ʹమన్రేగాʹ లో కులపర, మనువాద సలహాలు
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో, ఛత్తీస్గఢ్తో సహా మొత్తం దేశంలో మన్రేగా (MNREGA - ʹMahatma Gandhi National Rural Employment Guarantee Actʹ) లో పనిచేస్తున్న దళిత, ఆదివాసీ వర్గానికి చెందిన కార్మికులకు వేతన చెల్లింపులలో సంక్షోభం నెలకొంది, మిగిలిన కార్మికులకు మునుపటిలాగే వేతనం లభిస్తోంది.
దేశమంతటా కలకలం రేగిన తరువాత, నరేంద్ర తోమర్ నేతృత్వంలోని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ యిచ్చిన సలహా కారణంగా ఈ రుగ్మత తలెత్తిందని తెలిసింది, దీని గురించి చర్చలు బహిరంగంగా జరగలేదు, ఈ సలహాపై పార్లమెంటులో చర్చ జరగకపోవడమే కాదు. ఈ మంత్రిత్వ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో కూడా చర్చ జరగలేదు.
మంత్రిత్వ శాఖ అధికారులకు కూడా ఈ సలహా గురించి తెలియదు. ʹది వైర్ʹ నివేదిక ప్రకారం, చెల్లింపు సంక్షోభం తీవ్రత కారణంగా ఈ సలహాను మంత్రిత్వ శాఖ వెబ్సైట్ నుండి నిశ్శబ్దంగా తొలగించారు.
ఆ సలహా ఏమిటంటే, ఈ ఆర్థిక సంవత్సరం నుండి, మన్రేగా నిధులు షెడ్యూల్డ్ కులాలు, ఆదివాసీలకు విడిగా కేటాయింఛాలి. ఈ సలహా కారణంగా, రాష్ట్రాల కోసం నియమించబడిన డిడిఓల పనిభారం రెట్టింపు కావడం వల్ల ఎఫ్టిఒపై సంతకం చేయడానికి వారికి సమయం దొరకడం లేదు.
చెల్లింపు కోసం వందల కోట్ల రూపాయలు వస్తున్నప్పటికీ, కొత్త ఎస్సీ/ఎస్టీ ఖాతాల కోసం పిఎఫ్ఎంఎస్ (PFMS) మ్యాపింగ్ పనులను సకాలంలో పూర్తి చేయకపోవడం వల్ల బ్యాంకులు కూడా చెల్లించలేకపోయాయి.
ఈ సలహా అవసరం ఏమిటి అనే ప్రశ్నకు మౌనమే సమాధానం, కాని ఆదివాసీ, దళిత కార్మికుల వాస్తవ సంఖ్యను తెలుసుకోవడానికి ఇది జరుగుతోందని ప్రచారం జరుగుతోంది. అయితే, కార్మికులకు నిజంగా వేర్వేరు వర్గాలుగా విభజించి వేతనం చెల్లించడం అవసరమా? ఇలా చేయడం మన్రేగా ప్రాథమిక ఉద్దేశానికి వ్యతిరేకం కాదా?
కేంద్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం, మొత్తం దేశంలో మన్రేగా కింద పనిచేస్తున్న వారిలో 50% కంటే ఎక్కువ మంది మహిళలు, 40% కంటే ఎక్కువ మంది దళిత, గిరిజన వర్గాలకు చెందిన కార్మికులు వున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఈ సామాజిక వర్గీకరణ ఎలా దొరికింది? అంటే మన్రేగా కింద పనిచేస్తున్న కార్మికుల సామాజిక వర్గీకరణ రికార్డు ఇప్పటికే వుంది, దీన్ని తెలుసుకోవడానికి వేతన చెల్లింపును గ్రేడింగ్తో అనుసంధానించాల్సిన అవసరం లేదు. అయితే మరి ఈ గ్రేడెడ్ చెల్లింపు వెనుక వున్నఅసలు ఉద్దేశం ఏమిటి?
వాస్తవానికి, బిజెపి మన్రేగాకు అనుకూలంగా లేదు, ఈ చట్టాన్ని ʹమట్టి-తవ్వే అలగా పనిʹ అని ఎగతాళి చేస్తుంది. కానీ గ్రామీణ కార్మికులను మన్రేగా ఆర్థికపరంగా శక్తివంతం చేసిందని, వారి సామూహిక బేరసారాల శక్తిని పెంచిందని సామాజిక అధ్యయనాలు తెలియచేస్తున్నాయి.
మన్రేగా కార్మికుల ఆదాయం 10% పెరిగింది. ఈ పెరిగిన ఆర్థిక శక్తి కారణంగా, వారు వెట్టి చాకిరీ చేయడానికి లేదా గ్రామాల్లోని ఆధిపత్య వర్గాలకు తక్కువ వేతనంతో పనిచేయడానికి నిరాకరిస్తున్నారు. బిజెపికి వున్న అసలు సమస్య ఏమిటంటే, గ్రామీణ పేదల, ముఖ్యంగా ఈ పనులలో నిమగ్నమైన దళితుల ఆర్థిక శక్తి పెరగడం.
ఈ శక్తి ఎంత ఎక్కువైతే, గ్రామాల సామాజిక-ఆర్థిక-రాజకీయ, సాంస్కృతిక జీవితాల మీద అధికారం నెరపే ఆధిపత్య శక్తులకు మరింత సవాలుగా ఉంటుంది, అలాగే అవి అదే నిష్పత్తిలో బలహీనపడతాయి.
ఏ గ్రామీణ కుటుంబానికి అయినా కుల-మత వివక్ష లేకుండా, కనీసం 100 రోజుల పనికి హామీ ఇచ్చే ఈ యూనివర్సల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ చట్టాన్ని నీరుగార్చాలనేది బిజెపి ఉద్దేశ్యం. ఈ డిమాండ్ ఆధారిత యూనివర్సల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ చట్టాన్ని, కేటాయింపు-ఆధారిత పరిమిత ఉపాధి పథకంగా మార్చాలని చూస్తున్నారు - నిధుల కేటాయింపు లేకపోతే, పని కూడా వుండదు.
దళిత-ఆదివాసీ వర్గానికి చెందిన వ్యక్తుల ఉపాధిపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది, ʹనిధులు లేవు లేదా రాలేదు కాబట్టి, పని ఎలా ఇస్తాంʹ అంటారు. అందువల్ల ఈ సలహా మన్రేగా ప్రాథమిక భావనకు వ్యతిరేకమైనది.
ఈనాటికీ కూడా మన గ్రామీణ సమాజం, పంచాయతీలు అగ్ర కులాల ఆధిపత్యంలో వున్నాయి కాబట్టి యిలా జరిగే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది . ఈ సార్వభౌమాధికారం, మన్రేగా సార్వత్రిక ఉపాధి కార్యక్రమం అయినప్పటికీ, చట్టవిరుద్ధంగా ఈ సముదాయ ప్రజలకు పని దొరకకుండా చేస్తుంది. సమాజంలో ఉన్న కుల అసమానత వైరస్ ఈ ఉపాధి హామీ చట్టాన్ని కూడా కలుషితం చేస్తోంది.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్కు చెందిన నితిన్ ధాక్తోడే 2017-18 సంవత్సరంలో తెలంగాణలో ఈ విషయంలో ఒక అధ్యయనం నిర్వహించారు. ʹకాస్ట్ ఇన్ మన్రేగా వర్క్స్ అండ్ సోషల్ ఆడిట్ʹ అనే తన నివేదికలో, మన్రేగా కింద ప్రభుత్వం కనీస వేతనం రోజుకు రూ. 202 అయినప్పటికీ, సగటున, వెనుకబడిన తరగతి కార్మికులకు రూ. 172, షెడ్యూల్డ్ కుల కార్మికులకు రూ.155, రూ. మతపరమైన మైనారిటీ కార్మికులకు వేతనం రోజుకు 123 రూపాయలు మాత్రమే యిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రం, అదిలాబాదు జిల్లా, బోథ్ మండలానికి చెందిన సోనాలా పంచాయతీలో కార్మికులకు రోజుకు సగటున రూ. 153 మాత్రమే వేతనాన్ని చెల్లిస్తే, కొంతమంది కార్మికులకు రూ. 86 మాత్రమే దొరికింది. సమాజంలోని కుల నిచ్చెన మెట్ల క్రమంలో ఎంత అడుగున వుంటే అంత ఎక్కువ వేతనాలు కోల్పోయారు.
ఈ నివేదిక పంచాయతీలలో వున్న కులం ప్రభావాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. కానీ ఈ వంచన ఏదో ఒక రాష్ట్రంలోని ఏదో ఒక పంచాయతీకి మాత్రమే పరిమితమై లేదు, దేశవ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలకు విస్తరించింది.
ప్రముఖ ఆర్థికవేత్త జీన్ డ్రెజ్ చేసిన అధ్యయనం ప్రకారం, జార్ఖండ్ రాష్ట్రంలో మన్రేగా పనులలో ఎస్టీ-ఎస్సీ సముదాయ ప్రజల భాగస్వామ్యం నిరంతరం తగ్గుతోంది. ఈ రెండు సముదాయాల భాగస్వామ్యం 2015-16 సంవత్సరంలో 51.20% వుంటే, 2019-20 సంవత్సరంలో 35.79% కి పడిపోయింది. మోడీ ప్రభుత్వమిచ్చే ఈ సలహా, నిధుల కేటాయింపు విధానం ఈ మోసాన్ని మరింత ఎక్కువ చేస్తుంది.
