ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న ఎన్ఐఎ పాశవిక చర్యలను ఖండిద్దాం - clc
ప్రజాన్వామికవాదుల గొంతులను నొక్కుతున్న
ఎన్ఐఎ పాశవిక దాడిని ఖండిద్దాం !
వరవరరావు, ప్రొఫెసర్ షోమాసేన్, ప్రొఫెసర్ ఆనంద్ టెల్టుంట్లే, గౌతమ్ నవలాఖా లాంటి మేధావులను,
సుధా భరద్వాజ్ లాంటి న్యాయవాదులను, మరికొద్దిమంది బుద్ధిజీవులను అప్రజాస్వామికంగా అరెస్టు చేసి జైళ్ళలోనిర్పంధించిన జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన గురిని మరికొద్దిమందిపైకి ఎక్కుపెట్టింది. మేధావులు,న్యాయవాదులు, పాత్రికేయులు, రచయితలతో పాటు ప్రజాస్వామికఉద్యమకారులను వేటాడే కార్యక్రమాన్ని తీవ్రంచేసింది.
ఇందులో భాగంగా ప్రజాస్వామ్య, పౌరహక్కుల ఉద్యమాల్లో చురుకైన కార్యకర్తగా ఉన్న కోల్కతా నగరంలోని భారతీయ విజ్ఞాన విద్య పరిశోధనా సంస్థ (ఐఐఎస్ఈఆర్)లో జీవశాస్త్ర పరిశోధనకుడిగా పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ పార్టాసారధి రే, ముంబయిలోని ఎన్ఐఏ కార్యాలయంలో సెప్టెంబరు 10న ఉదయం 11.00 గంటలకు హాజరుకావాల్సిందిగా సమన్లు జారీచేసింది. హైదరాబాద్లోని ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ వర్శిటీ (ఇప్లూ)కిచెందిన దళిత మేధావి ప్రొఫెసర్ సత్యనారాయణకు ఇప్పటికే సమన్లు జారీ చేసింది. వృత్తిరీత్యా ప్రొఫెసర్ అయిన సత్యనారాయణ విప్లవ కవి వరవరరావు కుమార్తెను వివాహం చేసుకున్నారు.
భీమా కోరేగావ్ కేసులో ప్రశ్నించేందుకు హాజరుకావాల్సిందిగా ఆ సమన్లలో ఎన్ఐఏ పేర్కొంది. ఈ
ముగ్గురికీ ఎన్ఐఏ వెప్తున్నట్లుగా ఎల్లార్ పరిషత్తోగానీ, ఖీమా కోరేగావ్ కేసుతోగానీ ప్రత్యక్షంగానో పరోక్షంగానోఎలాంటి సంబంధం లేదని స్వయంగా వారే పలుమార్లు ప్రకటించారు. ఇప్పటికే అరెస్టయిన పలువురికి న్యాయవాదులుగా ఉంటూ వారి తరపున కోర్టులో కేసు వాదిస్తున్న నీహాల్ సింగ్ రాథోడ్, విష్లన్ టెల్టుంబ్లే, మరో న్యాయవాదిని కూడా హాజరుకావాలంటూ ఎన్ఐవ సమన్లు జారీ చేసింది. మేధావుల తరపున వాదిస్తున్న న్యాయవాదులను కూడా ఎన్ఐఏ విడిచిపెట్టడంలేదు.
డిల్లీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ హనీబాబును జూలై నెలలో విచారణ నిమిత్తం పిలిచిన ఎన్ఐఏ ఆ తర్వాతఅరెస్టు చేసింది. కబీర్ మంచ్ సంస్థకు చెందిన సాగర్ ఘోర్క్మే, రమేష్ గైచోర్లను కూడా విచారణ నిమిత్తం పిలిచిఅరెస్టు చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్న లేదా ప్రశ్నిస్తున్న గొంతుల్ని నొక్కేయడానికి పలు రకాల ప్రయత్నాలు ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేగవంతమయ్యాయి.
అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అని గర్వంగా ప్రకటిస్తున్న కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రశ్నించడాన్ని కూడా
జీర్ణించుకోలేకపోతున్నది. భావ వ్యక్తీకరణ స్వేచ్చ గురించి గొప్పగొప్ప ప్రసంగాలు చేస్తూనే ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే ఉద్యమకారులుగా, దేశద్రోహులుగా ముద్రవేసి అరెస్టులు చేయిస్తోంది. పౌరహక్కుల కార్యకర్తలపై కూడా అక్రమ కేసులు బనాయించి జైళ్ళలో బంధిస్తోంది. బనాయించిన కేసులకు సంబంధించి ఎలాంటి ఆధారాలను కూడా కోర్టుకు సమర్పించడంలేదు.
