జార్ఖండ్ లో ఆదివాసులపై సి ఆర్ పి ఎఫ్ దుర్మార్గాలు -నిజనిర్దారణ రిపోర్ట్

జార్ఖండ్

జార్ఖండ్ రాష్ట్రంలోని గిరిడి జిల్లాలో కేంద్ర ప్రభుత్వ నెలకొల్పుతున్న కొత్త సి ఆర్ పి ఎఫ్ క్యాంపులకు వ్యతిరేకంగా నిరసన తెలియచేస్తున్న ఆదివాసీ సంతాల్ గ్రామస్తులపై జరుగుతున్న దాడులు, అణిచివేతలకు సంబంధించి CDRO 2021 మార్చి 5, 6, & 7వ తేదీలలో జరిపిన నిజ నిర్ధారణ రిపోర్ట్

7 మార్చి 2021

2021 మార్చి 5-6 తేదీల్లో, సిడిఆర్ఓ(CDRO), హెచ్ఆర్ఎల్ఎన్(HRLN) మానవ హక్కుల నిజనిర్ధారణ బృందం గిరిడీ జిల్లాలోని - మధుబన్, డుమ్రీ, పిర్తాండ్ అనే మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాలకు వెళ్ళి, అక్కడ కొత్తగా కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న పారా మిలిటరీ క్యాంప్‌లకు వ్యతిరేకంగా జరుగుతున్న భారీ ప్రజా నిరసనకు సంబంధించి గ్రామస్తులను కలిసి పూర్తి సమాచారాన్ని సేకరించింది.

గిరిడీ జిల్లాలో అనేక సిఆర్పిఎఫ్ శిబిరాలు నిర్మాణమవుతున్నాయనీ, వాటిని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ దేశంలోని ప్రధాన వార్తాపత్రికలలో 2020 డిసెంబర్, 2021 జనవరిలలో వార్తలు వచ్చాయనే విషయం తెలిసిందే. ఈ విషయంపై గ్రామస్తులు, ప్రభుత్వానికి మధ్య చాలా ఘర్షణలు జరిగాయి, చాలా మందిపై ఎఫ్‌ఐఆర్‌లు పెట్టారు, అరెస్టులు కూడా జరిగాయి.

ఈ ప్రదేశంలో నివసించేవారు ప్రధానంగా ఆదివాసీలు, ఈ ప్రాంతంలో అధిక అటవీప్రాంతం, కొండలతో పాటు, ఆహార, ఖనిజ సంపద పుష్కలంగా ఉంది; స్థానిక ప్రజలకు వున్న అటవీ, భూ హక్కులను, గ్రామసభ హక్కును కూడా ప్రభుత్వం మొదటి నుండి పట్టించుకోలేదు; ఈ రోజు వరకు, అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం వ్యక్తిగత, సాముదాయిక హక్కు పత్రాలు యివ్వలేదు. అలాగే, ఇక్కడ స్థానికంగా నివసించేవారికి ఎలాంటి ఉపాధి మార్గాలు లేవు; గుణాత్మక వైద్యం, విద్య పూర్తిగా అంతరించిపోయింది అనే విషయాలు విచారణ క్రమంలో తెలిసాయి.

నక్సలైట్‌లకు వ్యతిరేకంగా పోలీసులు, సిఆర్‌పిఎఫ్ ఈ ప్రాంతంలో చేపట్టిన ప్రచారం వల్ల, ఇప్పటికే ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక సమస్యలను ఎదుర్కొంటున్న ఈ ప్రజల జీవితాలు మరింత నరకంగా మారాయి. ఇక్కడి అమాయక గిరిజన గ్రామస్తులపై ప్రభుత్వం ఎందుకు ఈ విధమైన అణచివేతను నడుపుతోందో తమకు తెలియదని, ఈ కారణంగా తాము, రాబోయే తరం నిరంతరం భయ, భీభత్సం జీవితాన్ని గడపవలసి ఉంటుంది అని ఇక్కడి ప్రజలు అంటున్నారు.

చింగియాపహరి, టెస్ఫులి, బారియార్పూర్, జీత్పూర్, భన్పురా, కరిపహరి, బెలథాన్, తరాతాండ్ ప్రాంతాలలోని మొత్తం 16 గ్రామాల నుండి మహిళలు, పిల్లలతో సహా గ్రామస్తుల నుండి నిజనిర్ధారణ బృందం సేకరించిన సమాచారంలో ఈ క్రింది విషయాలు తెలిసాయి:

1. అత్యాచారం - టెస్‌ఫులి ప్రాంతంలో భద్రతా దళాలు ఒక అత్యాచారం చేశారు.