దళిత మానవ హక్కులపై జాతీయ కేంపెయిన్ విశ్లేషణ ప్రకారం, 2014-19 మధ్య షెడ్యూల్డ్ కులాల కోసం కేవలం 6.2 లక్షల కోట్లు మాత్రమే మొత్తం కేటాయింపు అయితే అందులో ప్రభుత్వ కేవలం 3.1 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది.
అదేవిధంగా షెడ్యూల్డ్ తెగల కోసం కేటాయించిన రూ. 3.28 లక్షల కోట్లలో రూ .2 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. కేంద్ర స్థాయిలో ఎస్సీ-ఎస్టీ ఉప ప్రణాళిక స్థితి ఇది! కాబట్టి, ఈ సలహా దళిత-ఆదివాసీ సమాజ ప్రయోజనాల కోసమే అనే వాదన చిన్నపిల్లల చేష్ట తప్ప మరొకటి కాదు. వర్గీకరణ కేటాయింపు తరువాత, నిధుల కొరత అనే ఏడుపుతోనో లేదా ఉద్దేశపూర్వకంగా చట్టవ్యతిరేక చర్యల ద్వారా ఈ వర్గాల కార్మికులకు పనులు లేకుండా చేస్తారు అనే భయం ఎక్కువగా ఉంది.
+గత సంవత్సరం మోడీ ప్రభుత్వానికి మన్రేగా కోసం రూ. 1,11,500 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. కరోనా విపత్తు వల్ల పనులు కోల్పోయినవారికీ, గ్రామాల్లోని తమ ఇళ్లకు తిరిగి వచ్చిన కోట్లాది మందికి అదనపు పని అందించాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆర్థిక సంవత్సరంలో కేవలం 73000 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు.
నేటికీ పేద గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజులకు బదులుగా సగటున 46 రోజులు మాత్రమే పని దొరుకుతోంది. అటువంటి పరిస్థితిలో, శ్రేణులను బట్టి చేసే కేటాయింపు వల్ల ఈ రంగంలో పోటీని పెరుగుతుంది. ఏ శ్రేణులకు నిధులు కేటాయిస్తారో ఆ శ్రేణికి చెందిన కార్మికులకు మాత్రమే పని దొరుకుతుంది.
ఇది భారతదేశ గ్రామీణ సమాజంలో కుల అసమానతను పెంచుతుంది. ఈ చట్ట ప్రాథమిక భావన సార్వత్రిక ఉపాధి అనే హామీకి యిది వ్యతిరేకం. మోడీ ప్రభుత్వం కోరుకుంటున్నది ఇదే, ఇది హిందూరాజ్య నిర్మాణానికి ఒక చిన్న మనువాద అడుగు యిది.
ఈ సలహా వల్ల, చట్టబద్ధంగా కాకపోయినా, ఆచరణలోత్మకంగా మన్రేగాకి వీడ్కోలు చెప్పే మార్గం తెరుచుకుంటుంది. దీని తరువాత, ఉపాధి హామీ చట్టాన్ని ఆగ్ర కులాల వారు నిర్వహిస్తారు, దళిత-ఆదివాసీ వర్గాలకు నిధులు ఉండవు, ఉపాధి లభించదు!
(రచయిత సంజయ్ పరాతే, ఛత్తీస్ ఘడ్ కిసాన్ సభ అధ్యక్షుడు; తెలుగు అనువాదం పద్మ కొండిపర్తి)
janchowk.com సౌజన్యంతో...
