మృత్యు శయ్యపై ఉన్న వరవర రావుకు వైద్యం అందించండి- ముంబాయి హైకోర్టు
వరవరరావు మృత్యుముఖంలో చావుబతుకుల్లో మంచంపై పడిఉన్నాడు. అతనికి తగు చికిత్స అత్యవసరం. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వైద్యం అందించటానికి నిరాకరిస్తే.. అతను తలోజా జైలులో సజీవంగా ఉన్నాడని మేం భావించ వచ్చా? అని బొంబే హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది.
గత రెండేండ్లుగా భీమాకోరేగాం కేసులో ముంబాయి తలోజా జైలులో నిర్బంధంలో ఉన్న వరవర రావు ఆరోగ్య పరిస్థితి అత్యంత క్లిష్టంగా ఉన్నదని, అతనికి వెంటనే ఉన్నత ప్రమాణాలు, వైద్యసదుపాయాలున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యవసర వైద్య చికిత్స అందించాల్సిన అవసరమున్నదని సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకున్నది. వరవర రావును వెంటనే నానావతి హాస్పిటల్కు తరలించి నిపుణుల పర్యవేక్షణలో వైద్య పరీక్షలు, చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 15 రోజులు దవాఖానలోనే ఉంచి వైద్యం అందించాలనికూడా తెలిపింది. వైద్య చికిత్స అందించిన తర్వాత కూడా వీవీ ని కోర్టు అనుమతితోనే తిరిగి జైలుకు తరలించాలని సూచించింది. నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులను కూడా హాస్పిటల్లో వీవీని కలిసేందుకు అనుమతించాలని ప్రభుత్వానికి సూచించింది.
ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ దీపక్ థాకరే మాట్లాడుతూ.. వరవర రావును నానావతి హాస్పిటల్కు తరలించటానికి ప్రభుత్వానికి అభ్యంతరం లేదని తెలుపటంతో వీవీ కి వైద్య చికిత్స అందటానికి ఉన్న అవాంతరాలన్ని తొలగిపోయినట్లు అయ్యింది.
వీవీ ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో ఇందిరా జైసింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. వీవీ గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. మానసిక, నరాలకు సంబంధించిన సమస్యలతో సతమతమవుతున్నారు. మూత్రనాళ ఇన్ఫెక్షన్తో మల, మూత్ర విసర్జనలో నియంత్రణ కోల్పోయారు. డైపర్లు, మూత్రవిసర్జనకోసం క్యాథటర్ అమర్చారు. వైద్య నిబంధనల ప్రకారం కనీసం వారం రోజులకు ఒక సారి క్యాథటర్ మార్చాలి. కానీ వీవీకి అమర్చిన క్యాథటర్ను గత మూడు నెలలుగా మార్చలేదు. ఆహారం తీసుకోవటంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో వీవీకి తగు రీతిలో వైద్య సహాయం అందజేయటం అత్యవసరమని ఆమె కోర్టుకు విన్నవించారు.
అలాగే వీవీకి తీవ్ర ప్రమాదకరమైన myocardial infarction అనే హృదయసంబంధమైన సమస్య ఉన్నది. గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నరాల్లో అడ్డుపడ్డ కొవ్వు పదార్థం కారణంగా గుండె కండరాలు చనిపోయిన స్థితి ఏర్పడింది. ఈ సమస్య కారణంగా ఎప్పుడైనా వీవీకి హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదమున్నది. ఇప్పటికే కరోనా వైరస్ సోకడంతో శరీరంలోని అన్ని అవయవాలు కొవిడ్-19 వైరస్తో దెబ్బతినే ప్రమాదమున్నది.
ఇలాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో వ్యక్తి జైలులోని చనిపోయే పరిస్థితి ఎదురైతే అది కస్టోడియల్ డెత్ అవుతుందని, దీనికి బాధ్యులు ఎవరని ఇందిరా జైసింగ్ ప్రశ్నించారు.
అయితే ముంబై పోలీసులు, ఎన్ఐఏ అధికారులు మాత్రం వరవర రావుకు అవసరమైన వైద్యం ముంబాయిలోని ప్రభుత్వ జేజే హాస్పిటల్లోనే వైద్యం అందిస్తామని చెప్పుకొచ్చారు. తలోజా జైలులోని హాస్పిటల్లోనే తగు వైద్య చికిత్సలు అందిస్తున్నామని, నానావతి హాస్పిటల్కు తరలించాల్సిన అవసరం లేదని వాదించారు. ప్రతిగా.. పదిహేను నిమిషాల వీడియో కాల్ తో వైద్యపరిశీలన ఎలా సాధ్యమని వీవీ తరపు న్యాయవాది జైసింగ్ నిలదీశారు.
వీవీ తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలూ, ప్రభుత్వ ప్రతివాదనలు విన్న తర్వాత.. ముంబాయి హైకోర్టు డివిజన్ బెంచి విస్పష్ట తీర్పును ప్రకటించింది. వీవీ ఆరోగ్య పరిస్థితిపై బొంబాయి హైకోర్టులో న్యాయమూర్తులు ఎస్ఎస్ శిండే, మాధవ్ జమ్దార్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెబుతూ.. అంతిమంగా ఆ మనిషి మృత్యుముఖంలో చావుబతుకుల్లో మంచంపై పడిఉన్నాడు. అతనికి తగు చికిత్స అత్యవసరం. ఆ పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం వైద్యం అందించటానికి నిరాకరిస్తే.. అతను తలోజా జైలులో ఉన్నాడని మేం భావించ వచ్చా? అని నిలదీశారు.
ప్రస్తుతం హైకోర్టు బెంచి ముందు రెండు పిటిషన్లు ఉన్నాయి. వీవీకి సరియైన, అవసరమైన వైద్య చికిత్సలు అందించాలన్నది ఒకటైతే.., రెండోది- వీవీ సహచరి హేమలత గారు అనారోగ్య కారణాల రీత్యా సరియైన వైద్యం పొందేందుకు వీలుగా మద్యంతర బెయిల్ మంజూరు చేస్తూ, వైద్యం పొందే హక్కును, జీవించే హక్కును కాపాడాలన్నది. అయితే బెయిల్కు సంబంధించి తర్వాత విచారిస్తామని కోర్టు తెలిపింది.
Keywords : bhima koregaou, BK16, Varavara Rao, bombay high court, health, nanavathi hospital
(2023-09-26 04:29:44)
No. of visitors : 950
Suggested Posts
| bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ
భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని |
| భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది. |
| రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన
కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది. |
| UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన |
| స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలుభీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది. |
| Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన
భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది. |
| భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?
భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు. |
| హనీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు
భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది. |
| Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర బీమా కోరేగాం ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయి జైలు నిర్భంధంలో ఉన్న హక్కుల సంఘాల నేతలు, మేధావులు మరో ప్రమాదకరమైన సవాలును ఎదుర్కోబోతున్నారు. వారిని తలోజా జైలునుంచి మహారాష్ట్రలోని వివిధ జైళ్లకు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. |
| కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా
ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది. |
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
| మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ |
| యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు |
| నేటి నుంచి అమర వీరుల సంస్మరణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
|
| త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల |
| భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
more..