Soren calls police encounter with Maoist ʹfakeʹ, demands probe

The opposition parties have termed the encounter between police and Maoist guerrillas in Giridih earlier in June as "fake" and demanded a judicial probe. The encounter had claimed one life.....

ప్రభుత్వ హత్య : ఆధార్ కార్డు లేక రేషన్ కార్డు రద్దు... చిన్నారి ఆకలి చావు

జార్ఖండ్‌లోని సిమ్దేగా జిల్లా కరీమతి గ్రామానికి చెందిన 11 ఏళ్ల సంతోషి కుమారి తండ్రి మతిస్థిమితం కోల్పోవడంతో, తల్లి కొయిలీ దేవీనే పిల్లల్ని సాకుతోంది. ఆమెకు సంతోషితోపాటు మరో పాప కూడా ఉంది. దుర్భర పేదరికంలో జీవిస్తోన్న వారి కుటుంబానికి పౌరసరఫరాల శాఖ నుంచి అందే రేషన్‌ సరుకులే దిక్కు....

ఆ ఆదివాసీ యువకుడిది ఎన్ కౌంటర్ కాదు హత్యే, సీఆర్పీఎఫ్ అధికారే దోషి - 9 ఏండ్ల తర్వాత తేల్చిన సీఐడి

గ్రామానికి చేరుకున్న వెంటనే సిఆర్‌పిఎఫ్ జవాన్లు 20-22 మంది గ్రామస్తులను పట్టుకుని అందరి చేతులను వెనక్కు విరిచికట్టేసి, తమ వెంట తీసుకెళ్లి ఆ రాత్రి వారందరినీ వూరి బయట మైదానంలో వుంచి మర్నాడు జూన్ 29న తమ సామాన్లను బహదా అడవికి మోయించుకెళ్లారు. అక్కడ నుండి యింకా ముందుకు సామాను తీసుకెళ్లడానికి నిరాకరించడంతో మంగల్ హోన్‌హాగ్‌ను కాల్చి చంపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అంబులెన్స్