అమ్రాబాద్ చెంచులపై ఫారెస్టు అధికారుల దాడులు - పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ
18-07-2021
2 జులై,2021న,తెలంగాణ రాష్ట్రంలోని, అమ్రాబాద్ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా, మాచారం గ్రామం చెంచులపై ఫారెస్టు అధికారులు దాడులు చేశారు. ఆ ఆదివాసుల భూములను ఆక్రమించడానికి ప్రయత్నించిన అధికారులను అడ్డుకున్నందుకు చెంచులపై దాడులు చేయడమే కాక వాళ్ళపై అక్రమ కేసులు బనాయించి కొందరు చెంచులను జైలుకు పంపారు అధికారులు.
ఎన్నో ఏండ్లుగా సాగుచేసుకుంటున్న చెంచులో భూముల్లో నర్సరీ ఏర్పాటు చేయాలని ఫారెస్టు అధికారులు నిర్ణయించారు. జూలై 2వ తేదీన ఫారెస్ట్ అధికారులు మాచారం గ్రామం వెళ్ళగా ఆదివాసులు నిరసన తెలిపారు. రోజు జరిగిన సంఘటనపై ఫారెస్టు అధికారులు చెంచులపై కేసులు బనాయించి నలుగురిని జైలుకు పంపారు.
ఈ నేపథ్యంలో జూలై 2న జరిగిన సంఘటనలో నిజా నిజాలు తెలుసుకోవడానికి ఈ రోజు (జూలై18) పౌరహక్కుల సంఘం (CLC) నిజనిర్దారణ కమిటీ మాచారం వెళ్ళింది. CLC నాయకులు అక్కడ ప్రజలతో మాట్లాడారు. వివరాలు సేకరించారు. అనంతరం పౌరహక్కుల సంఘం నిజనిర్దారణ కమిటీ విడుదల చేసిన ప్రకటన
మాచారం నల్లమల చెంచులపై ఫారెస్ట్ అధికారుల దాడిని పౌర హక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది...
2 జులై,2021న,తెలంగాణ రాష్ట్రంలోని, అమ్రాబాద్ మండలం,నాగర్ కర్నూల్ జిల్లా, మాచారం గ్రామంలోని రెండు వందల సంవత్సరాలగా అటవీ భూముల్లో జీవిస్తున్న నల్లమల చెంచులపై ఫారెస్ట్ అధికారులు దాడి చేసి,కుట్రతో కేసులు నమోదు చేసి 4గురు చెంచులను మహబూబ్ నగర్ జైల్ కు తరలించడం పై,ఈ రోజు ఆదివారం,18,జులై,2021న పౌర హక్కుల సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మాచారం గ్రామం లో చెంచు ప్రజలను కలిసి సేకరించిన నిజానిర్దారణ వివరాలు....
మూడు తరాలుగా తాత ముత్తాతల నుండి సుమారు80 ఎకరాల భూమిలో 23 కుటుంబాల చెంచులు వ్యయసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా అమ్రాబాద్ ఫారెస్ట్ అధికారులు వీళ్ళ భూములు ఫారెస్ట్ భూములని కాళీచేసి వెళ్ళిపొమ్మని ఒత్తిడి తెచ్చినారు. ఇటీవల ఆరునెలల క్రితం నుంచి,మీ భూములకు పట్టాలిస్తామని చెప్పి ఫారెస్ట్ ఆఫీసర్ హనుమంతు 23 చెంచు కుటుంబాల తో తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకొన్నాడు. దాన్ని ఆధారం చేసుకుని కేవలం రెండు సంవత్సరాలుగా ఈభూముల్లో ఉంటున్నారని కాళీచేసి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చినారు.
2 జులై,2021 శుక్రవారం నాడు,50 మంది ఫారెస్ట్ అధికారులు, చెంచుల భూముల్లో వ్యవసాయం చేయకుండా అడ్డుకొని, చెంచు లను దాడిచేసి, నానబూతులు తిట్టి, చెంచు ముండల్లారారా అడవులలో బతికే మీకెందుకే భూమంటూ దుర్భాశలాడినారు. మనస్తాపం చెందిన చెంచు మహిళలు తమపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యా ప్రయత్నం చేసినారు.ఈ సందర్భంను సాకుగా తీసుకొని ఫారెస్ట్ అధికారులపైనే చెంచులు పెట్రొల్ పోసి దాడిచేసినారని అమ్రాబాద్ పోలీసుల ద్వారా తప్పుడు కేసు నమోదు చేయించి ఇద్దరు మహిళలను, ఇద్దరు పురుష చెంచులను మహబూబ్ నగర్ జిల్లా జైల్ కు కుట్రతో తరలించారు.....
