ʹనిరసన రాజ్యాంగం ఇచ్చిన హక్కుʹ: యుఎపిఎ కేసులో విద్యార్థులకు బెయిల్ మంజూరు
నిషేధిత మావోయిస్ట్ పార్టీతో సంబంధాలు వున్నాయనే ఆరోపణతో 10 నెలల క్రితం కేరళ పోలీసులు అరెస్టు చేసి ఎన్ఐఏకు అప్పగించిన అల్లన్ షుయబ్, త్వహా ఫసల్ అనే ఇద్దరు విద్యార్థుల పై చట్టవ్యతిరేక కార్యకలాపాలు (నివారణ) చట్టం కింద అభియోగాలు మోపి అరెస్టు చేశారు. సెప్టెంబర్ 9 బుధవారం నాడు వారికి కొచ్చిలోని ప్రత్యేక ఎన్ఐఏ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కేవలం మావోయిస్టు సాహిత్యాన్ని కలిగి ఉండటం, ప్రభుత్వ వ్యతిరేక నిరసన ప్రదర్శనలలో పాల్గొనడం లేదా బలమైన రాజకీయ విశ్వాసాలను కలిగి ఉండటం వల్లనే ఒక వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాలకు సహకరించాడు అనడం సరికాదు అని కోర్టు పేర్కొంది.
నిషేధిత సంస్థతో వారికి సంబంధాలున్నాయని నిరూపించడానికి ప్రాసిక్యూషన్ ఖచ్చితమైన ఆధారాలు ఇవ్వలేదని కోర్టు అభిప్రాయపడింది.
లా, జర్నలిజం కోర్సులు చదువుతున్న షోయబ్ (19) ఫసల్ (23) ను గత నవంబరులో కోజికోడ్ వున్న వాళ్ళ యిళ్ల నుండి పోలీసులు అరెస్ట్ చేసిన ఈ కేసు పంథీరంకావు మావోయిస్ట్ కేసుగా పేరు పొందింది. వారిద్దరికీ అధికారంలో వున్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) తో సంబంధం వుంది.
షుయబ్, ఫసల్ (పరారీలో వున్న ఉస్మాన్ అనే అతను) సిపిఐ (మావోయిస్ట్) పార్టీలో చురుకైన సభ్యులు అనీ, కేరళలో పార్టీని పునరుద్ధరించడానికి "మావోయిస్ట్ సాహిత్యం" పంపిణీ చేస్తున్నారనీ ఆరోపిస్తూ పోలీసులు క్రూరమైన చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం క్రింద కేసులు పెట్టారు.
నిందితుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలు, పోస్టర్లు, డైరీలు, పుస్తకాలు, ఇతర రాజకీయ సాహిత్యాల ఆధారంగా మొత్తం కేసును తయారు చేసిన పోలీసులు, ఇంటిపై ఎన్ఐఏ దాడి చేసినప్పుడు తహా "మావోయిస్టు అనుకూల నినాదాలు చేశాడని" ఆరోపించారు. ఈ కేసును డిసెంబర్లో ఎన్ఐఏకు బదిలీ చేశారు, అప్పటినుండి షుయబ్ ఫసల్ ఇద్దరూ జైలులో లో ఉన్నారు. ఈ కాలంలో వారి బెయిల్ దరఖాస్తులను సెషన్స్ కోర్టు పలుసార్లు తిరస్కరించింది.
ఈ కేసు కేరళలో అధికార సిపిఐ (ఎం)కూ- పౌర సమాజంలోని విస్తృత సెక్షన్లకూ మధ్య రాజకీయ వివాదానికి దారితీసింది. పోలీసులు వారిని అరెస్టు చేసిన వెంటనే సిపిఐ (ఎం) ఆ ఇద్దరిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అనేకమంది రాష్ట్ర సిపిఐ (ఎం) నాయకులు ఫాసల్, షుయబ్ లు ఇస్లామిస్ట్ ఉగ్రవాదులనీ మావోయిస్టు పార్టీని సమర్థిస్తూ, ఆ పార్టీతో సన్నిహితంగా పనిచేస్తున్నారనీ చెప్పి పోలీసు చర్యను సమర్థించారు.