2. లైంగిక వేధింపులు - భన్పురాలో 7 మంది మైనర్ బాలికలను భద్రతా దళాలు లైంగిక వేధింపులకు గురిచేశాయి

3. బూటకపు ఎన్‌కౌంటర్ –డోల్‌కట్టాలో జరిపిన ఒక బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఒక కార్మికుడిని హత్య చేసారు.

4. కస్టడీలో మరణం - పిర్తాండ్ పోలీస్ స్టేషన్‌లో ఝర్హా గ్రామ నివాసిని పోలీసు కస్టడీలో హత్య చేశారు. ఈ వ్యక్తికి పీర్టాండ్ పోలీస్ స్టేషన్ ప్రక్కనే హోటల్ ఉందని, పోలీస్ స్టేషన్, భద్రతా సిబ్బందికి అక్కడే ప్రతిరోజూ టీ, అల్పాహారం తయారవుతుందని తెలిసింది.

5. కస్టడీలో చిత్రహింస – తార్‌టాండ్ గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని గిరిడీలోని ఎస్పీ బంగ్లాలో అమానుషంగా కొట్టారు. కరీఫారి గ్రామానికి చెందిన మన్‌రేగా కార్మికుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని దారుణంగా కొట్టారు. అతని మొబైల్, బైక్, బ్యాంక్ పాస్‌బుక్, 15 మంది ఎంఎన్‌ఆర్‌ఇజిఎ సిబ్బంది జీతం జాబితాను పోలీసులు లాక్కున్నారు. ఈ సంఘటన కారణంగా, 15 మంది ఎంఎన్‌ఆర్‌ఇజిఎ కార్మికులకు ఇప్పటి వరకు 2 వారాల జీతం అందలేదు.

6. మహిళలు, పిల్లలు, అమాయక గ్రామస్తులను కొట్టిన ఘటనలు దాదాపు అన్ని గ్రామాల్లో జరిగాయి. కొంతమంది గ్రామస్తుల ఇళ్లను కూడా కూలగొట్టేశారు. అప్పుడప్పుడు భద్రతా దళాలు రాత్రి- పగలూ కూడా దాడి చేశాయి. ఇళ్ల నుంచి డబ్బు, నగలు దోచుకెళ్లిన సంఘటనలు కూడా ఉన్నాయి. తరచుగా ఇళ్లలో ఉంచిన, పంట, ధాన్యాలు వుంచిన గాదెలను కూడా దాడుల సమయంలో నాశనం చేశారు. ఈ రకమైన దాడులలో మహిళా పోలీసులు వుండరు, దాదాపు ప్రతి దాడిలోనూ మహిళలను వేధింపులకు గురిచేస్తారు, అసభ్యంగా ప్రవర్తిస్తారు.

7. అమాయక గ్రామస్తులపై తప్పుడు కేసులు – తప్పుడు కేసుల్లో 6 మంది ఇప్పటికీ జైలులో ఉన్నారు; ఇద్దరు తెలియని వ్యక్తులపై తప్పుడు కేసులు ఉన్నాయి, కాని ఇప్పటివరకు అరెస్టులు జరగలేదు; తప్పుడు కేసులో జైలుకు పంపిన ఒక వ్యక్తి ప్రస్తుతం బెయిలు పైన బయట ఉన్నాడు.

UAPA, CLA చట్టాలను ఈ ప్రాంతాలలో దుర్వినియోగం చేసారు; అమాయక గ్రామస్తులపై అణచివేత ప్రయోగించి భయ వాతావరణాన్ని సృష్టించారు. పియర్టాండ్ పోలీస్ స్టేషన్ ముందు కూరగాయలు అమ్ముకునే వ్యక్తి పోలీస్ స్టేషన్ సిబ్బందికి తాను అమ్మిన కూరగాయలకు డబ్బు అడిగినందుకు, పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జి వెంటనే UAPA కింద తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపాడనే దిగ్బ్రాంతి కలిగించే కేసు కూడా ఒకటి వుంది. ప్రస్తుతం ఈ వ్యక్తి బెయిల్‌పై ఉన్నారు.

