పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు సహాయం చేయండి -మావోయిస్టు పార్టీ పిలుపు

పేదరికంలో

24-07-2021

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు),తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్ విడుదల చేసిన ప్రకటన పూర్తి పాఠం...

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మరణ సభలను గ్రామ గ్రామాన జరుపండి! ప్రజల విముక్తికై నూతన ప్రజాస్వామిక విప్లవంలో నేల రాలిన అమర వీరుల త్యాగాలను ఎలుగెత్తి చాటండి!!

ప్రియమైన ప్రజలారా!

జూలై 28 ఒక ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన దినం అనేది మనందరికి తెలిసిన విషయమే రివిజనిజాన్ని బద్దలు కొడుతూ నగ్జల్బరీ సాయుధ రైతాంగ పోరాటాన్ని సృష్టించి దేశం నలుమూలల వ్యాపింప చేసి నూతన ప్రజాస్వామిక విప్లవ లక్ష్యంతో మన పార్టీని సంస్థాపించిన సారధులు కా॥ చారుమజుందర్, కా|| కన్హయ్ చటర్జీల అమరత్వాలను పురస్కరించుకొని ప్రతి ఏడాది ఈ దినాన్ని జరుపుకుంటున్నాం. ఆనాటి నుండి నేటి వరకు భారత నూతన ప్రజాస్వామిక విప్లవ విజయం కోసం అనేక శత్రువు అణచివేత క్యాంపెయిన్లను ప్రతిఘటించి ప్రజా యుద్ధాన్ని పురోగమింపజేస్తూ కేంద్ర కమిటీ నుండి విప్లవ ప్రజల వరకు వేలాది మంది తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన వీర వనితలు, వీరయోధులందరికి తెలంగాణ రాష్ట్ర కమిటీ తలవంచి విప్లవ జోహార్లు అర్పిస్తుంది.

ఈ ఏడాది దేశవ్యాప్తంగా మన పార్టీ, పీఎల్ జీఏతో పాటు ప్రజా సంఘాల వరకు మొత్తంగా 160 మంది ప్రజావీరులు అమరులయ్యారు. తెలంగాణ విప్లవోద్యమాన్ని పునర్ నిర్మిస్తూ కేంద్ర కమిటీ సభ్యుడు తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కా|| యాపనారాయణ ( హరిభూషణ్) సీనియర్ నేతలు కా॥ కత్తి మోహన్ రావు (ప్రకాషన్న) కా|| సిద్ధబోయిన సారక్క ఈ తరం యువ సైనికుడు కా॥ మాదరి బిక్షపతి ఇంకా ఏరియా కమిటీ సభ్యులు కా॥ సుధీర్, కా|| శంకర్, కా॥ శ్రీను, కా||జోగాల్, కా|| లలిత, కా|| రాజే, కా|| లక్మాల్, కా|| సుక్కాల్, కా|| బాజీరావు, కా|| ఐతులు అశేష పీడిత ప్రజల విముక్తి కోసం తమ నులి వెచ్చని రక్తాన్ని ధార పోశారు. ఈ వీరుల మరణం తెలంగాణ విప్లవోదమానికి, ప్రజలకు తీరని నష్టాన్ని కలిగించింది.

తెలంగాణ మావోయిస్టు పార్టీ సెట్ బ్యాక్ కు గురైన అనంతరం మళ్లీ భూస్వాములు పల్లెల్లో విజృంభిస్తూ రైతుల భూములను బలవంతంగా కబ్జా చేస్తున్నారు. భూస్వామ్యం, రాజకీయ వ్యవస్థ, పోలీసు, రెవెన్యూ, కాంట్రాక్టర్స్, గుండాలు, ఇసుక మాఫీయా, అవినీతి పరులు అందరు కుమ్మక్కై నూతన భూస్వామ్య వ్యవస్థను కొనసాగిస్తున్నారు. ఈ వ్యవస్థపై ఆధారపడి, భూస్వాములు, పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదులు ప్రజల శ్రమను, ప్రకృతి వనరులను కొల్లగొడుతున్నారు.

