ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ హ్యాష్ ట్యాగ్ తీయబోం - కేంద్రానికి స్పష్టం చేసిన ట్విట్టర్
ʹమోడీ ప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ ( రైతు జాతి హననానికి మోడీ ప్రణాళిక) అనే హ్యాష్ట్యాగ్తో కూడిన ట్వీట్లను బ్లాక్ చేయాలని, రైతుల నిరసనలకు సంబంధించిన 257 యుఆర్ఎల్లను బ్లాక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ ను కోరగా ట్విట్టర్ అందుకు నిరాకరింది.ఇది వాక్ స్వాతంత్య్రానికి సంబంధించిన అంశమని ట్విట్టర్ పేర్కొంది. దాంతో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ట్విట్టర్ కు మళ్ళీ నోటీసులు జారీ చేసింది. మూడు రోజుల్లో నోటీసులు జారీ చేయడం ఇది రెండోసారి.
ʹమోడీప్లానింగ్ ఫార్మర్ జెనోసైడ్ʹ అనే హ్యాష్ట్యాగ్ మరియు యుఆర్ఎల్లు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని, దేశంలో ప్రజా జీవితాన్ని ప్రభావితం చేసే హింసకు దారితీస్తుందని కేంద్రం పేర్కొంది.
"హ్యాష్ట్యాగ్ ప్రజలని హింసకు రెచ్చగొడుతుంది. నేరాలకు పాల్పడేలా ప్రజలను ప్రేరేపిస్తున్నది. ఇలా హింసను ప్రేరేపించేలా, ప్రజా జీవనాన్ని ప్రభావితం చేసే సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి పత్రికా స్వేచ్ఛను సాకుగా తీసుకోలేము" అని మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MEITY) ఫిబ్రవరి 2, 2021 నాటి నోటీసులో ట్విట్టర్కు తెలిపింది.
కేంద్రం జారీ చేసిన ఆదేశాలను పాటించకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 ఎ [3] కింద జరిమానా, జైలు శిక్ష విధించాల్సి ఉంటుందని కేంద్రం నోటీసు ట్విట్టర్ను హెచ్చరించింది. ఈ నిబంధన ప్రకారం, 69 (1) కింద జారీ చేసిన ఆదేశాన్ని పాటించడంలో విఫలమైతే ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించబడుతుంది.
సంబంధిత URL లు మరియు హ్యాష్ట్యాగ్ను తీసివేయమని ట్విట్టర్ను కోరుతూ కేంద్రం జనవరి 31 న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై ఫిబ్రవరి 1 న జరిగిన కమిటీ సమావేశం ముందు ట్విట్టర్ ప్రతినిధు హాజరయ్యి ప్రభుత్వ ఉత్తర్వులను పాఠించడానికి నిరాకరించింది. ఇదే విషయాన్ని తెలుపుతూ MEITYకి ట్విట్టర్ లేఖ కూడా రాసింది. దాంతో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ కు మళ్ళీ నోటీసులు జారీ చేసింది.
మరో వైపు దేశ వ్యాప్తంగా రెండు నెలలుకు పైగా సాగుతున్న రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి బీజేపీ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఢిల్లీ బార్డర్ లో ఉన్న లక్షల మంది రైతులకు సర్కార్ కరెంట్ కట్ చేసింది. నీళ్ళు బందు పెట్టింది. ఇమ్టర్నెట్ బ్యాన్ చేసింది. రోడ్లపై బ్యారికేడ్లు పెట్టింది. ముళ్ళకంచెలు వేసింది. రోడ్లపై మేకులను దిగ్గొట్టింది. ఇవి చాలవన్నట్టు అనేక రైయులపై కేసులు నమోదు చేసింది. 200 మందికి పైగా రైతులను అరెస్టులు చేసింది. రైతు ఉద్యమంపై రాస్తున్నందుకు, చూపిస్తున్నందుకు పలువురు జర్నలిస్టులపై కేసులు బనాయింది. కొందరిని అరెస్టు చేసింది. ఇన్ని చేసినా రైతులు బెధరకుండా తమ ఉద్యమాన్ని కొనసాగిస్తుండటం, ఉద్యమం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రైతు అనుకూల ప్రచారం జరుగుతుండటం కేంద్ర ప్రభుత్వానికి కంటగింపుగా మారింది. దాంతో ఇక సోషల్ మీడియాపై దాడి మొదలుపెట్టింది. పలు రైతు అనుకూల ట్విట్టర్ అకౌంట్లను బ్యాన్ చేయింది. అయితే దేశవ్యాప్తంగా విమర్షలు రావడంతో ట్విట్టర్ వెంటనే మేల్కొని ఆ అకౌంట్లను పునరుద్దరించింది. ఇప్పుడిక మోడీ ప్రభుత్వంపై ట్విట్టర్ ను టార్గెట్ చేసింది. జైలు శిక్ష బూచి చూపుతూ ట్విట్టర్ ను బెధిరిస్తోంది. అయితే ట్విట్టర్ వాక్ స్వాతత్య్రమనే తన వాదనకు కట్టుబడుతుందా లేక మోడీ ప్రభుత్వానికి లొంగిపోతుందా అనేది వేచి చూడాలి.
