విరసం వెబ్ సైట్ హ్యాక్....ఎన్నో దాడులను ఎదుర్కొంటున్నాం.. దీన్నీ ఎదుర్కొంటామన్న విరసం
విప్లవ రచయితల సంఘం వెబ్ సైట్ విరసం .ఆర్గ్ హ్యాక్ కు గురైంది. విరసం వెబ్ సైట్ లో వస్తున్న వ్యాసాల్లోని నిజాలను ఎదుర్కొనే దమ్ము లేక, జవాబులు చెప్పలేక ఇటువంటి అనైతిక పద్దతులకు దిగుతున్నారు. భావజాలాన్ని భావజాలంతో ఎదుర్కొనే నిజాయితీ లేని పిరికిపందల చర్య ఇది. ఈ దుర్మార్గ చర్యను ʹఅవని న్యూస్ʹ తీవ్రంగా ఖండిస్తున్నది.
విరసం వెబ్ సైట్ పై జరిగిన ఈ దాడిని విరసం తీవ్రంగా ఖండిస్తూ ʹʹముఖ్యంగా సామజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తరువాత ఈ తరహా దాడులు పెరిగిపోయాయి. భిన్నమైన భావజాలం, ప్రత్యామ్నాయ రాజకీయాల మీద జరుగుతున్న దాడుల్లో ఇది కూడా భాగమే.ʹʹ అని పేర్కొంది. ఇటువంటి దాడులు విరసానికి కొత్తకాదని, గత దాడులను ఎలాగైతే ఎదుర్కొంటూ విరసం పురోగమిస్తోందో అలాగే ఈ దాడిని కూడా ఎదుర్కొంటామని విరసం స్పష్టం చేసింది. ʹʹఅయితే వెంటనే రాగలిగే ఆర్థిక వనరులు, సాంకేతికత మాకు లేకపోవచ్చు గాని తిరిగి మళ్ళీ సాహిత్య అభిమానులు, విప్లవాభిమానుల ముందుకు త్వరలోనే వస్తాం. ఏదయితే మమల్ని మాట్లాడొద్దు అన్నారో, ఏ రచనలైతే రాయడానికి వీల్లేదన్నారో, ఏ రాజకీయాలను ప్రచారం చేయొద్దు అన్నారో వాటి గురించే మేము మళ్ళీ మాట్లాడుతాం.ʹʹ అని విరసం.ఆర్గ్ సంపాదకవర్గం ప్రకటించింది. విరసం ప్రకటన పూర్తి పాఠం...
విరసం .ఆర్గ్ పై దాడిని ఖండించండి
విరసం అధికారిక వెబ్ సైట్ విరసం.ఆర్గ్ కొన్ని రోజులుగా సైబర్ దాడులకు గురి అవుతున్నది. ఈ నెల 11 తారీఖున రాత్రి మొదటిసారి దాడికి గురి అయింది. ఆగస్టు 5న మా సభ్యుడు పాణి రాసిన ʹఈ నిర్మాణం ఏ విధ్వంసానికి?ʹ అనే ఆర్టికల్, జార్ఖండ్లో సీఆర్పీఎఫ్ బలగాలు ఆదివాసుల మీద దాడిచేసి దానిని మావోయిస్టు పార్టీ జరిపినట్టుగా చేసిన ప్రచారం మీద నిజనిర్దారణ వ్యాసాలను తొలగించారు. అలాగే కళాకారుడు వంగపండు ప్రసాద్ మీద విరసం నివాళి ప్రకటనను తీసివేశారు. వాటిని విరసం వెబ్ టీమ్ తిరిగి అప్లోడ్ చేయగా ఆగస్టు 12 సాయంత్రం పూర్తిస్థాయిలో హాక్ చేశారు. విరసం వెబ్ హోమ్ పేజీ మీద మీ ప్రవర్తనతో మేము విసిగిపోయాము, మేము ఎన్ని సార్లు చెప్పిన మీరు మారటంలేదు, అందుకు అనుభవించండి అంటూ ఒక మెస్సేజ్ ను పెట్టారు. (hacked by PA4TR1K). తిరిగి టెక్నీకల్ ఎక్సపర్ట్స్ సహాయంతో వెబ్సైటు ను ఆగస్టు 13 నాటికీ పునరుద్దరించగలిగాం. అయితే మళ్ళి ఆగస్టు 14 తెల్లవారుజాము నుంచి సైట్ మీద దాడి చేస్తూ నిన్న రాత్రికి మళ్లి హాక్ చేశారు. (hacked by balck blush). మొదటి సారి హాక్ చేసినప్పుడు విరసం వెబ్ మ్యాగజైన్లో ఈ నాలుగేళ్ల కాలంలో వేరు వేరు సంధర్భాలలో తీసుకువచ్చిన వ్యాసాలను ముఖ్యంగా మోదీ, బిజెపి పరిపాలన మీద వచ్చిన విమర్శ వ్యాసాలను, మావోయిస్టు ఉద్యమానికి సంబంధించిన వ్యాసాలను తొలగించారు. అలాగే మా సంస్థ వ్యవస్థాపక సభ్యులు, భీమాకొరేగాం కుట్రకేసులో అక్రమంగా జైలులో నిర్బంధించబడ్డ వరవరరావు వీడియోల లింకులను తొలగించారు. వీటితో పాటు రోహిత్ వేముల, ఢిల్లీ జేఎన్యూ లో ఆజాదీ వీడియో లింకులను తొలగించారు. దాడి చేసిన వ్యక్తులు ఎవరు అనేది సైబర్ దాడుల్లో ఇదిమిద్దంగా పైకి కనపడకపోవొచ్చు. కానీ మోదీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరేళ్ల కాలంలో భావప్రకటనా స్వేచ్ఛ మీద, భిన్న అభిప్రాయాల మీద జరుగుతున్న దాడులు చూస్తే ఇది ఖచ్చితంగా సంఘ్ పరివార్ మూక చేసిన దాడిగానే విరసం భావిస్తున్నది. ముఖ్యంగా సామజిక మాధ్యమాల విస్తృతి పెరిగిన తరువాత ఈ తరహా దాడులు పెరిగిపోయాయి. భిన్నమైన భావజాలం, ప్రత్యామ్నాయ రాజకీయాల మీద జరుగుతున్న దాడుల్లో ఇది కూడా భాగమే.
విరసం ఈ సంవత్సరం జులై 4 తో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. విరసం 1977 నుండి అరుణతార పత్రికతో తెలుగునాట సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నది. ఆ క్రమంలోనే 2013 జులై 28 న విరసం ఆవిర్భావ దినోత్సవం నాడు విరసం.ఇన్ పేరుతో విరసం వెబ్సైటు ను ప్రారంభించింది. విరసం సభ్యులకు సంబంధించిన రచనలతో పాటు, సంస్థ కార్యక్రమాలు, కరపత్రాలు, పుస్తకాలను విప్లవాభిమానులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసింది. 2014 ఎన్నికల తరువాత బీజేపీ అధికారంలోకి వచ్చాక దబోల్కర్, పన్సారే, కల్బుర్గి, గౌరీ లంకేశ్ వంటి వారిని చంపేశాయి. ఉత్తర్ ప్రదేశ్లో ఆవు మాంసం తిన్నాడన్న నెపంతో ఆక్లాక్ ను హిందుత్వ మూకలు చంపివేశాయి. రోహిత్ వేముల వ్యవస్థీకృత హత్య, యూనివర్సటీలలో హిందుత్వ అజెండాకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారి మీద దాడులు చేశారు. మరోవైపున ఆపరేషన్ గ్రీన్ హంట్ తరువాత మిషన్ 2016 రూపంలో విప్లవోద్యమం మీద నానాటికి పెరుగుతున్న దాడులను బయటి సమాజానికి చెప్పాల్సిన ఒక స్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆలోచనలకు, రాజకీయాలకు ఒక వేదికగా అరుణతార పత్రిక ఒకటే సరిపోదని విరసం.ఆర్గ్ పక్ష పత్రికను విరసం ప్రారంభించింది. ఈ పక్ష పత్రికను విరసం ప్రారంభించిన నాలుగేళ్ళ కాలంలో సాహిత్య, రాజకీయ రంగాలలో తన పరిధి మేర పనిచేస్తూ వచ్చింది. రెండు సార్లు మినహా మిగతా అన్ని సందర్భాలలో ఒకటి రెండు రోజులు ఆలస్యంగానైనా పత్రికను తీసుకురాగలిగాం. ఈ కాలంలో నా కవిత్వంతో నేను, కథావరణం,కవిత్వంలోకి , జీవిత కవిత్వం, నిశిత, ఈ పుస్తకం చదివేరా వంటి సాహిత్య సంబంధమైన కాలమ్స్ ను తీసువచ్చింది. అలాగే స్టాలిన్, టిఎమ్ఎస్, ధిక్కార స్వరం - తెలుగు మహాసభల సందర్భం, సమీక్షలు, విరసం 50 ప్రత్యామ్నాయ రాజకీయాలు, వివి 365 వంటి ప్రత్యేక సంచికలను తీసుకువచ్చింది. వీటి కంటే ముఖ్యంగా హిందుత్వ దాడులకు వ్యతిరేఖంగా, విప్లవోద్యమం మీద జరుగుతున్న దాడుల్లో భాగంగా ఆదివాసుల మీద, ప్రజాస్వామ్య వాదుల మీద జరిగిన దాడులకు వ్యతిరేకంగా ప్రచారం చేసింది. వారికి మద్దతును కూడగట్టడంలో తనవంతు పాత్రను పోషించింది. కాశ్మీర్ దగ్గరి నుండి అయోధ్య దాక, సీఏఎ నుంచి కరోనా విపత్తు దాక రాజ్య నిర్బంధం గురించి మాట్లాడుతూనే ఉంది. వాటి గురుంచి మాట్లాడే, రాసేవారికి ఒక వేదికగా ఉంది. ఇదే సంఘ్ పరివార్ మూకలకు కంటగింపుగా మారింది. అసభ్య పదజాలంతో దూషించడం మొదలు మా మీద సైబర్ దాడి చేయడం దాక వచ్చింది. ఇలాంటి దాడులు మా సంస్థకు ఇప్పుడు కొత్తగా ఏమి మొదలు కాలేదు. ప్రభుత్వ నిషేధాలు, కుట్ర కేసులు, అరెస్టులు లాంటివి ఎన్నో ఈ యాభై ఏళ్లలో మా సంస్థ ఎదుర్కొన్నది. దీనినీ అలాగే ఎదుర్కొంటాం. అయితే వెంటనే రాగలిగే ఆర్థిక వనరులు, సాంకేతికత మాకు లేకపోవచ్చు గాని తిరిగి మళ్ళీ సాహిత్య అభిమానులు, విప్లవాభిమానుల ముందుకు త్వరలోనే వస్తాం. ఏదయితే మమల్ని మాట్లాడొద్దు అన్నారో, ఏ రచనలైతే రాయడానికి వీల్లేదన్నారో, ఏ రాజకీయాలను ప్రచారం చేయొద్దు అన్నారో వాటి గురించే మేము మళ్ళీ మాట్లాడుతాం.
-విరసం.ఆర్గ్ సంపాదకవర్గం
Keywords : virasam, web site, hacking, cyber attack,
(2024-03-14 21:28:10)
No. of visitors : 633
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |