పారాదీప్-హైదరాబాద్ ఐఓసిఎల్ పైప్‌లైన్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆదివాసుల ఆందోళనలు

పారాదీప్-హైదరాబాద్


స్థానిక ఆదివాసీ ప్రజల నిరసనల మధ్య, ఆసియా లోనే పొడవైన పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయడానికి ఒదిశా ప్రభుత్వం అనుమతినిచ్చింది. పారాదీప్-హైదరాబాద్ పైప్‌లైన్ (పిహెచ్‌పిఎల్) కు 2018 డిసెంబర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పునాది వేసినప్పటికీ, వ్యతిరేక నిరసనలు ఆగిపోలేదు.

సుమారు 3,0000 కోట్ల రూపాయల విలువైన 1200 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ఒడిశాలోని పారాదీప్ నుండి హైదరాబాద్ వరకు విస్తరించనుంది. ఇది ఒడిశాలో 330 కిలోమీటర్లు, ఆంధ్రప్రదేశ్‌లో 723 కిలోమీటర్లు, తెలంగాణలో 160 కిలోమీటర్లు ఉంటుంది. సంవత్సరానికి 4.5 మిలియన్ మెట్రిక్ టన్నుల (MMTPA) పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాల రవాణా కోసం దీనిని నిర్మిస్తున్నారు.

ఒడిశాలోని గిరిజన జనాభా గత రెండేళ్లుగా పైప్‌లైన్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. పైప్ లైన్ వేస్తే కనక రాష్ట్రంలోని అనేక వందల గ్రామాలను ప్రభావితం చేస్తుంది, వ్యవసాయ భూములను నాశనం చేస్తుంది. పర్యావరణ సమతౌల్యాన్ని , జీవనోపాధిని కోల్పోతారు.

పోస్కో స్టీల్ ప్లాంట్ కారణంగా పెద్ద ఎత్తున జరిగే అన్యాయం గురించి యిక చెప్పనక్కరలేదు. ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా చేసిన ప్రతిఘటన కారణంగా స్థానిక జనాభా అణిచివేతకు గురైంది.

ఇప్పుడు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పచ్చిక బయళ్లను స్వాధీనం చేసుకుంటుందేమోనని వారు భయపడుతున్నారు, ఆందోళన చెందుతున్నారు. ʹమేము మా భూమిని రక్షించుకుంటామని ప్రతిజ్ఞ చేశాము, దానిని పోగొట్టుకుంటే మాకు ఏమీ మిగలదు. రాష్ట్రం మమ్మల్ని తప్పుదోవ పట్టించింది, ఇన్నాళ్ళు మాకు అబద్దం చెప్పింది. ఎటువంటి సమ్మతి తీసుకోలేదు, ఇప్పుడు మా భూమి మరియు మా ఇళ్ళు పెద్ద మొత్తంలో విధ్వంసం అంచున ఉన్నాయి. ʹ అని జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని ధింకియా గ్రామానికి చెందిన దేబేంద్ర స్వైన్ అన్నారు.

నవంబర్ ప్రారంభంలో 600 పైగా కుటుంబాలకు చెందిన గ్రామస్తులు, అధిక సంఖ్యలో మహిళలు పైప్‌లైన్‌కు వ్యతిరేకంగా వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలలో పాల్గొన్నారు. జిల్లా యంత్రాంగానికి గతంలో చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో ఆందోళనను తిరిగి మొదలుపెట్టామని గ్రామస్తులు అంటున్నారు.

