30 మందిపై అక్రమ కేసులు బనాయించిన జగన్ సర్కార్ -ఇద్దరు మహిళా కార్యకర్తల అరెస్టు
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కార్ ప్రజలపై, ప్రజాసంఘాల కార్యకర్తలపై అక్రమకేసులు బనాయిస్తున్నది, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నది. ఈ నెల 23న విశాఖ ఏజెన్సీలోని ముంచింగిపుట్టు పోలీస్ స్టేషన్లో 24వ తేదీన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో దాదాపు 30 మంది ప్రజాసంఘాల కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు.
ఈ రోజు(27 నవంబర్) ఉదయం 6.30 కి గుంటూరు జిల్లా గణపవరంలో బంధుమిత్రుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అంజమ్మను, 8:45 గంటలకు గుంటూరు జిల్లా, మంగళగిరిలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యురాలు CMS రాజేశ్వరిని అక్రమంగా అరెస్టు చేశారు.
ఇది ప్రజల కోసం ఎవ్వరూ నోరు ఎత్త కుండా చేసే ప్రయత్నమే అని ప్రజాసంఘాలు ఆరోపించాయి. ʹʹఇట్లా ప్రజాసంఘాల నాయకులు, సభ్యులందరి మీద కేసులు పెట్టే పద్ధతి గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఆరంభించింది. తెలంగాణలో కూడా సరిగ్గా ఇలాంటి తప్పుడు అభియోగాలే చేశారు. ఇప్పుడు ఆ పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నడుస్తున్న నిర్బంధంలో భాగమే ఈ అక్రమ కేసులు. ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల మీద చేస్తున్న దాడిలో భాగమే ఇదంతాʹʹ అని పౌరహక్కుల సంఘం, విప్లవ రచయితల సంఘం, అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం మండి పడ్డాయి.
పూర్తి వివరాలతో కూడిన ప్రకటనను విప్లవ రచయితల సంఘం మీడియాకు విడుదల చేసింది. ఆ ప్రకటన పూర్తి పాఠం....
ఆంధ్రప్రదేశ్ ప్రజాసంఘాలపై నిర్బంధం
రెండు రోజుల్లో రెండు కేసులు
ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రజా జీవన రంగాల్లో పని చేస్తున్న సంస్థల కార్యకర్తలపై పోలీసులు కుట్రపూరితంగా రెండు కేసులు బనాయించారు. 30 మంది మీద ఉపాతోపాటు అనేక సెక్షన్ల కేసులు నమోదు చేశారు.
ఈ కేసుల్లో ఒకటి ఈ నెల 23న విశాఖ ఏజెన్సీలోని ముంచింగిపుట్టు పోలీస్ స్టేషన్లో నమోదు చేశారు. రెండోది 24వ తేదీ గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పోలీసు స్టేషన్లో నమోదు చేశారు. ఈ రెండింట్లో ఇతరులతోపాటు ప్రజాసంఘాల బాధ్యులు, సభ్యులను నిందితులుగా చేర్చారు.
పెదబయలుకు చెందిన టీవీ 19 రిపోర్టర్ పాంగి నాగన్నను ఈ నెల 23న అరెస్టు చేశారు. అతను ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రజా సంఘాల కార్యకర్తలకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అభియోగాలు మోపుతూ కేసు పెట్టారు. అలాగే నవంబర్ 24న గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కంభంపాటి చైతన్య అనే యువకుడ్ని అరెస్టు చేశారు. అతని తండ్రితోపాటు ప్రజాసంఘాల సభ్యుల మీద కూడా కేసు పెట్టారు.
ఈ రెండు కేసులలో 1. చిలుకా చంద్రశేఖర్ (సీఎల్ సీ) 2. చిట్టిబాబు (సీఎల్ సీ) 3. దుడ్డు ప్రభాకర్(కెఎన్పీఎస్) 4. కోట(పీకేఎం) 5. వై. వెంకటేశ్వరులు (పీడీఎం) 6. పాణి(విరసం)7. వరలక్ష్మి(విరసం) 8. అంజమ్మ 9. పద్మకుమారి 10. వై. వి బాలకృష్ణ 11. కె. శివచలం 12. కొండపర్తి పద్మ 13. పొట్లూరి క్రాంతి 14. వాసిరెడ్డి కృష్ణ 15. శ్రీరాంమూర్తి(సీఎల్ సీ)16. జోగి కోదండం 17. అరుణ 18. పీకేఎం నీలకంఠు 19. కొండారెడ్డి 20. అన్నపూర్ణ 21. రేలా రాజేశ్వరి 22. స్వప్న 23. దేవేంద్ర 24. లక్ష్మి ప్రసన్న 25. పీకేఎం విజయ్ 26. పికెఎస్ ఆంజనేయులు 27. మిస్కా కృష్ణయ్య 28 . దుడ్డు వెంకట్రావ్ 29 . పికేఎం శ్రీను 30. ఆత్మకూరు అన్నపూర్ణ ఉన్నారు.
