భార్యతో కెనడా యాత్రను మానేసి రైతులకు ఉచిత కటింగులు చేస్తున్న కురుక్షేత్ర యువకుడు
కేంద్ర తీసుకవచ్చిన దుర్మార్గమైన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా మూడు వారాలుగా రైతులు పోరాటం చేస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతులు మూడు వారాలుగా రోడ్లపైనే ఉన్నారు. ఆ చట్టాలు రద్దేయ్యే వరకు తమ పోరాటం ఆపబోమని రైతులు ధీక్షతో ఉన్నారు. అయితే చలిలో ఎండలో రోడ్లపైనే ఉన్న ఈ రైతుల కోసం అనేక మంది అనేక రకాలుగా సహాయం చేస్తున్నారు. ఆహారం, దుప్పట్లు, వృద్దులకు కాళ్ళకు మసాజ్ చేసేందుకు యంత్రాలు ఇలా అనేక రకాలుగా సహాయం చేస్తున్నారు. అదే విధంగా హర్యాణా రాష్ట్రం కురుక్షేత్రలో ʹ క్రేజీ బ్యూటీ సెలూన్ʹ నడిపే లవ్ సింగ్ ఠాకూర్ కూడా తన షాపును తీసుకొని సింగు సరిహద్దులకు వచ్చాడు. ఓ ట్రాక్టర్ ట్రాలీలో కుర్చీలు, అద్దాలు, ఇతర సామాగ్రి వేసుకొని రైతుల కోసం వచ్చేశాడు లవ్ సింగ్.
అక్కడ నిరసనల్లో పాల్గొంటున్న వారికి ఫ్రీగా సేవలు అందిస్తున్నాడు లవ్ సింగ్. కటింగ్, షేవింగ్, హెడ్ మసాజ్, ఫేస్ మసాజ్ ... అన్నింటినీ ఉచితంగానే చేస్తారు. ఎవరైనా డబ్బులివ్వ బోయినా లవ్ సింగ్ తీసుకోడు. తానూ తన టీం రోజుకు దాదాపు 15 గంటలు పని చేస్తున్నామని, వంద నుండి 150 మందికి కటింగ్ చేయగల్గుతున్నామని చెప్పాడు లవ్ సింగ్.
"నేను నా భార్యతో కురుక్షేత్రంలో నా పార్లర్ నడుపుతున్నాను. మా కస్టమర్లలో ఎక్కువ మంది రైతులు ఉన్నారు. వారిలో చాలా మంది రైతులు నిరసన తెలిపే సింగు సరిహద్దు వద్ద మా సేవలు అవసరమని మాకు చెప్పారు. కాబట్టి, నేను నా బృందంతో ఇక్కడకు వచ్చాను. సగటున, మేము రోజుకు సుమారు 100-150 మందికి కటింగ్ చేస్తున్నాము. దీని కోసం మేము ఏమీ వసూలు చేయము. ఎవరైనా మాకు చెల్లించాలనుకున్నా మేము తీసుకోవడానికి నిరాకరిస్తున్నాము. "అని లవ్ సింగ్ ఠాకూర్ అన్నారు.
సింగు సరిహద్దు వద్ద రైతులకు సహాయం చేయడం సంతోషంగా ఉన్నప్పటికీ లవ్ సింగ్ ఠాకూర్ ఈ రోజు కాస్త అసంతృప్తితో ఉన్నారు. ఈ రోజు అతని భార్య పుట్టినరోజు ప్రతి సంవత్సరం తప్పకుండా ఈ జంట విదేశాలకు వెళ్ళే వాళ్ళు. కానీ ఈ సారి ఆమె దగ్గర లేడు
"మా సెలూన్ నడుపడానికి నా భార్య ఎంతో సహాయం చేస్తుంది. కురుక్షేత్రలోని మాషాపుకు వచ్చే ప్రతి కస్టమర్ కు ఆమె టీ అందిస్తుంది. నా అవసరాలు కూడా పూర్తి చేస్తుంది. ఆమె పుట్టినరోజైన ఈ రోజు నేను ఆమెను చాలా మిస్ అవుతున్నాను. "అని లవ్ సింగ్ అన్నారు.
ఈ సంవత్సరం భార్య పుట్టినరోజు సందర్భంగా వాళ్ళిద్దరూ కెనడా వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నారు. రైతుల ఉద్యమం ప్రారంభం అవడంతో వాళ్ళు తమ ప్రణాళికలను రద్దు చేసుకున్నారు.
"లవ్ జీ నడుపుతున్నఈ ఉచిత సెలూన్ సేవలను నేను పొందాను. ఆయన రైతుల కోసం గొప్ప పని చేస్తున్నాడు. అది ఇక్కడ లేకపోతే, మేము హెయిర్ కటింగ్, షేవింగ్ కోసం మా గ్రామాలకు తిరిగి వెళ్ళవలసి వచ్చేది " అని క్రేజీ సెలోన్ సమీపంలో ఒక రైతు చెప్పారు .
రైతులు కాకుండా, పిల్లలు కూడా సెలూన్లో జుట్టు కత్తిరింపుల కోసం వరుసలో ఉన్నారు.
హెయిర్ కట్ కోసం తాను గత మూడు రోజులుగా సెలూన్ ను సందర్శిస్తున్నానని, అయితే క్యూ చాలా పొడవుగా ఉందని, తన వంతు ఇంకా రాలేదని నిరసనలో ఉన్న అమన్ అనే బాలుడు చెప్పారు.
"నాకు హెయిర్ పొడుగ్గా ఉండటమే ఇష్టం కానీ మా నాన్న అందుకు ఒప్పుకోవడం లేదు. అందుకే కటింగ్ కోసం మూడురోజులుగా ఎదిరి చూస్తున్నాను. లవ్ అంకుల్ ఇక్కడ ఈ సెలూన్ పెట్టడం ద్వారా మంచి పని చేస్తున్నాడు. " అని ఆ బాలుడు చెప్పాడు.
Keywords : farmers protest, delhi, singhu, luv singh thakur, kurukshetra,Haryana salon owner skips Canada trip with wife, heads to Singhu border to provide free services to farmers
(2024-03-26 04:28:06)
No. of visitors : 538
Suggested Posts
| అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు
- అడ్డుకున్న పోలీసులురైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ నిర్వహించారు. |
| తీవ్రమైన రైతుల ఉద్యమం - రాజకీయ ఖైదీలను రిలీజ్ చేయాలని డిమాండ్ఢిల్లీ సరిహద్దుల్లోని టిక్రీ వద్ద భారతీయ కిసాన్ యూనియన్ (ఏక్తా ఉగ్రహాన్) ఆద్వర్యంలో జరిగిన ఈ కార్యక్రంలో రాజకీయ ఖైదీలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ అరెస్టుకు గురై జైళ్ళలో ఉన్న వరవరరావు, సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుంబ్డే, గౌతమ్ నవాలఖా తో సహా ఎల్గర్ పరిషథ్ కేసులో ఉన్న వారందరినీ విడుదల చేయాలని అదే విధంగా ఢిల్లీలో అక్రమ కేసులు బనాయించి అరెస్టు చే |
| రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు
దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళపై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు
గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని |
| దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన
ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖభారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్లోని |