మన ఈ పరిస్థితికి ఎవరిని నిందిద్దాం ?

మన

వరంగల్ లో మేం జర్నలిజం లో చేరే నాటికి వృత్తిలో టవరింగ్ పర్సనాలిటీలుగా పరిగణించబడే పీ ఎన్ స్వామి గారు, ఎం ఎస్ ఆచార్య గారు,వీ ఎల్ నరసిం హ రావు సార్, ఆంజనేయ శాస్త్రి గారు, ఆ తర్వాత వాళ్ల సమకాలికుడిగానే జర్నలిజం రంగం లో అడుగిడిన దాసరి కృష్ణా రెడ్డి గారు పాత్రికేయులుగా ఉండే వాళ్లు.
అంతకు ముందు వాళ్ల ను చేరువలో చూడకున్నప్పటికీ , కాకతీయ విశ్వవిద్యాలయం లో ఓ స్నాతకోత్సవ సందర్భం లో పాత్రికేయులకు సీట్లు కేటాయించడం లో జరిగిన వైఫల్యాన్ని
వీ ఎల్ సార్ ఎత్తిచూపిన అంశాన్ని ప్రత్యక్షం గా చూసినప్పుడు వెన్నెముక కలిగిన జర్నలిస్టు ఎంత కరాఖండిగా వ్యవహరిస్తాడో అర్థమయింది. అప్పట్లో ఆ జర్నలిస్టులంటే అధికార అనధికార వర్గాలు, ప్రజా ప్రతినిధులు, మంత్రులు అందరికీ హడల్. వాళ్ళంటే భయం అని అనను గానీ వాళ్ల నిజాయితీ పట్ల గౌరవభావం.
ఈ ఉపోద్ఘాతం నిన్నటినుంచీ చాలా అవసరమనిపించింది. ఈ రోజు ఓ ప్రధాన రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడుగా కొనసాగుతున్న బండి సంజయ్ నోరు పారేసుకున్న తర్వాత ఇంకా ఆవశ్యమనిపించింది. పత్రికా రంగం, ఎలక్ట్రానిక్ మీడియా అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఓ ముఖ్యమంత్రిని మార్చే క్రమం లో జరిగిన వైస్ రాయ్ హోటల్ ఎపిసోడ్ సందర్భంగా విమర్శలకు గురయింది. ఆ విమర్శల స్థాయి రాను రాను మొత్తం పత్రికా రంగం, పాత్రికేయ లోకం కొన్ని చోట్ల కొందరు పాత్రికేయులు పలుచబడేందుకు ముందస్తు చర్యగా నిర్వచించబడింది.
ముందుగా వైస్ రాయ్ అంశం పై విమర్శలకు పోదల్చుకోకుండా సూటిగా శుక్రవారం తెలంగాణ రాష్ట్రం లో మూకుమ్మడిగా పథకం ప్రకారం వండి వార్చిన ఓ భూస్కాం వార్త ను ప్రజానీకానికి అందించడానికి తమ విద్యుక్త ధర్మానికి భిన్నం గా ఓ పది పనినెండడుగుల ఆవలకు వెళ్ళి ప్రెజెంట్ చేసిన విధానం గురించి చెప్పాలనిపించింది.
మొన్నీ మధ్య ఛత్తీస్ గఢ్ లో గణేశ్ మిశ్రా అనే ఓ పాత్రికేయుడు మావోయిస్టుల చేతిలో ఓ జవాన్ బందీగా ఉన్న సందర్భం లో చర్చల ప్రతినిధిగా వెళ్ళి ఆ జవాన్ ను విడిపించిన తరుణం లో వార్తను ప్రెజెంట్ చేసిన విధానాన్ని మన రాష్ట్రం లో పాత్రికేయులకు, మీడియా ప్రతినిధులకు వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరిచేందుకు నిర్దేశించిన మీడియా అకాడమీ పునశ్చరణ ద్వారా వివరించగలిగితే బాగుండనిపించింది.
నాలుగు ఛానళ్ల యాజమాన్యాలకు వాళ్ల వాళ్ల ఎజెండాలు వాళ్లకుంటాయి. అయితే స్టింగ్ ఆపరేషన్ కూడా కాని ఆ స్కూప్ కం స్కాం వార్తను ప్రెజెంట్ చేసే సందర్భం లో జర్నలిజం వృత్తిని ఎంచుకొన్న మన మీడియా మిత్రులు చూపించిన అత్యుత్సాహం ఇక్కడ ప్రస్తావనార్హమైన అంశం. తెలుగు పాత్రికేయ ధిగ్గజాలు ఈ వార్తా ప్రెజెంటేషన్ విధానాన్ని ఆ వార్త లో ప్రస్తుతించిన విషయం తో ప్రమేయం లేకుండా నిష్పక్షపాతం గా కొత్త తరానికి చెప్పాల్సిన అవసరమున్నది.
నిన్న ముగిసింది. నిన్న రాత్రే సదరు ఆరోపణను ఎదుర్కున్న మంత్రి పత్రికా ఛానళ్ళతో బాటు పాత్రికేయులపై కూడా అక్కసు వెళ్లగక్కాడు. "దొంగ వచ్చాడని గాడిద ఓండ్ర పెడితే ఏమవుతుందో యజమాని ఆ గాడిద పై చేయిచేసుకున్న తర్వాత కాలిరిగినట్టు భవిష్యత్తు లో ఈ పాత్రికేయ మిత్రులకు ఇబ్బంది ఏర్పడితే ఆ వార్తను ఎయిర్ లోకి తెప్పించడానికి కుట్రపన్నిన వాళ్లు ఆదుకోరనేది నిర్వివాదాంశం.
అలా మనం పలుచబడడానికి మనమే కారకులమయ్యాం.
ఇక్కడ యూనియన్లు నాయకత్వాలను విమర్శించడం అసంబద్ధం అవుతుంది గానీ పాత్రికేయ ప్రొఫెషన్ యొక్క సేవాతత్పరతను పలుచబడేసిన సందర్భాల్లో ప్రశ్నించే నైజాన్ని మననుంచి దూరం చేయడానికి అనేక సందర్భాల్లో మన నాయకత్వాల వైఖరి కారణం అని నిర్ద్వంద్వంగా చెప్పాలనిపిస్తాది.
నిన్న ఇబ్బందికరమైన రీతిలో యజమాని చేతిలో కీలుబొమ్మలా వ్యవహరించాం. ఇవాళ్ల బండి సంజయ్ ముందు పలుచబడ్డాం. వీళ్లకు ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది. నాలుగో స్థంభాన్ని నిలదీయొద్దనను గానీ తీసిపారేసే స్థాయిలో మాట్లాడే భాష వీళ్లు ఎందుకు మనపై ప్రయోగిస్తున్నారు.ఇప్పుడు తెలంగాణ లో మనం అలాంటి కీలక మైన సవాల్ ను ఎదుర్కుంటున్నాం. ఆ సవాల్ ను అధిగమించాలంటే మనను దిశా నిర్దేశన చేయాల్సిన నాయకత్వాలు వాళ్ళేమనుకున్నా సరే "దిద్దుబాటు చర్యల ʹ దిశగా మనను గైడ్ చెయ్యాలి.

