ఆదివాసీ హక్కుల కార్యకర్త అక్రమ అరెస్ట్ - విడుదల చేయాలని జర్నలిస్టులు, ప్రజా సంఘాల డిమాండ్

ఆదివాసీ

మావోయిస్టు ముద్ర వేసి ఛత్తీస్ గడ్ లో మార్చి 9 న ఓ మానవహక్కుల కార్యకర్తను పోలీసులు అరెస్టు చేశారు. హిడ్మే మార్కమ్ అనే ఈ మహిళా కార్యకర్త ఛత్తీస్ గడ్ లో ఆదివాసుల హక్కుల కోసం పనిచేస్తోంది. 2016 -2020 మధ్య నమోదైనా కేసుల్లో ఇప్పుడు ఈమెను చేర్చి అరెస్టు చేశారు.

మావోయిస్టులతో పని చేసిన 20 ఏళ్ల ఆదివాసీ యువతి పాండే కవాసి 2021 ఫిబ్రవరి లో పోలీసుల ముందు లొంగిపోయింది. లొంగి పోయిన కొద్ది రోజులకే ఆ యువతి కావాసి కర్లి పోలీస్ లైన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నది. ఆమెకు నివాళులు అర్పించడానికి హిడ్మే మార్కమ్, మరి కొందరు ఆదివాసీ మహిళలు అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని సమావేశమయ్యారు. పోలీసుల క్రూరత్వానికి వ్యతిరేకంగా ఆదివాసీలను చైతన్యపరచడానికి, వారి హక్కుల గురించి వారికి అవగాహన కల్పించడానికి ʹజైలు బంది రిహాయ్ కమిటీʹ, ʹఛత్తీస్‌ గఢ్ మహిళా అధికార్ మంచ్ʹ ఈ రెండు రోజుల కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ సందర్భంగా పోలీసులు హిడ్మేను అరెస్టు చేశారు.

ʹ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న హిడ్మే మార్కమ్‌ను జనతన సర్కార్ రేంజ్ అధ్యక్షురాలు గా అరన్పూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది గుర్తించారు. చట్టబద్దమైన ప్రక్రియ తరువాత ఆమెను సమేలి గ్రామ సమీపంలో అరెస్టు చేశారు. ఆమె తలపై 1.10 లక్షల బహుమతి వుంది. ఆమెను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి 10 రోజుల రిమాండ్‌కు పంపించారు.ʹ అని దంతేవాడ పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ పల్లవ్ చెప్పారు. అయితే అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షులు మాత్రం పోలీసులు ఆమెను బలవంతంగా లాక్కెళ్ళి తమ వాహనంలో తీసుకెళ్లిపోయారని, ఎలాంటి వారంట్ చూపించలేదనీ, ఆమె అరెస్టుకు కారాణాలేమిటో చెప్పలేదనీ అంటున్నారు.

అరెస్ట్ సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న, ప్రసిద్ధ ఆదివాసీ హక్కుల కార్యకర్త సోని సోరి, హిడ్మేను ʹనక్సల్ʹఅనడాన్ని తోసిపుచ్చారు, "పోలీసులు పేర్కొన్నట్లు ఆమె మావోయిస్టు కాదు. బస్తర్‌లోని ఆదివాసీల జల్-జంగల్-జమీన్ (నీరు, అటవీ, భూమి) కోసం పోరాడుతోంది. ఆదివాసీల సమస్యల పైన ఆమె ఎస్పీ, కలెక్టర్ కార్యాలయాలకు తరచూ వెళుతూ ఉండేది. ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్, గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖ వ్యక్తులను అనేక సార్లు కలిసింది.ʹ ʹఎవరైనా మావోయిస్టు ఎస్పీ లేదా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళడం , ముఖ్యమంత్రి, గవర్నర్‌ ని కలిసి తమ గుర్తింపును బహిరంగంగా వెల్లడిస్తారని మీరు ఎప్పుడైనా విన్నారా?" అని సోని సోరి ప్రశ్నిస్తున్నారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 2019 లో దంతేవాడలోని పోటాలి గ్రామంలో, పోలీసు క్యాంప్ నిర్మాణానికి వ్యతిరేకంగా ఆదివాసీ గ్రామస్తులు నిరసన తెలియ చేసినప్పుడు తీసిన ఒక వీడియోలో, మార్కమ్ దంతేవాడ ఎస్పీ, అభిషేక్ పల్లవ్‌తో మాట్లాడుతుండడాన్ని చూడవచ్చు.

ముఖ్యమంత్రి భూపేష్ బాగెల్ నేతృత్వంలోని ఛత్తీస్‌‌గఢ్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాల మేరకు ఏర్పడిన ʹజైలు బంది రిహాయి మంచ్ʹ వేదిక ఏర్పాటు సందర్భంగా కార్యకర్త సోని సోరితో కలిసి మార్కమ్ కూడా కనిపించారు,

ఎమ్మెల్యేలు, దంతేవాడ సబ్ డివిజనల్ ఆఫీసర్ చంద్రకాంత్ గవర్ణతో పాటు ఇతర స్థానిక ప్రజా ప్రతినిధులతో, బస్తర్ డివిజన్ లోని ఇతర ప్రముఖ వ్యక్తులతో హిడ్మే మార్కమ్ తీసుకున్న ఫోటోలు వున్నాయి.


(కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో హిడ్మే మార్కమ్)

పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ ఛత్తీస్‌గఢ్‌, మహిళా అధికార్ మంచ్‌లు మార్కమ్ అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఆ రెండు సంస్థలు సంయుక్తం ప్రకటన‌ విడుదల చేశాయి.

