పీకేఎం కోటి అరెస్టు - ఖండించిన ప్రజాసంఘాలు

పీకేఎం

ప్రజాకళామండలి ప్రధాన కార్యదర్శి కోటి ని ఈ రోజు హైదరాబాద్ లో ఆయన ఇంట్లో ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసులు దాదాపు 70 మందిపై అక్రమ కేసులు బనాయించి ఇప్పటి వరకు 8 మందిని అరెస్టు చేశారు. నవంబర్ 27 న గుంటురు జిల్లా గణపవరంలో అమరుల బంధు మిత్రుల సంఘం అధ్యక్షురాలు బొప్పూడి అంజమ్మను అదే రోజు గుంటురు జిల్లా మంగళగిరిలో చైతన్య మహిళా సంఘం నాయకురాలు రాజేశ్వరి అరెస్టులతో మొదలుపెట్టి డిసెంబర్ 9న చిత్తూరు జిల్లా మదనపల్లే లో ప్రగతిశీల కార్మిక సమాఖ్య చిత్తూరు జిల్లా కార్యదర్శి ఆంజనేయులును, డిసెంబర్ 12న గుంటురులో ప్రగతిశీల కార్మిక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి బి కొండారెడ్డిని, డిసెంబర్ 15న విశాఖపట్నంలో ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయకురాలు, న్యాయవాది అండలూరి అన్నపూర్ణను, డిసెంబర్ 21 అనంత పురం జిల్లా పుప్పాలలో ప్రజా కళా మండలి అనంతపురం కార్యదర్శి, గాయకుడు విజయ్ ని, డిసెంబర్ 22న గుంటురులో న్యాయశాస్త్ర విద్యార్థి పోట్లూరి క్రాంతిని, ఈ రోజు(డిసెంబర్ 23) హైదరాబాద్ లో ప్రజా కళా మండలి రాష్ట్ర కార్యదర్శి, గాయకుడు, కవి కోటిని అరెస్టు చేశారు. వీళ్ళందరిపై ప్రజాస్వామ్య వ్యతిరేకమైన దుర్మార్గమైన చట్టం UAPA కింద కేసులు నమోదు చేశారు.

ఈ అక్రమ అరెస్టులపై ప్రజా సఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ రోజు కోటి అరెస్టును ఖండిస్తూ వివిధ ప్రజా సంఘాలు హైదరాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశాయి. ఈ సమావేశంలో కోటి భార్య మేరీతోపాటు ప్రజా కళా మండలి అధ్యక్షుడు జాన్, పౌరహక్కుల సంఘ‍ం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, సహాయ కార్యదర్శి రఘునాథ్, విప్లవ రచయితల సంఘం నుండి సాగర్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు రవిచందర్, అమరుల బందు మిత్రుల సంఘం నుండి భవానీ, విజయ, పీడీఎం నుండి చంద్రమౌళి, కోటి పిల్లలు సూర్య, కుమారి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కోటి భార్య మేరీ... ఈరోజు ఉదయమే అందరూ నిద్రిస్తున్న సమయంలో పది మంది ఎటువంటి వారెంట్ చూపించకుండా ఇంట్లోకి చొరబడ్డారని తెలిపింది. కోటిని కాలకృత్యాలు చేసుకోనివ్వకుండా బట్టలు కూడా మార్చుకోనివ్వకుండా లాక్కెళ్ళారని మేరీ ఆవేదన వ్యక్తం చేసింది.

ఏపీలో ప్రజా సంఘాల కార్యకర్తలపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. ప్రజా సంఘాల నాయకులకు మావోయిస్టులతో సంబంధాలున్నాయని పోలీసులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అప్రజాస్వామిక చర్యలను ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన నిలబడ్డందుకు ఇలా అరెస్టులు చేయడం , వారిపై దుర్మార్గ చట్టాలను మోపడాన్ని ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని కోరారు. ఈ అక్రమ అరెస్టులకు ఏపీ ప్రభుత్వానికి సహకరిస్తున్న తెలంగాణ ప్రభుత్వ చర్యలను కూడా తీవ్రంగా దుయ్యబట్టారు .

కాగా కోటి అక్రమ అరెస్టును ఖండిస్తూ నిర్బంధ వ్యతిరేక వేదిక ఓ ప్రకటన విడుదల చేసింది. వేదిక కన్వీనర్ హరగోపాల్ , కో కన్వీనర్స్ ప్రొ.జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ లు విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

*పీ.కె.యం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటి అక్రమ అరెస్టును ఖండించండి.*
*ప్రజా సంఘాల నాయకులపై బనాయించిన ఉపా కేసులను ఉపసంహరించుకోవాలి.*
*ఉపా చట్టాన్ని రద్దు చేయాలి*

ఈరోజు హైదరాబాద్ నాగోల్ లో తన నివాసం నుండి యూనిఫారం లేని ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రజాకళామండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె. కోటేశ్వరరావు (కోటి)ను అరెస్ట్ చేసి, ఏపీకి తరలించడాన్ని నిర్బంధ వ్యతిరేక వేదిక తీవ్రంగా ఖండిస్తోంది. గత నెల రోజులుగా ప్రజా సంఘాల కార్యకర్తల అరెస్టులో ఇది ఎనిమిదవది. అందరిలాగానే ఇంటి పై దాడి చేయడం, అరెస్ట్ కు సంబంధించిన చట్టబద్ధ నియమాలు పాటించకపోవడం, ఉపా కేసుల్లో అక్రమంగా ఇరికించి జైలుకు పంపడం... ప్రజా సంఘాల ప్రశ్నించే గొంతును అణిచివేయడంలో భాగంగా ప్రభుత్వము అనుసరించే పద్ధతి గా మారిపోయింది.
మూడు దశాబ్దాలుగా ప్రజా సాంస్కృతిక రంగంలో కవిగా, గాయకునిగా కోటి సుప్రసిద్ధుడు. ప్రజా క్షేత్రములోని అనేక రంగాలలో... అలాగే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ పాటగా కోటి తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు. తెలంగాణ ఆవిర్భావం తరువాత కూడా టిఆర్ఎస్ పార్టీ చేసిన వాగ్దానాలను అమలు చేయాలని, ప్రత్యేక తెలంగాణ ప్రజాస్వామిక ఆకాంక్షలను సాకారం చేయాలని ఊరూరా తిరిగి ప్రజలను చైతన్యవంతం చేస్తూనే ఉన్న ప్రజాగళం కోటిది. నేడు రైతాంగం చేస్తున్న ఉద్యమానికి బాసటగా శక్తిమంతమైన పాటలు రాసి అండగా నిలబడ్డ కలం,గళం కోటిది. ఈ ప్రశ్నించే గొంతును నొక్కి వేయడానికి UAPA, IPC, APPSA చట్టాల కింద అక్రమ కేసులు పెట్టి కొంతకాలము జైల్లో ఉంచడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పన్నిన కుట్ర లో భాగమే ఈ అరెస్టు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజా సంఘాల నాయకులను అక్రమ అరెస్టు చేసి అప్రకటిత ఎమర్జెన్సీని అమలు పరుస్తున్నారు. చైతన్య మహిళా సంఘం, అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రగతిశీల కార్మిక సమాఖ్య, ప్రజా కళా మండలి కార్యకర్తలపై బనాయించిన ఉపా కేసులను ఉపసంహరించుకోవాలని, మొత్తంగా ఉపా చట్టాన్ని రద్దు చేయాలని నిర్బంధ వ్యతిరేక వేదిక డిమాండ్ చేస్తోంది.

ప్రొ.జి.హరగోపాల్, కన్వీనర్
ప్రొ.జి.లక్ష్మణ్
ఎం.రాఘవాచారి
కె.రవిచందర్
కో-కన్వీనర్స్

Keywords : PKM, KOTI, arrest, Andhrapradesh, police, UAPA
(2024-04-08 18:46:55)



No. of visitors : 695

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పీకేఎం