రైతుల పోరాటానికి మద్దతుగా రాజకీయ ఖైదీల నిరాహార దీక్ష

రైతుల

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న పోరాటానికి రోజు రోజుకూ మద్దతు పెరుగుతోంది. దేశ విదేశాల్లో రైతు ఉద్యమానికి మద్దతుగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇప్పుడు రైతు ఉద్యమానిక రాజకీయ ఖైదీలు సైతం మద్దతును ప్రకటించారు. ఎల్గార్ పరిషద్ బీమా కోరేగావ్ కేసులో విచారణ ఖైదీలుగా ఉన్న సామజిక కార్యకర్తలు రైతు ఉద్యమానికి మద్దతుగా నిరాహార దీక్ష చేపట్టారు. తలోజా జైలు నుంచి మహేష్ రౌత్, సుధీర్ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్, ఆనంద్ తేల్ తుమ్డే, రోనా విల్సన్, హనీ బాబు, సాగర్ గోర్ఖే, రమేష్ గైకోర్, అరుణ్ ఫెరేరా, వెర్నన్ గోంజాల్వెస్, స్టాన్ స్వామీ, గౌతమ్ నవలాఖ రైతు ఉద్యమానికి సంఘీభావాన్ని ప్రకటించారు. తలోజా జైల్లో డిసెంబర్ 23న ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. తలోజా జైలు నుంచి పంపించిన సందేశం పూర్తి పాఠం.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో అమరులైన రైతులకు మా నివాళి. వాళ్ల అమరత్వం ఉద్యమాన్ని మరింత దృడంగా మలుస్తుందన్న విశ్వాసముంది.

జైలు నిర్బంధంలో ఉన్న మేము ప్రత్యక్షంగా ఆందోళనలో పాల్గొనే అవకాశంలేనందున ఒక రోజు నిరాహార దీక్ష ద్వారా మా సంఘీభావాన్ని ప్రకటించాలనుకున్నాము. మీరు లేవనెత్తిన డిమాండ్లు నూటికి నూరు శాతం న్యాయమైనవి. కేంద్రం ఈ ప్రజా వ్యతిరేక చట్టాలను తీసుకురావడం ద్వారా కార్పోరేట్లకు రైతులను బానిసలుగా మార్చేందుకు సిద్ధమైంది. ఈ చట్టాల సాయంతో రైతుల నుంచి భూములను లాక్కోవడమే అసలు ఎజెండా. తద్వారా అంబానీ, అదానీలకు రైతులను సేవకులుగా మార్చాలనుకుంటోంది. సమాజం కోసం రైతు తన సర్వస్వాన్ని వెచ్చించిన నేల ఇది. మీరు ఆరంభించిన ఈ ప్రజా ఉద్యమం చారిత్రకమైనదే కాదు, ప్రభుత్వానికి తన వాస్తవ స్థితిని గుర్తింపజేస్తుంది కూడా.

ప్రస్తుత ప్రభుత్వం, దాన్ని నడిపించే ఆర్ఎస్ఎస్ మొదటి నుంచీ ప్రజాస్వామానికి వ్యతిరేకం. తమ కులతత్వ ఎజెండాకు అడ్డుగా నిలిచే ఐక్యత, సోదరభావం, సమానత్వాలకు అవి వ్యతిరేకం. రాజ్యాంగ, ప్రజాస్వామ్య విలువల్ని గుర్తుచేసేవారంటే వాటికి భయం. అందుకే ప్రజాస్వామ్యాన్ని గురించి మాట్లాడేవాళ్లపై తప్పుడు ప్రచారం చేస్తాయి. తద్వారా ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఈ అసహ్యకరమైన పద్దతిని అనుసరించడం ద్వారా వాళ్ళు ప్రజలపై తీవ్రవాదులు, దేశద్రోహులు, విచ్చిన్నకర శక్తులు లాంటి ముద్రలు వేస్తుంటారు. గడిచిన ఆరేడు సంవత్సరాల్లో ఇలాంటి ప్రచారం చేయడంలో సంఘ్ పరివార్ శక్తులు సఫలీకృతమయ్యాయి. కానీ... రైతు ఆందోళనల ముందు వారి పాచికలు పారలేదు. ఇప్పుడు వారిలో భయం తాలుకు వణుకును గమనించవచ్చు.

