include 'men';
?>
వరవరరావు అల్లుళ్ళకు NIA నోటీసులు - విచారణకు హాజరుకావాలని ఆదేశం
భీమా కోరేగావ్ కేసులో తలోజా జైల్లో ఉన్న ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు ఇద్దరు అల్లుళ్ళు కె. సత్యనారాయణ, కె.వి.కుమార్నాథ్ లను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణకు రావాలని ఆదేశించింది. వీరితోపాటు కలకత్తాకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్ పార్థ సారథి రేను కూడా విచారణకు రావాలని ఆదేశించింది. సత్య నారాయణ దళిత కార్యకర్త, ఇఫ్లూలో ప్రొఫెసర్ కాగా కూర్మనాథ్ సీనియర్ జర్నలిస్టు. ఈ ముగ్గురిని NIA ముంబై కార్యాలయానికి హాజరు కావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ ఓ ప్రకటన విడుదల చేశారు.
"నా మామ, విప్లవ కవి వరవరరావుకు వ్యతిరేకంగా సాక్ష్యాలను సేకరించే నెపంతో నా ఫ్లాట్ను 2018 ఆగస్టులో పూణే పోలీసులు దాడి చేశారని మీకు తెలుసు" అని సత్యనారాయణ ఆ ప్రకటనలో తెలిపారు. ʹʹ నాకు భీమా కోరేగావ్ కేసుతో ఎలాంటి సంబందం లేదని ఆ రోజే చెప్పాను. వరవర రావు నా మామ కావడం వల్లనే నా ఇంటిపై దాడి చేసి నన్ను నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురి చేశారు.ʹʹ
"ఒక వైపు వరవర రావు ఆరోగ్య పరిస్థితి అస్సలు బాగా లేదు, మరో వైపు ముంబైలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సమయంలో NIA నన్ను విచారణకు ముంబై పిలవడం మా కుటుంబాన్ని మరింతగా బాధకు గురి చేస్తుంది" అని సత్యనారాయణ చెప్పారు. "నేను ఈ భయంకరమైన కాలంలో ముంబైకి ప్రయాణిస్తున్నాను." అన్నారు
ʹʹనా ఇంటిపై NIA దాడి చేసినప్పుడు ఎలాగైతే మీరంతా నాకు మద్దతుగా నిల్చి, NIA చర్యను ఖండించారో ఇప్పుడు కూడా నాకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నానుʹʹ అని సత్యనారయణ తన ప్రకటనలో పేర్కొన్నారు
ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని పార్థసారథి రే స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఇతర మేధావుల మాదిరిగానే తనను వేధించడానికి NIA ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. "సెక్షన్ 160 సిఆర్పిసి కింద ఈ కేసులో ఏజెన్సీ నన్ను సాక్షిగా పిలిచింది" అని పిటిఐకి చెప్పారు. ʹʹ నాపై ఎలాంటి ఆరోపణలు లేవు. నేను భీమా కోరెగావ్కు ఎన్నడూ వెళ్ళలేదు. ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు. వార్తాపత్రికలలో దాని గురించి చదివే వరకు నాకు ఈ సంఘటన గురించి కూడా తెలియదు.ʹʹ అన్నారు పార్థ సారథి.
భీమా కోరేగావ్/ఎల్గర్ పరిషథ్ కేసులో అనేక మంది విద్యావేత్తలు, న్యాయవాదులు, కార్యకర్తలను NIA ప్రశ్నించింది. ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేసింది. జూలై 28 న ఢిల్లీ విశ్వవిద్యాలయ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును అరెస్టు చేశారు. ప్రభుత్వ చర్యల వల్ల వచ్చే అసమ్మతిని అరికట్టడానికి, భారతదేశంలో మేధావుల గొంతు నొక్కడానికి, వారిని మాట్లాడకుండా చేయడానికే ఈ అరెస్టు విచారణ్ అపేరుతో బెధిరింపులు జరుగుతున్నాయని పలు హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి.
భీమా కోరేగావ్ కేసులో హానీ బాబుతో పాటు వరవరరావు, సుధీర్ ధవాలే, షోమా సేన్, మహేష్ రౌత్, రోనా విల్సన్, సురేంద్ర గాడ్లింగ్, సుధా భరద్వాజ్, అరుణ్ ఫెర్రెరా, వెర్నాన్ గోన్సాల్వ్స్, ఆనంద్ తెల్తుంబే, గౌతమ్ నవలఖలను అరెస్టు చేశారు.
ఈ కేసులో జైల్లో ఉన్న వరవరరావుతో సహా పలువురు తీవ్ర ఆనారోగ్యానికి గురయ్యారు. వరవరరావుకు ఇతర అనారోగ్య సమస్యలే కాక కరోనా కూడా సోకి కదలలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో ఉన్నప్పటికీ... ఎవ్వరికీ బెయిల్ రాకుండా NIA అడుగడుగునా అడ్డుపడుతోంది.
(scroll.in సౌజన్యంతో)
Keywords : varavararao, bhimakoregaon, elgar parishath, NIA, Talija jail, Mumbai
(2024-03-20 03:48:23)
No. of visitors : 894
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..