అక్రమ అరెస్టులపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి - CLC
ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో ప్రజాసంఘాల కార్యకర్తలను పోలీసులు వరసగా అరెస్టులు చేస్తున్నారు. అనేక మంది పై అక్రమ కేసులు మోపుతున్నారు. కొద్ది రోజుల ముందు అమరుల బందు మిత్రుల సంఘం అధ్యక్షురాలు అంజమ్మ, చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరిలను అరెస్టు చేసిన పోలీసులు ఆ సందర్భంగా దాదాపు 70 మంది ప్రజాసంఘాల కార్యకర్తలపై కేసులు బనాయించారు. మళ్ళీ మూడు నాలుగు రోజులుగా అరెస్టులు మొదలుపెట్టారు. ఈ సారి పోలీసుల దాడి ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులపై గురిపెట్టారు.ప్రగతిశీల కార్మిక సమాఖ్య చిత్తూరు జిల్లా కార్యదర్శి వి.ఆంజనేయులును ఈ నెల 9న , ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండారెడ్డి ని 12వ తేదీన రాష్ట్ర నాయకురాలు అన్నపూర్ణను ఈరోజు(డిశంబర్ 15) పోలీసులు అరెస్టు చేశారు. వరసగా సాగుతున్న ఈ అరెస్టులను ఖండిస్తూ పౌరహక్కుల సంఘం విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....
ప్రగతి శీల సమాఖ్య నాయకురాలు అన్నపూర్ణ అక్రమ అరెస్ట్ ను పౌర హక్కుల సంఘం తెలంగాణ ఖండిస్తుంది.
చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) పేరుతో ఆంధ్రప్రదేశ్ లో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. రాత్రి గడిస్తే చాలు ఎవరిని ఉపా కింద అరెస్టు చేస్తారోనని ప్రజా సంఘాల నాయకులు భయ బ్రాంతులకు గురౌతున్నారు. ప్రజా సంఘాల నాయకులను లక్ష్యంగా చేసుకుని, ప్రత్యేకంగా, ఉపా చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. వ్యక్తులు మరియు ప్రజా సంస్థలను లక్ష్యంగా చేసుకుని, పోలీసుల అరెస్టులు జరుగుతున్నాయు. వీటిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి చే న్యాయ విచారణ జరిపించాలి.
శాంతియుత మరియు ప్రజాస్వామ్య బద్దంగా UAPA వ్యతిరేక నిరసనలను జరుగుతున్నాయు. ఈ నేపథ్యంలో పీకే ఎస్ సంఘ నాయకులు మావోయిస్టుల సూచనల మేరకు పని చేస్తున్నారని, వారి వెనుక ఉన్న శక్తులను గుర్తించడానికి అవసరమైన చర్యగా పోలీసులు ఈ అరెస్టులను సమర్దిస్తున్నారు. నిజమైన అంశాలపై పోలీసుల దర్యాప్తు స్వాగతించబడుతున్నప్పటికీ, ఈ తరహా అక్రమ అరెస్టులు పోలీసుల పాత్ర పై ఆందోళనలను, అనుమానాలను పెంచుతోంది. ఈ అరెస్టులకు కొన్ని రోజుల ముందు అమిత్ షా జాతీయ భద్రతా మండలి సమావేశం నిర్వహించడం యాదృచ్చికం కాదు. అందులో భాగంగా ప్రజాసంఘాల కార్యకర్తలపై దర్యాప్తు చేయాలనే ఉద్దేశ్యంతో పోలీసులు, వారిపై నిజమైన అణచివేతను ప్రారంభించారు. మొదటగా చైతన్య మహిళా సమాఖ్య ,అమరుల బందు మిత్రుల సంఘం లను, తర్వాత ప్రగతి శీల సమాఖ్యను ప్రత్యేక లక్ష్యంగా చేసుకున్నారు. ప్రజా సంఘాల కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేస్తూ రాజ్యాంగ విరుద్ధంగా మెదులుతున్నారు.