ప్రజాస్వామ్య శక్తులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న‌ కాలంలో మీరు స్ఫూర్తిదాయకమైన పోరాటానికి శ్రీకారం చుట్టారు. రాబోయే రోజుల్లో రైతు ఉద్యమం వెలుగు దివిటీగా మారుతుంది. మీరు సంఘ్ పరివార్ శక్తుల, మోదీ ప్రభుత్వ, దాని మంత్రులతో పాటు గోదీ మీడియాను కూడా ఓడించారు. వాటి కుట్రను ప్రజల ముందు బట్టబయలు చేశారు. పెట్టుబడిదారుల సేవలో మునిగిపోయిన మీడియా, ప్రభుత్వ నిజస్వరూపాలు బట్టబయలయ్యాయి. వాళ్లు ప్రజల పట్ల జవాబుదారీ తనాన్ని విస్మరించారు. రైతులపై బాష్ఫవాయు గోళాలు, జల ఫిరంగులను ప్రయోగించడమే కాక‌ మతం పేరుతో రైతులను విభజించాలని చూసింది ప్రభుత్వం.

మరో వైపు దేశవాసుల చెమట, నెత్తురుతో నిర్మించబడిన ప్రభుత్వ రంగ సంస్థలను పెట్టుబడిదారులకు కానుకలుగా సమర్పిస్తోంది ప్రభుత్వం. ఒకవైపు, పెట్టుబడిదారులకు రుణాలు ఇస్తూ పన్నులు మాఫీ చేస్తూ మరోవైపు సామాన్యులపై పన్నుల భారం పెంచుతోంది. దేశమంతా కోవిడ్ 19తో బాధపడుతుంటే, వలస కూలీలు వేల కిలోమీటర్లు నడిచివెళ్లేలా చేశారు ఈ పాలకులు. అదే సమయంలో పెట్టుబడిదారులకు ప్రయోజనాలు ఒనగూర్చే దారులను అన్వేషించారు. వారికోసం లక్షల కోట్ల ప్యాకేజీలను ప్రకటించింది ప్రభుత్వం. ఆ మొత్తాన్ని సామాన్యుడి నుంచే బలవంతంగా రాబడుతుంది కూడా. రైతులు, కార్మికులు తమ కఠోర శ్రమతో ఈ దేశాన్ని నిర్మించారు. ఇప్పుడు దాన్ని విక్రయానికి పెట్టారు ఈ పాలకులు. నిజానికి వాళ్లే అసలైన జాతి వ్యతిరేకులు, ఉగ్రవాదులు.

రైతు ఉద్యమానికి మద్దతుగా మేము చేపట్టిన ఒక రోజు నిరాహార దీక్షలో అనారోగ్య కారణాల వల్ల స్టాన్ స్వామీ, గౌతమ్ నవలాఖా పాల్గొన కూడదని నిర్ణయించాం. నిజానికి వారు నిరాహార దీక్షలో పాల్గొనడానికి సుముఖంగా ఉన్నప్పటికీ మా అభిప్రాయాలను గౌరవించారు. అదే సమయంలో నైతికంగా వారు ఈ ఆందొళనకు సంపూర్ణ మద్దుతునిస్తున్నారు.

రైతుల ఐక్యత, పోరాట స్ఫూర్తి దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మేము వారి పోరాటంలో పూర్తిగా భాగం. రైతులు చేస్తున్న ఈ పోరాటంలో దేశ ప్రజలంతా భాగమవ్వాలని రైతుల గొంతుకకు మరింత శక్తినివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాము.

- మహేష్ రౌత్, సుధీర్ ధావ్లే, సురేంద్ర గాడ్లింగ్, ఆనంద్ తేల్ తుమ్డే, రోనా విల్సన్, హనీ బాబు, సాగర్ గోర్ఖే, రమేష్ గైకోర్, అరుణ్ ఫెరేరా, వెర్నన్ గోంజాల్వెస్, స్టాన్ స్వామీ, గౌతమ్ నవలాఖ
(తలోజా జైలు నుంచి)

Keywords : farmers protest, BK16, Taloja jail, Political prisoners on hunger strike in Taloja jail in support of farmersʹ movement
(2024-04-19 00:04:24)



No. of visitors : 685

Suggested Posts


bhima koregaon:ʹనా కొడుకు ప్రజల కోసం పాటలు పాడాడు.. అది దేశద్రోహమెట్లయ్యింది?ʹ

భీమా కోరేగావ్ కేసులో అరెస్టయ్యి జైల్లో ఉన్న కబీర్ కళా మంచ్ కళాకారుడు సాగర్ గోర్కే తల్లి సురేఖా గోర్కే తాను మాట్లాడిన ఓ వీడియో విడుదల చేశారు. తన కుమారుడితో పాటు ఆ కేసులో ఉన్న ఎవ్వరూ ఎలాంటి నేరం చేయలేదని

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులకు కరోనా పాజిటీవ్

భీమా కోరేగావ్ కేసులో మరో ముగ్గురు నిందితులు - మహేష్ రౌత్, సాగర్ గోర్ఖే , రమేష్ గైచోర్ ‍ లకు కరోనావైరస్ పాజిటివ్ వచ్చినట్టు గురువారం నాడు ʹహిందూʹ నివేదించింది.

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలంటూ.... జూన్ 13న ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ప్రదర్శన‌

కేంద్రం అక్రమ కేసులు మోపిఅరెస్టు చేసిన మేధావులు మరియు ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్ యూనియన్ జూన్ 13న ర్యాలీ నిర్వహించనుంది.

UAPA దుర్వినియోగంపై జస్టిస్ చంద్రచూడ్ ఆగ్రహం - స్టాన్ స్వామి మరణంపై దిగ్భ్రాంతి

భిన్నాభిప్రాయాలను అరికట్టడానికి లేదా పౌరులను వేధించడానికి UAPA చట్టాలను దుర్వినియోగం చేయరాదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సోమవారం అన్నారు. భారతదేశం మరియు అమెరికా మధ్య చట్టపరమైన సంబంధాలపై జరిగిన

భీమా కోరేగావ్ కేసులో అందరికన్నా చిన్నవాడైన ఈ మహేష్ ఎవరు ?

భీమా కోరేగావ్ కేసులో జైలులో ఉన్న‌16 మందిలో అందరికంటే చిన్నవాడు మహేష్ రౌత్. దయా హృదయుడు, స్నేహశీలి, మానవీయ సున్నితత్వ స్వభావం కలిగిన అతను తన స్నేహితులు, సహోద్యోగులలో మంచి పేరుపొందాడు, ఆదివాసీ భూముల్లో జరిగే గనితవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడారు.

స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ కు తరలించండి - బోంబే హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గర్ పరిషత్) కేసులో ప్రస్తుతం తలోజా జైలులో అనారోగ్యంతో ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని హోలీ ఫ్యామిలీ హాస్పటల్ లో చేర్పించాలని బొంబాయి హైకోర్టు శుక్రవారం రాష్ట్ర జైలు అధికారులను ఆదేశించింది.

Bhima-Koregaon:భీమా కోరేగావ్ అక్రమ కేసు ఎత్తి వేయాలి.... పంజాబ్ లో భారీ ప్రదర్శన‌

భీమా కోరేగావ్ కేసులో అక్రమంగా అరెస్టు చేసిన 16 మందిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్ లో భారీ ప్రదర్శన జరిగింది.

Bhima Koregaon: హక్కుల నేతలపై మరో కుట్ర

బీమా కోరేగాం ఎల్గార్ ప‌రిష‌ద్ కేసులో అరెస్ట‌యి జైలు నిర్భంధంలో ఉన్న హ‌క్కుల సంఘాల నేత‌లు, మేధావులు మ‌రో ప్ర‌మాద‌క‌ర‌మైన స‌వాలును ఎదుర్కోబోతున్నారు. వారిని త‌లోజా జైలునుంచి మ‌హారాష్ట్ర‌లోని వివిధ జైళ్ల‌కు త‌ర‌లించేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి.

హ‌నీ బాబును జూన్1 వరకు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేయొద్దు - ముంబై హైకోర్టు ఆదేశాలు

భీమా కోరేగావ్(ఎల్గార్ పరిషత్) కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ యూనివర్శిటీ అసోసియేట్ ప్రొఫెసర్ హనీ బాబును జూన్ 1 వరకు డిశ్చార్జ్ చేయవద్దని దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిని బొంబాయి హైకోర్టు గురువారం కోరింది.

కాలంగడుస్తూంటే గాయాలు మరింతగా బాధ పెడుతున్నాయి : సుధా భరద్వాజ్ కుమార్తె మాయెషా

ఈ రోజు భీమా కోరేగావ్ కేసులో జైలులో వున్న కార్యకర్త, న్యాయవాది సుధా భరద్వాజ్ పుట్టినరోజు. అమెరికా పౌరసత్వాన్ని తిరస్కరించి, జీవితంలో అన్ని సౌకర్యాలను త్యజింఛి, ఛత్తీస్‌గఢ్ లోని ఆదివాసీ ప్రాంతాల్లోని కార్మికులు, ఆదివాసీల మధ్య పనిచేయాలని సుధ నిర్ణయించుకుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రైతుల