ఒడిశాకు చెందిన కార్యకర్త ప్రశాంత్ పరిక్రే ఇలా అన్నారు: ʹమేము రెండు సంవత్సరాలుగా పైప్‌లైన్‌ వేయడాన్ని నిరంతరం నిరసిస్తూ, ప్రతిఘటించాము. గ్రామ పరిపాలన సమావేశాలు నిర్వహిస్తోంది, చట్టవిరుద్ధంగా నిర్మాణ పనులు యిప్పటికే ప్రారంభమైపోయాయి కాబట్టి బహిరంగ విచారణ చేస్తామని మాకు చేసిన వాగ్దానం నెరవేరుస్తుందని మేము అనుకోవడం లేదు. ప్రాజెక్ట్ ఆగిపోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము.ʹ

గ్యాస్ లీక్ అయితే కనక విశాలమైన భూములను నాశనం చేస్తుంది కాబట్టి పైప్లైన్ నిర్మాణం భారీ పర్యావరణ విపత్తును కలిగిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.

ఈ ప్రాంతంలోని ఆదివాసీలు ప్రధానంగా వ్యవసాయం, అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నారు.

పైప్లైన్ ఒడిశా - రాజ్ నగర్ వైల్డ్ లైఫ్, కటక్, పూరి డివిజన్లు, బెర్హాంపూర్ డివిజన్లలోని కీలకమైన అటవీ విభాగాల గుండా వెళుతుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) తన 1200 కిలోమీటర్ల పొడవైన పరదీప్-హైదరాబాద్ పైప్‌లైన్ ప్రాజెక్టు పనులను ప్రారంభించడంతో ఒడిశాలోని ధింకియా ప్రజలు అభివృద్ధి ముసుగులో జరుగుతున్న భూ కబ్జాకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.

పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం భూసేకరణ విషయానికి వస్తే బిజు జనతాదళ్ (బిజెడి) ప్రభుత్వం చేసిన అధికార దుర్వినియోగం సుస్పష్టంగా ఉంది, ఒడిశా అంతటా అనేక ప్రదేశాలలో బిజెడి ప్రభుత్వం తుపాకిని ఎక్కుపెట్టి ధింకియాలోని భూమిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. జగత్సింగ్‌పూర్ జిల్లా రెండు దశాబ్దాలకు పైగా తీవ్రమైన అణచివేతకు గురైంది.

2005 నుండి దక్షిణ కొరియా ఉక్కు సంస్థ పోస్కోకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు నవీన్ పట్నాయక్‌ దారుణ అణచివేతను అమలుచేశాడు. ధింకియాను ముట్టడించ డానికి పోలీసు ప్లాటూన్‌లను పంపాడు. మహిళలు, పిల్లలు, వృద్ధులు చేసిన శాంతియుత నిరసనలపై హింసాత్మక దాడులను ప్రారంభించాడు.
ధింకియా, పటానా, గోవింద్పూర్ తదితర గ్రామాల ప్రజలను నిర్వాసితులను చేసి, వందల ఎకరాల వ్యవసాయ భూములను తుడిచిపెట్టి, వేలాది ఎకరాల తీరప్రాంత అడవులను కొల్లగొట్టి, ఓడరేవు నిర్మాణం కోసం నదీముఖాన్ని తవ్వేసే పోస్కో ప్రాజెక్ట్ నిర్మాణానికి వ్యతిరేకిస్తూ ధింకియా చరిదేశ్ ప్రజలు లాఠీలు, బుల్లెట్లు, బాంబులను ఎదుర్కున్నారు. అసంఖ్యాక తప్పుడు కేసులను ఎదుర్కొన్నారు. అయినా దృఢంగా నిలబడ్డారు..

