include 'men';
?>
రైతుల ఉద్యమంలాంటిదే అక్కడా నడుస్తోంది - 4 రోజులుగా చలిలో వాళ్ళు రోడ్లమీదే ఉన్నారు
కేంద్రం చేసిన రైతు వ్యతిరేక చట్టాలకు నిరసనగా లక్షలాదిమంది రైతులు ఉద్యమిస్తున్నారు. దాదాపు పది రోజులుగా వణికించే చలిలో ఢిల్లీ శివార్లలో కూర్చొని ఉన్నారు రైతులు. దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమంపై చర్చ జరుగుతున్న ఈ సమయంలో చత్తీస్ గడ్ రాష్ట్రంలో ఆదివాసులు దాదాపు ఇటువంటి ఉద్యమాన్నే ప్రారంభించారు. నాలుగు రోజులుగా ఆరు వేల మంది ఆదివాసులు రోడ్లను బ్లాక్ చేసి చలికి వణుకుతూ , ఎండలో మండుతూ కూర్చుని ఉన్నారు. కార్పోరేట్ కంపనీల కోసం రైతుల పొట్టగొడుతున్న ప్రభుత్వం అదే కార్పోరేట్ కంపనీల కోసం ఆదివాసులనూ నిరాశ్రయులను చేయబూనుకుంది. దానిపై బస్తర్ ఆదివాసులు రోడ్డెక్కారు.
బస్తర్ ఆదివాసీలు అడవిని, భూమిని కాపాడుకోడానికి ఐక్యమయ్యారు. అమదై బాక్సైట్ గని తవ్వకాన్ని వ్యతిరేకిస్తున్నారు. బస్తర్ డివిజన్ నారాయణపూర్ జిల్లాలోని ధౌడై సమీపంలో దట్టమైన అడవుల మధ్య 6 వేలకు పైగా ఆదివాసీలు, మహిళలు, పురుషులు సాంప్రదాయ ఆయుధాలతో ధర్నా మొదలుపెట్టారు. చల్లటి చలిలో మూడు రోజులుగాఆరు వేల మంది ఆదివాసులు అక్కడే కూర్చున్నారు. అబుజ్మడ్ ప్రాంతంలోని ఛోటా డొంగర్ గ్రామం నుండి 6 వేల మందితో బయలుదేరిన ర్యాలీ 55 కి. మీ. నడిచి ధోడై అడవుల్లో ధర్నాపై కూర్చున్నారు. ధోడై సమీపంలోని రోడ్లన్నింటిని మూసి వేశారు. ఆ చుట్టు పక్కల అత్యవసర వాహనాలను తప్ప ఇంకేవాహనాన్ని కదలనివ్వడం లేదు ఆదివాసులు.
"మా డిమాండ్లు నెరవేరేదాకా, మేము అడవి నుండి బయటికి వెళ్లము. అంత మాత్రమే కాదు, డిసెంబర్ 17 వరకు ధర్నా చేయాలని నిర్ణయించుకుని. అవసరమయ్యే భోజన సామాగ్రిని తెచ్చుకున్నాం. గని తవ్వకం వల్ల మా నీరు, అటవీ, భూమికి భారీ నష్టం కలుగుతుంది. మేము మా భూమిని దేవుడిలా చూస్తాం. ప్రైవేటు సంస్థ జోక్యం చేసుకుంటే మా ప్రాంతం సురక్షితంగా ఉండదు. మా డిమాండ్లు నెరవేరేదాకా వేలాది సంఖ్యలో నిరసన తెలియచేస్తాము. రాస్తా రోకో జరుపుతాం. మేము ముందుకు వెళ్తాము. " అని సర్వ ఆదివాసీ సమాజ్ అధ్యక్షుడు బీసల్ నాగ్ చెప్పారు.
అవసరమైన సేవలను మినహాయించి, ద్విచక్ర వాహనాలు, ఇతర వాహనాల కదలికను తాము ఆపివేశామని వారు తెలిపారు. అలాగే, వారపు సంతను కూడా పూర్తిగా మూసేశారు. రహదారిని మూసివేసారు. అయితే అటుగా వచ్చిన అంబులెన్స్ కు మాత్రం వెంటనే దారి కల్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో బస్తర్ డివిజన్లో ఏడు జిల్లాల ఆదివాసీలు పాల్గొంటున్నారు. ఆ ప్రాత గ్రామాల నుండి ఆరుగురు ఆదివాసులను పోలీసులు అరెస్టు చేశారు. వారు నక్స్లైట్లని పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై ఆదివాసులు ఆగ్రహంగా ఉన్నారు. ఆదివాసులందరూ తమ గ్రామాలకు తిరిగి వెళ్ళాలని ప్రభుత్వం చెప్పినప్పటికీ వాళ్ళు ససేమిరా అంటున్నారు. వాళ్ళతోపాటు ఆదివాసులు దాదాపు 15 రోజులకు సరిపడ ఆహార పదార్థాలు వెంట తెచ్చుకున్నారు.
నారాయణపూర్ జిల్లాలోని అమదై గనిని నిక్కో కంపెనీకి లీజుకు ఇచ్చారు. నిక్కో సంస్థ త్వరలో గని తవ్వకాలు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తోంది. అందువల్ల ఈ ప్రాంతానికి కలిగే నష్టాన్ని గుర్తించిన ఆదివాసీలు ఈ విధంగా ఉద్యమాన్ని చేపట్టారు
ఆదివాసీల ఆందోళన ఆపడానికి తహశీల్దార్, తాలూకా ఇన్స్ పెక్టర్ స్థాయి అధికారులు రాగా వాళ్ళతో మాట్లాడడానికి ఆదివాసీలు తిరస్కరించారు. తమతో మాట్లాడటానికి ప్రభుత్వ ప్రతినిధి రాకపోతే తమ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు అంటున్నారు. గనులను నిక్కో కంపెనీకి ఇవ్వవద్దని డిమాండ్ చేస్తున్నారు. అలాగే, నక్సలైట్ల పేరుతో అరెస్టు చేసిన 6 గురు యువకులను వెంటనే విడుదల చేయాలని వాళ్ళు కోరుతున్నారు. ఈ డిమాండ్స్ నెరవేరేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామంటున్నారు.
Keywords : chattis garh, adivasi, farmers, mining, bauxite
(2024-03-25 21:53:55)
No. of visitors : 938
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| హెచ్ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..