include 'men';
?>
BK16:నేను చేసిన తప్పేంటి? నా చార్జిషీటు నేనే రాసుకుంటున్నాను – ఫాదర్ స్టాన్ స్వామి
గత మూడు దశాబ్దాలలో, ఆదివాసీలు, తమ ఆత్మగౌరవం, గౌరవంగా జీవించే హక్కు కోసం చేస్తున్న పోరాటంలో నన్ను నేను కలుపుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి ప్రయత్నించాను. రచయితగా కూడా నేను వారి వివిధ సమస్యలను అంచనా వేయడానికి ప్రయత్నించాను. ఈ సమయంలో, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనేక ఆదివాసీ వ్యతిరేక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నా అసమ్మతిని ప్రజాస్వామిక పద్ధతుల్లో వ్యక్తం చేశాను. ప్రభుత్వం, పాలక వ్యవస్థల ఇటువంటి అనేక విధానాల నైతికత, హేతుబద్ధత, చట్టపరమైన ప్రామాణికతను నేను ప్రశ్నించాను.
1. రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ అమలు చేయకపోవడాన్ని నేను ప్రశ్నించాను. ఆదివాసీలు మాత్రమే వుండే ʹగిరిజన సలహా మండలిʹ ని రాష్ట్రంలో ఏర్పాటు చేయాలి. ఆదివాసీల అభివృద్ధి, రక్షణ అంశాలకు సంబంధించి ఈ కమిటీ గవర్నర్కు సలహా ఇస్తుంది అని ఈ షెడ్యూల్ [ఆర్టికల్ 244 (ఎ), భారత రాజ్యాంగం] స్పష్టంగా పేర్కొంది.
2. పెసా చట్టాన్ని ఎందుకు పూర్తిగా విస్మరించారు? అని నేను అడిగాను. 1996 లో అమల్లోకి వచ్చిన పెసా చట్టం మొదటిసారిగా, దేశంలోని ఆదివాసీ సముదాయాలకు గ్రామసభల ద్వారా స్వయం పాలన చేసుకొనే సంపద్వంతమైన సామాజిక, సాంస్కృతిక చరిత్ర ఉందని గుర్తించింది.
3. సుప్రీంకోర్టు 1997 సమత నిర్ణయంపై ప్రభుత్వం మౌనం వహించడం పట్ల నేను నిరంతరం నా నిరాశను వ్యక్తం చేశాను. ఈ నిర్ణయం యొక్క ఉద్దేశ్యం [1997 లో సివిల్ అప్పీల్ నెం: 4601-2] ఆదివాసీలకు, తమ భూమిపై గనుల తవ్వకాన్ని నియంత్రించే హక్కును ఇవ్వడం, వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం.
4. 2006 లో చేసిన అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం చూపిన ఉదాసీన వైఖరిపై నేను నిరంతరం నా దు:ఖాన్ని వ్యక్తం చేశాను. ఈ చట్టం యొక్క ఉద్దేశ్యం శతాబ్దాలుగా ఆదివాసీలకు, అటవీ ఆధారిత సముదాయాలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడం.
5. - భూమి ఎవరిదో, ఖనిజాలు వారికే -అనే సుప్రీంకోర్టు నిర్ణయాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు సుముఖంగా లేదని నేను అడిగాను [ఎస్సీ: సివిల్ అప్పీల్ నంబర్ 4549, 2000] భూస్వంతదారుల వాటా గురించి ఆలోచించకుండా, బొగ్గు బ్లాకులను వేలం వేసి కంపెనీలకు యిస్తున్నారు.
6. భూసేకరణ చట్టం, 2013 కి జార్ఖండ్ ప్రభుత్వం 2017లోచేసిన సవరణ ఔచిత్వాన్ని నేను ప్రశ్నించాను. ఈ సవరణ ఆదివాసీ వర్గాలను విధ్వంసం చేసే ఆయుధం. ఈ సవరణ ద్వారా, ప్రభుత్వం ʹసామాజిక ప్రభావ అంచనాʹ యొక్క అత్యవసరాన్ని తొలగించింది. వ్యవసాయ, బహుళ-పంట భూముల వ్యవసాయేతర వినియోగానికి తలుపులు తెరిచింది.
7. ప్రభుత్వం ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు చేయడాన్ని నేను తీవ్రంగా నిరసించాను. ల్యాండ్ బ్యాంక్ ఆదివాసీలను అంతం చేసే మరో ప్రయత్నం, ఎందుకంటే దీని ప్రకారం గ్రామానికి చెందిన మజ్రూయేతర (కమ్యూనిటీ ల్యాండ్) భూమి ప్రభుత్వానికి చెందుతుంది, గ్రామసభకు కాదు. ప్రభుత్వం తన యిష్టం వచ్చినట్లు ఈ భూమిని ఎవరికైనా (ప్రాథమికంగా కంపెనీలకు) ఇవ్వవచ్చు.
భూసేకరణ, విస్థాపనల అన్యాయాన్ని ప్రశ్నించే వేలాది మంది ఆదివాసీ-స్థానిక ప్రజలను ʹనక్సల్ʹ అని అరెస్టు చేయడాన్ని నేను వ్యతిరేకించాను.
నేను ఈ డిమాండ్ లతో జార్ఖండ్ రాష్ట్రంపై హై కోర్టులో పిల్ దాఖలు చేశాను 1) విచారణ ఖైదీలందరినీ వ్యక్తిగత పూచీకత్తు తీసుకొని బెయిల్పై విడుదల చేయాలని, 2) ఈ అబద్ధపు అభియోగం నుండి చాలా మంది నిర్దోషులైన ఖైదీలు బయటపడడానికి కోర్టు వ్యాజ్య ప్రక్రియను వేగవంతం చేయాలి, 3) ఈ కేసులో కోర్టు విచారణ ప్రక్రియను ధీర్ఘకాలంగా పెండింగ్లో వుంచడానికి గల కారణాలను విచారించడానికి జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటు చేయాలి, 4) పోలీసుల విచారణలో ఉన్న ఖైదీలకు సంబంధించిన వివరాలను యివ్వమని పిఐల్ వేసి రెండేళ్ళకు పైగా అయింది కాని ఇప్పటివరకు కోరిన పూర్తి సమాచారం ఇవ్వలేదు. పూర్తి సమాచారం ఇవ్వండి.
ప్రభుత్వ వ్యవస్థ నన్ను దారి నుండి తొలగించాలని కోరుకుంటుందని నేను నమ్ముతున్నాను. నన్ను తొలగించడానికి సులభమైన మార్గం ఏమిటంటే, నన్ను అబద్ధపు కేసులలో, తీవ్రమైన ఆరోపణల్లో యిరికించడం, దాంతో పాటు అమాయక ఆదివాసీలకు న్యాయం జరిగే న్యాయ ప్రక్రియను కూడా ఆపడం.
(స్టాన్ స్వామి అరెస్టుకు ముందు తాను మాట్లాడిన వీడియోను పైన చూడండి)
Keywords : stan swamy, jharkhand, NIA, Bhimakoregaon, case, BK16, maoists,
(2024-03-18 15:37:55)
No. of visitors : 869
Suggested Posts
0 results
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..