Keywords : Mahatma Gandhi National Rural Employment Guarantee Act, caste,manuvadi,advisory
(2024-02-09 23:55:39)
No. of visitors : 580
Suggested Posts
| చత్తీస్ గడ్ ఎన్ కౌంటర్ పై మావోయిస్టు పార్టీ ప్రకటనఏప్రెల్ 3 న చత్తీస్ గడ్ లోని బీజాపూర్ జిల్లా, జీరగూడెం వద్ద పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 23 మంది పోలీసులు మరణించగా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ నేపథ్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్స్ మీడియాకు విడుదల చేసిన |
| మావోయిస్టుల పై డ్రోన్ల ద్వారా బాంబు దాడులు చేస్తున్న ప్రభుత్వం ..... మావోయిస్టు నేత వికల్ప్ లేఖ
ఏప్రిల్ 19 న తెల్లవారుజామున 3 గంటలకు, బీజాపూర్ జిల్లాలోని పమీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోటలాపూర్ మరియు పాలగుడెం గ్రామాల మధ్య, కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు ఆకాశం నుండి డ్రోన్ల ద్వారా బాంబు దాడులను చేశాయి. |
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
జూలై 28 నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు జరిగిన అమరుల వారోత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల ర్యాలీలు, సభలు, సమావేశాలు జరిగాయి. తెలంగాణ అటవీ ప్రాంతంలో, ఏవోబీ, చత్తీస్ గడ్, బీహార్, జార్ఖండ్ ప్రాంతాల్లో బహిరంగ సభలు జరిగాయి. |
| ప్రధానికి ఐరాస నిపుణుల బృందం లేఖ - చత్తీస్ గడ్ లో మహిళలపై హింస, హిడ్మే మార్కమ్ అరెస్టుపై ఆగ్రహంచత్తీస్ గడ్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం నిర్వహించిన ఆదివాసీ మహిళ హిడ్మే మార్కమ్ ను పోలీసులు అరెస్టు చేయడాన్ని ఐక్యరాజ్యసమితి తప్పుబట్టింది. ఆమెపై కేసును వెంటనే ఎత్తివేయాలని ఏడుగురు ఐరాస నిపుణుల బృందం భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఓ లేఖ రాసింది. |
| తమ వద్ద బందీగా ఉన్న జవాను ఫోటోను విడుదల చేసిన మావోయిస్టులుచత్తీస్ గడ్ లో ఏప్రెల్ 3 వ తేదీన పోలీసులకు మావోయిస్టులకు జరిగిన ఎన్ కౌంటర్ తర్వాత మావోయిస్టులకు బందీగా చిక్కిన సీఆర్పీఎఫ్ జవాను క్షేమంగా ఉన్నాడు. ఈ మేరకు సీపీఐ మావోయిస్టు పార్టీ ఓ ఫోటోను రిలీజ్ చేసింది. ఆ ఫోటోలో CRPF జవాను రాకేశ్వర్ సింగ్ కూర్చొని ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నట్టు తెలుస్తోంది. |
| హెచ్ఐవి పాజిటివ్ బాలికలు,వారి లాయర్ పై దుర్మార్గంగా దాడి చేసిన పోలీసులు
ఛత్తీస్ఘడ్ పోలీసులు, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు హెచ్ఐవి సోకిన 14 మంది బాలికలు, న్యాయవాది ప్రియాంక శుక్లాలపై దారుణంగా దాడి చేసి రక్తాలు వచ్చేలా కొట్టి వారందరినీ గుర్తు తెలియని ప్రదేశానికి ఎత్తుకెళ్ళారు. |
| ʹపోలీసు కాల్పుల్లో చనిపోయింది ముగ్గురు కాదు 9 మంది, 16 మందికి గాయాలుʹ చత్తీస్ గడ్ సుక్మా-బీజాపూర్ సరిహద్దులోని తారెమ్లోని మోకూర్ క్యాంప్ కు వ్యతిరేకంగా నిరసనతెలుపుతున్న ఆదివాసులపై పోలీసులు ఏకపక్షంగా కాల్పులు జరిపారని స్థానికులు ఆరోపిస్తున్నారు. |
| పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కూల్చి వేసిన మావోయిస్టులు - మరో లేఖ, చిత్రాలు విడుదల దండకారణ్యంలో ప్రజా సమూహాలపై పోలీసులు ప్రయోగించిన డ్రోన్లను కొన్నింటిని మావోయిస్టు పార్టీ పీఎల్జీఏ దళాలు కూల్చి వేశాయి. ఈ మేరకు కూలిన డ్రోన్ల చిత్రాలను, ఓ లేఖను మావోయిస్టు పార్టీ ఈ రోజు విడుదల చేసింది. |
| మావోయిస్టు ప్రాంతాల్లో సర్వే: సైనిక దాడులు కాదు...శాంతి చర్చలు కావాలంటున్న 92 శాతం ప్రజలు
మావోయిస్టులకు, పోలీసులకు మధ్య సాయుధ ఘర్షణలు జరుగుతున్నఛత్తీస్గడ్ లోని పలు ప్రాంతాల్లో ఓ సర్వే జరిగింది. స్థానిక ఆదివాసీ భాషలైన గోండీ, హల్బీ బాషలతో పాటు హిందీ భాషలో ఈ సర్వే నిర్వహించబడింది. ఈ ప్రాంతాల్లో సంఘర్షణ ఆపడానికి శాంతి చర్చలు మార్గమా లేక మిలటరీ దాడులా ? ఏది సరైనదని ఆదివాసులు అభిప్రాయపడుతున్నారో తెలుసుకోవడానికి ఈ సర్వే నిర్వహించబడింది.
|
| మావోయిస్టు మధుకర్ కరోనాతో చనిపోలేదు,పోలీసులే చంపేశారు -మావోయిస్టు పార్టీ ప్రకటనజూన్ 1వ తేదీన తెలంగాణ పోలీసులు అరెస్టు చేసిన మావోయిస్టు పార్టీ నాయకుడు గడ్డం మధుకర్ ఎలియాస్ శోభరాయ్ కరోనా తో చనిపోలేదని అతనిని పోలీసులే హత్య చేశారని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. |