పౌరహక్కుల సంఘం పాదయాత్రను ప్రభుత్వం ఎందుకు భగ్నం చేసింది ?

కేంద్రం తీసుక వచ్చిన వ్యవసాయ చట్టాలకు రైతులు చేస్తున పోరాటానికి మద్దతుగా పౌరహక్కుల సంఘం చేపట్టిన పాదయాత్రను భగ్నం చేయడమే కాక ఆ సంఘం నాయక్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ... అసలు మొత్త వ్యవహారం జరిగిన తీరును వివరిస్తూ పౌరహక్కుల సంఘం విడుదల చేసిన మీడియా ప్రకటన పూర్తి పాఠం...

రైతులు పండించే మెతుకు మీద బ్రతుకుతున్న మనుషులుగా ఢిల్లీలో రైతులు ఎముకలు కొరికే చలిలో రాజ్యం పెడుతున్న హింసను కళ్ళుండి చూసి భరించలేక పౌర హక్కుల సంఘం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది. నలభై ఐదు రోజులుగా అష్టకష్టాలకు ఓర్చుకొని చేస్తున్న చారిత్రాత్మక పోరాటానికి తన వంతు బాధ్యతను గుర్తించి నూతన వ్యవసాయ సవరణ చట్టాలను రద్దు చేయాలనే డిమాండు ప్రభుత్వంపై వత్తిడి పెంచాలనే లక్ష్యంతో పాదయాత్ర తల పెట్టింది.

ఈ ప్రజా చైతన్య యాత్ర బీర్ పూర్ మండలం జగిత్యాల జిల్లా, కోల్వాయి గ్రామం నుండి ఈ నెల 10వ తేదీన మొదలై మరుసటి రోజు 11న జగిత్యాలలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేయడంతో ముగుస్తుందని నిర్ణయించాం. ఈ మేరకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు సమాచార పత్రం వ్రాతపూర్వకంగా ఈ నెల 7న అందజేసాము. మా విన్నపం ఎడల మొదట సానుకూలతను ప్రదర్శించిన పోలీసులు తర్వాత తమ ధోరణి మార్చుకొని ఖఠిన వైఖరిని అవలంబించి అరెస్టులకు దిగారు.

ఈ నెల 9న మా కరీంనగర్ జిల్లా నాయకులు మాదన కుమారస్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఏనుగు మల్లారెడ్డి, రాజేశం, వెంకట్,రాజేంద్రలను అరెస్టు చేశారు. వారిని ఏ పోలీస్ స్టేషన్లో నిర్బంధించినారో కూడా తెలుపలేదు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాల్సిన వారే ఇవ్వకుండా నిరాకరించారు. నిరాకరించిన వారే అనుమతి లేదనే నెపంతో పాదయాత్రను భగ్నం చేశారు. పైగా అక్రమ అరెస్టులకు పూనుకోవడం చట్టవ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సమస్తం డిసెంబర్ 8వ తేదీన రాష్ట్ర రహదారులన్నీ బైటాయించి దిగ్బంధం చేశారు. దానికి ఎవరు అనుమతి యిచ్చారు? మరి మేము తలపెట్టిన చిన్న కర్యాక్రమానికి పోలీసుల అనుమతి కావాలనడం ఏ చట్టం నిర్దేశించింది?

పోలీసులు అరెస్టు చేసిన మా కార్యకర్తలను విడుదల చేయాలని, పాదయాత్రను యధావిధిగా సాగనివ్వాలని అడగడం కోసం జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ను కలుద్దామని రాష్ట్ర నాయకత్వం జగిత్యాలకు ఈ నెల 10న ఉదయం హైదరాబాదు నుండి బయలుదేరింది. అయితే కొడిమ్యాల పోలీసులు చెక్ పోస్టు వద్ద వారి వాహనాన్ని అడ్డగించి అధ్యక్షులు ప్రొ॥ గడ్డం లక్ష్మణ్, ఉపాధ్యక్షులు రఘునాధ్, సహాయ కార్యదర్శి గుంటి రవితో పాటు కార్యవర్గ సభ్యులు జెల్ల లింగయ్యల‌ ను అరెస్టు చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో పౌర ప్రజాస్వామిక కార్యాచరణకు అవకాశం లేకుండా దారులన్నిటిని మూసేస్తున్నారు. ప్రత్యామ్నయ గొంతులను ప్రగతిశీలమైన విమర్శలను ప్రభుత్వం భరించలేక పోతున్నది. అన్ని వర్గాల ప్రజలు ఏకీకృత అభిప్రాయానికి వస్తే తమ ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందని భయపడుతున్నది. ప్రజలు సమూహంగా కదలి రోడ్ల మీదికి రావడాన్ని తమ అధికారం తృణ ప్రాయమవుతుందని జంకుతున్నది.

కేవలం పొగడ్తలను మాత్రమే ప్రోత్సహిస్తున్నది.అదే సమయంలో తమకిష్టమైన రాజకీయ పార్టీలు, అకస్మాత్తుగా ఆందోళనకు దిగి హైవేలను దిగ్భందించినా, పబ్లిక్ సర్వీసు కమీషన్ కార్యాలయాన్ని, ఎలక్షన్ కమీషన్ కార్యాలయాల లాంటి అత్యున్నత ప్రభుత్వ యంత్రాగాన్ని దిగ్భందించి విధులకు అంతరాయం కలిగించినా ఎలాంటి కేసులు నమోదు చేయడం కాని, భగ్నం చేయడం కాని జరగడం లేదు. ప్రజలకెంత ఇబ్బంది కలిగించినా పట్టనట్లు మిన్నకుండా ఉంటుంది.

ప్రజా సంఘాలు శాంతియుతంగా నిర్వహించ తల పెట్టిన ప్రతీ కార్యక్రమానికి అనుమతి నిరాకరించి భగ్నం చేస్తూ ద్వంద వైఖరిని చాటుకుంటుంది. ఈ విధమైన ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజలను, ప్రజా సంఘాలను టార్గెటు చేసి కక్ష పూరితంగా వ్యవహరించడం మానుకోవాలి. అక్రమ అరెస్టులకు స్వస్తి పలకాలి. పోలీసు యంత్రాంగాన్ని చట్ట ప్రకారంగా, పారదర్శకంగా, నిస్పక్షపాతంగా వ్యవహ‌రించేలా కట్టడి చేయాలి. నూతన వ్యవసాయ చట్టాల ఆమోదాన్ని పార్లమెంటు సాక్షిగా వ్యతిరేకించిన వైఖిరికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలని పౌర హక్కుల సంఘం డిమాండు చేస్తుంది.

లక్ష్మణ్ గడ్డం రాష్ట్ర అధ్యక్షులు
ఎన్. నారాయణ రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
రఘునాధ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
మాదవ కుమార స్వామి రాష్ట్ర సహాయ కార్యదర్శి
జల్ల లింగయ్య రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మల్లారెడ్డి ఎ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు
పి.యం. రాజు సిటి కమిటి అధ్యక్షులు

Keywords : CLC, Farmers protest, jagityala, karimnagar
(2024-04-18 16:19:23)



No. of visitors : 992

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పౌరహక్కుల