Keywords : farmers protest, narendra modi, ModiPlanningFarmerGenocide,Twitter,Twitter refuses to comply with Centreʹs order to block one hashtag, 257 URLs on Farmers Protests; "Astonished" Centre warns of penal action
(2021-02-24 10:23:48)
No. of visitors : 194
Suggested Posts
| ఉల్లిగడ్డలు తినకపోతే చస్తారా -మంత్రి గారి దబాయింపువాళ్ళ పొరపాట్లను ఎత్తి చూపితే పాలకులకు ఆవేశం పొంగుకొస్తుంది. వాళ్ళను ప్రశ్నలడిగితే చిర్రెత్తుకొస్తుంది. అడిగిన వారినే దబాయిస్తారు. బెదిరిస్తారు. ఈ మంత్రి కూడా అదే చేశారు..... |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోనూ, దేశవ్యాప్తంగానూ ఐక్యంగా, దృఢ సంకల్పంతో నిరంతరాయంగా పోరాడుతున్న రైతులకు భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మరొకసారి విప్లవాభినందనలతో లాల్ సలాం చెబుతున్నది. |
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
నిరంతరం విస్తరిస్తున్న, తీవ్రతరం అవుతున్నదేశవ్యాప్త రైతు ఉద్యమాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం జనవరి 26 న ఎర్రకోట కుట్రను అమలు చేసింది, దీనిని జనతన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నది. |
| రైతాంగ పోరాటానికి మావోయిస్టు పార్టీ మద్దతు - విప్లవ ప్రభుత్వాన్నినిర్మించుకోవాలని రైతులకు పిలుపు
ఆత్మహత్యలు, బలిదానాలు రైతాంగ సమస్యకు పరిష్కారం కాదు. భారత దళారీ పాలక వర్గాల చేతిలో రాజ్యాధికారం వున్నంత వరకు ఈ విధానాలు మారవు. రుణ మాఫీలు ఎన్ని జరిగినా , ఎన్ని సార్లు కనీస మద్దతు ధర పెరిగినా స్వామినాధన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వం పూర్తిగా అమలు చేసినా అదంతా కేవలం చినిగిన్న గుడ్డకు మాసిక వేయడమే అవుతుంది తప్ప రైతాంగా సమస్యకు శాశ్వత పరిష్కారం కాదు. |
| ఈ ఫోటో తీసిన జర్నలిస్టుపై దాడి - ప్రభుత్వ వాహనంలో వచ్చిన అగంతకులు
ఆ ఫోటో తీసిన జర్నలిస్టు రవి చౌదరిపై ఈ రోజు దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ లో గంగా కాలువ రోడ్డులో ఓ ప్రభుత్వ వాహనంలో వచ్చిన కొందరు అగంతకులు తనపై దాడి చేశారని రవి తెలిపాడు. |
| రోజుకు 700 ఇస్తాను పొలంపనికి వస్తావా !బీజేపీకి అనధికార ప్రతినిధి పాత్రను పోషిస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తన వల్లే దేశం సుభిక్షంగా ఉందనుకుంటుంది. అందుకే... అన్నదాతలను దేశద్రోహులుగా కించపరిచి ఆనందాన్ని పొందుతోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల పట్ల అత్యంత అమానవీయమైన కామెంట్లు చేసిన కంగనా రనౌత్ తాను కార్పోరేట్ పెరటి మెక్కనని మరోమారు నిరూపించుకుంది. |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పంజాబ్ డీఐజీ రాజినామా
కేంద్ర ప్రభుత్వం తీసుకవచ్చిన కార్పోరేట్ల అనుకూల ప్రజా వ్యతిరేక మూడు కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు దాదాపు 18 రోజులుగా ఉద్యమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైతుల ఉద్యమానికి మద్దతుగా , కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులపై చేస్తున్న దాడులకు నిరసనగా పంజాబ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (జైళ్లు) లక్మీందర్ సింగ్ జఖర్ తన పదవికి రాజినామా చేశాడు. |
| ఈ 60 గ్రామాల్లో బీజేపీపై నిషేధం - ఆ పార్టీ నాయకులెవ్వరూ రావొద్దని తీర్మానం
