విశాఖ ఉక్కు ఉద్యమానికి మద్దతుగా నిలుద్దాం - మావోయిస్టు నేత జగన్ ప్రకటన
(విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేయాలన్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ , స్టీల్ ప్లాంట్ కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతూ సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం....)
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం !
విశాఖ ఉక్కు కర్మాగార కార్మికుల ఉద్యమానికి సంపూర్ణ మద్దతునిద్దాం!
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు
బ్రాహ్మణీయ హిందుత్వ బీజేపీ మోడీ ప్రభుత్వం దేశ సంపదను సామ్రాజ్యవాద, కార్పోరేట్ శక్తులకు దారదత్తం చేయడానికి దూకుడుగా ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల చట్టాలను తీసుక వచ్చి లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి పూనుకున్నది. కార్మిక చట్టాల సవరణ పేరుతో కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాచి కోల్ ఇండియా బొగ్గు బావులను అమ్మివేసి కార్మికులను నడివీదిలోకి నెట్టివేసింది. నిరుద్యోగులుగా మార్చి వేసింది.
2019 అటవీ హక్కుల చట్టం తీసుకువచ్చి తమ తరాల నుండి అడవిలో జీవిస్తున్న అదివాసులని అడవి నుండి గెంటివేయడానికి కుట్ర చేస్తున్నది.
భూమిని దున్ని బువ్వను పంచే రైతాంగాన్ని భూముల నుండి గెంటి వేయడానికి నూతన వ్యవసాయ చట్టాలను తీసుక వచ్చి అన్నం పెట్టే భారత రైతాంగాన్ని బిచ్చగాళ్ళుగా మార్చాలని కుట్ర చేస్తున్నది.
ప్రజా వ్యతరేక విధానాలను ప్రశ్నిస్తున్న సామాజిక కార్యకర్తలను హక్కుల నాయకులను మేధావులను అర్బన్ మావోయిస్టు ముద్రలు వేసి అరెస్టులు చేసి జైళ్ళో బంధించి ప్రశ్నించే గొంతులను నొక్కివేస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతున్న కార్మికులను, రైతులను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారు.
దేశంలో భావోద్వేగాలను, జాతోన్మాదాన్ని రెచ్చగొట్టి బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాద బీజేపీ మోడీ ప్రభుత్వం, సంఘ్ పరివార్ శక్తులు పబ్బం గడుపుకుంటున్నారు. భారత మాతాకి జై అంటూనే భారత మాతను బజార్ కీడుస్తున్నారు. సామ్రాజ్యవాదులకు, కార్పోరేట్ శక్తులకు దేశ సంపదను అమ్మివేస్తున్నారు. మేమే నిజమైన దేశ భక్తులమని గుండెలు బాదుకుంటున్నారు.
హిందుత్వ మోడీ ప్రభుత్వం దేశం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని ప్రైవేటీకరించాలని ప్రచారం చేస్తున్నాడు. అందులో భాగంగానే విశాఖ ఉక్కు కర్మాగరాన్ని అమ్మివేయడానికి పూనుకున్నది. గత 5 దశాబ్దాలుగా వేలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తుస్తు లాభలాతో నడుస్తున్న విశాఖ ఉక్కు కర్మగారాన్ని ప్రైవేటీ కంపెనీలకు అమ్మివేసి వేలాది కుటుంబాలను వీధులపాలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నారు.
ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాడుతున్న విశాఖ ఉక్కు కర్మాగార కార్మికులకు, ప్రజలకు మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నది. విశాఖ ఉక్కు కర్మాగార కార్మికుల ఉద్యమానికి తెలంగాణ ప్రజలు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని పిలుపునిస్తున్నది.
