ఆమె బైటికి వెళ్ళకుండా ఉంటే రేప్ జరిగేది కాదు - మహిళా కమిషన్ సభ్యురాలి దుర్మార్గపు వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ బదాయూలో గుడికి వెళ్ళిన 50 మహిళపై పూజారి, అతని అనుచరులు గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిన సంఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు దుర్మార్గంగా మాట్లాడింది. అత్యాచార బాధిత కుటుంబ సభ్యులను కలవడానికి జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి బుధవారం బదాయూ వెళ్లారు. కుటుంబ సభ్యులను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ʹʹఆమె ఎవరి నుంచైనా ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు భావిస్తే.. బయట తిరిగే సమయాన్ని సరిగ్గా గుర్తు పెట్టుకోవాలి. ఆలస్యంగా బయటికి వెళ్లకుండా జగ్రత్త పడాలి. అలాంటి వ్యక్తి సాయంత్రం ఆలస్యంగా బయటికి వెళ్లకపోయినా, లేదంటే ఎవరైనా కుటుంబ సభ్యుల్ని వెంట తీసుకు వెళ్లినా ఆమె క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చేది. ఈ ఘటన జరిగి ఉండేది కాదుʹʹ అని అన్నారు.
చంద్రముఖి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా నెటిజనులు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉన్న వాళ్ళే ఇలా మాట్లాడటమేంటని నెటిజనులు విమర్షలు గుప్పించారు. దీంతో అప్రమత్తమైన మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ చంద్రముఖిని పిలిచి మాట్లాడతానని చెప్పారు. ʹʹఆమె (చంద్రముఖి) ఇలా ఎలా వ్యాఖ్యానించిందో అర్థం కావడం లేదు. ఏ సమయంలోనైనా ఎక్కడైనా తిరిగేందుకు మహిళకు సర్వాధికారాలు ఉన్నాయి. మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత సమాజంతో పాటు మనకు ఉందిʹʹ అని రేఖా శర్మ ట్విట్టర్ లో రాసుకొచ్చారు.
ఈ నెల మూడవ తేదీన సాయంత్రం బదాయూ జిల్లా మేవాలి గ్రామంలో 50 ఏళ్ళ అంగన్ వాడి మహిళ రోజూ వెళ్ళినట్టు గానే ఆ గ్రామంలో గుడికి వెళ్ళింది. ఒంటరిగా ఉన్న ఆమెపై గుడి పూజారి హంత్ బాబా సత్యనారాయణ, అతని అనుచరుడు వేద్ రాం, డ్రైవర్ జస్పాల్ లు అత్యాచారానికి ఒడి గట్టారు. ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవడానికి ఆమె ప్రయత్నించడంతో ఆ ముగ్గురు దుర్మార్గులు ఆమెను దారుణంగా కొట్టారు. కాలు, పక్కటెముకలను విరగొట్టారు. ఆమె జననావయవంలో రాడ్డు జొప్పించి మరీ అఘాయిత్యానికి పాల్పడి చంపేశారు.
ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధితుల పక్షం ఉండాల్సిన అధికార గణం బాధితులనే దోషులను చేయడం బీజేపీ హయాంలో పెరిగిపోయింది. ఇదే రాష్ట్రంలోని హత్రాస్ లో 19 ఏళ్ళ యువతిని అత్యాచారం చేసి చంపేస్తే... ఆ యువతిపై అత్యాచారం చేసి నాలుక కోసేశారని, గొంతుకూడా కోశారని, వెన్నెముక విరిగిపోయిందని ఆ బాలిక కుటుంబం చెప్పినప్పటికీ...వైద్యం చేసిన వైద్యులు కూడా ద్రువీకరించినప్పటికీ "బాధితురాలి నాలుక కత్తిరించే వార్త పూర్తిగా తప్పు, మేము బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసాము. ఆమె వెన్నెముక విరిగిపోయిందనేది కూడా అబద్దం. ఆమె మెడ ఎముకపై గాయాలు అయ్యాయి. అత్యాచారం జరిగినట్టు కూడా వైద్యులు కనుగొనలేదు. బాధితురాలి ప్రైవేట్ భాగాలపై ఎలాంటి గాయాలు లేవుʹʹ అని హత్రాస్ జిల్లా ఎస్పీ విక్రంత్ వీర్ బహిరంగంగా ప్రకటించిన విషయం మనం మర్చిపోగలమా? ʹʹ ఈ మీడియా వాళ్లు ఈ రోజు ఉంటారు.. రేపు వెళ్తారు. మేము మాత్రం ఇక్కడే ఉంటాం. స్టేట్మెంట్ను మార్చడం.. మార్చకపోవడం మీ ఇష్టం. కానీ మేం మార్చగలంʹʹ అని సాక్షాత్తూ జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ లష్కర్ బెదిరించిన విషయం మర్చిపోగలమా ? హత్రాస్ లో బీజేపీ నాయకులైన ఠాకూర్లు నిందితులకు మద్దతుగా ఊరేగింపులు తీయడం, బాధిత కుటుంబాన్ని బెధిరించడం మర్చిపోతామా ? ఈ రోజు జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్ర ముఖి మాటలను కూడా ఈ నేపథ్యంలో చూస్తే మనకు ఈ దేశంలో ఏం జరుగుతుందో స్పష్టంగా అర్దమవుతుంది.