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసిఎల్) ఇప్పటికే పెట్రోలియం రిఫైనరీని నిర్మించడానికి పంచాయతీ యాజమాన్యంలోని వ్యవసాయ భూములలో ఎక్కువ భాగాన్ని లాక్కోవడంతో ధింకియా ప్రజలకు అభివృద్ధి ముసుగులో భూమిని లాక్కోవడం కొత్త కాదు. ఎప్పటిలాగే నిర్వాసితులకు శాశ్వత ఉపాధి, లాభదాయకమైన జీవితం కల్పిస్తామనే అబద్ధపు వాగ్దానాలు మాత్రమే మిగిలాయి.
భూమిని కోల్పోయిన వారు ధింకియా తమలపాకు తోటల్లో వ్యవసాయ కార్మికులుగా మారారు. ప్రతి కొన్ని కిలోమీటర్లకు ఇదే కథ పునరావృతమవుతుంది, ఒడిశాలో ఒకప్పుడు అత్యంత సారవంతమైన భూములలో ఒకటిగా వుండిన పారాదీప్ నౌకాశ్రయానికి దగ్గరగా వున్న ఈ ప్రాంతంలో అనేక ఉక్కు, ఎరువుల పరిశ్రమలు పుట్టుకొచ్చాయి. ఐఓసిఎల్ రిఫైనరీ, దాని పెట్రో-కెమికల్ ప్రాజెక్ట్ ఈ ప్రాంతంలోని అతిపెద్ద పరిశ్రమలలో ఒకటి. ఈ ప్రాంతంలోని ప్రతి ప్రాజెక్టులో రాజ్య అణచివేత, అన్యాయం, కష్టాల గురించి చెప్పలేని, అంతం లేని కథ ఉంది.

పారాదీప్-హైదరాబాద్ 4.5 ఎంఎమ్‌టిపిఎ పెట్రోల్, డీజిల్, విమాన ఇంధనాన్ని రవాణా చేయడానికి ఐఓసిఎల్ తన రూ. 3800 కోట్ల ప్రాజెక్టు, 1200 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ నిర్మాణాన్ని ప్రారంభించింది. సుమారు 330 కిలోమీటర్ల పైప్‌లైన్ ఒడిశాలో, ఆంధ్రప్రదేశ్‌లో 723 కిలోమీటర్లు, తెలంగాణలో 160 కిలోమీటర్లు ఉంటుంది. పైప్‌లైన్ ఒడిశాలోని, రాజ్‌నగర్, కటక్, పూరి, భువనేశ్వర్, ఖుర్దా, నాయగర్, ఘుమ్‌సూర్, బెర్హంపూర్ అటవీ విభాగాల గుండా వెళుతుంది.

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బృందం ధింకియా పంచాయతీకి చెందిన 11 ఎకరాల మేత భూమిని తవ్వడంతో పైప్‌లైన్ ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ భూమి వందల సంవత్సరాలుగా పశువుల మేత కోసం సంరక్షించబడుతోంది, ప్రతిరోజూ వేలాది పంచాయతీ పశువులు మైదానంలో గడ్డి మేస్తాయి. పంచాయతీ అనుమతి లేకుండానే నిర్మాణ పనులు హడావిడిగా ప్రారంభమయ్యాయి. ఇది మేత భూమిని ప్రతికూలంగా ప్రభావితం చేసింది, ప్రతిరోజూ అక్కడ గడ్డి మేసే పశువులను తీవ్ర ప్రమాదాలకు గురిచేస్తుంది.

ధింకియా ప్రజలు 2020అక్టోబర్ 1, న, జిల్లా కలెక్టర్‌కు రాసిన లేఖలో, 1940/1980, 1931/2977, 1938/2982, 1976, 1977 నంబర్ల ఫ్లాట్లలో పైప్‌లైన్ నిర్మాణ పనులు జరుగుతున్నాయనే విషయాన్ని ఎత్తిచూపారు. 1932, 1933, 1934 నంబర్ల ఫ్లాట్లు, ఇతర సమీప ప్లాట్లు కొన్నింటిని పశువుల మేత కోసం ధింకియా ప్రజలు కేటాయించారు. వాటిలో చేపట్టిన అనధికార నిర్మాణాన్ని ప్రశ్నించిన ప్రజలకు ఇండియన్ ఆయిల్ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం యిచ్చిన అనుమతికి రుజువుగా రెండు లేఖలను చూపించారు.