- పీవీ కొండల్ రావు

Keywords : journalists, bandi sanjay, bjp, trs, kcr, warangal
(2024-04-23 05:59:57)



No. of visitors : 432

Suggested Posts


గూడ అంజన్నకు జోహార్లు !

ʹఊరు మనదిరా.. ఈ వాడ మనదిరాʹ పాటతో అంజయ్యకు గుర్తింపు వచ్చింది. ఆయన రాసిన ఈ పాట తెలంగాణా ప్రతి పల్లె, ప్రతి ఇల్లు పాడుకుంది. ఆ పాట ప్రతి పల్లెలో సంఘం ఏర్పాటుకు మార్గమయ్యింది. ఈ ఊరు మనది... ఈ వాడ మనది.... దొర ఎవడురో అంటూ విప్లవకారుల నాయకత్వంలో తెలంగాణా పల్లెలు దొరల గడీల మీద...

విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

తెలంగాణను విముక్తి చేయడానికి వచ్చిందని చెప్పబడుతున్న సైన్యం 1948 సెప్టెంబర్18 నుంచి1951 అక్టోబర్ దాకా వేల మంది తెలంగాణ రైతుకూలీలను, పోరాటయోధులను కాల్చిచంపింది. నైజాం సైన్యాలు, రజాకార్లు చేసిన హత్యల కన్న, 1948 సెప్టెంబర్ తర్వాత కేంద్రప్రభుత్వ సైనిక బలగాలు చేసిన హత్యలు,అకృత్యాలు ఎక్కువ....

 విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్

సెప్టెంబర్ 17, 1948 ని ʹహైదరాబాద్ విమోచన దినంʹ అని అభివర్ణిస్తే చరిత్ర మాత్రం ఫక్కున నవ్వుతుంది. ఏ ఒక్క చారిత్రక కోణం నుంచి చూసినా అది తెలంగాణ విమోచన కాదు. కావడానికి అవకాశం లేదు. ఎక్కువలో ఎక్కువ అది హైదరాబాద్ రాజ్యాన్ని భారత ప్రభుత్వ పాలన...

