ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..

ఇప్పటికి

ఇప్పటికి రెండేళ్లు.. ఇంకెంత కాలమో..
భీమా కొరేగావ్ కుట్ర కేసుకు వ్యతిరేకంగా పోరాడుదాం
---------------------------
నేరమయ రాజ్యం అల్లిన కుట్ర కేసుల్లో భీమా కొరేగావ్ కు సాటి రాగలది ఉన్నదా? అనుమానమే. బహుశా ప్రపంచంలోనే ఇలాంటి ఉదాహరణలు కొన్నే ఉంటాయి. సంక్షోభంలో చిక్కుకొని ఫాసిస్టు తీరం చేరిన భారత రాజకీయార్థిక వ్యవస్థకు ఇలాంటి కుట్ర కేసు అత్యవసరం అయింది. అందుకే ఈ కేసు కింద మొదట తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఈ రెండేళ్లలో జాబితా పెరిగిపోయింది. సుప్రసిద్ధ మేధావులు ఆనంద్ తేలుంబ్లే, గౌతం నవల్కాలను అరెస్టు చేశారు. ఆ తర్వాత ప్రొ. హనీబాబును అరెస్టు చేశారు. విరసం సభ్యుడు క్రాంతిని ఇంకా వేధిస్తూనే ఉన్నారు. ప్రొ. ప్రేమ్ కుమార్ విజయన్, ప్రొ. రాకేష్ రంజన్ లకు, ఆనంద్‌ తేల్‌తుంబ్డే కుటుంబ సభ్యులకు, మరి కొందరు న్యాయవాదులకు ఇదే కేసు కింద సమన్లు ఇచ్చారు. ఇలా ఈ కేసు దేశవ్యాప్తంగా కవులు, మేధావులు, ప్రజాస్వామికవాదులను చుట్టుముడుతోంది.
ఈ రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం అనేక దుర్మార్గాలకు పాల్పడింది. ఆత్మ నిర్బర్ భారత్ పేరుతో ఇరవై వేల కోట్లు కార్పొరేట్లకు ధారాదత్తం చేసింది. కార్మిక చట్టాలను రద్దు చేసింది. ఉపా చట్టం విషపు కోరలకు పదును పెట్టింది. 12 గంటల పని విధానాన్ని తీసుకొస్తోంది. సీఏఏ వ్యతిరేక ఉద్యమాన్ని దారుణమైన నిర్బంధంలోకి తోసేసింది. కరోనాను కూడా అడ్డం పెట్టుకొని దేశవ్యాప్తంగా ముస్లిం వ్యతిరేకతను రెచ్చగొట్టింది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తోంది. అత్యంత దుర్మార్గమైన జాతీయ విద్యా, వ్యవసాయ, పర్యావరణ విధానాలను తీసుకొచ్చింది. మృతప్రాయంగానైనా ఉన్న 370 ఆర్టికల్ ను శాశ్వతంగా తుడిచేసి కశ్మీర్‌ను ఖైదు చేసి ఏడాది దాటిపోయింది. రామజన్మభూమి విషయంలో సుప్రీంకోర్టుతో అత్యంత దుర్మార్గమైన తీర్పు ఇప్పించింది. దేశమంతా కరోనా కల్లోలంలో చిక్కుకొని ఉంటే నిస్సిగ్గుగా అయోధ్య రామాలయానికి భూమి పూజ చేసింది... ఇలా ఒకటా.. రెండా.. భీమా కొరేగావ్ కుట్ర కేసు మొదలైన ఈ రెండేళ్లలోనే దేశాన్నంతా ఫాసిజం అనేక వైపుల నుంచి ఆక్రమించింది. జైల్లో దుర్భర స్థితిలో ఉన్న ప్రజా మేధావులకు మాట్లాడే అవకాశమే ఉంటే ఈ దుర్మార్గాలను నిశితంగా విమర్శించి ఉండేవారు. ఏదో ఒక మేరకైనా ప్రజాభిప్రాయాన్ని కూడగట్టేవారు. ఫాసిస్టు వ్యతిరేక ప్రజా ప్రత్యామ్నాయాలను ముందుకు తీసుకొచ్చేవాళ్లు. అందుకే వాళ్లను ఫాసిస్టు రాజ్యం చీకటి ఖైదులోకి తోసేశారు. ఈ అరెస్టుల పరంపర ఇంకా కొనసాగేలా కనిపిస్తోంది.
ఈ రెండేళ్లలో అరెస్టులు పెరిగిపోయాయేగాని ఈ కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేదు. బెయిలు పిటీషన్లను పదే పదే తిరస్కరించడం తప్ప న్యాయ ప్రక్రియ జరిగిందంటూ లేదు. ఈ రెండేళ్లలో వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్‌ తేల్‌తుంబ్డే, గౌతం నవల్కా తదితరుల ఆరోగ్యాలు పాడైపోయాయి. జైలులోకి కరోనా వ్యాపించింది. అయినా బెయిలు ఇవ్వలేదు. వరవరరావుకు వైద్యం చేయించాలని ప్రపంచమంతా ఒక్క గొంతుతో ఆందోళన చేయాల్సి వచ్చింది. అలాగే సాయిబాబాకు పెరోల్ ను అనేక సార్లు తిరస్కరించారు. ఆయన తల్లి మరణించాక కూడా కోర్టు పెరోలను తిరస్కరించి తన ఫాసిస్టు స్వభావాన్ని చాటుకున్నది. అనారోగ్యం ఆయనను ప్రమాదపు అంచులకు తీసికెళ్లింది.
మేధావులను చూసి భయపడుతున్న ఈ రాజ్య దుర్మార్గాన్ని సమాజం అంగీకరించలేదు. దేశదేశాల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దాన్ని ఇంకా తీవ్రం చేయాల్సి ఉంది. అందులో భాగమే ఈ సభ. తప్పక విజయవంతం చేయండి.
- విప్లవ రచయితల సంఘం

Keywords : virasam, bhimakoregaon, varavararao, anand teltumbde, sudha bharadvaj, nia, hani babu
(2024-04-25 00:07:50)



No. of visitors : 649

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఇప్పటికి