జగత్సింగ్‌పూర్ Dy కలెక్టర్ కి సంబోధిస్తూ 18.3.2018 తేదీన రాసిన నాటి మొదటి లేఖపై, ఎర్సామా తహశీల్దార్ సంతకం చేశారు, ఇది కలెక్టరేట్ నుండి ఇంతకు ముందు వచ్చిన లేఖకు సమాధానం. ఆ ప్రాజెక్ట్ కోసం ఐఓసిఎల్‌కు తహశీల్దార్ సమర్పించిన ʹరైట్ ఆఫ్ వే మంజూరు కోసం నిర్దేశించిన ఫార్మాట్ʹ తప్ప అందులో ఇంకేమీ లేదు. ఐఓసిఎల్ రూ. 2, 41, 513 / - లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి అని వుంది.. ఐఓసిఎల్‌కు ʹరైట్ ఆఫ్ వేʹ (మార్గంపై హక్కును) మంజూరు చేయాలని కలెక్టర్ సిఫారసు చేస్తు ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీకి రాసినది 21.6.18 నాటి రెండవ లేఖ.

1 అక్టోబర్ 2020 న, ఐ.ఓ.సి.ఎల్ చట్టవిరుద్ధమైన, బలవంతపు నిర్మాణ పనులను నిర్వహిస్తున్న విషయాన్ని ఎత్తిచూపి, ఐ.ఓ.సి.ఎల్ ʹరైట్ ఆఫ్ వేʹ గా ఇస్తున్న లేఖల గురించి, వాస్తవాన్ని ప్రస్తావించలేదని ధింకియా ప్రజలు జగత్సింగ్పూర్ కలెక్టర్కు లేఖ రాశారు.

"ధింకియా గ్రామ పంచాయతీ ప్రజలమైన మేము గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వం, పోస్కో, ఇండియన్ ఆయిల్ మరియు ఇతర సంస్థలు నుండి మా హక్కులను డిమాండ్ చేసినందుకు విపరీతమైన అణచివేతను ఎదుర్కొంటున్నాము. అన్ని సదుపాయాలను కోల్పోయాము, ఏదో ఒక విధంగా బతకటానికి ప్రయత్నిస్తున్నాము. ఎలాంటి నిబంధనలను పాటించకుండా, ధింకియా ప్రజల అనుమతి తీసుకోకుండా గ్రామ పంచాయతీ పచ్చిక బయలు పైన ఇండియన్ ఆయిల్ పైప్ లైన్ నిర్మించడానికి ప్రయత్నిస్తోంది. ఇది ఖండించదగిన, అప్రజాస్వామికమైన చర్య. నిర్మాణాన్ని ఆపడానికి మాత్రమే కాకుండా, పంచాయతీ భూమిని మళ్లించడాన్ని నిషేధించాలని ప్రభుత్వం ఒక తీర్మానాన్ని ఆమోదించాలని లేఖలో ధింకియా ప్రజలు డిమాండ్ చేశారు. జిల్లా పరిపాలన, ఇండియన్ ఆయిల్ మా డిమాండ్లను నెరవేర్చాలి, లేకపోతే ధింకియా ప్రజలు ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతాము. మా అనుమతి లేకుండా మా పంచాయతీ భూమిమీద పైప్‌లైన్లు నిర్మించే చర్యను ఒక తీవ్రమైన నేరంగా మేము పరిగణిస్తున్నాము . ఈ విషయంపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము.ʹ

నిర్మాణ సామగ్రిని తొలగించి, పచ్చిక బయలును పునరుద్ధరించడంలో ప్రభుత్వం ఏ చర్యలూ చేపట్టక పోవడంతో నవంబర్ 9 న ప్రజలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

17 నవంబర్ న ప్రజలు ఈ క్రింది డిమాండ్లతో కలెక్టర్‌కు మరో లేఖ రాశారు -

1. మా పశువులను మేపే స్థలంలో మా అనుమతి లేకుండా మా పంచాయతీ భూమిపై పైప్‌లైన్లు నిర్మించే చర్యను ఘోరమైన నేరంగా పరిగణించాము. ఈ విషయంపై విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. పచ్చిక బయలును దాని అసలు స్థితికి తీసుకురావాలి.