జైళ్ళలో పేదలే మగ్గుతున్నారు... ప్రజలకు పోలీసులతో ఎలాంటి లాభం లేదు... తెలంగాణ ఐపీఎస్ అధికారి

ʹభారత దేశం జైళ్ళలో 90 శాతం పేదలే మగ్గుతున్నారు. కొంతమందికి కనీసం ఎందుకు అరెస్ట్ అయ్యామో.. ఏ కేసులో అరెస్ట్ అయ్యి జైల్‌కు వచ్చామో కూడా తెలియదుʹʹ ఈ మాటలన్నది హక్కుల సంఘాల కార్యకర్తలు కాదు. కమ్యూనిస్టులు కాదు. మావోయిస్టులసలే కాదు. ఓ ఐపీఎస్ అధికారి ఈ మాటలు మాట్లాడారు.

కామ్రేడ్ మారోజు వీరన్న స్థూపాన్ని కాపాడుకుందాం - విరసం

కామ్రేడ్ మారోజు వీరన్న స్మృతి చిహ్నాన్ని తొలగించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజల కనీస అవసరాలు తీర్చలేని పాలకులు విధ్వంసకర అభివృద్దిని శరవేగంగా ముందుకు తీసుకొనిపోతున్నారు....

సమైక్య సభలో తెలంగాణను నినదించిన‌ శ్రీనివాస్ గౌడ్ ను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసింది

సమైక్య గూండాల చేతుల్లో దెబ్బలు తిని నెత్తురోడుతూ కూడా జై తెలంగాణ అని నినదించిన చేగోను... లాఠీలతో చితకబాదుతున్నా... ఆగకుండా తెలంగాణను నినధించిన పోలీసు శ్రీనివాస గౌడ్ నుమర్చి పోగలమా ? తన నేల తల్లి విముక్తి కోసం ఉద్యోగాన్ని లెక్క చేయకుండా నినాదాలు చేసి....

ʹనా భర్తను పోలీసులు కొట్టి చంపారుʹ

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట పోలీసులు కరీంనగర్ జిల్లా బావుపేటకి చెందిన వెంకటేశ్ ను దొంగతనం చేశాడనే పేరుతో అరెస్ట్ చేశారు. జులై 13 న కోర్టులో హాజరుపరచగా వెంకటేశ్ నుకోర్టు జ్యుడిషియల్ కస్టడికి ఆదేశించింది. ఆరోగ్యంబాగా లేదని చెప్పి వెంకటేష్ ను....

ఉస్మానియా గుండె నిండా... ఈ దేశపు విప్లవ జెండా

ఉస్మానియాలో ఆరెస్యూ నాయకులైన రాంచందర్, మల్లోజుల కోటేశ్వర్ రావు, పటేల్ సుధాకర్, సంతోష్ రెడ్డి ఎలియాస్ మహేష్ , ఆ తర్వాత కాలంలో మావోయిస్టు పార్టీ నాయకత్వంలో ప్రత్యామ్నాయ రాజకీయాలతో భారత దేశంలో సాగుతున్న విప్లవానికి నాయకత్వం వహించినవారు... దేశ‌ విప్లవంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన మారోజు వీరన్న, దామోదర్ రెడ్డి, విజయ కుమార్, రామేశ్వర్ లు ఉస్మానియా...

మార్చ్13 ఎంఆర్‌పిఎస్ బంద్ ను విజయవంత చేయండి - మావోయిస్టు పార్టీ ప్రకటన‌

ఇరవయ్యేళ్లకు పూర్వమే ముఖ్యమంత్రి నివాసాన్ని లక్షలాది మందితో ముట్టడించడం మొదలు గాంధీభవన్‌ ముట్టడి, పెరేడ్‌ గ్రౌండ్స్‌లో మెరుపు సమ్మె, కలెక్టరాఫీసుల ముందు ధర్నాలు, పాలకవర్గాల ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా భారతీ మాదిగ స్మృతిలో ఊరేగింపు వంటి ఎన్నో మిలిటెంట్‌ ఉద్యమాలు నిర్వహించారు.

కెసిఆర్ రెండేళ్లపాలన - విద్యారంగం - వరవరరావు

ఒక తెలంగాణ కవి తెలంగాణ ప్రభుత్వాధినేతను గరుత్మంతునితో పోల్చాడు. చూపు బహు తీక్షణం అని, రెండు కండ్ల తార్మికుడని, ఈ గరుత్మంతుని ముక్కు అంత పెద్దదని ఎంత ఎత్తుకు ఎదిగినా గూడు లేని తెలంగాణ గుడ్డుమీదే ధ్యాస అని అభివర్ణించాడు.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


మన