సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన పౌరహక్కుల సంఘం నేతలు... ప్రజా సంఘాల‌పై నిషేధం ఎత్తివేయాలని విఙప్తి

సుప్రీం

17-06-2021

పౌరహక్కుల సంఘంతో సహా 16 ప్రజా సంఘాలపై తెలంగాణ ప్రభుత్వం విధించిన నిషేధం ఎత్తి వేయాలని కోరుతూ ఈ రోజు (17-06-2021) ఆ సంఘం నాయకులు భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ ను కలిశారు. హైదరాబాద్ లో ఉన్న ఛీఫ్ జస్టిస్ ను కలిసిన‌ పౌరహక్కుల సంఘం నాయకులు ఆయనకు ఓ నివేదికను సమర్పించారు.

ఈ సందర్భంగా పౌరహక్కుల సంఘం (CLC) విడుదల చేసిన మీడియా ప్రకటన..

ప్రభుత్వాలు చాలా కాలంగా పౌర హక్కుల సంఘాన్ని నిషేధించాలని అనుకుంటూ వస్తూ చివరికి తెలంగాణ ఏర్పడి తెలంగాణ వాసులు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మార్చి 30, 2021 న తెలంగాణ పౌర హక్కుల సంఘాన్ని నిషేదించింది. అదనంగా మరో 15 ప్రజా సంఘాలను కూడా నిషేధించారు. గతంలోనే పీపుల్స్ వార్ పార్టీని అనుబంధ సంఘాలను కూడా నిషేధించారు. దీంతో ఉద్యమాలను పూర్తిగా తుడిచి పెట్టామ‌ని సంబరపడిపోతున్నారు.

నిర్భంధాలు, నిషేదాలు, ఉద్యమాలను ఆపలేవని మరీ ముఖ్యంగా ప్రస్తుత పాలకులకు బాగా తెలుసు. అయినా కాని ఈ నిరర్దక చ‌ర్యలకు పాల్పడి మరింత అబాసుపాలవుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) ని ఆనాడు కాంగ్రెసు ప్రభుత్వం ఇదే రకంగా నిషేదించినట్లయితే తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేనా? తెలంగాణ సాధన కోసం పౌరహక్కుల సంఘం మిగిలిన 15 సంఘాలు టిఆర్ఎస్ తో పాటు బహిరంగ, ప్ర‌జాస్వామిక ఉద్యమాలు చేశారు. ఆనాడు తెలంగాణ సాధనోద్యమంలో పౌర హక్కుల సంఘం పాత్రను ప్రశంసించిన నేతలే, ఈ సంఘం వేదికలో ప్రసంగించిన నేతలే యిపుడు అధికారంలో వుండి అదే సంస్థను నిషేదానికి గురి చేయడం విస్మయానికి గురి చేస్తుంది.

ఈ నిషేదానికి సంబంధించి ఈ రోజు (17-06-2021) ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ గారిని కలిసి నివేదికను సమర్పించాం. వెంటనే నిషేదాన్ని ఎత్తివేయాలని, సదరు జీవో నెంబరు 73ను రద్దు చేయాలని విన్నవించాం. ప్రధాన న్యాయమూర్తి సానుకూలంగా స్పందించి తగు చర్యలు చేపడ్తామని హామీ ఇచ్చారు.

పౌర హక్కుల సంఘం తన 48 సం||ల ప్రస్థానంలో ఎక్కడ కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ‌లేదు. సహకరించలేదు. ప్రజలను రెచ్చగొట్టలేదు. అలాంటి ప్రసంగాలు చేయలేదు. పైగా రాజ్యాంగ హామీ యిచ్చిన హక్కులను అమలు పర్చమని నిత్యం చట్టబద్ధంగా ప్రభుత్వాలను అడుగుతున్నాం. మా మొత్తం కార్యాచరణ ఎంత చట్టబద్ధంగా వుందో చూడమంటున్నాం.

నక్సలైటు ఉద్యమ సందర్భంగా ప్రభుత్వాలు సంక్షోభంలో కూరుకుపోయినపుడు ప్రభుత్వాలకు సహకరించాము. ఎన్టీ రామారావు పదవి కోల్పోయినపుడు ఆయనకు అండగా నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండు చేసాం. ప్రభుత్వం నక్సలైట్ల తో చర్చల జరిపిన సందర్భంగా మధ్యవర్తులుగా గణనీయమైన పాత్ర పోషించినాం. అన్నీ మర్చిపోయిన ప్రభుత్వం ఎందుకు కక్ష పూరితంగా వ్యవహరిస్తుందో వారి మనస్సాక్షికి వారు సమాధానం చెప్పుకోవాలి.

16 ప్రజా సంఘాలపై నిషేదాన్ని ఇప్పటికైనా ఎత్తివేయాలి. పౌర ప్రజా స్వామిక హక్కుల వాతావరణాన్ని రాష్ట్రంలో తిరిగి నెలకొల్పాలి.

ప్రొ. లక్ష్మణ్ గడ్డం,
అధ్యక్షులు,
నారాయణ రావు,
ప్రధాన కార్యదర్శి,
పౌర హక్కుల సంఘం

Keywords : Justice N V Ramana, Supreme Court, CLC, CIVIL LIBERTIES COMMITTEE,Civil Liberties Committee Leaders Meet to Chief Justice N V Ramana
(2024-04-07 23:39:32)



No. of visitors : 1046

Suggested Posts


ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ

సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది.

ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది.

ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులు

అక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస‌

సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘం

GDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.

జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్

మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల

CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన‌ పాలకులపై పోరాడుదాం

ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే.

ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹ

చత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు.

మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టు

పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్‌స్టేషన్‌లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది.

ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడ‌లో పౌరహక్కుల సంఘం సభ‌

విజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర.....

ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన‌

14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది.

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


సుప్రీం