మార్కమ్ హిడ్మే పారామిలిటరీ శిబిరాల నిర్మాణానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడే గొంతుగా, నిర్వాసిత‌ వ్యతిరేక పోరాటంలో ఈ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కార్యకర్త అనీ ఆ ప్రకటన పేర్కొంది. ʹజైలు బంది రిహాయి కమిటీʹ కన్వీనర్గా... తప్పుడు ముద్రలు వేస్ అరెస్టు చేయబడిన, దోషులుగా జైళ్లలో, పోలీసు శిబిరాల్లో నిర్బంధించిన ఆదివాసుల విడుదల కోసం, వ్యవసాయ‌ భూములలో మైనింగ్ కు వ్యతిరేకంగా గవర్నర్, ముఖ్యమంత్రి, పోలీసు సూపరింటెండెంట్, కలెక్టర్ తదితర అనేక ఇతర ఉన్నత స్థాయి అధికారులతో హిడ్మే మార్కం అనేక సార్లు కలిశారని ఆప్రకటనలో తెలిపారు.

ఇది అరెస్టు కాదు కిడ్నాప్ అని మరో ఆదివాసీ హక్కుల కార్యకర్త, ఛత్తీస్‌ గఢ్ మహిళా అధికార్ మంచ్ సభ్యురాలు రిన్చిన్ అన్నారు. "ఇది అరెస్టు కాదు, ఇది ప్రణాళికాబద్ధమైన అపహరణ. హిడ్మే ఒక సామాజిక కార్యకర్త, ప్రజాస్వామిక పద్ధతుల్లో పనిచేసే ప్రజా నాయకురాలు. ఆమె ముఖ్యమంత్రితో సహా అనేక యితర రాజకీయ నాయకులతో సమావేశాలకు హాజరయ్యారు, బహిరంగంగా ఆందోళనలకు నాయకత్వం వహించారు. ఆమె ఎలా వాంటెడ్ నక్సల్ అవుతుంది? ʹఅని ఆమె ప్రశ్నించించారు.

" ఒకవేళ ఆమె నక్సలైట్ అయితే, 2016 నుండి పోలీసుల దగ్గర ఆమెకు వ్యతిరేకంగా సమాచారం వుంటే, ఇంతకు ముందు ఎందుకు అరెస్టు చేయలేదు? ఆదివాసీలు, మహిళలు, వారి హక్కుల గురించి మాట్లాడే గొంతులను అణచివేయడానికి పోలీసులు చేసిన మోసపూరిత చర్య యిది, ʹఅని రిన్చిన్ పోలీసు ఆరోపణల్లోని అవకతవకలను ఎత్తిచూపారు.

అయితే హిడ్మేను అక్రమంగా నిర్బంధించారనే ఆరోపణలను దంతెవాడ ఎస్పీ తోసిపుచ్చారు. "మావోయిస్టు కేడర్‌ను గుర్తించడం ఈ ప్రాంతాల్లో కష్ట‌మైన పని. 2016 నుండి వివిధ ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా మాకు సమాచారం ఉంది, కాని ఆ పేరు గల ఆమె ఈవిడేననే విషయం మాకు తెలియదు. మాకు ధృవీకరణ దొరకగానే మా సిబ్బంది హిడ్మేను మావోయిస్టుగా గుర్తించారు. వెంటనే చర్య తీసుకొని ఆమెను అరెస్టు చేసాము, ʹఅని ఎస్పీ అన్నారు.

గత నాలుగు-ఐదు సంవత్సరాలుగా ఆదివాసీల వివిధ సమస్యల కోసం పోరాడుతున్న ఈ ప్రాంత సామాజిక కార్యకర్తగా ఆమె చేసిన కృషిని గుర్తిస్తూ మార్కమ్ అరెస్టుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు, న్యాయవాదుల కూడా ట్విట్టర్లో తమ స్పందన తెలియచేసారు. పి యు సి ఎల్ కు చెందిన డిగ్రీ ప్రసాద్ ʹఇది స్పష్టంగా రాజ్య అణచివేత కేసు. జిల్లా పోలీసులు భద్రతా సిబ్బందితో కలిసి ఆదివాసీల ప్రాధమిక హక్కులను కాలరాస్తూ, ఎలాంటి సాక్ష్యాలు లేకుండా నిర్బంధిస్తున్నారు.ʹ అని అన్నారు.

అయితే, ఇది ఒక్క సంఘటనే కాదు . హిందూస్తాన్ టైమ్స్ లో వచ్చిన ఒక నివేదిక ప్రకారం, మానవ హక్కుల కార్యకర్తలను బెదిరించి ఆదివాసీల సమస్యలపై పని చేయకుండా వుండడానికి పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేసిన‌ ఘటనలకు సంబంధించి చత్తీస్ ఘడ్ కు పెద్ద చరిత్రే ఉంది.

(న్యూస్ క్లిక్ సౌజన్యంతో)

Keywords : chattis garh, markam hidme, adivasi activist, danthewada, arrest
(2024-04-01 13:39:40)



No. of visitors : 792

Suggested Posts


చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటన

ఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన

మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ‌

ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి.

బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌

జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి.

ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహం

చత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది.

తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులు

చత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది.

హెచ్‌ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు

ఛత్తీస్‌ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు.

ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ

చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్‌లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల

దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది.

మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు

మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ‌ ఘర్షణలు జరుగుతున్న‌ఛత్తీస్గడ్ ‌లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.

మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌

జూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఆదివాసీ