include 'men';
?>
దళిత యువకుడిని పెళ్ళి చేసుకుందని స్వంత సోదరిని కాల్చి చంపిన కులోన్మాదులు
దళిత యువకుడిని పెళ్ళి చేసుకుందని స్వంత సోదరిని కాల్చి చంపారు దుర్మార్గులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మెయిన్ పురి జిల్లా కాశ్యప్ నగర్ గ్రామంలో ఓబీసీ కులానికి చెందిన 23 ఏళ్ళ చాందినీ కశ్యప్, దళితుడైన 25ఏళ్ళ అర్జున్ కుమార్ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. ఈ ఏడాది జూన్ 12 న వీళ్ళిద్దరి పెళ్ళి జరిగిన తర్వాత ఢిల్లీలోని త్రిలోక్పురి ప్రాంతంలో నివసిస్తున్నారు. అర్జున్ కుమార్ ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు.
వివాహం తర్వాత చాందినీ సోదరులు ఫోన్లో ఆమెతో మాట్లాడటం ప్రారంభించారు. నవంబర్17న ఢిల్లీ వచ్చిన చాందినీ కశ్యప్ సోదరులు సునీల్ కశ్యప్, సుశీల్ కశ్యప్, సుధీర్ కశ్యప్ లు వీళ్ళిద్దరితో మంచిగా ఉన్నట్టు నటించారు. సోదరిని ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వెనక్కి పంపిస్తామని చెప్పి నమ్మించారు. అదే రోజు ఆమెను తీసుకెళ్ళారు.
నవంబర్ 20 న చాందిని నుండి అర్జున్ కు ఫోన్ వచ్చింది. తన సోదరులు తనను కొట్టారని, ఢిల్లీకి తిరిగి రాకుండా అడ్డుకుంటున్నారని చెప్పింది. ఆమె మాట్లాడుతుండగానే ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది. అర్జున్ మళ్ళీ ఫోన్ చేయడానికి ప్రయత్నిస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. అప్పటి నుండి ఎన్ని సార్లు ప్రయత్నించినా ఫోన్ స్విచ్డ్ ఆఫ్ వచ్చిందని అర్జున్ తెలిపాడు.
కీడు శంకించిన అర్జున్ ఆమె గురించి ఆరా తీయడానికి చాందిని సొంత గ్రామానికి వెళ్ళాలనుకున్నాడు. అక్కడికి బయలుదేరే ముందు నవంబర్ 22 న మయూర్ విహార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అర్జున్ తన తల్లి మరియు మామలతో కలిసి మెయిన్పురికి చేరుకొని ఆమె గురించి ఎంక్వైరీ చేశాడు. ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడాడు. చాందిని ఒంటరిగా ఢిల్లీకి వెళ్ళిపోయిందని ఒకరు, ఆమె మరో వివాహం చేసుకుందని ఒకరు, ఆమె ఆత్మహత్య చేసుకుందని మరోకరు పొంతన లేని మాటలు చెప్పారు.
దీంతో మళ్ళీ పోలీసులను సంప్రదించాడు అర్జున్. వెంటనే ఢిల్లీ మయూర్ విహార్ పోలీసు అధికారులు ఒక పోలీసు టీం ను కాశ్యప్ నగర్ కు పంపారు. పోలీసులు చాందినీ కశ్యప్ సోదరుడైన సునీల్ కశ్యప్ ను విచారించగా అసలు నిజం భయటపడింది. చాందినీ కశ్యప్ సోదరులు సునీల్ కశ్యప్, సుశీల్ కశ్యప్, సుధీర్ కశ్యప్ లు ఆమెను కాల్చి చంపి పొలంలో పాతిపెట్టారని తెలిసింది. ఆ విషయం కుటుంబం మొత్తానికి తెలుసు. శుక్రవారం (డిసెంబర్ 11) పోలీసులు 10 గంటల పాటు వెతికి చాందిని మృతదేహాన్ని పొలంలో నుంచి వెలికి తీశారు.
అర్జున్ స్టేట్మెంట్ ఆధారంగా చాందినీ సోదరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాధితురాలి సోదరుడు సునీల్ కశ్యప్ ఈ నేరాన్ని అంగీకరించిన తరువాత హత్య ఆరోపణను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. సునీల్ కశ్యప్ ను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మిగతా ఇద్దరు సోదరుల కోసం వెతుకుతున్నారు పోలీసులు.
మనిషి శరీరంలో నరనరాన విషం నింపుతున్నఈ కులం, మతం ఈ దేశంలో ఇంకెంత మంది నరహంతకులను తాయారుచేస్తుందో...!
Keywords : UTTARAPRADESH, dalit, wedding,obc, killing, murder, Woman who married Dalit man killed, buried on family farm by brothers
(2024-04-23 07:47:15)
No. of visitors : 1512
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
| ఉన్నావ్ అత్యాచార బాధితురాలి హత్యకు కుట్ర...ఇద్దరి మరణం..బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదుగతేడాది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ అత్యాచార ఘటన బాధితురాలు ప్రయాణిస్తున్న కారును ఆదివారం ట్రక్కు ఢీకొనడంతో బాధిత యువతి బంధువులు ఇద్దరు మరణించారు. బాధితురాలితోపాటు ఆమె న్యాయవాది కూడా తీవ్రగాయాలపాలయ్యారు. అధికార బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ తనపై అత్యాచారం చేశాడని 19 ఏండ్ల బాధితురాలు గతేడాది ఫిర్యాదు చేయగా |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..