ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన
కేంద్రం తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలుకు పైగా పోరాడుతున్న రైతులకు సీపీఐ మావోయిస్టు పార్టీ పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....
మోదీ ప్రభుత్వ మూడు ప్రజావ్యతిరేక వ్యయసాయచట్టాలను
పూర్తిగా రద్దు చేసేంత వరకూ పోరాటాన్ని కొనసాగించండి!
మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది.
జనవరి 26న రైతులు చేసిన ట్రాక్టర్ పెరేడ్ ను మేం ఉత్సాహంగా స్వాగతిస్తున్నాం.
దిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ జరుగుతున్న రైతు ఆందోళనలు బ్రిటిష్ వాళ్లు చేసిన రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలను గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు వున్నది బ్రిటిష్ వాళ్లు. నేడున్నది మోదీ. అనాడు భగత్ సింగ్ వుంటే నేడు పోరాడుతున్న రైతుల రూపంలో లక్షలాది ఆయన వారసులున్నారు. ప్రభుత్వం చట్టాల్ని రద్దు చేయడం కాకుండా నాన్చుతూ పోరాటాలను నీరుకార్చే విధానాలను అవలంభిస్తున్నది. 11 దఫాలుగా జరిగిన చర్చల సందర్భంగా ప్రతీసారీ రైతు నాయకులు చట్టాలను రద్దు చేయాలనే ప్రధానమైన డిమాండ్ నే స్పష్టంగా చేస్తున్నప్పటికీ, ప్రభుత్వం మొండి వైఖరిని అవలంభిస్తున్నది. ఎందుకంటే ఈ ప్రభుత్వం సామ్రాజ్యవాదుల, భారత దళారీ కంపెనీలకు సేవ చేసేది కనుక.
జనవరి 26న లక్షలాది రైతులు ట్రాక్టర్లతో దిల్లీకి దూసుకుపోయి ఈ గణతంత్రం ఎంత పక్షపాతమైనదో, రైతు వ్యతిరేకమైనదో ప్రపంచానికి చాటారు. ర్యాలీకి అనుమతి ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పోలీసుల ద్వారా రైతులను ఆపడానికి అన్ని ప్రయత్నాలూ చేసింది. రైతులు వచ్చే మార్గంలో కావాలని బ్యారికేడ్లు నిర్మించింది. భాష్ప వాయువు వదిలింది. లాఠీఛార్జి చేసింది. ఈ సందర్భంగా నవరీత్ సింగ్ అనే యువకుడు మరణించాడు. చట్టాలూ, సువ్యవస్థ ప్రభుత్వ బాధ్యత అవుతుంది. రైతుల శాంతియుత అందోళనను హింసాత్మకం చేయడం కోసం ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసింది. ఈ ఆందోళనల్లో చొరబడి చీలికలు, అల్లర్లు సృష్టించడానికి మోదీ ప్రభుత్వం మొదటి నుండి ప్రయత్నం చేస్తున్నది. జనవరి 26న జరిగిన హింసాత్మక ఘటనల వెనుక ఖచ్చితంగా ప్రభుత్వ హస్తం వున్నది. బీజేపీ ఏజెంట్లు దీప్ సిద్ధూ, లబ్బా సిధ్ నాలను ఆందోళనను రెచ్చగొట్టడానికి జొప్పించారు. ప్రత్యేక రక్షణ వున్నప్పటికీ ఈ ఏజెంట్లను ఎర్రకోట వైపుకు పోనిచ్చారు. ఎర్రకోటపై జెండా ఎగరేయడం, ట్రాక్టర్ ర్యాలీని హింసాత్మకం చేయడం, రైతు నాయకులపై నేరాన్ని మోపడం బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు మోదీ ప్రభుత్వపు కుట్రపూరిత పథకం. ఈ నీచమైన, నిరంకుశమైన ప్రభుత్వ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. నిగ్రహం పాటించాలనీ, రైతులకు మద్దతుగా నిలబడాలనీ పోలీసు, సైన్యానికి చెందిన జవానులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే వాళ్లు కూడా రైతు బిడ్డలే!