అయితే, ప్రజా మేధావులు, స్వతంత్ర కార్యకర్తలు పినారి విజయన్ ప్రభుత్వం రాష్ట్ర పోలీసులకు స్వేచ్ఛా హస్తం ఇచ్చినందుకు, అసమ్మతివాదులను "మావోయిస్టులు లేదా ఉగ్రవాదులు" అని ముద్రవేయడాన్ని మొదటినుంచీ ఖండించారు.
సిపిఐ (ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం యెచురీ కూడా ఈ ఇద్దరిపై వచ్చిన అభియోగాలను ఖండించారు, కేరళ వామపక్ష ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు.
సెప్టెంబర్ 9, బుధవారం బెయిల్ విచారణ కొనసాగుతున్నప్పుడు, ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన రాజకీయ కరపత్రాలు, సాహిత్యానికి సంబంధించిన 12 సాక్ష్యాలను ఎన్ఐఏ కోర్టు డిఫెన్స్ లాయర్లు ఇసాక్ సంజయ్, తుషార్ నిర్మల్ సారథిలు చేసిన వాదనలతో మూల్యాంకనం చేసింది. ఇద్దరు నిందితుల ఇళ్ల నుంచి స్వాధీనం చేసుకున్న, ఎన్ఐఏ దోషులుగా భావిస్తున్న పత్రాల్లో ఎక్కువ భాగం బయట సులభంగా లభించేవీ, విస్తృతంగా చర్చలో వున్నవే కదా అని కోర్టు ఆశర్యాన్ని ప్రకటించింది.
పశ్చిమ కనుమలలో పర్యావరణన్ని పరిరక్షించడానికి మాధవ్ గాడ్గిల్ కమిటీ నివేదికను అమలు చేయాలని, ఆదివాసీల ప్రయోజనాలను కాపాడాలనీ డిమాండ్ చేసే పత్రాలు, గ్రేట్ రష్యన్ విప్లవం అనే పుస్తకం, కమ్యూనిస్ట్ నాయకులు మావో త్సే తుంగ్, చే గువేరా మరియు కాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు SAS గిలానీల చిత్రాలు, ʹమార్క్సిస్ట్ భావజాలంʹ, ʹఇస్లాం భావజాలంʹ లను ప్రచారం చేసే పుస్తకాలు ఎన్ఐఏ సాక్ష్యంగా సమర్పించినవాటిలో కొన్ని. UAPA కి వ్యతిరేకంగా, కుర్దులపై టర్కీ యుద్ధంపై, కాశ్మీర్ లోయలో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలపై విమర్శనాత్మక కరపత్రాలతో సహా సాహిత్యాన్ని నేరారోపిత సాహిత్యంగా పేర్కొంటూ NIA కోర్టులో ప్రవేశపెట్టింది.
మావోయిస్టు పార్టీతో వారికి అనుబంధాన్ని వుంది అని కేసును తయారుచేయడానికి , వారిద్దరూ కుర్దులకు సంఘీభావం తెలిపే అనేక నిరసనలు, సమావేశాలలోనూ, జిషా హత్య, కరెన్సీ రద్దు, పోలీసులు జరిపిన దురాగతాల కేసులకు వ్యతిరేకంగా జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారనీ, అంతేకాకుండా మావోయిస్టు పార్టీ పత్రాలు, కేంద్ర కమిటీ నివేదికలు, పార్టీ జెండాలను కూడా వారి ఇళ్లనుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఐఏ తెలిపింది. ఇవేవీ హింసాత్మక, ఉగ్రవాద కార్యకలాపాలను సూచించవంటూ కోర్టు NIA వాదనను తోసిపుచ్చింది.
