include 'men';
?>
రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్
హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దెబ్బ తగిలింది. పట్టణ ప్రాంతాలైనప్పటికీ రైతులు చేస్తున్న పోరాట ప్రభావం ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
సోనేపట్, అంబాలా మేయర్ పీఠాలను అధికార బీజేపీ కూటమి చేజార్చుకుంది. అలాగే హిస్సార్ జిల్లా ఉకలానా, రేవారీ పరిధిలోని ధారూహెరాలను బీజేపీ కోల్పోయింది. ఈ రెండు స్థానాలూ జేజేపీ నేత డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలాకు కంచుకోటలు కావడం గమనార్హం.
హరియాణా హోమ్ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గం అంబాలాలో బీజేపీ ఓటమి ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక స్థానిక సంస్థల్లో బీజేపీ ఓటమి పాలైందని తెలిసిన అనంతరం ధర్నాల్లో ఉన్న రైతులు మిఠాయిలు పంచుకుని, ఆనందంతో పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. అంబాలాలో జనచేతన పార్టీకి చెందిన శక్తి రాణి శర్మ 800 ఓట్ల తేడాతో విజయం సాధించడంతో ఆమె మేయర్ కాబోతున్నారు. జనచేతన పార్టీ అధినేత, మాజీ కేంద్ర మంత్రి వినోద్ శర్మ భార్య రాణి శర్మ.
తొలిసారి హరియాణాలో ప్రత్యక్ష విధానంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. సోనేపట్లో కాంగ్రెస్కు చెందిన మేయర్ అభ్యర్థి లలిత్ బాత్రా 14,000 ఓట్లతో విజయం సాధించారు. ʹʹసోనిపట్ మేయర్ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో విజయం సాధించింది. ప్రస్తుతం రైతులు నిరసనలు తెలుపుతున్న సింఘూ సరిహద్దుల పక్కనే ఇది ఉందన్న సంగతి తెలిసిందేʹʹ అని కాంగ్రెస్ పార్టీ నేత శ్రీవాత్సవ ట్వీట్ చేశారు.
అయితే, పంచకుల మేయర్ పదవి మాత్రం అతికష్టంతో బీజేపీ దక్కించుకుంది. ఇక్కడ కుల్ భూషణ్ గోయల్ విజయం సాధించారు. మొత్తం ఏడు మునిసిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. అంబాలాలో 20 సీట్లకు గాను అధికార బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలవడం గమనార్హం. అంబాలాలో బీజేపీ ఎనిమిది, జనచేతన పార్టీ ఏడు, కాంగ్రెస్ మూడు, హరియాణా డెమొక్రాటిక్ ఫ్రంట్ మూడు స్థానాల్లో విజయం సాధించాయి.
సోనెపట్లో మొత్తం 20 స్థానాలుండగా బీజేపీ 10, కాంగ్రెస్ 9, స్వతంత్రులు ఒకచోట గెలిచారు. ఇక, పంచకులలో బీజేపీ, కాంగ్రెస్ చెరో తొమ్మిది చొప్పున గెలుపొందాయి. ధర్హేరా, సప్లా, ఉకలానాలో స్వతంత్ర అభ్యర్థులు మేయర్లుగా గెలిచించారు.
Keywords : haryana, farmers protest, municipal elections, Amid farm protests, jolt to BJP-JJP in Haryana civic polls
(2024-04-07 13:13:41)
No. of visitors : 605
Suggested Posts
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరికఅనేక రాష్ట్రాల నుండి మహిళా రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి సిద్దమవుతున్నారు. ట్రాక్టర్లర్యాలీలో తామే ముందుండబోతున్నామని ప్రకటించారు మహిళా రైతులు. ఇందుకోసం అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నారు. |
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
ఇవాళ్టి రోజు ఎటువంటిదంటే, ఒక శాంతియుతమైన నిరసన ప్రదర్శన శత్రుపూరితంగా మారి నేను అనుమానితుడిగా మారిపోయాననిపిస్తున్నది. రెండు నెలలుగా మన సరిహద్దుల మీద కుతకుత ఉడుకుతున్న వేదననూ |
| కేసీఆర్ కుటుంబానికి చెందిన అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్ |
| నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు |
| 24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే ! |
| డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు |
| ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ |
| హుస్నాబాద్ స్తూపం స్థలాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక
|
| కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు |
| 5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా? |
| తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
|
| అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
|
| పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2) |
| వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1) |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్ |
| హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ |
| అనారోగ్యంతో ఉన్న మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు |
| మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ ! |
| సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణ |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ |
| గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం |
more..