ఎర్రకోట వద్ద తనను తాను ప్రధాన సేవకుడని చెప్పుకునే మాటల మాయగాడు మోదీ కపటత్వాన్ని ఈ ర్యాలీ బహిర్గతం చేసింది. నరేంద్రమోదీ దేశ ప్రజల సేవకుడు కాదు. సామ్రాజ్యవాదుల కార్పొరేట్ సంస్థల సేవకుడు. ఈ నిజం మరొకసారి బహిర్గతం అయింది. చట్టాల రద్దును తప్ప మరి దేన్నీ అంగీకరించని దృఢ సంకల్పాన్ని తమ ఐక్యత ద్వారా ప్రదర్శించిన రైతులు మోసపూరిత రాజీ చర్యలను ఈసడించారు. ఇప్పటికీ రైతుల ఐక్య వేదిక బయట కొన్ని శక్తులు వున్నాయి. వర్తమాన అవశ్యకతను అర్థం చేసుకొని ఈ చట్టాలను రద్దు చేసేవరకూ కలిసి పోరాడాలని ఈ శక్తులకు మేం విజ్ఞప్తి చేస్తున్నాం.
మోదీ ప్రభుత్వం ఆహార ధాన్య భాండాగారాన్ని అదానీ, అంబానీల చేతికిచ్చి పేద ప్రజల నోటికాడి ముద్దని లాక్కుంటున్నది. ప్రైవేట్ మండీలను తెరిచి, భూములను కార్పొరేట్ల చేతుల్లో పెట్టి రైతుల మెడలకు కార్పొరేట్ ఉచ్చును బిగిస్తున్నారు. చిన్న వ్యాపారాలనూ, వ్యాపారుల ఉపాధిని కూడా ఈ చట్టాలు లాక్కుంటున్నాయి. ఈ చట్టాల మూలంగా రైతులే కాదు 80 శాతం సాధారణ ప్రజలు ప్రభావితం కానున్నారు.
కనుక రైతుల పోరాటంలో పాల్గొనమని ప్రజలందరికీ మేం విజ్ఞప్తి చేస్తున్నాం. రైతులకు మద్దతుగా తమ తమ రంగాల్లో పోరాడమనీ, ఈ చట్టాలను వెనక్కి తీసుకునేలా మోదీ ప్రభుత్వపు మెడలు వంచాలని ప్రజలను కోరుతున్నాం. రైతు పోరాట కమిటీ ద్వారా 2021, ఫిబ్రవరి 1న పార్లమెంట్ ను ముట్టడించాలని తీసుకున్న కార్యక్రమంతో పాటు ఇతర పోరాటాలూ, కార్యక్రమాలకు మద్దతుగా దేశవ్యాప్తంగా అందోళనలూ, ప్రదర్శనలూ చేపట్టాలని మేం ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. దేశంలో కొనసాగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా, వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరంతరం పోరాటాలు చేపట్టవల్సిందిగా మా పార్టీ శ్రేణులకూ, పీఎల్ జీఏ కూ, అన్ని విప్లవ ప్రజాసంఘాలకూ, జనతన సర్కార్లకు పిలుపునిస్తున్నాం. అందులో భాగంగా మహాన్ భూంకాల్ దివస్ సందర్భంగా 2021,ఫిబ్రవరి 10న దేశవ్యాప్తంగా ప్రదర్శనలు చేయాలని పిలుపునిస్తున్నాం.
అభయ్, అధికార ప్రతినిధి,
కేంద్ర కమిటీ,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)

Keywords : farmers protest, delhi, red fort, cpi maoit
(2021-02-25 03:41:21)
No. of visitors : 719
Suggested Posts
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది. |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు. |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి. |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది. |
| రైతుల ఉద్యమానికి జాతీయ మహిళా సంఘాల మద్దతు - మోడీకీ బహిరంగ లేఖ
రైతుల చట్టబద్ధమైన, శాంతియుత నిరసనలను ప్రభుత్వం అణచివేయడాన్ని వెంటనే ఆపాలని కోరుతూ జాతీయ మహిళా సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి బహిరంగ లేఖ రాశాయి. పోరాడుతున్న రైతులు, రైతు సంస్థల నాయకులపై పెట్టిన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని, విపత్తు సమయంలో అమల్లోకి వచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు. |