మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక
కేంద్రం తీసుకవచ్చిన కార్పోరేట్ అనుకూల రైతు వ్యతిరేక మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ తో దేశ రైతాంగం చేస్తున్న ఉద్యమం తీవ్రమవుతోంది. ప్రభుత్వంతో 40 రైతు సంఘాలు ఏడు సార్లు జరిపిన చర్చల్లో ఏమీ తేలకపోగా ప్రభుత్వం తన కార్పోరేట్ అనుకూల విధానాల నుండి వెనక్కి తగ్గడానికి ససేమిరా అనడంతో రైతు సంఘాలు తమ పోరాటాన్ని ఉదృతం చేయడానికి నిర్ణయించాయి.
జనవరి 26 రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలోకి ట్రాక్టర్ మార్చ్ నిర్వహించడానికి నిర్ణయించిన రైతు సంఘాలు దానికి తగ్గ ఏర్పాట్లపై దృష్టి సారించాయి. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు. అనేక రాష్ట్రాల నుండి మహిళా రైతులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కడానికి సిద్దమవుతున్నారు. ట్రాక్టర్లర్యాలీలో తామే ముందుండబోతున్నామని ప్రకటించారు మహిళా రైతులు. ఇందుకోసం అనేక మంది మహిళలు ట్రాక్టర్లు నడపడంలో శిక్షణ తీసుకుంటున్నారు.
హర్యాణా రాష్ట్ర వ్యాప్తంగా ఈ శిక్షణా కార్యక్రమాన్ని భారతీయ కిసాన్ సంఘ్ ప్రారంభించింది. జింద్-పాటియాలా జాతీయ రహదారిలోని ఖట్కర్ టోల్ ప్లాజా వద్ద సోమవారం జింద్ జిల్లాకు చెందిన మహిళల కోసం శిక్షణ శిభిరం ప్రారంభమయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల మహిళలు ట్రాక్టర్లు నడపడానికి మహిళలు శిక్షణ పొందుతున్నారు. పితృస్వామ్య హర్యానాలో ఇది నిజంగా గొప్ప మార్పు మార్పు. జనవరి 26 న మహిళలు ట్రాక్టర్లు నడుపుతూ రాజధానిలోకి వెళ్లడం ద్వారా దేశానికి ఒక గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారు. అదే విధంగా రైతు కుటుంబాలు మొత్తం ఈ ఉద్యమంలో ఉన్నాయని దేశానికి చాటబోతున్నారు.
అయితే ఈ మహిళల్లో చాలా మందికి ట్రాక్టర్ నడపడం వచ్చు. తమ వ్యవసాయ పనుల కోసం వాళ్ళు అనేక సార్లు ట్రాక్టర్ నడిపి ఉన్నారు. అయితే నేషనల్ హైవేలపై ట్రాక్టర్ నడపడం మాత్రం వాళ్ళకు కొంత కొత్త. అదే ఇప్పుడు ఆ మహిళా రైతులు నేర్చుకుంటున్నారు. అయితే మహిళలకు శిక్షణనివ్వడం చాలా సులువుగా ఉండని వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటున్నారని ఓ శిక్షకుడు మీడియాకు చేప్పాడు.
టోల్ ప్లాజాలో జరిగే శిక్షణా సమావేశాలకు జిల్లాకు చెందిన వందలాది మంది మహిళలు హాజరవుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి సన్నాహాలు జరుగుతున్నాయని సఫా ఖేరి గ్రామానికి చెందిన సిక్కిం నైన్ అనే మహిళ తెలిపారు. ʹఇది ప్రభుత్వానికి మేము చూపిస్తున్న ట్రైలర్ మాత్రమే. ట్రాక్టర్ పరేడ్లో పాల్గొనడానికి మేము మా ట్రాక్టర్లను ఎర్ర కోటకు తీసుకువెళతాము. ఇది చారిత్రక సంఘటన అవుతుంది ʹ అని 38 ఏళ్ల నైన్ అన్నారు.
"మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది. మేము వెనకడుగు వేయబోం, మమ్మల్ని తేలికగా తీసుకోకండి. ఇది రెండవ స్వాతంత్య్ర యుద్ధం. మేము ఈ రోజు పోరాడకపోతే, భవిష్యత్ తరాలకు మేము ఏం సమాధానం చెప్పాలి? ʹ అని ప్రశ్నించింది నైన్
తనను తాను ʹఖట్కర్ గావ్ హై, రాజ్పాల్ కి ఘర్వాలి హన్, సరోజ్ నామ్ హై (నా గ్రామం ఖాట్కర్, నా భర్త రాజ్పాలా, నాపేరు సరోజ్ʹ అని పరిచయం చేసుకుంటూ 35 ఏళ్ల యువతి, ʹనేను ఒక రైతు బిడ్డను. ప్రభుత్వం ఇప్పటికే రైతులపై చాలా దారుణాలకు పాల్పడింది, కాని ఇక మేము దీనిని ఇక సహించము. ʹ అని చెప్పింది.
ఖాట్కర్, సఫా ఖేరి, బార్సోలా, పోక్రీ ఖేరి గ్రామాల నుండి మహిళలు శిక్షణ కోసం వస్తున్నారని రైతు విజేందర్ సింధు తెలిపారు. మహిళలు ఈ విధంగా ముందుకు రావడం ఇక్కడ చాలా పెద్ద విషయమే కానీ ఇది చాలా సహజమైనది అని వృద్ధ రైతు సత్బీర్ పెహ్ల్వాల్ అన్నాడు.
"మా బిడ్డలు కొందరు దేశ సరిహద్దుల వద్ద పోరాడుతున్నారు, మరికొందరు బిడ్డలు జాతీయ రాజధానిని గెరావ్ చేశారు," అని పెహ్ల్వాల్ అన్నారు
రిపబ్లిక్ డే రోజు జవాన్లు చేసే పెరేడ్ లాగానే మా కిసాన్లు చేసే ట్రాక్టర్ పెరేడ్ ఉంటుందని ఖాప్ నాయకుడు ఆజాద్ సింగ్ పాల్వాన్ అన్నాడు
Keywords : farmers protest, delhi, tractors rally, ʹDaughters of farmersʹ on tractors headed for Delhi
(2024-03-28 22:38:45)
No. of visitors : 922
Suggested Posts
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
ఇవాళ్టి రోజు ఎటువంటిదంటే, ఒక శాంతియుతమైన నిరసన ప్రదర్శన శత్రుపూరితంగా మారి నేను అనుమానితుడిగా మారిపోయాననిపిస్తున్నది. రెండు నెలలుగా మన సరిహద్దుల మీద కుతకుత ఉడుకుతున్న వేదననూ |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్హర్యాణా మున్సిపల్ ఎన్నికల్లో వ్యవసాయ చట్టాల ప్రభావం కొట్టొచ్చినట్టు కనిపించింది. బీజేపీ - జన నాయక్ జనతా పార్టీ (జేజేపీ) కూటమికి ఈ ఎన్నికల్లో గట్టి ఎదురు దె |