నాటి ఎమర్జెన్సీ నాటి కంటే ఈ నాటి పరిస్థితులు మరింత ప్రమాదకరం -ప్రొఫెసర్ హరగోపాల్
27-06-2021
46 వ ఎమర్జెన్సీ దినం సందర్భంగా సీపీఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ "ఎమర్జెన్సీ నాడు - నేడు" అనే అంశం పై జూన్ 26 న ఆన్లైన్ బహిరంగ సభ ను నిర్వహించింది.ఈ సభ కు సీపీఐ (ఎం-ఎల్)న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ సాదినేని వెంకటేశ్వరావు అధ్యక్షత వహిస్తు...క్రూర ఎమర్జెన్సీ కాలం లో దేశంలోని జైళ్ళలో లక్షల మందిని కుక్కి,వందల మందిని కాల్చి చంపిన ఉదంతాలు ఎన్నెన్నో ఉన్నాయన్నారు.వాటిని స్మరించుకుని నేడు చేపట్టాల్సిన కర్తవ్యాల కోసం ఈ సభను తలపెట్టామన్నారు.
ఈ సభలో ప్రముఖ మేధావి,హక్కుల ఉద్యమ నాయకులు ప్రొఫెసర్ జీ.హరగోపాల్ మాట్లాడుతూ... నాటి పరిస్థితుల కంటే నేడే దేశం లో అప్రకటిత ఎమర్జెన్సీ భయానక పరిస్థితులు దారుణంగా కొనసాగుతున్నాయన్నారు.
ఆనాడు ఇందిరా గాంధీ పేదల ఉద్ధరణ పేరిట ఎమర్జెన్సీ ని తేస్తే నేటి పాలకులు కార్పొరేట్ల ప్రయోజనాలకోసం అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నందున దేశంలో నిర్భందం, అణచివేత తీవ్ర మయ్యాయని గుర్తించాలన్నారు.
ఆంధ్రజ్యోతి సంపాదకులు కే.శ్రీనివాస్ గారు మాట్లాడుతూ... పాలకులు తమ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజల్లో సమ్మతిని పొందే చర్యలను చేపట్టడం ద్వారా మొత్తం రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాస్తున్న స్థితిని చూడాలన్నారు.ఆర్థిక విధానాల్లో విపలమైన పాలకులు సాంస్కృతిక అంశాలపై కేంద్రీకరించి ప్రజల్ని ప్రభావితం చేస్తున్న సంగతిని గుర్తించాలన్నారు.
మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు,న్యాయవాది గొర్రెపాటి మాధవరావు గారు మాట్లాడుతూ... ఆనాడు రాజ్యాంగం కల్పించిన అవకాశాల మేరకే ఇందిర ఎమర్జెన్సీ విదిస్తే నేడు మోడీ - షా ద్వయం మంత్రి వర్గాన్ని,రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి ఇష్టమోచ్చినట్లు పాలిస్తున్నారన్నరు.ఎప్పుడు ఇదే పరిస్థితి ఉండదన్నారు
Pow జాతీయ కన్వీనర్ సంధ్య మాట్లాడుతూ...దేశంలో కొనసాగుతున్న నిర్భంధ,నిషేధ పరిస్తుతుల్లో విస్తృత స్థాయి ప్రజా ఉద్యమాలను నిర్మించాలన్నారు.
చివరగా మీటింగును సీపీఐ (ఎం ఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కే. గోవర్థన్ ముగిస్తూ...నేడు దేశంలో హిందుత్వ ఫాసిజం అమలవుతున్న కారణంగానే భారత రాజ్యాంగ విలువలను,స్ఫూర్తిని కాల రాయడం కోసం మనువాద పాలకులు దూకుడుగా ముందుకు రావడాన్ని చూడాలన్నారు.
సభలో అరుణోదయ అధ్యక్షులు వేణు విప్లవ గీతాలను పాడారు.
Keywords : haragopal, emergency, cpi ml new democracy, narendra modi
(2023-05-30 17:32:38)
No. of visitors : 950
Suggested Posts
| న్యూడెమాక్రసీ నేత లింగన్నను కాల్చి చంపిన పోలీసులు ... పోలీసులకు ప్రజలకు ఘర్షణ
లింగన్నను పోలీసులు కాల్చి చంపిన సమయంలో అక్కడికి చేరుకున్న చుట్టు పక్క గ్రామాల ప్రజలు పోలీసులతో ఘర్షణకు దిగారు. తమ అన్నను అన్యాయంగా కాల్చి చంపారని ఆరోపిస్తూ పోలీసులపైకి వెళ్ళారు. కొద్ది దూరం పోలీసులను తరిమి కొట్టారు. ఈ సమయంలో పోలీసులు గాలి లోకి కాల్పులు జరిపారు. అయినా ప్రజలు వెన్ను చూపలేదు. |
| ʹనా తండ్రిని పోలీసులు పట్టుకొని హింసలు పెట్టి కాల్చి చంపారుʹన తండ్రిని పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చి చంపారని బుధవారంనాడు భద్రాద్రి కొత్త గూడెం జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూడెమాక్రసీ నాయకుడు లింగన్న కుమారుడు హరిఆరోపించారు. |
| న్యూ డెమాక్రసీ నేత లింగన్న మృతదేహానికి రీపోస్ట్ మార్టం జరపాలి..హైకోర్టు ఆదేశంభద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుండాల లో జరిగిన ఎన్ కౌంటర్ లో మరణించిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమాక్రసీ రాష్ట్ర కమిటీ సబ్యుడు లింగన్న మృతదేహానికి రీపోస్ట్మార్టం నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. గాంధీ ఆస్పత్రిలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో రీపోస్ట్మార్టం నిర్వహించాలని |
| న్యూడెమోక్రసీ నాయకుడు కా॥ ముఖ్తార్ పాష అమర్ రహే! -ఇల్లందులో రేపు వర్ధంతి సభసి.పి.ఐ. (యం.యల్) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటి సభ్యుడుగా, ఇ.ఎఫ్.టి.యు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉద్యమ బాధ్యతలు చూస్తున్న కా॥ ముఖ్తార్ పాష 2020 సెప్టెంబర్ 24న, కార్పోరేట్ క్రూర కరోనాతో అమరుడైన విషయం తెలిసిందే. |
| ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాల ఏజెన్సీ ప్రాంతాల్లో పోలీసులు పోడు రైతులపై సాగిస్తున్న దాడులను, అరెస్టులను ఆపాలి!
అనేక దశాబ్దాలుగా పొడుగొట్టి తమ జీవనాన్ని సాగిస్తున్న పోడు రైతులను ఈనాడు పెద్ద ఎత్తున పోలీసులు ఏజెన్సీ గ్రామాల్లో మోహరించి తీవ్ర భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.అందులో భాగంగానే ఈ రోజు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని |
| RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
|
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన |
| మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ |
| అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్ |
| పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన |
| కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
|
| కాకలు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్.ఎల్.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ! |
| సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన |
| పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు |
| పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC |
| పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్ |
| దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక
|
| విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన |
| ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
|
| బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ
|
| ఆదివాసీల అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ |
| ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
|
| ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
|
| ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 2 |
| మార్గదర్శి - అల్లం రాజయ్య...Part 1 |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
|
| వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక |
more..