Keywords : uttarapradesh, NCW Member Says ʹBadaun Gangrape Victim Shouldnʹt Have Gone Out Alone In Eveningʹ, NCW, Chandramukhi
(2021-01-25 01:07:24)
No. of visitors : 1385
Suggested Posts
| అది రామరాజ్యం... ఆవులకేమో అంబులెన్సులు... పిల్లలకేమో చావుకేకలు !ఆవులకు ఏమైనా అయితే రక్షించడానికి, వాటిని ఆఘమేఘాలమీద ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్స్ లు ప్రారంభించారు. ఇంత గొప్పగా జరుగుతున్న యోగీ మహరాజ్ పాలనలో గోరఖ్ పూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రిలోఆక్సీజన్ లేక 63మంది చిన్నారుల ప్రాణాలు పోయాయి. ప్రభుత్వం బాకీ పడ్డ 60 లక్షల రూపాయలు .... |
| అనుకున్నంతయ్యింది...బీజేపీ నేత కూతురును పెళ్ళి చేసుకున్న దళిత యువకుడిపై దాడి జరిగింది
నాన్నా నన్నూ అజిత్ ను చంపకండి ప్లీజ్ అంటూ ఉత్తర ప్రదేశ్ ఎమ్మెల్యే కూతురు సాక్షి మిశ్రా వేడుకున్న వీడియో మీకు గుర్తుంది కదా.... తాను దళితుడిని పెండ్లి చేసుకున్నందుకు మమ్మల్ని చంపడానికి నాన్న గూండాలను పంపుతున్నాడని, పోలీసులు తమకు రక్షణ కల్పించాలని ఆమె విఙప్తి చేసింది. అయితే ఆ యువతి అనుకున్నంతా అయ్యింది. సాక్షాత్తూ హైకోర్టు ముందరే వీరిపై దాడి |
| రోహింగ్యాల పట్ల సానుభూతి చూపిన ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందే - బీజేపీ నేత రోహింగ్యా శరణార్థులను సందర్శించిన సినీ నటి ప్రియాంకా చోప్రా దేశం విడిచి వెళ్ళాలంటూ బీజేపీ నేత వినయ్ కటియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందేనంటూ ఆయన అన్నారు. |
| అది మనువాదపు కసాయి రాజ్యం - ప్రేమంటే నరనరాన ద్వేషంఓ యుతి, ఓ యువకుడు జంటగా రోడ్డు మీద వెళ్తున్నారు. నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ వెళ్తున్న వాళ్ళను చూసి యాంటీ రోమియో స్క్వాడ్ ముసుగేసుకున్న మనువులకు మండింది. సంఘ్ పరివార్ పాలనలో మగ ఆడ కలిసి తిరగడ ఎంత పాపం ! ఆ పాపానికి ఒడిగట్టిన ఆ ఇద్దరినీ పట్టుకొని కొట్టారు, పోలీసులతో కలిసి యువకుడికి గుండు గీసి అవమానించారు.... |
| యోగీ రాజ్యం: ఆవును కాపాడటం కోసం మహిళను చంపేసిన పోలీసు అది ఉత్తర ప్రదేశ్ లోని హర్రియా పట్టణం శనివారం నాడు వేగంగా వెళ్తున్న ఓ పోలీసు జీబు డ్రైవర్ కంట్రోల్ తప్పింది. ఆ జీబుకు ఎదురుగా ఓ ఆవు వస్తోంది. డ్రైవర్ కు ఆ సమయంలో తమ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్, ఆయన శిష్యులైన గోరక్షకులు.... |
|
యోగీ రాజ్యంలో దారుణం... ఆక్సిజన్ లేక 30 మంది చిన్నారుల మృతి !ఆక్సిజన్ సరఫరా చేస్తున్న కంపెనీకి ప్రభుత్వం కట్టాల్సిన 66లక్షల రూపాయల బాకీ కట్టకపోవడం వల్ల ఆ కంపెనీ ఆక్సిజన్ పంపిణీని ఆపేసింది. ఫలితంగా ఇంతమంది చిన్నారుల ప్రాణాలు గాల్లో పోయాయి.... |
| అమానుషంగా అమ్మాయిలను కొట్టారు...వాళ్ళ మీదే కేసులు పెట్టారు...బేటీ బచావ్...బేటీ పడావ్..అంటే ఇదేనా ?
విద్యార్థినులపై దాడి చేసి నెత్తురోడేట్టు అమానుషంగా కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవల్సింది పోయి బాధితులపైనే కేసులు పెట్టారు. ఉత్తర ప్రదేశ్ లోని బెనారస్ హిందూ యూనివర్సిటీకి చెందిన 1000 మంది విద్యార్థులపై ఇవ్వాళ్ళ కేసు నమోదయ్యింది.... |
| ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయండి.. బీజేపీ మహిళా మోర్చా చీఫ్ సునీతఇప్పుడు ముస్లింలకు ఒకే ఒక్క పరిష్కారం ఉంది. హిందూ సోదరులు పది మంది కలిసి గ్రూపుగా ఏర్పడి ముస్లిం మహిళలను గ్యాంగ్ రేప్ చేయాలి. తల్లులు, చెల్లెళ్లు ఎవరినీ వదలకూడదు. అందరినీ బహిరంగంగా వీధుల్లోకి లాక్కొచ్చిమరీ అత్యాచారం చేయాలి. |
| పోలీసుల దుర్మార్గం...బాలిక గ్యాంగ్ రేప్ !రక్షక భటులు ఓ బాలికను కాటేశారు. కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మథుర గోవింద్నగర్లో పదవతరగతి చదువుతున్న ఓ బాలికను ఇన్స్పెక్టర్ రమాకాంత్ పాండే, మరో పోలీస్ ప్రవీణ్ ఉపాధ్యాయ్లు.... |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
ఉత్తరప్రదేశ్లో మహిళలపై అత్యాచారపర్వాలు కొనసాగుతున్నాయి. హథ్రాస్ ఉదంతం మరవకముందే బదూన్లో మరో అమానుష ఘటన చోటుచేసుకుంది. |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
| ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
|
| అదానీపై కథనానికి అరెస్టు వారెంట్ ! |
| వ్యవసాయ చట్టాలపై ప్రచారం చేస్తున్న రైతుల అరెస్ట్
|
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
|
| అవును, మా గెలుపుకు MIM సహకరిస్తోంది - బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు |
| ʹమాన్ʹ లాగే మిగతా ముగ్గురు కూడా కమిటీనుండి బైటికి రావాలని రైతుల పిలుపు |
| వ్యవసాయ చట్టాలపై ʹసుప్రీంʹ నియమించిన కమిటీ నుండి ఒకరు ఔట్ |
| సంజీవ్ పాటతో మళ్ళీ మన ముందుకొస్తున్న జననాట్యమండలి
|
| పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?
|
| సుప్రీం కమిటీని తిరస్కరిస్తున్నాం - పోరాటం ఆపబోం
|
| తెలంగాణలో రైతులకు మద్దతు పలకడం నేరమా ? |
| యూపీలో మరో ఘోరం... తలకు తుపాకీ పెట్టి 19 ఏళ్ళ అమ్మాయిపై అత్యాచారం... ఆపై బిల్డింగుపై నుండి కిందికి తోసేసిన దుర్మార్గుడు. |
| రైతు చట్టాల రద్దుకై పౌరహక్కుల సంఘం పాద యాత్ర |
| ఎముకలు విరిచారు...రాడ్లను దూర్చారు..గుడికి వెళ్ళిన మహిళపై పూజారి, అతని అనుచరుల గ్యాంగ్ రేప్
|
| ఏపీలో కొనసాగుతున్న అక్రమ అరెస్టులు - దుడ్డు ప్రభాకర్ అరెస్ట్
|
| మహిళా శక్తి ఇప్పుడు యుద్ధభూమిలో చేరింది, మమ్మల్ని తేలికగా తీసుకోకండి - మహిళా రైతుల హెచ్చరిక |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
|
| రిపబ్లిక్ డేనాడు ఢిల్లీలోకి ట్రాక్టర్ ర్యాలీ - ఉద్యమం మరింత ఉదృతం చేస్తామన్న రైతు సంఘాలు
|
| రైతులకు మద్దతుగా సింగు సరిహద్దులకు చేరుకున్న ఏపీ, తెలంగాణ స్ట్రీట్ వెండర్స్ |
| హర్యాణా, రాజస్తాన్ బార్డర్ లో రైతులపై వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు |
| రైతుల ఆందోళనల ఎఫెక్ట్.. హరియాణా మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ కూటమికి షాక్ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
|
| అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా కేరళ అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం... కొద్ది సేపట్లోనే బీజేపీ ఎమ్మెల్యే యూ టర్న్
|
| షహీన్ భాగ్ లో కాల్పులకు పాల్పడ్డ వ్యక్తి బీజేపీలో చేరిక - విమర్షలు రావడంతో బహిష్కరణ
|
more..