వీరి మీద ముంచింగిపుట్టు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 120 (ఎ), 121, 121 j), 143, 144, 124 (4) r/w విత్ 149, . ఊపా సెక్షన్ 10, 13, 18 . ఆర్మ్స్ యాక్ట్ 25 సెక్షనల కింద కేసు నమోదు చేశారు. పిడుగురాళ్ల స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 120 (ఎ), 121, 121 (1), 122, 124 (1), 143, 144, 149 , ఊపా సెక్షన్ 16, 17, 18, 18 (1), 18 (ఎ), 20, 21, 38, 39, 40 ల కింద కేసు నమోదు చేశారు.
వీరంతా గత 20 ఏళ్లకు పైగా తెలుగు నేల మీద వివిధ రంగాలలో బహిరంగంగా పనిచేస్తున్నారు. పాలకుల విధానాల వల్ల, వ్యవస్థ వల్ల దుర్భరంగా మారిన ప్రజా జీవితంలో మార్పు కోసం ప్రగతిశీల దృక్పథంతో పని చేస్తున్నారు. తమ విశ్వాసాలను బహిరంగంగా ప్రకటించుకొని పని చేస్తున్నారు. కానీ వీరంతా మావోయిస్టు పార్టీ నాయకుడు అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని వీరి పోలీసులు ఆరోపించారు. ఒక అబద్ద ఆరోపణ చేసి, దాని మీద ఆధారపడి ఈ కేసు నమోదు చేశారు.
వాస్తవానికి ఈ సంఘాలన్నీ తమ అవగాహన మేరకు ప్రజాస్వామిక విలువల కోసం పని చేస్తున్నాయి. రాష్ట్రంలో బూటకపు ఎన్ కౌంటర్ హత్యలు, మావోయిస్టుల అణచివేత పేరుతో ఆదివాసుల మీద దాడులు, బాక్సైట్ వ్యతిరేక ఆదివాసీ పోరాటాలను అణచివేయడానికి కూంబింగ్ తరహా హింసాత్మక చర్యలను వ్యతిరేకిస్తూ పని చేస్తున్నారు. స్త్రీల మీద పితృస్వామ్య హింస, అగ్రకుల ఆధిపత్య దాడులు, ముస్లింలపై హిందుత్వ శక్తుల హింసోన్మాదం, అభివృద్ధి పేరుతో విధ్వంసం, నిర్వాసితత్వం, అప్రజాస్వామిక చట్టాల కింద అక్రమ అరెస్టులు మొదలైన ఎన్నో ప్రజాస్వామిక సమస్యలపై పోరాడుతున్నారు. ఈ సమస్యలపై నిజనిర్ధారణలు, సభలు సమావేశాలు, పత్రికా ప్రకటనలు, ఆందోళనలు, రచన, పత్రికా నిర్వహణ వంటి రూపాల్లో పని చేస్తున్నారు.
దీన్ని సహించలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ అక్రమ కేసులను పెట్టింది. ఈ కేసుల వల్ల ప్రజల కోసం పనిచేయకుండా ప్రజా సంలను అడ్డుకోగలమని అనుకోవడం పిచ్చి ఊహే. దేనికంటే ఇలాంటి కేసులు ప్రజా సంఘాలకు ఇదే మొదలు కాదు. ఇట్లా ప్రజాసంఘాల నాయకులు, సభ్యులందరి మీద కేసులు పెట్టే పద్ధతి గత ఏడాది తెలంగాణ ప్రభుత్వం ఆరంభించింది. అక్కడా సరిగ్గా ఇలాంటి తప్పుడు అభియోగాలే చేశారు. ఇప్పుడు ఆ పని ఆంధ్రప్రదేశ్ పోలీసులు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో నడుస్తున్న నిర్బంధంలో భాగమే ఈ అక్రమ కేసులు. అజిత్ దోవల్, విజయ్ కుమార్ ప్రజాస్వామిక, ప్రగతిశీల శక్తుల మీద చేస్తున్న దాడిలో భాగమే ఇదంతా. దీన్ని విరసం ఖండిస్తోంది.
అరసవిల్లి కృష్ణ
అధ్యక్షుడు, విరసం
Keywords : andhrapradesh, ABMS, CMS, VIRASAM, CLC, POLICE, Arrests, anjamma, rajeshvari
(2024-03-13 20:13:01)
No. of visitors : 558
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |