పది రోజులు నిరాహార దీక్ష చేసిన డాక్టర్ సాయిబాబా - బాహ్య ప్ర‌పంచానికి తెలియ‌కుండా తొక్కిపెట్టిన జైలు అధికారులు

పది

మ‌హారాష్ట్ర నాగ‌పూర్ జైల్లో ఉన్న ఢిల్లీ యూనివ‌ర్సిటీ ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబా త‌న అనారోగ్య స‌మ‌స్య‌ల‌పై త‌గు విధంగా వైద్య‌సేవ‌లు, త‌న కుటుంబ స‌భ్యులు అందిస్తున్న మందులు కూడా ఇవ్వ‌కుండా జైలు అధికారులు అనుస‌రిస్తున్న తీరుకు నిర‌స‌న‌గా గ‌తంలో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష‌కు పూనుకున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా ఆయ‌న ఆరోగ్య స్థితి గ‌తుల‌పై ఆందోళ‌న వ్యక్త‌మైంది. కుటుంబ స‌భ్యుల‌తో పాటు పౌర‌, ప్ర‌జాసంఘాలు, దేశ‌వ్యాప్త‌గా ఉన్న హ‌క్కుల సంఘాలు సాయిబాబా నిరాహార దీక్ష చేసే ప‌రిస్థితి వ‌స్తే అది అత‌ని ప్రాణానికే ప్ర‌మాద‌మ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. 90శాతం విక‌లాంగుడుగా ఉన్న సాయిబాబా‌ అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో ఉన్నందున అతన్ని నిరాహార దీక్ష‌కు పూనుకోకుండా నిరోధించాల్సిన బాధ్య‌త జైలు అధికారులు, ప్ర‌భుత్వానిదేన‌ని అంద‌రూ నిన‌దించారు. దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఉన్న‌తాధికారులు సాయిబాబా డిమాండ్ల‌న్నింటినీ ఒప్పుకోవ‌టంతో పాటు, ఆయ‌న స‌మ‌స్య‌ల‌న్నంటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని హామీఇచ్చారు. దాంతో సాయిబాబా నిరాహార దీక్ష విర‌మించిన‌ట్లు అంద‌రికీ తెలుసు. కానీ నాటి ప‌రిస్థితుల దృష్ట్యా అధికారులు డిమాండ్ల‌ను తీరుస్తామ‌ని చెప్పినా, హామీ నెరవేర్చ‌లేదు. దీంతో మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వ తీరుకు నిర‌స‌న‌గా సాయిబాబా అక్టోబ‌ర్ 28వ తేదీ నుంచి నిరాహార దీక్ష‌కు పూనుకున్నారు.

ప్రొఫెస‌ర్ సాయిబాబా నిర‌హార దీక్ష‌కు పూనుకున్న విష‌యాన్ని జైలు అధికారులు ఎవ‌రికీ తెలియ‌కుండా దాచారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న సాయిబాబా నిరాహార దీక్ష‌కు పూనుకుంటే ఆ విష‌యాన్ని ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు, ఆయ‌న కేసును వాదిస్తున్న అడ్వ‌కేట్ల‌కు కూడా తెలియకుండా జైలు అధికారులు చేశారు. ఈ నేప‌థ్యంలోనే సాయిబాబా న‌వంబ‌ర్ 6వ తేదీ దాకా ప‌ది రోజులు నిరాహార దీక్ష చేశారు. ఆ క్ర‌మంలోనే ఆయ‌న‌ను హాస్పట‌ల్‌కు త‌ర‌లించి నిరాహార‌దీక్ష విర‌మింప జేసి ఒక్క రోజులోనే తిరిగి జైలుకు త‌ర‌లించారు. ఆయ‌న డిమాండ్లన్నింటిని ఒప్పుకుంటున్న‌ట్లు జైలు అధికారులు ప్ర‌క‌టించి ఆయ‌న‌తో నిర‌హార దీక్ష‌ను విర‌మింప‌జేశారు.