హర్యాణాలోని 60 గ్రామాలు భారతీయ జనతా పార్టీ (బిజెపి), జాననాయక్ జనతా పార్టీ (జెజెపి) నాయకుల ప్రవేశాన్ని నిషేధించాయి. రైతు వ్యతిరేక చట్టాలకు మద్దతు తెలుపుతున్న బిజెపి-జెజెపి మంత్రులు, ఎమ్మెల్యేలను బహిష్కరించాలని అనేక గ్రామాలు పిలుపునిచ్చాయి. |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
నిన్న జరిగిన హింసాయుత సంఘటనలకు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న సంయుక్త కిసాన్ మోర్చాకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రెండు నెలలుగా రైతు ఆందోళన జరుగుతుండగా 15 రోజుల కింద అక్కడికి వచ్చి కిసాన్ మోర్చాతో సంబంధం లేకుండా |
| రైతుల ఉద్యమానికి మద్దతుగా పౌర, ప్రజా సంఘాల ధర్నా
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ పదకొండురోజులుగా ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న రైతుల ఉద్యమానికి పౌర హక్కుల సంఘం పూర్తి సంఘీభావం ప్రకటించింది. |
| మరింత ప్రమాదంలో సాయిబాబా ఆరోగ్యం - ʹమహాʹ ముఖ్యమంత్రికి కుటుంబ సభ్యుల లేఖ
|
| దీనికి బెయిల్ అని పేరు పెట్టడమే విచిత్రం -విరసం |
| అమరుల అంత్య క్రియలు - మావోయిస్టు సైన్యం కవాతు |
| వరవర రావుకు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్... ముంబైలోనే ఉండాలని ఆదేశం
|
| టీ షాప్ నడుపుకుంటున్న ముస్లిం యువతిపై ʹహిందూ జాగరన్ మంచ్ʹ మూక దాడి
|
| Dr. G. N. Saibaba tested Covid positive: Family demands monitoring and shifting to a private hospital |
| జి. ఎన్. సాయిబాబాను వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి మార్చాలి..... సాయిబాబా భార్య డిమాండ్ |
| ప్రొఫెసర్ సాయిబాబాకు కరోనా - ఆయన ప్రాణాలకు ప్రమాదం
|
| రైతాంగ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన క్రాంతికారీ జనతన సర్కార్
|
| రైతుల ఉద్యమం: జర్నలిస్టు అరెస్టు ఖండించిన CASR |
| రాకేశ్ తికాయత్ కన్నీళ్ళతో కూడిన పశ్చాత్తాపం పాత గాయాలను మాన్పుతుందా ? |
| రేప్ చేస్తానంటూ మహిళా జర్నలిస్టును బెదిరించిన ఏబీవీపీ కార్యకర్త అరెస్ట్ |
| ఎర్ర కోట వద్ద జరిగిన హింస బీజేపీ కుట్రే - మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన |
| రైతుల ఉద్యమం....నిజాలు రాస్తున్నందుకు జర్నలిస్టు అరెస్ట్
|
| రిపబ్లిక్ డే నాడు నిరసనల్లో పాల్గొన్న 100 మంది రైతులు మిస్సింగ్ |
| CDRO strongly condemns the continuing targeting and intimidation of the farmersʹ protests/ foisting false cases against farmersʹ leaders and arrest of protesting farmers |
| నిరసనల్లో ఉన్న రైతులను చంపేందుకు బీజేపీ కుట్ర చేస్తోందంటూ బోరున విలపించిన రైతు నాయకుడు |
| జనవరి 30 న తెలంగాణ వ్యాప్తంగా నిరహార దీక్షలు - రైతు సంఘాల ప్రకటన
|
| రైతులను బలవంతంగా ఖాళీ చేయిస్తున్న పోలీసులు..... వెనక్కి తగ్గేది లేదంటున్న రైతులు |
| కుట్రలను తిప్పి కొడతాం, పోరాటం కొనసాగిస్తాం - రైతు సంఘాల ప్రకటన
|
| నిన్న డిల్లీలో జరిగి సంఘటనల వెనక అసలు కథ !
|
| ఫ్యాక్ట్ చెక్: ఎర్ర కోట వద్ద జాతీయ జెండాకు అవమానం జరగలేదు...ఖాలిస్తాన్ జెండా ఎగిరేయలేదు
|
| నిర్బందపు బారికేడ్లను బద్దలుకొట్టిన రైతులు - ఎర్రకోటపై రెపరెపలాడిన రైతు జెండా |
| వ్యవస్థ దుర్మార్గానికి బలైన విచారణ ఖైదీ కామ్రేడ్ కంచన్ నానావరె |
| ఢిల్లీలో రిపబ్లిక్ డే కిసాన్ పెరేడ్ కు అనుమతి -100 కిలోమీటర్లు ట్రాక్టర్ల ర్యాలీ
|
more..