"... ఇవన్నీ సామాజిక, రాజకీయ రంగాలలో చర్చించబడిన సమస్యలకు సంబంధించినవి, నిరసనలన్నీ ఏమాత్రం హింస లేకుండా శాంతియుతంగా జరిగాయి" అని కోర్టు ఉత్తర్వు తెలిపింది. నిందితులు మావోయిస్టు పార్టీ పత్రాలను కలిగి ఉన్నారన్న ఆరోపణకు సంబంధించి, ఈ పత్రాలు చాలావరకు ప్రజలకు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నవే కదా అంది.
ఎన్ఐఏ బృందంపై పై తీవ్రంగా వ్యాఖ్యానిస్టూ ఈ ఉత్తర్వులో :
"[పత్రాలు] ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసాత్మకంగా నిరసన తెలపడానికి ప్రజలను ఉత్తేజపరిచే ప్రయత్నం చేసినట్లుగా పత్రాలు ప్రాథమికంగా సూచించడంలేదు ... సిపిఐ (మావోయిస్టు) ఉద్యమానికి మద్దతు ఇవ్వమని ప్రజలకు పిలుపునివ్వలేదు, పూర్తిగా అన్యాయం అని తాము అనుకొన్న ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వారు నిరసన తెలియచేస్తున్న విషయం వాస్తవానికి సమర్థనీయమైనదా కాదా అనేది మాకు సంబంధించినది కాదు. ʹ
సిపిఐ (మావోయిస్టు) తరఫున ఫసల్ తయారుచేసినట్లు చెప్తు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించినది ఒకే ఒక పత్రం ʹజమ్మూ కాశ్మీర్ స్వాతంత్ర్య పోరాటానికి మద్దతు కోరుతూʹ బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడానికి ఉద్దేశించిన "జమ్మూ కాశ్మీర్ లో భారత ప్రభుత్వ నియంత్రణను వ్యతిరేకించండి, హిందూ బ్రాహ్మణ ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడండి. ʹఅని రాసి వున్న బ్యానర్ మాత్రమే అని కోర్టు పేర్కొంది.
ʹభారతదేశ పార్లమెంటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, 35 (ఎ) ను రద్దు చేసిన తరువాత ఈ బ్యానర్లు తయారు చేసినట్లు గమనించాలి. ఆ సందర్భం నుండి వేరు చేసి చూస్తే ఏ మూల్యాంకనమైనా తప్పు నిర్ణయాలకు దారి తీస్తుంది.ʹ అని బ్యానర్ గురించి కోర్టు పేర్కొంది,
"నిరసన హక్కు రాజ్యాంగబద్ధంగా హామీ ఇవ్వబడిన హక్కు" అని న్యాయమూర్తి భాస్కర్ అన్నారు, "ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసన, అది తప్పు కారణం అయినా, దేశద్రోహంగానో లేదా విడిపోవడానికీ, లేదా విడిపోయేహక్కుకు మద్దతు ఇచ్చే ఉద్దేశపూర్వక చర్యగా చెప్పలేము.ʹ
నిందితులకు వ్యతిరేకంగా సాక్ష్యంగా సమర్పించిన "అభ్యంతరకరమైన రచనల" సందర్భోచిత మూల్యాంకనం "నిషేధించబడలేదు", "భారత ప్రభుత్వం పట్ల ఏ విధమైన ద్వేషాన్ని లేదా ధిక్కారాన్ని సృష్టించే ప్రయత్నాన్ని రుజువు చేయదు లేదా అది ఎటువంటి అసంతృప్తిని ప్రేరేపించదు"
"మన రాజ్యాంగ రాజకీయాలతో" సమకాలీకరించబడనప్పటికీ మావోయిస్టు సాహిత్యాన్ని, వర్గ పోరాటాల గురించి చదవడం లేదా మావోయిస్టుగా ఉండటం "నేరం కాదు" అది కోర్టు తెలిపింది. "హింసను ప్రేరేపించడానికి నిందితుల వైపు నుండి ఏదైనా సానుకూల చర్య" ఉంటే మాత్రమే ఒక వ్యక్తి యొక్క రాజకీయ నమ్మకాలు ప్రతికూలంగా పరిగణించబడతాయి.
