రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు


రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు

రైతాంగ

కేంధ్ర ప్రభుత్వం తీసుక వచ్చిన 3 రైతు చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దాదపూ 38 రోజులుగా దేశంలో రైతాంగ చేస్తున్న పోరాటానికి భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తన సంపూర్ణ మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఆంధ్రా ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గణేష్ మీడియాకు విడుదల చేసిన‌ ప్రకటన....

భారతదేశ ఆరిక వ్యవస్థ మునుపెన్నడూ లేనంత తీవ్రమైన‌ వ్యవసాయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది 1960లోప్రవేశపెట్టబడిన హరిత విప్లవం ఈ సంక్షోభానికి నాంది పలికింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు కేంధ్ర రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిన కాంగ్రెస్ తోపాటు వివిధ ప్రాంతీయ పార్టీలు అనుసరించిన సామ్రాజ్యవాద అనుకూల విధానాలనే మోడీ ప్రభుత్వం నేడు మరింత వేగంగా, క్రూరంగా అమలు చేయటం వల్లనే ఈ వ్యవసాయ సంక్షోభం మరింత తీవ్ర స్థాయికి చేరుకున్న ది.

1991లో దేశంలో ప్రవేశ పెట్టబడిన నూతన ఆర్థిక‌ విధానాలు (సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ) కార్పోరేటు, మార్కెట్ శక్తుల ఆధిపత్యాన్ని నెలకొల్పాయి. 1995 లో ప్రపంచ వాణిజ్య సంస్థ(WTO) ఏర్పడిన తర్వాత దానితో భారత దళారీ పాలకులు కుదుర్చుకున్న ఒప్పందాల వలన ప్రభుత్వ రంగ ఆజమాయిషీ గల దేశ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్థానంలో దేశ, విదేశీ కార్పోరేటు సంస్థల ఆజమాయిషీ ముందుకొచ్చింది. WTO పై ఆధిపత్యం ఉన్న అమెరికా వంటి సామ్రాజ్యవాద దేశాలు విధించిన షరతులకు తల ఒగ్గి దేశంలో వ్యవసాయ రంగానికి రాను రానూ రయితీలను తగ్గించేస్తున్నారు. మరో వైపు ఎరువుల ధరలు, నీటి పన్ను, కరెంటు రేట్లు విపరీతంగా పెంచేస్తున్నారు. అందుకు తగ్గట్టు పంటల రేట్లు మాత్రం పెరగడం లేదు.

ఈ నేపథ్యంలో WTO నిబందనలకు అనుగుణంగా వ్యవ‌సాయాన్ని కార్పోరేటీకరణ చేసే పనిలో మోడీ ప్రభుత్వ నిమగ్నమైంది. దేశంలోని మొత్తం వ్యవసాయాన్ని కార్పోరేట్ల పర‍ం చేసి రైతులను తమ భూముల్లోనే కూలీలుగా మార్చే కుట్రకు తెరతీసింది. 3 వ్యవసాయ చట్టాల పేరుతో రైతులను తమ భూములనుండి బేదఖలు చేసి అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకు సిద్దమయ్యింది.

కేంద్ర ప్రభుత్వం పాలపడుతున్న కుట్రను గ్రహించిన దేశ రైతాంగం ప్రస్తుతం అలుపెరగని పోరాటం చేస్తోంది. రైతాంగం చేస్తోన్న ఈ పోరాటానికి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మద్దతు వస్తోంది. దాంతో మోడీ ప్రభుత్వం దుష్ప్రచారానికి తెరలేపింది.

బీజేపీ, ఆరెస్సెస్ వాటి ఐటీ సెల్ లు రైతులపై సోషల్ మీడియాలో మీడియాలో దుర్మార్గమైన అబద్దపు ప్రచారానికి తెగించాయి. రైతుల ఉద్యమంలో చైనా, పాకిస్తాన్ హస్తమున్నదని, ఉగ్రవాదులున్నారని..ఇలా రకరకాల ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయని రైతులు పోరాటాన్ని ముందుకు నడిపించడమే కాక, దేశంలోని అన్ని వర్గాల మద్దతును కూడగట్టుకోవడంలో కూడా విజయం సాధించారు.

ప్రభుత్వం చేస్తున్న అన్ని రకాల దాడులను ఎదుర్కొంటూ రైతులు చేస్తున్న సమరశీల పోరాటానికి మా పార్టీ AOBSZC సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. ఆత్మహత్యలు, బలిదానాలతో ఇప్పటి వరకు ప్రాణాలర్పించిన 40 మందికి పైగా రైతులకు నివాళులర్పిస్తున్నాము. వారి కుటుంబసభ్యులకు, బందు మిత్రులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

ప్రియమైన రైతులారా ! ప్రజలారా!

ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్ర‌భుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన గుడ్డ‌కు మాసిక వేయడ‌మే అవుతుంది తప్ప రైతాంగ సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు.

సామ్రాజ్య‌వాదానికి దాస్యం చేస్తున్న భారత బడా బూర్జునా, భూస్వామ్య‌ వర్గాలను , వారు సంరక్షిస్తున్న అర్థ వ‌లస, అర్థ‌ భూస్యామ్య వ్యవస్థ‌ను కూలదోసి దేశంలో ధీర్ఘకాల ప్రజాయుద్ద పంథాలో వ్యవసాయ విప్లవం ఇరుసుగా సాగుతున్న నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడం తప్ప ఈ వ్యవసాయ సంక్షోభ పరిష్కారానికి వేరే దారి లేదు.

దున్నేవారికే భూమి, విప్లవ ప్రజా కమిటీలకే సర్వాధికారాలు లభించే వరకు, నూతన ప్రజాస్వామిక వ్యవస్థను స్థాపించేంత వరకు ఈ సమస్య పరిష్కారం కాదు. రైతాంగం ఎన్ని ఆటు పోట్లు, ఆటంకాలు, ఎగుడు దిగుళ్ళు ఎదురైనా నూతన ప్రజాస్వామిక భారత దేశాన్ని స్థాపించడంలో భాగంగా తమ విప్లవ ప్రభుత్వాన్ని నిర్మాణం చేసుకునే వైపు దృఢంగా ముందుకు సాగాలని కోరుతున్నాం.

విప్లవాభినందనలతో
గణేష్,
కార్యదర్శి,
ఆంధ్రా ఒడిశా బార్డర్ స్పెషల్ జోనల్ కమిటీ (AOBSZC)

CPI మావోయిస్టు


Keywords : cpi maoist, farmers, struggle,
(2023-03-22 10:26:37)



No. of visitors : 1218

Suggested Posts


అవార్డులను వాపస్ చేయడానికి రాష్ట్రపతి భవన్ వైపు మార్చ్ చేసిన క్రీడాకారులు - అడ్డుకున్న పోలీసులు

రైతు చట్టాల విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ క్రీడా రంగంలో వివిధ అవార్డులు అందుకున్న వారుఇవ్వాళ్ళ రాష్ట్రపతి భవన్‌ వైపు మార్చ్ నిర్వహించారు.

రైతు ఉద్యమానికి మద్దతుపలికిన బాలీవుడ్ ప్రముఖులపై ఐటీ దాడులు

దేశంలో కొనసాగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుపలికిన బాలీ వుడ్ ప్రముఖుల ఇళ్ళ‌పై ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది. నిర్మాత, దర్శకుడు అనురాగ్ కాశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను ఇళ్ళపై ఈ రోజు ఆదాయపు పన్ను శాఖ రైడ్స్ నిర్చహించింది.

ఈ నెల 27న రైతు సంఘాల భారత్ బంద్ - విజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీ పిలుపు

గత 10 మాసాల రైతాంగ ఉద్యమంలో అపూర్వ స్థాయిలో 5 సెప్టెంబర్ నాడు ముజఫర్ నగర్ లో భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) సహ సంయుక్త కిసాన్ మోర్చాతో పాటు కేంద్ర సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న అనేక రైతు సంఘాల పిలుపుపై జరుపతల పెట్టిన కిసాన్ మహా పంచాయత్ తో బెంబేలు పడిన ఉత్తర ప్రదేశ్ అదిత్యనాథ్ యోగీ సర్కార్ దానిని

ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు

ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు.

దేశంలో ప్రజాపోరాటాలు ఆగవు... వాటికి నాయకత్వం వహించకుండా ఏశక్తీ మమ్మల్ని అడ్డుకోలేదు - మావోయిస్టు పార్టీ ప్రకటన

ప్రజా వీరులు గేంద్ సింగ్, బాబూరావు సడ్మెక్, గుండాదుర్, బిర్సాముండా, సిద్ధ-కానో, జ్యోతిబా ఫూలే, భగత్ సింగ్, రామరాజు, కొంరంభీం, బాబా సాహెబ్ అంబేడ్కర్, పెరియార్ మున్నగు అనేక మంది మహనీయుల పేర్లు ఉచ్ఛరించడానికైనా నైతిక అర్హతలేని బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు వారిని ముందు పెట్టి శాహీన్ బాగ్ నుండి సిల్గేర్ వరకు ప్రజా పోరాటాలను నెత్తురుటేరులలో ముంచడాన్ని మా పార్టీ

ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే ‍- మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన

మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.

రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్

నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది.

ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపు

వాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు.....

కెనడాలోని పాఠశాలల్లో భారత్ రైతు ఉద్యమ పాఠ్యాంశాలు... తొలగించాలని భారత్ లేఖ‌

భారత దేశంలో సాగుతున్న రైతుల ఉద్యమం గురించి కెనడాలోని కొన్ని పాఠశాలల్లో పాఠ్యాంశాలు ప్రవేశపెట్టడాన్ని భారత ప్రభుత్వం వ్యతిరేకింది. ఆ పాఠ్యాంశాలను వెంటనే తొలగించాలని కెనడాలోని భారత కాన్సులేట్ అంటారియో ప్రావిన్స్‌లోని

ʹRevolutionary Greetings to Indian peasantry fighting non compromisingly with a strong willʹ

he Central Committee of our Party firstly conveys its revolutionary greetings to the Indian peasantry that is fighting non-compromisingly and with a strong will against the central government to achieve their

Search Engine

అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
more..


రైతాంగ