error_reporting(E_ERROR | E_PARSE); ?>
రైతుల చట్టబద్ధమైన, శాంతియుత నిరసనలను ప్రభుత్వం అణచివేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ జాతీయ మహిళా సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశాయి. పోరాడుతున్న రైతులు, రైతు సంస్థల నాయకులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, విపత్తు సమయంలో అమల్లోకి వచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు.
ఈ లేఖను ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఎయిడ్వా), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యు), ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఎఐపిడబ్ల్యుఎ), ప్రగతిశీల్ మహిళా సంఘటన్ (పిఎంఎస్), అఖిల భారత మహిళా సాంస్కృతిక్ సంఘటన్ (ఎయిమ్స్), ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి (ఎఐఎఎంఎస్).
"కాంట్రాక్ట్ వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని నిలిపివేయండి", అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను (ఎంఎస్పి) నిర్ణయించి, హామీ ఇవ్వాలని, "ప్రభుత్వం వికేంద్రీకృత సేకరణను నిర్ధారించాలని" ప్రధానమంత్రి మోడిని కోరాయి.
వారు రైతులకు రుణ మాఫీ, ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వితంతువులకు, మైక్రోఫైనాన్స్ కంపెనీలు స్వయం సహాయక సంఘాల నుండి రుణాలు తీసుకున్న అప్పులను మాఫీ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
దేశంలో ప్రస్తుతం ఉన్న ఆకలి, పేదరికాల పరిస్థితిని ఎత్తిచూపి, ప్రభుత్వం ʹప్రజా వితరణ వ్యవస్థను విశ్వవ్యాప్తం చేయడం, విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం ఉండేలా చూడటం, అన్ని బలహీన కుటుంబాలకు నెలవారీ ఆదాయ మద్దతు, ఆరోగ్య సంరక్షణ, విద్యకు సార్వత్రిక సామాజిక భద్రత మద్దతును అందించాలని బహిరంగ లేఖలో కోరాయి.
ప్రభుత్వం ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, ప్రభుత్వ విధానాలు గ్రామీణ రంగంలోని మహిళలపై కలిగిస్తున్న ప్రతికూల ప్రభావాన్ని ఎత్తి చూపారు. "మహిళలు, రైతులుగా గుర్తించబడనప్పటికీ, వ్యవసాయ కార్యకలాపాలలో వారు సమానంగా నిమగ్నమై ఉన్నారు.
మహిళలు ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే "అదృశ్య సహాయకులు"గా ఉన్నారు. వ్యవసాయ శ్రమశక్తిలో 33%, స్వయం ఉపాధి రైతులుగా 48% వుండడం వల్ల వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను విస్మరించలేము ʹఅని వారు రాశారు.
ఈ చట్టాలు, విధానాలు, "వ్యవసాయ ఆధారిత కుటుంబాలను విపరీతమైన అప్పులపాలు చేశాయి. ఫలితంగా రైతు ఆత్మహత్యలు జరిగాయి". ఆత్మహత్య బాధిత కుటుంబాల మహిళా రైతులను చాలా హాని కలిగించే పరిస్థితుల్లోకి నెట్టివేసింది, ఎందుకంటే మహిళల పేరు మీద భూమి పట్టాలు లేవు కాబట్టి వారు సంక్షోభాన్ని ఎదుర్కోవటానికి ప్రభుత్వాల నుండి ఎటువంటి సహాయం పొందరు.
మహిళల సంఘాలు రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపాయి. "మీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన క్రూరత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు" నిర్వహించబోతున్నామని ప్రధానికి తెలియచేసారు.
మహిళా సంఘాల బహిరంగ లేఖ పూర్తి పాఠం
తేదీ: నవంబర్ 29, 2020
శ్రీ నరేంద్ర మోడిగారికి,
ప్రధానమంత్రి,
మీ విధానాలు, మీ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన మూడు రైతు వ్యతిరేక చట్టాలు, గ్రామీణ రంగంలోని మహిళలపై కలిగించే ప్రతికూల ప్రభావం గురించి మేము, ఈ కింద సంతకం చేసిన జాతీయ మహిళా సంస్థలు, తీవ్ర ఆందోళన చెందుతున్నాయి.
మహిళలు, రైతులుగా గుర్తించబడకపోయినా, వ్యవసాయ కార్యకలాపాలలో సమానంగా నిమగ్నమై ఉన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఇప్పటికీ "అదృశ్య సహాయకులు" గా ఉన్నారు. వ్యవసాయ రంగంలో మహిళల పాత్రను విస్మరించలేము, ఎందుకంటే వారు వ్యవసాయ శ్రమశక్తిలో 33%, స్వయం ఉపాధి రైతులుగా 48% ఉన్నారు.
మహమ్మారిని ఎదుర్కోవటానికి మీ ప్రభుత్వం తీసుకున్న ప్రణాళికా రహిత, కఠినమైన చర్యల ఫలితంగా రైతులు నిరంతర వ్యవసాయ బాధలు, ఆర్థిక ప్రభావం నుండి నానా యిబ్బందులు పడుతున్నారు. ఇది వ్యవసాయంపై ఆధారపడిన కుటుంబాలను అప్పులపాలు చేసిన ఫలితంగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు చెందిన మహిళా రైతులు పూర్తిగా దుర్బలమైన స్థితిలో ఉన్నారు. సాధారణంగా మహిళల పేరుమీద భూమి ఉండదు. అందువల్ల అప్పుల భారం, ఆత్మహత్యలు అనే రెండు విపత్తులను ఎదుర్కోవటానికి ప్రభుత్వాల నుండి వారికి ఎటువంటి సహాయం లభించదు.
నిత్యావసర వస్తువులు, నిరుద్యోగం, ఆకలి, పెరుగుతున్న ధరలు మహిళలు, బలహీన కుటుంబాల జీవితాలపై తీవ్రమైన పరిణామాలను కలిగిస్తున్నాయి.
2020 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన వ్యవసాయ వాణిజ్య, వ్యాపార చట్టం, రైతు ధరల భరోసా చట్టం, అత్యవసర వస్తువుల (సవరణ) చట్టం దేశవ్యాప్తంగా నిరసనలు రేకెత్తించాయి, ఇది రైతాంగాన్ని, వారి కుటుంబాలను వ్యవసాయ వ్యాపార దయా దాక్షిణ్యాలపై ఆధారపడేట్లు చేస్తుంది కాబట్టి వీటిలో మహిళా రైతుల భారీ భాగస్వామ్యం ఉంది.
కాంట్రాక్ట్ వ్యవసాయానికి ప్రోత్సాహమిస్తే కనక రైతులు తమ భూమి కోల్పోవడానికి, మరింత పేదరికానికీ దారితీస్తుంది. ఈ చట్టాల వల్ల కార్పొరేట్ లాబీ చేసే తీవ్రమైన దోపిడీ నుండి రక్షణ లేని మహిళా రైతులు మరింత పేదరికానికీ గురవుతారు. ఈ చర్యలు ప్రభుత్వం వికేంద్రీకృత సేకరణను తగ్గించడానికి, ప్రజా పంపిణీ వ్యవస్థ శిధిలమైపోవడానికి దారి తీస్తాయి.
స్వామినాథన్ కమిషన్ నివేదిక ఆధారంగా రుణ మాఫీ, కనీస మద్దతు ధరను నిర్ణయించాలన్న డిమాండ్లను రైతు సంస్థలు నిరంతరం పెడుతున్నాయి. ఈ డిమాండ్లను పట్టించుకోకుండా, రైతు వ్యతిరేక చట్టాలను ఆమోదించడం ద్వారా రైతులను మరింత కష్టాల్లోకి నెట్టడాన్ని మీ ప్రభుత్వం ఎంచుకోవడం దురదృష్టకరం.
రైతుల పోరాటంపై , భాష్ప వాయువు, ఎముకలు కోరికే చలిలో నీటి ఫిరంగులు ఉపయోగించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. బిజెపి-ఆర్ఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం, యుపి, హర్యానాల్లోని బిజెపి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఢిల్లీకి చేరుకోవాలనుకుంటున్న శాంతియుత రైతులపై ఇంతకుముందెన్నడూ లేనంత క్రూరంగా ప్రవర్తించాయి.
రైతుల పోరాటానికి సంఘీభావం తెలుపుతున్నాము. మీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ప్రదర్శించిన క్రూరత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు నిర్వహిస్తాము.
జాతీయ మహిళా సంస్థల డిమాండ్:
రైతాంగ చట్టబద్ధ, శాంతియుత నిరసనల అణచివేతను వెంటనే ఆపండి.
పోరాడుడుతున్న రైతులు, రైతు సంస్థల నాయకులపై విధించిన అన్ని కేసులను ఉపసంహరించుకోవాలి.
విపత్తు సమయంలో అమల్లోకి వచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి.
కాంట్రాక్ట్ వ్యవసాయానికి ప్రోత్సాహాన్నివ్వడాన్ని ఆపాలి.
అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను నిర్ణయింఛాలి, హామీ ఇవ్వాలి, ప్రభుత్వ సేకరణను వికేంద్రీకరించాలి.
ఆకలి, పేదరికాల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని, ప్రజా వితరణ వ్యవస్థను (పిడిఎస్)ను విశ్వవ్యాప్తం చేయాలి.
విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అందేలా చూడాలి.
రైతులకు రుణ మాఫీ, ముఖ్యంగా ఆత్మహత్య చేసుకున్న రైతుల వితంతువులకు, సూక్ష్మ ఆర్థిక సంస్థలు, స్వయం సహాయక సంఘాల నుండి రుణాలు తీసుకున్నవారి రుణాలు మాఫీ చేయాలి.
అన్ని బలహీన కుటుంబాలకు నెలవారీ ఆదాయ మద్దతు ఇవ్వాలి.
ఆరోగ్య సంరక్షణకు, విద్యకు సార్వత్రిక సామాజిక భద్రత మద్దతు ఇవ్వాలి.
ఆల్ ఇండియా డెమోక్రటిక్ ఉమెన్స్ అసోసియేషన్ (ఎయిడ్వా), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ (ఎన్ఎఫ్ఐడబ్ల్యు), ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఉమెన్స్ అసోసియేషన్ (ఎఐపిడబ్ల్యుఎ), ప్రగతిశీల్ మహిళా సంఘటన్ (పిఎంఎస్), అఖిల భారత మహిళా సాంస్కృతిక్ సంఘటన్ (ఎయిమ్స్), ఆల్ ఇండియా అగ్రగామి మహిళా సమితి (ఎఐఎఎంఎస్).
Keywords : farmers protest, delhi, prime minister, narendra modi, women associations,అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులుదేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులుఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపుగత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటనప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనమోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్లోని |
??????? ????? |
కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక |
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు |
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ |
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |