ʹఅటవీ సంపద ఆదివాసులదేʹ - మన్యంలో తీవ్రమైన మావోయిస్టుల పోరాటం

ʹఅటవీ

అటవీ సంపద పై ఆదివాసులదే అధికారం అంటూ మన్యంలో మావోయిస్టులు పోరాటం ఉదృతం చేశారు. విశాఖపట్నం మన్యంలో ఒక వైపు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న మావోయిస్టులు మరో వైపు కాఫీ తోటలను ఆదివాసుల పరం చేయాలంటూ ఉద్యమం ప్రారంభించారు. గూడెంకొత్తవీధి మండలంలోని ఆర్వీనగర్, లంక పాకల తదితర ప్రాంతాల్లో ఉన్న కాఫీ తోటలపై ఆదివాసులకే హక్కు ఉండాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న మావోయిస్టులు ఇప్పుడు ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తూ సాగుతున్న ఉద్యమంలో అధికార తెలుగుదేశం పార్టీ నేతలోతో సహా ప్రతి ఒక్కరినీ కదిలించడంలో సఫలం అయిన అన్నలు ఇప్పుడు అటవీ సంపదంతా ఆదివాసులదేనంటూ ఉదృతం చేసిన ఉద్యమంలో కూడా ఆదివాసులందరినీ కలుపుక రావడంలో విజయం సాధించినట్టు కనపడుతోంది. శనివారం ఉదయం దాదాపు 300 ఆదివాసులు చాపరాతిపాలెం ప్రాంతం నుండి నలుగురు ఏపీఎఫ్ డీసీ ఉద్యోగులను పట్టుకెళ్ళి సాయంత్రానికి వదిలేశారు. కాఫీతోటలపై ఆదివాసులకు మాత్రమే హక్కు ఉండాలని, తోటల జోలికి ఏపీఎఫ్ డీసీ అధికారులు రావద్దని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉద్యోగులను హెచ్చరించినట్టు తెలిసింది. మరో వైపు బాక్సైట్ తవ్వకాలను నిలిపివేయాలనే డిమాండ్ తో తెలుగుదేశం నాయకులను పట్టుకెళ్ళి పది రోజుల తర్వాత వదిలేసి కొద్దిరోజులు కూడా గడవకముందే మళ్ళీ ఉద్యోగులను పట్టుకెళ్ళడం పోలీసులకు సవాల్ గా మారింది. పోలీసులు మన్యంలో కూంబింగ్ తీవ్రతరం చేశారు. అయినప్పటికీ అటు బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా ఇటు కాఫీ తోటలపై హక్కు కోసం గ్రామాల్లో ఆదివాసులు సభలు సమావేశాలు నిర్వహిస్తూనే ఉన్నారు.

Keywords : Maoists, Tribes, Bauxite, Coffee plants, Visakhapatnam
(2024-04-11 19:17:58)



No. of visitors : 1190

Suggested Posts


తుపాకులతో... బాక్సైట్ తవ్వకాలు - భగ్గుమంటున్న మన్యం

పచ్చని అడవి బతుకులను బూడిద చేయడానికి ప్రభుత్వం నడుం భిగించింది. మన్యం ఆదివాసులంతా తమ జీవితాలను బుగ్గి చేయొద్దని వేడుకుంటున్నా, మావోయిస్టు పార్టీతో సహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్నా.... చివరకు అధికార తెలుగుదేశం నాయకులు కూడా ఒద్దని చెబుతున్నా.... తెలుగుదేశం ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది....

ముందు బాక్సైట్‌ సంగతి చూడండి - పాణి

అరకు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్య మీద చాలా మంది అంగలారుస్తున్నారు. ఆదివాసుల నుంచి ఎదిగిన నాయకులను చంపేస్తారా? అంటున్నారు. ఒకవేళ ఆదివాసులు కాకపోయి ఉంటే అప్పుడు ఇంకో రకమైన నిట్లూర్పులు వినిపించేవి. అసలు ఎవర్నీ చంపే దాకా పరిస్థితులు పోకూడదు. దీని మీద ఎవరూ సిద్ధాంతాలు చెప్పనవసరం లేదు. అది చాలా మామూలు మానవతా వైఖరి. వివరాల్లోకి వెళితే ఎంతయినా మాట్లాడుకోవచ్చ

టీడీపీ సైట్ నుండి బాబు బాక్సైట్ లేఖను ఎందుకు మాయం చేశారు ?

విశాఖపట్నం ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల పై చంద్రబాబు రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారా ? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాక్సైట్ తవ్వకాలు జరప వద్దని, అది రాజ్యాంగ విరుద్దమని డిశంబర్ 24, 2011న గవర్నర్ కు లేఖ రాసిన చంద్రబాబు ఇప్పుడు బాక్సౖట్ తవ్వకాలకు అనుమతులు ఎలా ఇచ్చారు ? నిన్నటిదాకా తెలుగుదేశం వెబ్ సైట్ లో ఉన్న ఆ లేఖ ఇవ్వాళ్ళ ఎందుకు మాయమయ్యింది ?....

బాక్సైట్ నిరసన - మన్యం బంద్

విశాఖమన్యంలో బాక్సైట్ తవ్వకాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం మన్యం బంద్ జరగనుంది.....

బాక్సైట్ తవ్వకాలు ఆపేయండి లేదంటే నక్సల్స్ బతకనివ్వరు - మంత్రి అయ్యన్నవేడుకోలు

ʹప్రతిపక్షాలను ఎదుర్కోవచ్చు నక్సలైట్లను ఎదుర్కోలేంʹ ఇది ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడి ఆందోళన. విశాఖపట్నం జిల్లా మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి....

బాక్సైట్ పోరు - మన్యం బంద్ సక్సెస్

విశాఖ మన్యం బంద్ విజయవంతమైంది. రాష్ట్ర ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలకోసం అనుమతినివ్వడాన్ని నిరసిస్తూ అఖిలపక్షం శనివారం బంద్ కు పిలుపునిచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలోని తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు కూడా ఈ బంద్ లో....

బాక్సైట్ పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం

విషాఖ మన్యంలో బాక్సైట్ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. మావోయిస్టుల నాయకత్వంలో గిరిజనుల పోరాటం, స్వపక్షం విపక్షం నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ʹఅటవీ