1.చెంచులపై కుట్రతో దాడిచేసిన ఫారెస్ట్ అధికారుల పై SC/ST కేసు నమోదు చెయ్యాలి.
2.చెంచుల భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలి.
3.చెంచులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
4.KCR ప్రభుత్వం పోడు భూములకు పట్టాలిస్తామని అసెంబ్లీలో, ఎన్నికల ర్యాలీలలో ఎన్నో సందర్భంబాలుగా ఇచ్చిన హామీ మేరకు ఆదివాసులకు పొడుభూముల పట్టాలు మంజూరు చేయాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది.....
పాల్గొన్నవారు..
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్,అధ్యక్ధుడు,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు, ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
3.మాదన కుమారస్వామి, సహాయకార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
4.అల్గోట్ రవిందర్, కోశాధికారి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
5.జెల్ల లింగయ్య, EC మెంబర్,పౌర హక్కుల సంఘం తెలంగాణ.
6.వెంకటేష్,ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
7.జక్కబాలయ్య,సహాయ కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
8.తిరుమలయ్య,సహాయ కార్యదర్శి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం.
9.పోతే ప్రవీణ్, నిజామాబాద్ జిల్లా పౌర హక్కుల సంఘం.
మరియు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పౌర హక్కుల సంఘం నాయకులు
5:40PM,ఆదివారం,18 జులై,2021.
మాచారం గ్రామం,అమ్రాబాద్ మండలం,, నాగర్ కర్నూల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
Keywords : telangana, nagar kurnool, macharam, CLC, Adivasi
(2024-04-24 23:32:01)
No. of visitors : 974
Suggested Posts
| ʹరోళ్ళగడ్డ ఎన్ కౌంటర్ లో పాల్గొన్న పోలీసులందరిపై సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం హత్య కేసు నమోదు చేయాలిʹ
సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై 302 కేసు నమోదు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాక పోలీసుల అదుపులో వున్న నలుగురు ఉద్యమకారులను కోర్టులో హాజరుపరిచి వారి ప్రాణాపాయం లేకుండా బాధ్యత పడాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును పౌరహక్కుల సంఘం డిమాండ్ ఉన్నది. |
| ప్రతి ఎన్కౌంటర్ పై హత్యానేరం నమోదు చేసి విచారించాలి... సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రత్యేక పోలీసు బలగం గ్రేహూండ్స్ పోలీసులు 2006 జూలై 23న నల్లమల అడవుల్లో మావోయిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుర్రా చిన్నయ్య (మాధవ్) ను, ఐదుగురు మహిళలతో సహా మరొక ఏడుగురిని ఎన్ కౌంటర్ పేరుతో కాల్చిచంపారు. వెంటనే ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం హైకోర్టులో రిట్ దాఖలు చేసింది. |
| ఆదివాసుల జీవించే హక్కును కాలరాసున్న తెలంగాణ పాలకులుఅక్కడ ʹఆడాʹ ప్రాజెక్ట్ కాలువలకింద భూములు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ కాలువలకింద నీటితో, వ్యవసాయం చేయడానికి, చిన్న,పిల్ల కాలువలు ఉన్నాయి.మొత్తానికి ఇక్కడ సారవంతమైన, అద్భుతమైన నీటివనరులు గల భూములున్నాయి. బహుశా ఆదివాసులనూ తరలించి, భూములను కబ్జాజేయడానికి స్థానిక అధికార పార్టీ నేతలు కుట్ర చేస్తున్నారని అందుకే స్థానిక MLA కొనేరుకొనప్ప దృష్టికి ఈ విషయం వచ్చినా కనీస |