సాయిబాబా ఆరోగ్య‌ప‌రిస్థితుల దృష్ట్యా అత‌న్ని నిరాహార‌దీక్ష‌కు దిగ‌కుండా చూడాల్సిన బాధ్య‌త అధికారుల‌పై ఉన్న‌ద‌ని సాయిబాబా కుటుంభ సభ్యులు, లాయ‌ర్లు జైలు అధికారుల‌కు అనేక రూపాల్లో విజ్ఞ‌ప్తులు చేశారు. ఇ-మెయిల్లు, విజ్ఞాప‌న‌లు రాశారు. ఆయ‌న ప‌రిస్థితి గురించి కుటుంభ స‌భ్యులు అనేక మార్లు ఫోన్ చేసినా అది ఎవ‌రి చెవికీ ఎక్క‌లేదు. ఏ విధ‌మైన స్పంద‌న లేదు. అంద‌రూ ఆయ‌న నిరాహార దీక్ష విర‌మించార‌నీ, ఆయ‌న డిమాండ్ల‌న్నీ ప‌రిష్కార‌మయ్యాయ‌నీ భావించారు. కానీ ఆయ‌న స‌మ‌స్య‌లేవీ ప‌రిష్కారం కాలేద‌ని నిరాహార దీక్ష‌కు పూనుకుంటే.., ఆ విష‌యాన్ని జైలు అధికారులు, పోలీసులు ప్ర‌య‌త్న పూర్వ‌కంగా తొక్కిపెట్టారు. బ‌య‌టి ప్ర‌పంచానికీ, ఆయ‌న కుటుంభ స‌భ్యుల‌కు తెలియ‌కుండా చేశారు. సాయిబాబా నిర‌హార దీక్ష చేస్తున్న‌దీ, లేనిదీ ఎవ‌రికీ తెలియ‌కుండా చేయ‌ట‌మే ల‌క్ష్యంగా జైలు అధికారులు, ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింది.

నెల వారీ ఫోన్ కాల్ అవ‌కాశంలో భాగంగా నిన్న సాయిబాబా కుటుంభ స‌భ్యుల‌తో మాట్లాడిన‌ప్పుడు కానీ ఆయ‌న 10 రోజులు నిరాహార‌దీక్ష‌కు పూనుకున్న విష‌యం తెలియ‌లేదు. ప్ర‌స్తుతం తాను గ్లూకోజ్ బాటిళ్ల‌పై ఆధార‌ప‌డి ఉన్నాన‌ని తెలిపారు. దీక్ష సంద‌ర్భంగా తాను పెట్టిన డిమాండ్లు, అధికారులు ఒప్పుకున్న డిమాండ్ల వివ‌రాల‌ను తెలియ‌జేశారు. అవి..

--గ‌త ఏడాది కాలంగా త‌న ఆరోగ్య స‌మ‌స్య‌పై ఉన్న వైద్య ప‌రీక్ష‌ల రికార్డుల‌న్నీ అందించాల‌ని, వాటి ఆధారంగా తాను న్యాయ‌పోరాటం చేస్తాన‌ని తెలిపాడు.ఇప్ప‌టి దాకా ఆ మెడిక‌ల్ రికార్డుల‌న్నీ అందివ్వ‌లేదు.కొన్ని మెడిక‌ల్ రిపోర్టులు మాత్రం అంద‌జేశారు.

--సాయిబాబాకు ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా క్ర‌మం త‌ప్ప‌కుండా ఫిజియో థెర‌పీ అవ‌స‌ర‌మ‌ని నాగ‌పూర్‌లోని ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీ హాస్పిట‌ల్ గ‌తంలోనే తెలిపింది. అలాగే ఆయ‌న‌కు కోల్డ్ ప్యాక్‌ల‌తో పాటు, రెండు దిండ్ల‌ను కూడా స‌మ‌కూర్చాల‌ని చెప్పింది. అవేవీ సాయిబాబాకు జైలు స‌మ‌కూర్చ‌లేదు. ఇప్పుడు జైలు అధికారులు ఫిజియో థెర‌పీ, ఆక్యుపేష‌న‌ల్ థెర‌పీ అందిస్తామ‌ని అంటున్నారు.