ప్రస్తుత బిజెపి, వై సి పి ప్రభుత్వంలో రాజకీయ అసమ్మతిని అరికట్టడానికి UAPA దర్యాప్తు తప్పుగా ఉపయోగించబడుతుందని ప్రజలు నమ్మడానికి ఈ అరెస్టులు కారణాలుగా ఉన్నాయి. బహుశా ఉపా వ్యతిరేక ఉద్యమం కేంద్ర , ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలకు కోపం తెప్పించింది. ఈ ఉద్యమానికి అన్ని ప్రజా సంఘాల నాయకుల నాయకత్వం వహించారు. ఈ ఉద్యమం విద్యార్థులు, మహిళల సమూహాలు, కార్మికవర్గాల నుండి అపూర్వమైన మద్దతును పొందింది. ఇది ప్రజాస్వామ్య ప్రయాణంలో ఒక మైలురాయి. ఈ ఉద్యమం ప్రభుత్వం యొక్క రెండు ముఖ్యమైన వాదనలను సవాలు చేసింది. మొదట, ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న వామపక్ష-లిబరల్ ఉన్నతవర్గాలు (తరచుగా ట్విట్టర్ యుద్ధాలలో "లిబ్టార్డ్స్" అని పిలుస్తారు). రెండవది, హిందూ దేవాలయం నిర్మించడానికి బాబ్రీ మసీదు ప్రాంగణాన్ని కేటాయించడం ద్వారా బిజెపి ప్రభుత్వం ముస్లింలపై నిరంతరాయంగా దాడి చేసినప్పటికీ, అల్లర్లు మరియు హింసను నిశ్శబ్దంగా ఆమోదించడం. ఇస్లామోఫోబియాను అనాలోచితంగా ప్రోత్సహించడం. ఆర్టికల్ 370 ను ఏకపక్షంగా ఉపసంహరించుకోవడం వంటివి బిజెపి చేసింది. వీటిని వ్యతిరేకిస్తున్న వారందరినీ ఉగ్రవాదులుగా ప్రభుత్వం పరిగణించింది. వారందరినీ UAPA చట్టం కింద అరెస్టు చేయటం ప్రారంభించింది.
ఈ అరెస్టులు అప్రకటిత ఎమర్జెన్సీ ధోరణి యొక్క కొనసాగింపుగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో ఐదు మందిని ఉపా చట్టం కింద అక్రమంగా అరెస్టు చేశారు. తాజాగా అన్నపూర్ణ ను ఈరోజు వైజాగ్ లో అదుపులోకి తీసుకున్నారు. వీరందరూ కూడా మావోయిస్టు సంఘానికి మద్దతుదారులుగా ఉన్నారని తప్పుడు కేసులు పోలీసులు బనాయించారు. నిజానికి వీరు UAPA వ్యతిరేక ఆందోళనలో ఉధృతంగా పాల్గొన్నవారే. అంతే కాకుండా బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యతిరేక, హిందూ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా వీరు పోరాడారు.
తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టులే లేరని సాక్షాత్తు కేంద్ర హోం మంత్రి ప్రకటించారు. అటువంటప్పుడు అరెస్టు కాబడిన వారు మావోయిస్టులతో ఎలా సంబంధాలు కలిగి ఉంటారో పోలీసులు చెప్పాలి. ఈ తప్పుడు UAPA కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు. వీరందరూ నిర్దోషులుగా బయటకు వస్తారు. అయితే ప్రజాసంఘాల నాయకత్వాన్ని జైల్లో నిర్బంధించడం వల్ల ప్రజాసంఘాలు నిర్వీర్యం అవుతాయి. ప్రజా సంఘాలు పనిచేయటం ఆపేస్తాయి. తద్వారా ప్రభుత్వాలు ప్రజలపై అప్రజాస్వామిక విధానాలను రుద్దుతుంది. ప్రజలపై పెద్దఎత్తున పన్నుల భారాన్ని మోపి వారిని ఆత్మహత్యల వైపు ప్రభుత్వం నెట్టుతుంది. దీన్ని అన్ని ప్రజా సంఘాలు, వామపక్ష రాజకీయ పార్టీలు ఐక్యంగా తిప్పికొట్టాలి. లేనిపక్షంలో ప్రజాస్వామ్య వ్యవస్థలో నిరంకుశత్వాన్ని ప్రభుత్వాలు చూపిస్తాయి. భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రశ్నించే హక్కు దెబ్బతింటుంది. ప్రభుత్వాలు రాజ్యాంగ వ్యతిరేక విధానాలకు పాలు పడతాయి. ఐక్య కార్యాచరణే లక్ష్యంగా అన్ని ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు ఈ అక్రమ అరెస్టులపై తక్షణమే స్పందించాలి. తద్వారా ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులను నిరోదించాలి.
పౌరహక్కుల సంఘం
తెలంగాణ, ఆంద్రప్రదేశ్.
Keywords : andhrapradesh, arrests, annapurna, PKS, Telangana, UAPA
(2024-03-19 09:29:04)
No. of visitors : 737
Suggested Posts
| ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. |
| ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. |
| ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులుఅక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస |
| సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘంGDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. |
| జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల |
| CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన పాలకులపై పోరాడుదాం
ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. |
|
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹచత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు. |
| మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టుపెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది. |
| ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడలో పౌరహక్కుల సంఘం సభవిజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్గిరి ఎన్కౌంటర్ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర..... |
| ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన
14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. |