భద్రతా దళాలు చేస్తున్న ఈ నిరంతర హింసను దృష్టిలో ఉంచుకునే సిఆర్‌పిఎఫ్ శిబిరాన్ని అన్ని వర్గాల వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిసింది. తమ డబ్బుతోనే ప్రభుత్వం తమపై దారుణాలు, దోపిడీలు చేస్తోందని వారు అంటున్నారు.

సిఆర్‌పిఎఫ్ క్యాంపు వద్దని, ఆసుపత్రి, పాఠశాల, ఉపాధి, అభివృద్ధి కావాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు . తమ ప్రార్థనా స్థలం, స్మశానం, మైదానాల్లో బలవంతంగా సిఆర్‌పిఎఫ్ క్యాంపుని నిర్మించిందని గ్రామస్తులు తెలిపారు. ఐదవ షెడ్యూల్ ప్రాంతం అయినప్పటికీ, క్యాంపు ఏర్పాటు చేయడానికి గ్రామసభ నుండి అనుమతి తీసుకోలేదు.

బాధితులకు ఎలాంటి చట్టపరమైన, న్యాయ సేవలు అందవు. ఇక్కడి అడవుల్లో నివసించే గ్రామస్తులకు కట్టెలు కొట్టడం లేదా పండ్లు, పువ్వులు కోసుకోవడం లేదా చిన్న జంతువులను వేటాడటం వంటి అటవీ హక్కులన్నింటినీ నిరాకరించారు.

ఈ కేసులే కాకుండా, మధుబన్‌లోని కూలీల సమస్యలు కూడా ముందుకొచ్చాయి. అంతకుముందు తమకు యూనియన్ ఉండేదని, ప్రజలందరికీ ఉచిత చికిత్స అందించడానికి యూనియన్ ఆసుపత్రులను నడిపేదనీ, కార్మిక హక్కులు పరిరక్షించబడేవి అని; కానీ ఆ యూనియన్‌పై తప్పుడు ఆరోపణలు చేసి నిషేధించారని కార్మికులు అంటున్నారు. నేడు, అన్ని చోట్ల కూలీలకు తక్కువ వేతనాలు ఇవ్వడం గురించి చర్చ జరుగుతోంది. ఈ సమస్యకు సంబంధించి ఒక ధర్మశాల కార్మికులు 21 మంది ధర్నా కు కూర్చున్నారు. ఈ కార్మికులను వారి ఉద్యోగాల నుండి తీసేస్తున్నారు, వీరికి ఎలాంటి సామాజిక భద్రత లేదు.

గిరిడికి చెందిన ఒక సాంస్కృతిక సంఘం ʹజార్ఖండి ఎవన్ʹ కూడా నిషేధానికి గురైంది. ఈ సంస్థ తన పాటలు, నాటకాల ద్వారా వరకట్న వ్యవస్థ, మంత్రగత్తె వ్యవస్థ, మూఢనమ్మకం, విద్య మొదలైన వాటిపై ప్రజలకు అవగాహన కల్పించేది. నేడు, చాలా మంది సాంస్కృతిక కార్యకర్తలపై కేసులు పెట్టారు, అనేక మందిని అరెస్టు చేశారు.

ఈ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, నిజనిర్ధారణ బృందం ఈ క్రింది డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతుంది:

1. అమాయక గ్రామస్తులపై నమోదు చేసిన తప్పుడు కేసులన్నింటినీ ఎత్తివేసి, వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలి.

2. అదుపులోకి తీసుకున్న వారిపై జరుపుతున్న హింసను వెంటనే ఆపాలి. కస్టోడియల్ మరణాన్ని సుప్రీంకోర్టు, జాతీయ మానవ హక్కుల కమిషన్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక స్వతంత్ర ఏజెన్సీతో దర్యాప్తు చేయించాలి.

3. ఐక్యరాజ్యసమితిలో ప్రభుత్వం ఆమోదించిన సామాజిక అభివృద్ధిని పూర్తి చేయడం ద్వారా ఇక్కడి సముదాయపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి.

4. అటవీ హక్కుల చట్టం ప్రకారం, అడవుల్లో నివసించే ప్రజలకు అడవిపై సాముదాయిక హక్కులను ప్రభుత్వం వెంటనే యివ్వాలి.

5. ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో, గ్రామసభ అనుమతి లేకుండా ఎటువంటి పని చేయకూడదు, పెసా చట్టంలో ఇచ్చిన నిబంధనలను ప్రభుత్వం పాటించాలి.

6. బాధితులందరికీ ఉచిత న్యాయ సేవ అందించాలి.

7. న్యాయమూర్తి డి.కె బసు సూచనలను ఖచ్చితంగా పాటించాలి.


నిజనిర్దారణ బృందం

నిజ నిర్దారణలో పాల్గొన్న సభ్యులు, సంఘాలు
Participants..
1.Tapas Chakraborthy.APDR.West Bengal.
2.Probhas(Babudaa),APDR.West Bengal.
3.Samir Saha Paddaru.APDR.West Bengal.
4.J.Lix,JCDR, Jharkhand Counsil For Democratic Rights, Ranchi.
5.Rohit, Advocate,JCDR, Jharkhand Counsil For Democratic Rights, Ranchi.
6.Anup Agarwal, Advocate, High Court,Ranchi.HRLN.(Human Fights Law Network).
7.Sonal,Advocate, High Court,Ranchi.HRLN.(Human Fights Law Network).
8.Raju Hebron,Advocate, High Court,Ranchi.HRLN.(Human Fights Law Network).
9.Madana Kumaraswamy,Joint Secretary,CLC (Civil Liberties Committee, Telangana State)
10.Deepak Bara Social Activist and Film maker.Ranchi,Jharkhand.
11.Varsha, Social Activist,Jharkhand.
12.Rajni, professor,Social Activist,Jharkhand.
13.Jaideep, Journalist Times of India.Ranchi.
14.Mukesh,Journalist Times of India.Ranchi.
15.Sanjay Varma, Journalist,Tana Kabar.
16.Bhagwan, Social activist and Santhal Tribal Leader, Madhuban, Giridih,Jharkhand.

Keywords : jarakhand, crpf, santal, tribal, police, attacks, CDRO, HRLN
(2024-04-13 21:37:19)



No. of visitors : 1245

Suggested Posts


మాఊర్లో మారాజ్యం... స్వతంత్రం ప్రకటించుకున్న 100 ఆదివాసీ గ్రామాలు

మా ఊళ్లో మా రాజ్యం అంటూ ఆదివాసీలు స్వ‌యం పాల‌న‌ను ప్ర‌క‌టించుకుంటున్నారు. ఝార్ఖండ్‌లోని దాదాపు వంద‌ ఆదివాసీ గ్రామాలు ఇప్పుడీ ఉద్య‌మంలో భాగ‌మ‌య్యాయి. ʹఈ గ్రామం మాది. దీనిపై సర్వహక్కులూ మావి.

78 ఏళ్ళ స్వామి అగ్నివేష్ పై చెడ్డీ గ్యాంగ్ దాడి

సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్‌పై జార్ఖాండ్‌లోని పకూర్‌లో మంగళవారంనాడు చెడ్డీ గ్యాంగ్ మూక దాడి చేసింది. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వచ్చినప్పుడు బీజేపీ యువమోర్చా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ)కి చెందిన కార్యకర్తలు జై శ్రీరాం నినాదాలు చేస్తూ ఆయనను తీవ్రంగా కొట్టడంతో పాటు దుస్తులు చించివేశారు.

Fact-finding team alleges CRPF brutality in Jharkhand villages

On 5-6 March 2021, a human rights fact-finding team of CDRO and HRLN visited three police station areas of the Giridih district - Madhuvan, Dumri and Pirtand, where the central government has decided to set up para – military camps. Following the decision there has been massive protests by the villagers. The team met these villagers and got complete info

బ్రహ్మదేవ్‌ను భద్రతా దళాలు హత్య చేశాయి - బహిర్గతం చేసిన‌ నిజనిర్దారణ కమిటీ నివేదిక

జార్ఖండ్ రాష్ట్రం, లాతేహర్ జిల్లాలోని, గారూ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుకు-పిరి అడవిలో 2021 జూన్ 12 న, భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో, ఒక నక్సలైట్ మరణించాడనీ, అనేక తుపాకులు స్వాధీనం చేసుకున్నారు అనీ అనేక వెబ్‌సైట్లలో వార్తలు వచ్చాయి.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జార్ఖండ్