నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా
కేంద్రం తీసుకవచ్చిన కార్పోరేట్ అనుకూల రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు రెండు నెలలుగా రైతులు ఈ రోజు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. అయితే పలు చోట్ల రైతులపై పోలీసులు లాథీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ వదిలారు. రైతులను ముందుకు వెళ్ళకుండా అడ్డుకున్నారు. మూడు రంగుల జెండాలను, రైతు పోరాట జెండాలను చేబూనిన రైతులు పోలీసులను ధిక్కరిస్తూ ఢిల్లీ రోడ్లపై పరుగులు తీశారు. పలు చోట్ల రైతులు పోలీసుల బ్యారికేడ్లను బద్దలు కొట్టారు. పోలీసులపై తిరగబడి వారిని తరిమి కొట్టారు. ఉత్తరాఖండ్ కు చెందిన నవనీత్ సింగ్ అనే రైతు మరణించాడు. పోలీసుల కాల్పులవల్లనే అతను చనిపోయాడని రైతులు ఆరోపిస్తుండగా, ట్రాక్టర్ బోల్తా పడి రైతు మరణించాడని పోలీసులు చెబుతున్నారు. మరో వైపు వేల మంది రైతులు ఢిల్లీ లోకి దూసుకవెళ్ళారు. ఎర్ర కోట వద్దకు వెళ్ళిన రైతులు ట్రాక్టర్లతో ఎర్ర కోట వద్ద ప్రదర్శన నిర్వహించారు. పోలీసులు వారిని అడ్డుకొని చెదరగొట్టడానికి ప్రయత్నించినప్పటికీ రైతుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. చివరకు రైతులు ఎర్ర కోట పైకి వెళ్ళి రైతుల పోరాట జెండా ఎగురవేశారు. రైతులు అంతకంతకూ ఎక్కువవుతుండటంతో అధికారులు మరిన్ని పోలీసు బలగాలను మోహరించారు. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేక చోట్ల ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.
ఢిల్లీలో రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఘాజీపూర్ బోర్డర్ వద్దకు రైతులు భారీ సంఖ్యలో చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దేశ రాజధానిలోకి వస్తున్న ట్రాక్టర్లను అడ్డుకునేందుకు సీఆర్ పీ ఎఫ్ బలగాలను మోహరించారు. సరిహద్దుల్లో ఎక్కడికక్కడ బారికేడ్లతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ కు చెందిన భారీ వాహనాలను రోడ్లకు అడ్డంగా పెట్టారు.
ట్రాక్టర్లను నగరంలోకి అనుమతించాలని కోరుతూ పోలీసులతో రైతు సంఘాల నేతలు వాదానికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నదాతలు బారికేడ్లను పక్కకు నెట్టి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. గందరగోళ పరిస్థితులతో ఈ ప్రాంతం అంతా యుద్ధ భూమిలా మారింది.
ర్యాలీలో 5వేల ట్రాక్టర్లకే అనుమతి ఇచ్చినా… ఢిల్లీ, హర్యానా నుంచి వేల సంఖ్యలో రైతులు ట్రాక్టర్లతో వచ్చారు. ర్యాలీలో పాకిస్తాన్ ప్రేరేపిత అరాచక శక్తులు చొరబడే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు అనుమతించిన దాని కంటే ఎక్కువగా ట్రాక్టర్లు రావడంతో పోలీసులు వాటిని అడ్డుకున్నారు. దీంతో ఘాజీపూర్, టిక్రీ వద్ద టెన్షన్ పెరిగింది.
ట్రాక్టర్ల ర్యాలీ ప్రారంభానికి ముందే సరిహద్దుల్లో ఉద్రిక్తత మొదలైంది. జాతీయ జండాలు పట్టుకున్న రైతులు ఒక వైపు.. వారిని అడ్డుకునేందుకు మోహరించిన సీఆర్ పీఎఫ్ బలగాలు మరోవైపు. ఘాజీపూర్ బోర్డర్ యుద్ధ వాతావరణాన్ని తలపించింది. పంజాబ్ నుంచి కొంతమంది రైతులు గుర్రాల మీద వచ్చారు. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేట్లను తొలగిస్తూ ముందుకెళ్లే ప్రయత్నం చేశారు.
పోలీసులు రైతుల మీద విచక్షణారహితంగా లాఠీలతో విరుచుకు పడ్డారు. పంజాబ్ నుంచి గుర్రాల మీద వచ్చిన కొంతమంది రైతులు… పోలీసులకు కత్తులు చూపిస్తూ… తమకు అడ్డు రావద్దని హెచ్చరించారు. రైతుల ఆగ్రహన్ని చూసి పోలీసులు కూడా వెనకడుగు వేశారు.
ఢిల్లీలోని ఎర్రకోటను ముట్టడించిన అన్నదాతలు అక్కడి ఓ స్తంభం పైకి ఎక్కి తమ పతాకాలను ఎగురవేశారు. మొదట రెడ్ ఫోర్ట్ బయట రామ్ లీలా మైదాన్ వద్ద తమ ట్రాక్టర్లతో మోహరించిన వేలాది రైతులు ఆ తరువాత అనూహ్యంగా రెడ్ ఫోర్ట్ కు బయలుదేరారు. అక్కడ ట్రాక్టర్లతో బ్యారికేడ్లను బద్దలు కొడుతూ అడ్డొచ్చిన పోలీసులపైకి దూసుకెళ్ళారు. దాంతో పోలీసులు పరుగులు తీశారు.అనంతరం ఎర్ర కోట పై రైతు జెండాను ఎగురవేశారు.ఈ సందర్భంగా ఓ రైతు నేత మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వానికి ఓ సందేశం ఇవ్వడానికి తాము వచ్చామని, తమ ʹజాబ్ʹ ముగిసిందని, ఇక తిరిగి వెళ్తున్నామని అన్నారు. కానీ రైతు చట్టాలను రద్దు చేయాలన్న తమ లక్ష్యం మారలేదన్నారు.
మరో వైపు ముందు అనుకున్న ప్రకారం రైతుల ట్రాక్టర్ ర్యాలీ యదావిధిగా కొనసాగుతోంది. ఈ రాత్రికి కూడా ట్రాక్టర్ ర్యాలీ అయిపోతుందా అనేది అనుమానమే. అయితే చాలా మంది రైతులు తిరిగి తమ పోరాట స్థావరాలైన టిక్రీ, సింఘూ, ఘజీపూర్, ఛిల్లా బార్డర్స్ కు చేరుకుంటున్నారు.
మరో వైపు ఎర్రకోట వద్ద జరిగిన హింసకు తమకు సంబంధం లేదని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు ప్రకటించారు. కొందరు అత్యూత్సాహంతో ఢిల్లీలోకి చొచ్చుక వెళ్ళారని రైతు నాయకుడు రాకేష్ తికాయత్ అన్నారు. అయినా వ్యవసాయ చట్టాలను ప్రభుత్వం వెనక్కి తీసుకునే దాకా తమ పోరాటం ఆగబోదని ఆయన స్పష్టం చేశారు.
Keywords : farmers protest, delhi, tractors rally, red fort, flag,
(2021-02-24 17:33:49)
No. of visitors : 144
Suggested Posts
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది. |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు. |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి. |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది. |