హైకోర్టులో మనువు విగ్రహం తొలగించాలని దశాబ్దాల పోరాటం
18-08-2021
మనుషుల మధ్య అంతరాలుండాలని బోదించిన, కులం ఆధారంగా న్యాయం ఉండాలని చెప్పిన, శూద్రులలు అగ్రకులాల కాళ్ళ కింద అణిగి ఉండాలని చెప్పిన మనువు విగ్రహం స్వాతంత్ర్య భారతావనిలో పెడితే..... అందులోనూ న్యాయం అందరికీ సమానమని చెప్పే న్యాయస్థానంలో మనువు విగ్రహాన్ని పెడితే... పెడితే కాదు 1989 నుండి రాజస్థాన్ హైకోర్టు ఆవరణలో మనువు విగ్రహం ఉంది. ఆ విగ్రహాన్ని అక్కడి నుండి తొలగించాలని 32 ఏళ్ళుగా పోరాటం సాగుతుంది. దళిత, బహుజనులు, ప్రజాస్వామిక వాదులు ఆ విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
జూలై 1989 లో విగ్రహం అక్కడ ఏర్పాటు చేశారు. అది జరిగిన ఆరు నెలల తర్వాత, రాజస్థాన్ హైకోర్టు లోని న్యాయమూర్తుల ప్యానెల్ ఆ విగ్రహాన్ని తొలగించాలని ఆదేశించింది. అయితే ఆ ఆర్డర్కి వ్యతిరేకంగా ఒక పిల్ దాఖలు చేయబడింది. ఔరంగాబాద్కు చెందిన ఇద్దరు దళిత మహిళలు, మనువు విగ్రహం పైకి ఎక్కి పెయింట్ ఆ విగ్రహానికి పూశారు. ఆ ఇద్దరు మహిళలపై కేసు నమోదు చేసిన పోలీసులు వాళ్ళను జైలుకు పంపారు. అప్పటి నుండి ఆ ఇద్దరు మహిళలపై కేసు నడుస్తూనే ఉంది.
న్యాయస్థానంలో కూడా ఈ అంశంపై న్యాయవాదులు రెండు వర్గాలుగా విడిపోయారు. ఈ కేసును ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించిన పలువురు న్యాయవాదులపై అగ్రకుల న్యాయవాదులు దాడి చేసి కొట్టారు.
"ఆ విచారణ సమయంలో, మనువు విగ్రహం మద్దతుదారులు దీనిని తొలగించాలని వాదించే న్యాయవాదులను దాదాపుగా కొట్టారు" అని పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ (PUCL) కార్యకర్త కవితా శ్రీవాస్తవ అన్నారు. ఈ విషయం కోర్టు ప్రాధాన్యతలో ఎన్నడూ లేదని ఆమె ఆరోపించారు.
ఇంత జరుగుతున్నా ఆ కేసు మాత్రం ముందుకు కదలడంలేదు.
"కోర్టు ఎప్పుడూ అణగారిన వర్గాల కోసం నిలబడదు, మొత్తం వ్యవస్థ అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా ఉంది, న్యాయ వ్యవస్థలో కూర్చున్న వ్యక్తులకు మనువు పట్ల గౌరవం ఉంది, అందుకే కోర్టు ఆ విగ్రహాన్ని ఎప్పటికీ తీసివేస్తుందని నేను అనుకోను, అది అలాగే ఉండాలని వారు కోరుకుంటున్నారు ʹ అని ప్రజా కార్యకర్త, రచయిత భన్వర్ మేఘవంశీ ʹమక్తూబ్ʹతో అన్నారు.
ఈ నేపథ్యంలో ఈ వివాదాస్పద మనువు విగ్రహాన్ని కోర్టు ఆవరణ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 15 న స్వాతంత్ర్య దినోత్సవం రోజు ʹమను మూర్తి హటావో అభియాన్ʹ నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చింది.
ఈ నిరసన కార్యక్రమం 18 రాష్ట్రాల్లో , రాజస్థాన్లోని 110 ప్రాంతాలలో నిర్వహించారు. జైపూర్ లోని స్గహీద్ స్మారక్ నుండి హైకోర్టు వరకు మార్చ్ నిర్వహించిన వందలాది మంది మనువు విగ్రహం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించగా పోలీసులు వాళ్ళను అడ్డగించారు.
"మనువు విగ్రహం ప్రతిష్టించబడిన ప్రాంగణం నుండి న్యాయం ఆశించలేం. మనువు విగ్రహం స్థానంలో రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ భీంరావు అంబేద్కర్ విగ్రహం పెట్టాలి, ʹఅని నిరసన ప్రదర్శనలో పాల్గొన్న ఉష అనే కార్యకర్త అన్నారు. ఆమె మధ్యప్రదేశ్ రేవా నుంచి వచ్చారు.
ఉష అంటున్నట్టు మనువు విగ్రహం తొలగించి అంబేద్కర్ విగ్రహం పెడతారా లేక ʹʹకోర్టు ఎప్పుడూ అణగారిన వర్గాల కోసం నిలబడదు, మొత్తం వ్యవస్థ అట్టడుగు వర్గాలకు వ్యతిరేకంగా ఉంది, న్యాయ వ్యవస్థలో కూర్చున్న వ్యక్తులకు మనువు పట్ల గౌరవం ఉంది, అందుకే కోర్టు ఆ విగ్రహాన్ని ఎప్పటికీ తీసివేస్తుందని నేను అనుకోను, అది అలాగే ఉండాలని వారు కోరుకుంటున్నారుʹʹ అన్న ప్రజా కార్యకర్త, రచయిత భన్వర్ మేఘవంశీ మాటలు నిజం చేస్తారో చూడాలి.
(maktoobmedia.com సౌజన్యంతో )
Keywords : rajasthan, high court, Manu statue, ʹRemove statue of Manu from Rajasthan High Court,ʹ activists protest
(2024-04-18 21:57:51)
No. of visitors : 688
Suggested Posts
| సీఎం ఆదేశాలతో...బహిర్భూమికి వెళ్ళిన మహిళల ఫోటోలు తీశారు.. అడ్డుకున్నందుకు కొట్టి చంపారు.స్త్రీలు బహిర్భూమికి వెళ్తుంటే వాళ్ళ సెల్ ఫోన్లలో ఫోటోలు తీసేవాళ్ళను ఏమంటారు. పోకిరీలు... జులాయీలు... ఈవ్ టీజర్లు.... అలా ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తే అట్లాంటివాళ్ళను ఏమనాలి ? బ్లాక్ మెయిలర్స్ అనే కదా అంటారు. అలా ఫోటోలు తీసేవాళ్ళను అడ్డుకుంటే అలా అడ్డుకున్నవాళ్ళను కొట్టి చంపేవాళ్ళను ఏమంటారు ? హంతకులనే కదా ! కానీ ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ.... |
| Muslim man shot dead by cow vigilantes in Rajasthanʹs Alwar, body thrown onto railway tracks The family of a Muslim man, whose dismembered body was found on the railway tracks near Govindgarh in Alwar district of Rajasthan on Friday, has claimed that he was thrashed and shot dead by a crowd of cow vigilantes when he was transporting four cows to his native village Ghatmika in Bharatpur.... |
| బీజేపీ,కాంగ్రెస్ సేమ్ టూ సేమ్... గోరక్షకుల మూక దాడిలో చనిపోయిన పెహ్లూ ఖాన్ పై చార్జ్ షీట్ఇప్పుడు రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. బాధితులపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన కేసును ఎత్తి వేసి పెహ్లూ ఖాన్ హంతకులను శిక్షిస్తుందని ఆ కుటుంభం భావించింది. అయితే బీజేపీ కన్నా తామేమీ తక్కువ తినలేదని మరో సారి నిరూపిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం. చనిపోయిన పెహ్లూ ఖాన్ పై, అతని కొడుకుపై చార్జ్ షీట్ దాఖలు చేశారు. |
| పెహ్లూఖాన్ ను ఎవరూ చంపలేదా ? మూక హత్య కేసులో నిందితులంతా నిర్దోషులని కోర్టు తీర్పు!ఆవులను అక్రమ రవాణా చేశాడన్న నెపంతో రాజస్తాన్ లో పెహ్లూ ఖాన్ అనే వ్యక్తిని మతోన్మాద మూక కొట్టి చంపిన కేసును రాజస్థాన్లోని ఆల్వార్ జిల్లా కోర్టు ఈ రోజు కొట్టివేసింది. నిందితులైన ఆరుగురిని నిర్దోషులని కోర్టు ప్రకటించింది. |
|
గోవు పేరుతో మరొకరిని కాల్చి చంపిన మతోన్మాదులు... మద్దతు పలికిన మంత్రిగోరక్షక ముసుగులో ఉన్న మతోన్మాదులు మరోసారి రెచ్చిపోయారు. రాజస్తాన్లో ఆవులను తీసుకెళ్తున్న ఉమర్ ఖాన్ అనే వ్యక్తిని తుపాకీతో కాల్చిచంపారు. అనంతరం మృతదేహాన్ని రైల్వే ట్రాక్పై పడేశారు. భరత్పూర్ జిల్లాలోని ఘట్మిక గ్రామానికి చెందిన ఉమర్.... |
| అంబేడ్కర్ పోస్టర్లను చించేసి, అడ్డుకున్న దళిత యువకుడిని కొట్టి చంపారు !బాబా సాహెన్ అంబేడ్కర్ పోస్టర్లను చించేసిన వారిని అడ్డుకున్నందుకు ఓ దళిత యువకుడిని కొట్టి చంపారు. చంపిన వాళ్ళు ఓబీసీ వర్గానికి చెందినవాళ్ళుగా పోలీసులు పేర్కొన్నారు. |
| మోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఆటో డ్రైవర్ ను చితకబాదిన మతోన్మాదులుమోడీకి, శ్రీరాముడికి జైకొట్టనందుకు ఓ ముస్లిం వ్యక్తిపై దారుణంగా దాడి చేశారు మతోన్మాదులు. రాజస్థాన్ లోని షికార్ జిల్లా సదర్ పోలీసు స్టేషన్ పరిథిలో గఫార్ అహ్మద్ అనే ఆటో నడుపుకొని జీవించే 53 ఏళ్ళ వ్యక్తి తన ఆటోలో పాసింజర్లను గమ్య స్థానాల్లో దింపి |