2. ఇరవై సంవత్సరాల క్రితం తన రిఫైనరీ కోసం ఇండియన్ ఆయిల్ మా వ్యవసాయ భూములను లాక్కొని, మాకు ఉపాధి కల్పిస్తామని తప్పుడు వాగ్దానాలు చేసింది. మాకు ఇంతవరకు రిఫైనరీలో ఎలాంటి ఉపాధి కల్పించలేదు. మా వ్యవసాయ భూములను కోల్పోడంతో మేము చాలా కష్టంగా జీవితాన్ని గడుపుతున్నాం. అంతేకాకుండా బయటివారికి ఉద్యోగాలు ఇస్తున్నారు కాని మన పంచాయతీకి చెందినవారికి కాదు. ఇండియన్ ఆయిల్ తన వాగ్దానాన్ని నెరవేర్చాలి అని డిమాండ్ ఛేస్తున్నాం.

3. ఇండియన్ ఆయిల్ ధింకియా పంచాయతీని ʹదత్తత తీసుకుంటాననిʹ ప్రకటించింది, కాని ఇప్పటి వరకు ఇండియన్ ఆయిల్ ప్రారంభించిన ఒక్క అభివృద్ధి కార్యకలాపాన్ని మేం చూడలేదు. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, జీవనోపాధి, రవాణా మొదలైన వాటి అభివృద్ధిలో కంపెనీ ఎలాంటి సహకారం అందించలేదు. మేము ఇండియన్ ఆయిల్ నుండి ఈ క్రింది సౌకర్యాల ఏర్పాటును కోరుతున్నాము - (i) గ్రామంలో తాగునీటి సౌకర్యాలు (ii) గ్రామ రహదారుల నిర్మాణం, నిర్వహణ ( iii) గ్రామ రహదారుల్లో విద్యుద్దీపాలు (iv) ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మరమ్మత్తు, నిర్వహణ, వైద్యుల, సహాయక సిబ్బంది నియామకం.

4. వందలాది సంవత్సరాలుగా అటవీప్రాంతాన్ని రక్షిస్తున్నాం, అక్కడే జీవిస్తునాం. తమలపాకు-ద్రాక్షతోటలతో పాటు, జీడిపప్పు, కొబ్బరి, మామిడి, పనస, వక్క, పైనాపిల్ మొదలైన వాటిని పెంచుకుంటాము. ఈ అటవీప్రాంతంలో మా పశువులను, కోళ్ళను పెంచుతాం. ఈ అటవీ భూమిని మరెవరికీ అప్పగించకూడదు. ఈ భూమి యాజమాన్యాన్ని భూమిలేని గ్రామస్తులకు ఇవ్వాలి.

5. పోస్కో ప్రాజెక్టు కోసం భూసేకరణను ఆపడానికి జరిగిన ప్రజాస్వామిక ఉద్యమంలో అనేకమంది గ్రామస్తులపైన ఎన్నో తప్పుడు అభియోగాలతో కేసులు పెట్టారు. ఈ కేసులను మమ్మల్ని ఇబ్బందిపెట్టడానికి ఉపయోగిస్తారనే భయంతో, అభద్రతతో జీవిస్తున్నాం. ఈ కేసులన్నింటినీ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.

6. భారతీయ చమురు శుద్ధి కర్మాగారం దగ్గరగా వుండడం వల్ల ఉత్పన్నమయ్యే అనేక సమస్యలను పరిష్కరించడానికి జిల్లా యంత్రాంగం, ఇండియన్ ఆయిల్ అధికారులు, పంచాయతీ ప్రజలతో సంప్రదించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ఈ ప్రాజెక్టే కాకుండా, ఆయిల్ & నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ అస్సాంలోని నుమాలిగర్ నుండి ఒడిశాలోని పరదీప్ వరకు మరో 1400 కిలోమీటర్ల పొడవైన పైప్‌లైన్ ప్రాజెక్టును ప్రారంభించబోతోంది. ఈ రెండు ప్రాజెక్టులు అడవులు, వ్యవసాయ భూములు, పచ్చిక బయళ్ళు, నీటివనరులు మొదలైనవాటిని కలుపుకొని రాష్ట్రాలలో విశాల భూప్రాంతానికి తీవ్ర ముప్పు కలిగిస్తాయి. పరదీప్ ఇప్పటికే దేశంలోని అత్యంత కలుషితమైన ప్రదేశాలలో ఒకటి, అలాంటి పారిశ్రామికీకరణను కొనసాగించే సామర్థ్యం లేదు. ఈ ప్రాజెక్ట్ ఆదివాసీ, దళిత వర్గాలకు తీవ్ర నష్టాలను కలిగిస్తుంది.