టీఆర్ఎస్ ప్రభుత్వం హరితహరం పేరుతో, అభయారణ్యాల పేరుతో, టైగర్ జోన్స్ పేరుతో ఆదివాసీలను, సొంత భూముల నుండి అడవుల నుండి వెళ్ళగొట్టి సామ్రాజ్యవాదులకు అక్రమంగా కట్టబెడుతున్నారు. గ్రానైడ్ క్యారీలు, ఓపెన్ కాస్టులు, భారీ నీటి ప్రాజెక్టులు, ఫార్మా కం పెనీల రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ప్రజల పట్టా భూముల నుండి తరిమివేస్తూ భూస్వాముల, పెట్టుబడిదారుల, సామ్రాజ్యవాదుల లాభాలకోసం పాటు పడుతున్నది. ఈ దోపిడికి వ్యతిరేకంగా ప్రజలు న్యాయమైన డిమాండ్లతో ప్రజాస్వామికంగా పోరాడుతుంటే ఆ పోరాటాలను క్రూరంగా అణచివేస్తున్నారు. ప్రజా పోరాటాలకు నాయకత్వం వహిస్తున్న భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టుపై దోపిడీ పాలక వర్గాలు ఎన్నడూ లేనంతగా బహుముఖ దాడిని కొనసాగిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికార పాలక పార్టీలు సమాధాన్ పేరుతో విప్లవోద్యమాన్ని అంతమోదించడానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించి ఆధునిక ఆయుధాలు, డ్రోన్స్, సాంకేతిక పరిజ్ఞానాన్ని కొనుగోలు చేస్తూ మరింత క్రూరంగా, పాశవికంగా అణచివేయడానికి సాయుధ బలగాలను పెద్ద ఎత్తున మోహరిస్తున్నారు.

తెలంగాణ ప్రజలు నీళ్ళు, నిధులు, నియమకాలు, ఎన్‌కౌంటర్లు లేని ప్రజాస్వామిక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్నారు. నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామిక హక్కులనే కాదు జీవించే హక్కును కూడా హరించివేస్తుంది. తమ మౌళిక సమస్యల పరిష్కారానికి పోరాడుతున్న రైతాంగంపై, విద్యార్థులపై, కార్మికులపై, ఉద్యోగులపై, హక్కుల నేతలపై రచయితల పై, కాళకారులపై, ప్రజాస్వామిక వాదులపై, ప్రజా సంఘాలపై అణచివేతతో విరుచుక పడుతుంది.

ప్రజలను అన్ని రకాలుగా పీల్చి పిప్పి చేస్తున్న ఈ దోపిడీ వ్యవస్థను కూల్చి ప్రజా విముక్తి సాధించడానికి నూతన ప్రజాస్వామిక విప్లవ మార్గంలో ప్రియతమ కామ్రేడ్స్ అమరులయ్యారు. వారు చూపిన దారిలోనే మనమంతా ప్రయాణిద్దాం. అమరుల కల‌లను నిజం చేద్దాం.

ప్రజలారా!
అమర వీరుల గొప్ప త్యాగాలను, వారు చేసిన కృషిని యువతరానికి చాటి చెప్పండి.

గ్రామాల్లో కరుడు కట్టిన భూస్వామ్యాన్ని తరిమికొట్టిన పోరాట చరితలను నేటి తరానికి తెలియజేయండి.

పేదరికంలో మగ్గుతున్న అమరుల కుటుంబాలకు మీకు తోచిన సహాయాన్ని అందించండి

జూలై 28 నుండి వారం రోజుల వరకు నగరాల్లో, పట్టణాల్లో, గల్లీల్లో, పల్లెల్లో, మీ ఇంటిలో రెండు నిమిషాలు అమరులను స్మరించుకొండి

భూస్వాముల, పెత్తందార్ల, భూ కబ్జాదారుల, అవినీతిపరుల పీడ‌న నుండి అశేష ప్రజల విముక్తి కోసం పోరాడుతన్న సీపీఐ (మావోయిస్టు)ను కంటికి రెప్పలా కాపాడుకొండి.

పార్టీ కొనసాగిస్తున్న ప్రజాయుద్ధంలో మీరంతా భాగస్వామ్యంకండి.

విప్లవాభివందనాలతో

జగన్,
అధికార ప్రతినిధి,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు),
తెలంగాణ రాష్ట్ర కమిటీ

Keywords : CPI Maoist, jagan, Martyrs Week, Telangana
(2024-03-31 19:40:21)



No. of visitors : 2291

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


పేదరికంలో