చట్టపరంగా లభించాల్సిన బెయిల్ పిటిషన్లపై సైతం రకరకాల సాకుల్ని చూపిస్తూ జైళ్ళ నుంచి బైటకు
రాకుండా ఎన్ఐఏ తనదైన ప్రయత్నాలు చేస్తోంది. బెయిల్ మంజూరు కాకూడదని, జైలు నుంచి బైటకు రావద్దనేదే ఎన్ఐఏ లక్ష్యం. ఛార్జిషీట్, అనుబంధ ఛార్జిషీట్ సమర్పించినా కోర్టు విచారణ మాత్రం ప్రారంభించకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తోంది. ప్రజాస్వామిక ఆకాంక్షలను, హక్కులను అణచివేసి అప్రజాస్వామిక పాలన కొనసాగించడంలో భాగంగానే రాజకీయ భావాలను వ్యక్తీకరించే స్వేచ్చను హరిస్తున్నది.
తాజాగా ముగ్గురికి సమన్లు జారీచేసి పౌర, ప్రజాస్వామిక హక్కులను ఎన్ఐఏ ఉల్లంఘిస్తోంది. ప్రొఫెసర్లుగా,పాత్రికేయులుగా, పరిశోధకులుగా ఉన్న వీరికి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు జారీచేయడమంటే అరెస్టు చేయడమే. ఎన్ఐఏ వెప్తున్న ఖీమా కోరేగావ్ లేదా ఎల్లార్ పరిషత్ కేసులతో ఎలాంటి సంబంధం లేని ఈ ముగ్గురికీ సమన్లు జారీచేయడం, ఆ కేసుతో సంబంధం ఉందని అభియోగాలను అంటగట్టడం వారి ప్రజాస్వామిక హక్కులను అణచివేయడమే. ఎన్ఐఏ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం.
ఇప్పటికే ప్రజాస్వామికవాదుల మీద, పారహక్కుల కార్యకర్తల మీద, న్యాయవాదుల మీద, రచయితల మీద,పాత్రికేయులమీద పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. అక్రమ కేసులతో ఎన్ఐఏ చేస్తున్నకుట్రలకు వ్యతిరేకంగా జరుగుతున్న అన్ని ఉద్యమాలకు, పోరాటాలకు, నిరసనలకు మద్దతు ఇవ్వాల్సిందిగా ప్రజలకు, ప్రజాన్వామికవాదులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి సంపూర్ణ సహకారం ఇవ్వాలని కోరుతున్నాం.
గడ్డం లక్ష్మణ్, అధ్యక్షులు
నారాయణరావు, కార్యదర్శి
పారహక్కుల సంఘం
తెలంగాణ రాష్ట్రకమిటీ
Keywords : bhima kerogaon, nia, varavararao, shomasen, sudhabharadvaj, anand teltumbde,
(2024-04-14 10:44:40)
No. of visitors : 743
Suggested Posts
| Release Sudha Bharadwaj, Shoma Sen From Covid-19 Hit Byculla Jail — Citizens Appeal to Committee
We would like to extend our appreciation of the directions made by you on 12.05.2020, liberalizing the conditions for the release of undertrial prisoners in Maharashtra jails, and also clarifying that those undertrials who are otherwise excluded from this category (including those who are charged under Special Acts such as UAPA, NDPS etc) are eligible to |
| భీమా కోరేగావ్ లో దళితులకు మద్దతుగా నిలబడ్డందుకు ప్రజా సంఘాల నాయకుల అక్రమ అరెస్టుదళితుల ఐక్యత కు, పోరాటానికి చిహ్నమైన భీమా కోరేగావ్.. పాలకులను ఇంకా వణికిస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరి ఒకటిన భీమా కోరేగావ్ లో దళితులు నిర్వహించిన విజయోత్సవాలపై దుర్మార్గమైన దాడులు చేసి దళితుల మరణానికి, వందలాది మంది గాయాలపాలవ్వడానికి కారణమైన హిందూ మతోన్మాద ఉగ్రవాదులను వదిలేసిన పోలీసులు దళితులకు మద్దతుగా నిలబడ్డవారిపై విరుచుకపడుతున్నారు. |
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్...భీమా కోరేగావ్ / ఎల్గర్ పరిషథ్ కేసులో మరో ముగ్గురిని అరెస్టు చేసింది ఎన్ ఐ ఏ. కళా కారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే రమేష్ గైచోర్ల ను నిన్న(సెప్టంబర్7, 2020) అరెస్టు చేయగా కళాకారిని, రచయిత, దళిత కార్యకర్త జ్యోతీ జగతాప్ ను ఈ రోజు (సెప్టంబర్ 8, 2020)అరెస్టు చేశారు. దీంతో భీమా కోరేగావ్ కేసులో ఇప్పటి వరకు అరెస్టయినవాళ్ళ సంఖ్య 15కు చేరుకుంది. |
| ఢిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు డాక్టర్ పికె విజయన్, రాకేశ్ రంజన్లకు ఎన్ఐఏ సమన్లు పంపడాన్ని ఖండించండి!హిందూ కళాశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుడు డాక్టర్ పి.కె. విజయన్, శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో ఆర్థిక శాస్త్ర ఉపాధ్యాయుడు రాకేశ్ రంజన్లు ఇద్దరూ విశ్వవిద్యాలయ సముదాయానికి దశాబ్దాల జీవితాన్ని అంకితం చేసిన విద్యావేత్తలు. వారు ప్రజాస్వామిక హక్కులు, ఉన్నత విద్య అందుబాటు మరియు కుల, వర్గ, సముదాయ ప్రాతిపదికన వివక్ష వంటి సమస్యలపై పని చేశారు. |
| ʹమేము సావర్కర్ వారసులం కాదు...అంబేడ్కర్ బిడ్డలం... క్షమాపణ కోరబోం ʹభీమా కోరే గావ్ కేసులో నిన్న అరెస్టు కాబడిన కబీర్ కళా మంచ్ కళాకారులు, దళిత కార్యకర్తలు సాగర్ గోర్ఖే , షాహిర్ రమేష్ గైచోర్ లను ఎన్ ఐ ఏ కొంత కాలంగా విచారణ పేరుతో వేధిస్తోంది. ప్రధాని హత్యకు కుట్ర కేసులో సాక్షులుగా మారాలని |
| కరోనా కాలంలో...ఆనంద్ తేల్తుంబ్డే కు తాత్కాలిక బెయిల్ తిరస్కరించిన కోర్టుఎల్గర్ పరిషత్ - భీమా కోరెగావ్ కేసులో నిందితుడు విద్యావేత్త, కార్యకర్త ఆనంద్ తేల్తుంబ్డే వైద్య కారణాలపై దాఖలు చేసిన తాత్కాలిక బెయిల్ పిటిషన్ను ముంబైలోని ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. కోర్టు అతన్ని తలోజా జైలుకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. |
| ఇది భయపడాల్సిన సమయం కాదు... ఎదిరించాల్సిన సమయం...ప్రొఫెసర్ హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా
హానీ బాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా అన్నారు. దేనికీ భయపడే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు.
మిరాండా హౌస్ కాలేజీ అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న హానీబాబు భార్య డాక్టర్ జెన్నీ రోవేనా |
| స్టాన్ స్వామి మృతికి నిరసనగా జైల్లో నిరాహార దీక్షభీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో నిందితులుగా తలోజా జైల్లో ఉన్న పది మంది హక్కుల కార్యకర్తలు నిరాహార దీక్షకు దిగారు. తమతో పాటు సహ నిందితుడిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామి అనారోగ్యంతో మృతి చెందడానికి ప్రభుత్వమే కారణమని ఆరోపిస్తూ వీరు ఒక రోజు నిరాహార దీక్షను చేపట్టారు. |
| అరెస్టవబోయే ముందు గౌతమ్ నవ్లాఖా రాసిన ʹస్వేచ్ఛా గీతంʹఢిల్లీలోని ఎన్ఐఎ ప్రధాన కార్యాలయంలో సరెండర్ అవడానికి వెళ్లబోతూ, ఈ వారం బైట గడపడానికి, నాకొక వారం స్వేచ్ఛ ఇవ్వడానికి ఏప్రిల్ 8న జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఇందిరా బెనర్జీ ఇచ్చిన తీర్పుకు సంతోషపడుతున్నాను. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో, ఈ లాక్ డౌన్ సమయంలో కూడ, ఒక వారం రోజుల స్వేచ్ఛ అంటే చాల విలువైనది. |
| Condemn the arbitrary arrest of Prof. Hany Babu - CASRThe Campaign Against State Repression (CASR) condemns the arrest of Professor Hany Babu MT at Mumbai by the National Investigation Agency (NIA) in connection with the Bhima Koregaon-Elgaar Parishad case. |