రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్
కేంద్రం తీసుకవచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రెండు నెలలకు పైగా రైతులు చేస్తున్న ఆందోళనలను అణిచివేయడానికి, దెబ్బ తీయడానికి ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యక్షంగా ప్రభుత్వమే కాకుండా బీజేపీ దాని అనుబంధ సంస్థలు కూడా రైతుల ఉద్యమాన్ని దెబ్బతీయడానికి దాడులు చేయడం, దుష్ప్రచారాలకు పూను కోవడం లాంటి అనేక పనులకు పాల్పడుతున్నాయి. ఇక వీరికి మద్దతుగా ప్రధాన మీడియా సంస్థలు కూడా రైతులపై తమ శాయశక్తులా దాడి చేస్తూనే ఉన్నాయి. అయితే సమాజం పట్ల బాధ్యత కల్గిన కొందరు జర్నలిస్టులు మాత్రం బీజేపీ ప్రభుత్వం, పార్టీ రైతులపట్ల అనుసరిస్తున్న దుర్మార్గ విధానాలను బహిర్గతం చేస్తూనే ఉన్నారు. అలాంటి నిజాయితీ కల్గిన జర్నలిస్టులపై కేసులు బనాయించడం, అక్రమ అరెస్టులు చేయడం పనిగా పెట్టుకుంది ప్రభుత్వం. మరో వైపు ఆ పార్టీ కార్యకర్తలు కూడా రైతులనే కాకుండా జర్నలిస్టులను కూడా బెధిరించడం, హత్య చేస్తామని హెచ్చరికలు జారీ చేయడం, మహిళా జర్నలిస్టులనైతే రేప్ చేస్తానని బెధిరించడం చేస్తున్నారు.
ది వైర్ తదితర మీడియాల కోసం పని చేసే రోహిణీ సింగ్ అనే సీనియర్ జర్నలిస్టు రైతుల ఉద్యమాన్ని కవర్ చేస్తోంది. రైతు ఉద్యమంపై అనేక వ్యాసాలు రాయడమే కాక ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తున్నది. ఆమె రాతల పట్ల సహజంగానే రైతు వ్యతిరేకులు కోపం పెంచుకున్నారు. అలా నిజాలు భరించలేని రాజస్థాన్ కు చెందిన కపిల్ వియాన్ అనే ఏబీవీపీ కార్యకర్త జర్నలిస్టు రోహిణీ సింగ్ పై బెదిరింపులకు దిగాడు. ఆమెను హత్య చేస్తానని, ఆమెపై అత్యాచారం చేస్తానని బెదిరించాడు. 26 ఏళ్ల కపిల్ వియాన్ ʹలాʹ చదువుతున్నాడు. అతనిది ఉదయపూర్ జిల్లా సెమారీ గ్రామం.

అతని బెదిరింపులపై చర్యలు తీసుకోవాలని రోహిణీ సింగ్ ఉదయపూర్ రేంజ్ పోలీసులను, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ను ట్విట్టర్ లో ట్యాగ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని గెహ్లాట్ ఉదయపూర్ ఐజి, ఎస్పీలను ఆదేశించారు. కపిల్ వియాన్ ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని విచారిస్తున్నారు.
ʹʹజర్నలిస్ట్ రోహిణి సింగ్కు హత్య, అత్యాచార బెదిరింపులు పంపిన సెమారి నివాసి కపిల్ సింగ్ను మా బృందం అరెస్టు చేసింది ʹ అని ఉదయపూర్ పరిధిలోని ఇన్స్పెక్టర్ జనరల్ (ఐజి) సత్యవీర్ సింగ్, ట్వీట్ చేశారు.

రైతుల ర్యాలీపై రోహిణీ సింగ్ రాసిన రాతలు తనకు కోపం తెప్పించాయని వియాన్ పోలీసులకు చెప్పాడు. " ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతుల ఆందోళనపై ఆమె నివేదికలు తనకు కోపం తెప్పించినందువల్లే జర్నలిస్టును బెదిరించినట్టు విచారణ సమయంలోనిందితుడు ఒప్పుకున్నాడు" అని ఉదయపూర్ ఐజి హిందుస్తాన్ టైమ్స్తో అన్నారు.
కాగా తాను ట్వీట్ చేసిన వెంటనే చర్యలు చేపట్టినందుకు ముఖ్యమంత్రి గెహ్లాట్ , ఉదయపూర్ పోలీసులకు జర్నలిస్టు రోహిణీ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

ʹది వైర్ʹ సౌజన్యంతో
Keywords : farmers protest, journalist, women, abvp, Law Student Affiliated With ABVP Arrested Over Rape Threats to Journalist Rohini Singh
(2021-02-24 23:19:10)
No. of visitors : 173
Suggested Posts
0 results
| మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల లేఖ
|
| దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం |
| అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు |
| వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
|
| టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగరన్ మంచ్ʹ మూక దాడి
|
| Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital |
| జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య డిమాండ్ |
| ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
|
| ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
|
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
|
| రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR |
| రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ? |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన |
| రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
|
| రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్ |
| CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers |
| నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన రైతు నాయకుడు |
| జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన
|
| రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
|
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
|
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
| ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
|
more..