నిందితులు ఇద్దరూ బలమైన రాజకీయ విశ్వాసాలను కలిగి ఉన్నారని, ప్రభుత్వాన్ని విమర్శించే రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొన్నారని స్పష్టంగా తెలుస్తోంది అయితే అంతమాత్రాన వారిద్దరూ మావోయిస్టు పార్టీకి చెందిన "క్యాడెర్లు" లేదా వారి కార్యకలాపాలను ఆ సంస్థ నియంత్రిస్తోంది అని అర్థం కాదు.
నిందితులు "ప్రతి వివాదాస్పద సామాజిక, రాజకీయ సమస్యలలో చురుకుగా ఉండేవారు" కాబట్టి, వారు "ఉగ్రవాద భావజాలాల" పట్ల సుముఖత కలిగివుండడం వల్ల, నిషేధిత సంస్థతో సంబంధాలు ఏర్పరచుకునే దిశగా వారిని ఆకర్షించివుండవచ్చని కోర్టు అభిప్రాయపడింది. ఏది ఏమయినప్పటికీ, ప్రాసిక్యూటింగ్ బృందం వారు నేరం చేశారని నిరూపించడానికి తగిన సాక్ష్యాలను సేకరించలేకపోవడంతో, అంతిమ నివేదికలో మొదటి నిందితుడు షుయబ్పై UAPA సెక్షన్లను తీసివేయాల్సి వచ్చింది.
ఈ పరిస్థితులలో, న్యాయస్థానం సున్నితమైన దృక్పథాన్ని అవలంబించాలని, బెయిల్ యివ్వడం వల్ల వారు తమ రాజకీయాభిప్రాయాల గురించి తిరిగి ఆలోచించే అవకాశం కలుగుతుందని న్యాయమూర్తి భాస్కర్ ఆశించారు.
Keywords : kerala, kochi, maoists, UAPA, court, granted bail, students
(2024-03-25 21:53:37)
No. of visitors : 793
Suggested Posts
| ʹఅవును ఆ అంకులే అందర్నీ కొట్టాడుʹ న్యాయమూర్తి ముందు ఓ ఐపీఎస్ కు షాకిచ్చిన ఏడేళ్ళ బాలుడుఇంతలో అక్కడికి వచ్చిన ఓ ఏడేళ్ళ బాలుడు. ʹఈ అంకులే అందర్నీ కొట్టాడు , మర్నాడు పేపర్లో కూడా ఈ అంకుల్ ఫోటో వచ్చిందిʹ అని ఆ ఐపీఎస్ అధికారి వైపు వేలు చూపిస్తూ న్యాయమూర్తికి చెప్పాడు. ఊహించని ఆ బాలుడి సాక్ష్యంతో ఒక్క సారి షాక్ తిన్నఆ అధికారి ʹనేను కొట్టానాʹ అని ఆ బాలుడిని ప్రశ్నించాడు. వెంటనే ఆ పిల్లాడు అవును నువ్వే కొట్టావు అని మరింత గట్టిగా చెప్పడంతో.. |
| తన తల్లిని క్రిమినల్ గా చూయించిన సినిమా పై మావోయిస్టు దంపతుల కూతురు పోరాటం
తన తల్లిని క్రిమినల్ అని ప్రచారం చేస్తున్న ఓ సినిమా పై ఓ యువతి చేస్తున్న పోరాటమిది. ప్రజలకోసం తన జీవితాన్ని ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్న తన తల్లిని క్రిమినల్ గా చూయించడంపై పోరాడుతున్న ఆయువతి పేరు అమిరూప్ షైనా... విప్లవ ప్రజానీకానికి సుపరిచితమైన పేరు.... |
| కేరళలో మావోయిస్టు దేవరాజ్ అంత్యక్రియలు - అడ్డుకున్న బీజేపీ, పోలీసులుకేరళ నిలంబదూర్ లో పోలీసు కాల్పుల్లో అమరులైన మావోయిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ కుప్పు దేవరాజ్అంత్యక్రియలు శుక్రవారం కోజికోడ్ లో జరిగాయి. వందలాదిమంది విప్లవ అభిమానులు అమర కామ్రేడ్ కు..... |
| Lynching of tribal youth Madhu : CPI (Maoist) calls for protestCPI (Maoist) has issued a statement calling for protests against the lynching of tribal youth Madhu in Attapadi.