--గ‌తంలో సాయిబాబాకు త‌న కుటుంభ స‌భ్యుల‌నుంచి అందే తెలుగులో రాసిన ఉత్త‌రాల‌ను అందించే వారు కాదు. అలాగే ప‌స్త‌కాల‌ను అందించ‌టంలో విప‌రీత జాప్యం చేసేవారు. ఎక్కువ సంద‌ర్భాల్లో అందకుండా చేశారు. కానీ ఇప్పుడు పుస్త‌కాల‌ను, కుటుంభ స‌భ్యులు రాసే ఉత్త‌రాల‌ను అందిస్తామని, చ‌దువు కోవ‌టానికి ఇంగ్లీష్ ప‌త్రిక‌ల‌ను ఇస్తామ‌ని ఒప్పుకున్నారు.

-- జైలు లోని అండాసెల్‌లో ఎల్ల‌ప్పుడూ నిర్బంధించ‌టం కాకుండా.. గాలి, వెలుతురు అందే విధంగా ఉద‌యం సాయంత్రం వేళ‌ల్లో అండా సెల్ బ‌య‌ట‌కు పంపిస్తామ‌ని ఒప్పుకున్నారు.

అయితే సాయిబాబా పెట్టిన కొన్ని డిమాండ్ల‌ను జైలు అధికారులు నిరాకరించారు. వాటి వివరాలు...

1) సాయిబాబా వివిధ సందర్భాల్లో జైలు అధికారుల‌కు రాసిన ఫిర్యాదు పిటిష‌న్ల న‌క‌లు కాపీల‌ను ఇవ్వ‌టానికి జైలు అధికారులు అంగీక‌రించ‌లేదు.

2) తన‌ను నాగ‌పూర్ జైలు నుంచి హైద‌రాబాద్ జైలుకు త‌ర‌లించాల‌న్న సాయిబాబా డిమాండ్‌ను,ఒక‌ జైలునుంచి మ‌రొక జైలుకు మార్చ‌టం అనేది త‌మ ప‌రిధిలోని విష‌యం కాద‌ని జైలు అధికారులు తిర‌స్క‌రించారు.

రాజ్యంగ బ‌ద్ధంగా జైలు నిర్బంధితుల‌కు ద‌క్కాల్సిన అన్ని ర‌కాల హ‌క్కుల‌ను అమ‌లు చేయాలి. సాయిబాబా ఆరోగ్య ప‌రిస్థితులు, అత‌ని యోగ‌క్షేమాల స‌మాచారాన్ని కుటుంబ‌ స‌భ్యుల‌కు తెలుపాల్సిన బాధ్య‌త జైలు అధికారుల‌దే. సాయిబాబాకు అవ‌స‌ర‌మైన అన్నిర‌కాల వైద్య స‌దుపాయాల‌ను క‌ల్పించాలి.సాయిబాబా సంక్లిష్ట అనారోగ్య ప‌రిస్థితుల దృష్ట్యా అత‌నికి అత్య‌వ‌స‌ర ఫోన్ కాల్ సౌక‌ర్యం క‌ల్పించాలి. కుటుంభ స‌భ్యులు చేసే ఫోన్‌ల‌ను ఆయ‌న‌కు అందేట్లు చూడాలి. ఇలాంటి రాజ్యంగ బ‌ద్ధ‌మైన ఖైదీల హ‌క్కుల‌ను జైలు అధికారుల‌, మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం వెంట‌నే అమ‌లు చేయాల‌ని ప్రొఫెస‌ర్ జీఎన్ సాయిబాబా సంర‌క్ష‌ణ‌, విడుద‌ల క‌మిటీ చైర్మ‌న్ ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్, తెలంగాణ రాష్ట్ర క‌న్వీన‌ర్ కె. ర‌విచంద్ర డిమాండ్ చేశారు. ‌

Keywords : dr.sababa, nagpur jail, hunger strike, maoists,
(2024-04-13 11:52:44)



No. of visitors : 1624

Suggested Posts


సాయిబాబాను చంపేస్తారేమో !

సాయిబాబాని మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో నాగ్‌పూర్‌ సెంట్రల్‌ జైల్లో కలిసాను. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్టు కనిపించింది. ఆయన ప్రాణానికే ప్రమాదం ఉందనిపించింది. జైలు అధికారులు ఎటువంటి...