విప్లవాభినందనాలతో
జగన్
అధికార ప్రతినిధి
తెలంగాణ రాష్ట్ర కమిటీ
సీపీఐ (మావోయిస్టు)
Keywords : visakhapatnam, steel plant, privatization, bjp, workers, cpi maoist
(2024-03-30 17:16:31)
No. of visitors : 1783
Suggested Posts
| ముగ్గురు మావోయిస్టుల అరెస్ట్
విశాఖపట్నం ఏజెన్సీలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ముగ్గురు మహిళా మావోయిస్టులు వలసి @ రమే, వనతల లక్ష్మి @ సంగీత , కొర్ర దేవి @ సీతలను సోమవారం అరెస్టు చేసినట్టు పోలీసులుప్రకటించారు.
|
| మనిషులింకా మాయం కాలేదు - జోసఫ్ లాంటి వాళ్ళున్నారుమనుషులు మాయమైపోతున్న చోట ఇలాంటి కొంత మంది ఇంకా ఉండటం వల్లనే సమాజంలో ఇంకా కొన్ని విలువలు మిగిలి ఉన్నాయి. ఎంతో మంది ప్రభుత్వ ఉపాద్య్హాయులు విద్యార్తులకు బోధనం చేయడం..... |
| అనారోగ్యంతో నడవలేకపోతున్నా వైద్య సహాయం ఇవ్వడం లేదు....జైలు నుండి అనూష లేఖ ! నాకు సరైన వైద్యం అందించాలని కొట్లాడగా KGH హాస్పిటల్ కి తీసుకెళ్ళారు. అక్కడి డాక్టర్లు కూడా నాకు సరైన వైద్యం అందించలేదు. KGH డాక్టర్ల, అలాగే జైల్ అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కోర్టులో పిటీషన్ వేస్తే, ఖచ్చితంగా వైద్యం అందించాలని KGH హాస్పిటల్ కి, జైల్ అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. KGH హాస్పిటల్ వాళ్ళు స్పందించి నన్నుఅడ్మీట్ అవ్వమన్నారు కానీ |
| చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై పోలీసుల దుర్మార్గపు దాడి ఇవ్వాళ్ళ విశాఖపట్నం కలెక్టర్ కార్యాలయం దగ్గర చైతన్య మహిళా సంఘంతో సహా ఇతర ప్రజా సంఘాలు నిరసన ప్రదర్శన నిర్వహించాయి. దాంతో అసలు నిజాలు ప్రజలకు ఎక్కడ తెలుస్తాయో అని భయపడిన చంద్రబాబు పోలీసులు అదే స్థలంలో కొందరు కిరాయి మనుషులతో పోటీ ధర్నాకు దిగారు. ప్రజలను కాపాడాల్సిన తమ బాధ్యతను వదిలేసిన పోలీసులు.... |
| ఎవడి లాభాల కోసం ఈ మరణాలు .. ప్రసాద్ ఇఫ్టూమనం ప్రతిరోజూ రకరకాల "ఉగ్రవాదాల" పై భీతావహ వార్తలు వింటాం. AK-47 తుపాకులతోనో, మరేవో బీభత్స ఆయుధాలతోనో జరిగే మారణహోమాల గూర్చి భయవిహ్వలులమై వింటాం. భయాంకరాకారులుగా "ఉగ్రవాద" మూకలను విలన్లుగా చిత్రించే వ్యంగ్య కార్టూన్లని చూసి, అట్టి అదృశ్య శక్తులపై పళ్ళు పటపట కోరుకుతాం. అవేవీ నేడు విశాఖలో చోటు చేసుకోలేదు. |
| విషం... విషాదం... పరిహారం.. పోరాటం -నరేష్కుమార్ సూఫీఆ ఫ్యాక్టరీ ఇప్పుడు కొత్తగా ఉన్నదేమీ కాదు 1961 నుంచీ విశాఖపట్నం సిటీకి దూరంగా మొదలై రెండు చేతులు మారి 1997 లో LG అనే కొరియన్ కంపెనీ చేతుల్లోకి వెళ్ళింది. ఈ కంపెనీ పేరుమీద ఎకరాలకు ఎకరాలు సేకరించారు. ఇ |
| విశాఖ జైల్లో 50 మంది మహిళా రాజకీయ ఖైదీల నిరశన దీక్ష
విశాఖ సెంటర్ల్ జైల్లో 50 మంది మహిళా ఖైదీలు బుధవారం నుండి నిరాహార దీక్ష చేపట్టారు. కరోనాను సాకుగా చూపి కుటుంబ సభ్యులను కలవనివ్వకుండా చేయడాన్ని నిరసిస్తూ ఖైదీలు నిరాహార దీక్ష చేపట్టారు. |