The statement issued by party spokesperson Jogi on Monday said the incident reflects the cruel racist onslaught by Malayalis against the tribal community which must be resisted by all progressive forces. |
| The Courageous leader Comrade Kuppu Devraj - Maoist Central CommitteeWe send late but deep Condolences to the families of our beloved Comrades Devaraj and Ajitha. Comrade Devraj was 62 and Comrade Ajitha 52. We call upon all the masses, democrats, patriots and citizens of the country to condemn the brutal killing and fight against such atrocities. The presentfake encounter was conducted by the present Brahmanic.... |
| Four districts in Kerala on high alert as Maoists form new combat unit
The Communist Party of India-Maoist (CPI-Maoist) cadres have formed a new ʹcombat and operationalʹ unit at the Kerala-Tamil Nadu-Karnataka ʹtri-junction.... |
| మావోయిస్టు పార్టీ నేత అమరుడు కుప్పు దేవరాజ్ వీడియో కేరళలో నిలంబదూర్ ప్రాంతంలో పోలీసుల ʹఎన్కౌంటర్లోʹ అమరుడైన మావోయిస్టు పార్టీ నేత కుప్పు దేవరాజ్ వీడియో ఒకటి ప్రచారంలోకి వచ్చింది. అటవీ ప్రాంతంలో పీఎల్జీఏ కామ్రేడ్స్ ను ఉద్దేశించి దేవరాజ్ మరో మావోయిస్టు నేత మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో కనపడుతున్నవి..... |
| మావోయిస్టు పార్టీ నాయకత్వంలో తీవ్రమవుతున్న భూపోరాటాలుఅక్కడ మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రజలు వందలాది ఎకరాలు స్వాధీనం చేసుకుంటున్నారు. అనేక గ్రామాల ప్రజలు ఆ భూములను సమానంగా పంచుకుంటున్నారు. ఈ మధ్య జరిగిన ఎన్కౌంటర్ స్థలంలో పోలీసులకు దొరికిన కొన్ని వీడియోల్లో... |
| దళిత నటి విషాద గాథ !అప్పుడే రెండో ఆట చూడడానికి.. తనను తాను తెర పై చూసు కోడానికి వచ్చిన రోజీపై దాడి చేశారు. భయంతో పరుగులు తీసి రోజీ ఒక పూరి గుడిసెలో ఆశ్రయం పొందింది. ఆమె ధైర్యం తమ కులాధిపత్యానికి చేటు కలిగిస్తుందనే మూర్ఖులు... ఆమెని వెంబడించి ఆ ఇంటిని దహనం చేశారు. ఇంటివాళ్ళు ప్రాణభయం తో పారిపోయారు |
| Resisting police and BJP, several human rights activists pay homage to Maoist leader Kuppu DevarajHuman right activists and Maoist sympathisers bid adieu to slain leader of CPI (Maoist) Kuppu Devaraj in Kozhikode district of Kerala, resisting opposition from the Kerala police and BJP workers. Police denied permission to the human rights activists to lay the body..... |