IOCL పరదీప్-హైదరాబాద్ పైప్‌లైన్ ప్రాజెక్ట్ పర్యావరణాన్ని, వ్యవసాయానికి, మానవ జీవితానికి పెద్ద ముప్పుగా ఉంది. స్వల్పంగా లీక్ లేదా ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా ఘోరమైన, అనియంత్రిత ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. 2014 లో ఆంధ్రప్రదేశ్‌లో GAIL పైప్‌లైన్ లో జరిగిన పేలుడులో 22 మంది మరణించారు, 37 మంది గాయపడ్డారు. ప్రతి సంవత్సరం ఐఓసిఎల్, ఒఎన్‌జిసి, గెయిల్ మొదలైనవి నడుపుతున్న పైప్‌లైన్లలో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు, పేలుళ్లు, మంటల రూపంలో జరుగి వృక్షజాలం, జంతుజాలం, నీటి వనరులు, వ్యవసాయ భూములు, మానవ జీవితాలకు విస్తృతమైన నష్టం జరుగుతుంది.

చమురు- గ్యాస్ పైప్‌లైన్‌ల వల్ల విపత్తు సంభవించిన భయంకరమైన చరిత్ర ప్రపంచవ్యాప్తంగా వుంది. అలాంటి విపత్తు సంభవించే భయం కారణంగానే అమెరికాలో కూడా పైప్‌లైన్‌లు ఏర్పాటు చేయడాన్ని స్థానిక ప్రజలు తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు.

పోస్కో ప్రాజెక్ట్ లేదా జెఎస్‌డబ్ల్యు ఉత్కల్ విషయంలో అయినా, యిప్పుడు ఈ పైప్ లైన్ ప్రాజెక్ట్ వ్యతిరేక ఉద్యమంలో అయినా, ధింకియా చరిదేశ్ ప్రజలు జల్, జంగల్, జమీన్ లనును రక్షించడానికి తమ చివరి శ్వాస వరకు దృఢంగా నిలబడతారు అని మళ్లీ మళ్లీ నిరూపించారు.

Keywords : odisha, Indian Oilʹs Paradip-Hyderabad pipeline project: Dhinkia stands up to tyranny once again, IOCL
(2024-03-26 21:04:30)



No. of visitors : 572

Suggested Posts


Successful bandh in Odisha

The bandh was convened to demand the immediate arrest of the accused for gang rape of a minor girl in Kunduli, control of violence against tribal women and a solution to the Mahanadi area. The movement of vehicles was affected in the five districts due to the bandh, according to the reports....

Maoist posters on Russian Revolution in Narayanpatna

Maoist posters resurfaced in Narayanpatna of Koraput district with the rebels appealing people to participate in the week-long centenary celebrations of the Russian Revolution from November 7-13 across the State....

మావోయిస్టుల ఎన్నికల బహిష్కరణ ‍-ఒడిశాలో అనేక చోట్ల ఎన్నికల వాయిదా

మల్కన్ గిరి, కోరాపూట్, గంజా‍ం, గణపతి, కొందమాల్ జిల్లాల్లో వందలాది గ్రామాల్లో పార్టీ ప్రచారం ముమ్మరంగాసాగుతోంది. అనేక గ్రామాల్లో సభలు సమావేశాలు జరుగుతున్నాయి. చిత్రకొండ సమితిలోని 18 పైగా పంచాయితీల్లో, 2 జిల్లా పరిషథ్ జోన్లలో, కటాఫ్ ఏరియాలోని 9 పంచాయితీల్లో ఒక్కరు కూడా నామినేషన్లు వేయకపోవడంతో అధికారులు అక్కడ ఎన్నికలను వాయిదా వేశారు....

Maoist movement puts Odisha cops on toes

THE intelligence inputs on movement of a small group of Maoists in the tri-junction area of Angul, Nayagarh and Cuttack rural district, has put Odisha Police on alert. Cops have started combing operation in Angul district amid reports of Maoist movement at Satkosia-Narasinghpur border.

పోలీసు అరాచకాలను నిరసిస్తూ ఎస్పీ ఆఫీస్ ను ముట్ట‌డించిన ఆదివాసీలు

తమ గ్రామాలపై దాడులు, అరెస్టులు, స్త్రీలపై అత్యాచారాలు తక్షణం ఆపివేయాలని , కూంబింగ్ నిలిపి వేయాలని డిమాండ్ చేస్తూ వేలాదిమంది ఆదివాసులు ఒడీశా రాయగడ ఎస్పీ కార్యాలయాన్ని ముట్టడించారు. అడవిపై ఆధారపడి జీవించే తమపై.....

Maoist posters warn informers in Odishaʹs Kalahandi district

A couple of Maoist posters appealing to the villagers not to become police informers was found at Lakhbahali near Pahadpadar village under Lanjigarh block of Kalahandi district on Thursday. The Maoists have also appealed to the locals to observe ʹSahid Divasʹ on Thursday....

మతం మారాడని ఓ బాలుడిని ముక్కలుగా నరికి చంపిన మతోన్మాదులు

ఓ కుటుంభం మతం మారిందన్న‌ కోపంతో మతోన్మాదులు ఓ 14 ఏళ్ళ బాలుడిని ముక్కలుగా నరికి చంపారు. ఒడిశా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలోని కెండుగుడ అనే గ్రామంలో ఉంగా మద్కామి అతని కుమారుడు సమరూ మద్కామీ మూడు సంవత్సరాల‌ క్రితం క్రైస్తవ మతంలోకి మారారు.

Where is gau rakshaks - Vehicle in Amit Shahʹs convoy hits cow in Odisha

At a time when the incidents of lynchings in the name of ʹgau rakshaʹ are being reported from across the country, a vehicle in BJP president Amit Shahʹs motorcade hit a cow during his Odisha tour on Thursday, leaving the animal wounded and prompting a sarcastic....

పోలీసు స్టేషన్ లో బాలికపై దుర్మార్గం....రోజుల తరబడి గ్యాంగ్ రేప్ చేసిన ఇన్‌స్పెక్టర్, పోలీసులు

ఓడిశా లో ఓ బాలికపై పోలీసు స్టేషన్ లోనే ఇన్‌స్పెక్టర్ తో సహా పలువురు పోలీసులు కొన్ని రోజుల పాటు గ్యాంగ్ రేప్ చేశారు. మార్చ్ 25 న సుందర్ గడ్ జిల్లా బిరమిత్రపూర్ లో జరిగిన ఓ ప్రదర్శనలో పాల్గొనడానికి 13 ఏళ్ళ బాలిక వచ్చింది. అయితే లాక్ డౌన్ కారణంగా ఆ ప్రదర్శన రద్దయ్యింది. ఇంటికి తిరిగి వెళ్ళడానికి బస్సులు కూడా లేవు.

సీనియర్ మావోయిస్టు నాయకుడు దుబాసి శంకర్ @ మహేందర్ అరెస్ట్

సీపీఐ మావోయిస్టు ఆంధ్రా ఒడిశా స్పెషల్ జోన్ కమిటీ మెంబర్ దుబాసీ శంకర్ ఎలియాస్ మహేందర్ అరెస్టయ్యారు. ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లాలోని బాయిపరిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహేందర్ ఒడిశా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అభయ్ తెలిపారు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పారాదీప్-హైదరాబాద్