| సింగరేణి కార్మికుడు కోడెం సంజీవ్ మృతికి యాజమాన్యానిదే బాధ్యత...పౌరహక్కుల సంఘంGDK 11 వ గనిలో మరణించిన కోడెం సంజీవ్ మృతికి సింగరేణి యజమాన్యందే బాధ్యత,ఈ ఘటనపై హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్ చే న్యాయవిచారణ జరిపించాలి, .సింగరేణి CMD పై క్రిమినల్ కేసులు నమోదు చెయ్యాలి,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలనిపౌర హక్కుల సంఘం తెలంగాణ డిమాండ్ చేస్తున్నది. |
| జాడి వీరస్వామి, వెట్టి నందయ్యలను పోలీసులు హత్య చేశారు...నిజ నిర్దారణ కమిటీ రిపోర్ట్మంగళవారం 20 ఆగస్టు,2019 న రాత్రి 12 నుండి 1 గంటల మధ్యన సుమారు 200 మంది వరకు సాయుధ పోలీసులు బుడుగుల గ్రామాన్ని దిగ్బంధించి ఆదివాసీ ప్రజలందరినీ గ్రామంలో రెండు చోట్లకు తీసుకువచ్చి,ప్రజలందరినీ తీవ్రంగా కొడుతూ ఒక్కొక్క ఇంటిని సోదాచేసి, ఒక ఇంటిలోనుండి జాడి వీరస్వామిని పోలీసులు గ్రామంపక్కన ఉత్తర దిక్కు అడవిలోకి తీసుకుపోయి రాత్రంతా చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటల |
| CLC ప్రకటన: కార్మిక చట్టాలను రద్దు చేసి కార్మికులను భానిసత్వంలోకి నెట్టిన పాలకులపై పోరాడుదాం
ఈ కార్మిక చట్టాలను రద్దు చేయడం అప్రజాస్వామ్యం మరియు రాజ్యాంగ విరుద్ధం. సంవత్సరాల పైబడి ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను ఈ విధంగా రద్దు చేయడం అంటే కార్మిక వర్గాన్ని బానిసత్వం లోకి నెట్టివేయడమే. |
|
ʹఅవి ఎదురుకాల్పులు కాదు.. ఆదివాసీల హత్యలుʹచత్తిస్ ఘడ్ లోని కుంట బ్లాక్ లో జరిగిన ఎన్ కౌంటర్ నిజమైన ఎన్ కౌంటర్ కాదని అది కేవలం ఆదివాసీల హత్య కాండేనని భావిస్తున్నాం.చత్తిస్ ఘడ్ అటవీ ప్రాంతములో లక్షలాదిగా ఉన్న ఫారా మిలటరీ బలగాలు నిత్యం అడవిని జల్లెడ పడుతూ అనుమానంతో ఆదివాసీ యువతి యువకులను అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టి హత్య చేసి ఎన్ కౌంటర్ గా ప్రకటిస్తున్నారు. |
| మంథని లో లాకప్ డెత్...పౌరహక్కుల సంఘం నిజ నిర్దారణ... విచారణకు ఆదేశించిన హైకోర్టుపెద్దపల్లి జిల్లా మంథని పోలీస్స్టేషన్లో మంగళవారంనాడు రంగయ్య అనే వ్యక్తి మరణం ఆత్మహత్యగా పోలీసులు చెబుతుంటే అది ఆత్మహత్య కాదని దానిపై విచారణ జరిపించాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేసింది. మరో వైపు దీనిపై తెలంగాణ హైకోర్టు వీచారణకు ఆదేశించింది. |
| ʹఅది ఎన్కౌంటర్ కాదు వేటాడి చంపారుʹ....విజయవాడలో పౌరహక్కుల సంఘం సభవిజయవాడలోని రాఘవయ్య పార్కు దగ్గరలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం ఆధ్వర్యంలో శనివారం ఒరిస్సా-మల్కన్గిరి ఎన్కౌంటర్ బూటకం అనే అంశంపై సభ జరిగింది. ఈ సభకు పౌరహక్కుల సంఘం రాష్ట్ర..... |
| ఆనంద్ తెల్ తుంబ్డే, గౌతమ్ నవలఖా అరెస్టులపై పౌరహక్కుల సంఘం ప్రకటన
14 ఏప్రిల్ 2020 న అంబేద్కర్ 129 వ జయంతి రోజున ప్రొపెసర్, విద్యావేత్త, విమర్శకుడు దళిత మేధావి మరియు హక్కుల నాయకుడైన ఆనంద్ తెల్ తుంబ్డే, ప్రముఖ జర్నలిస్టు మరియు హక్కుల నాయకుడైన గౌతమ్ నవలఖా లను భారత కేంద్ర ప్రభుత్వము ఈ రోజు అరెస్టు చేసి ముంబై మరియు ఢిల్లీలో ని NIA కార్యాలయాల్లో నిర్భందించడాన్ని పౌరహక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తుంది. |