A Complaint lodged to NHRC for deteriorating health of Dr. G.N. Saibaba by Defend in India

Most humbly this is to bring to your notice that I came to know from the wife of Professor Saibaba that on 22nd February 2017, Prof. G. N. Saibaba was admitted in ICU of a hospital for a mild chest pain and breathlessness and a severe pain in abdomen....

Prof. G N Saibabaʹs emotional letter from jail to his wife

Now you are the lone fighter fighting for my freedom. Donʹt get disheartened in these dark days we should not lose our hopes and dreams for the darkness canʹt permanently overshadow the light. These are not empty words.....

iʹm not sure that I would survive in this Solitary cell during this gruelling summer:prof. Saibaba

Now it is 47.5 degrees C. On 25th May at around 11.15 am I suffered severe chest pain, syncope attack and high-level dehydration together all at the same time. I was sitting at my table and had just started eating. I hardly took two spoonfuls of rice into my mouth.

ʹరాముడికి వ‌ర్తించే న్యాయం ప్ర‌జ‌ల‌కు వ‌ర్తించ‌దాʹ

"సాయిబాబ‌ను క‌లిసేందుకు ఈనెల 13న నాగ్‌పూర్ సెంట్ర‌ల్ జైలుకు వెళ్లాను. జాలీ ములాఖ‌త్‌. కేవ‌లం 15 నిమిషాలు మాత్ర‌మే మాట్లాడే అవ‌కాశం ల‌భించింది. రెండు వైపులా మ‌స‌క‌బారిన అద్దాలు. వాటి గుండా చూస్తే అవ‌త‌లి వైపు మ‌నుషులు అంతంత మాత్రంగానే క‌నిపిస్తారు. మాట్లాడేది స‌రిగ్గా వినిపించ‌దు కూడా. సాయిబాబ చాలా బ‌ల‌హీనంగా ఉన్నారు....

Saibabaʹs health worsening - Delegation seeks NHRC intervention

A delegation headed by Delhi University professor G N Saibabaʹs wife, Vasantha Kumari, on Thursday sought the intervention of the National Human Rights Commission to ensure proper medical care for the jailed academic. The condition of Saibaba...

RELEASE G.N. SAIBABA IMMEDIATELY - TVV

When judiciary itself starts bypassing its role, then it points towards a dying democracy. It is ironic that even while holding these six people are so dangerous that they should be incarcerated for major part of their lives, the judgment fails to point out...

Freedom and Justice for GN Saibaba!

The Popular Resistance – Left Anti-imperialist Cooperation condemns this decision of the Indian court. We send our unequivocal support to GN Saibaba, his comrades and the movement of support that grows in India....

ఈ నెల 21 నుండి జైల్లో ప్రొఫెసర్ సాయిబాబా ఆమరణ నిరాహార దీక్ష‌

నాగ్ పూర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ప్రొఫెసర్ సాయిబాబా ఈ నెల (అక్టోబర్) 21 వ తేదీ నుండి ఆమరణ నిరాహార ధీక్ష చేపట్టాలని నిర్ణయించారు. 90 శాతం అంగవైకల్యంతో సహా అనేక రకాల అనారోగ్యాలతో సతమతమవుతున్న సాయిబాబాకు సరైన వైద్యం అందించడం లేదు

ఈ ఎండాకాలం...ఈ అండాసెల్ లో...బతకగలుగుతాననే నమ్మకం లేదు...ప్రొ.సాయిబాబా

47.5 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతల నడుమ అండా సెల్ లో ఉండలేకపోతున్నాను. గతనెల 25 వ తేదీన ఉదయం సుమారు 11.15 గంటల ప్రాంతంలో ఛాతీలో తీవ్రమైన నొప్పితో పాటు డీహైడ్రేషన్ ఒకేసారి చుట్టుముట్టాయి. ఆ సమయంలో నేను నా టేబుల్ దగ్గర కూర్చొని రెండు చెంచాల అన్నం నోట్లో పెట్టుకున్నానో

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పది